Thursday 21 November 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వేంకటేశ్వరునికి పెళ్ళి సంబంధం మాట్లాడుట

ఓం నమో వేంకటేశాయ

పెళ్ళి సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతున్న వకుళమాతతో శ్రీనివాసుడు " అమ్మా! నువ్వు వెళ్తున్న దారిలో వచ్చే కపిల తీర్ధంలో స్నానం చేసి, కపిలేశ్వరుని దర్శనం చేసుకుని, ఆయనకు నమస్కారం చేసి, అటుపై పద్మతీర్ధంలో శ్రీ శుకాచార్యులు ప్రతిష్టించిన బలరామకృష్ణులను దర్శించుకునిం వారి అనుగ్రహం పొంది, అగస్త్యముని ఆశ్రమంలో అగస్త్యునిచే పర్తిష్టిమపడి, పూజింపబడిన అగస్తేశ్వరుడిని (శివుడు) అనుగ్రహం పొంది, దారిలో కనిపించే ఋషులకుం, మునులకు నమస్కారం చేసి, ఆశీర్వాదం పోందుతూ ముందుకు వెళ్తే కార్య సిద్ధిస్తుంది " అని పలుకుతాడు. ఒక గుర్రాన్ని సృష్టించి, దానిపై వెళ్ళమంటాడు.

కార్యం సిద్ధించడమేమిటి, స్వామి ఉండగా విఫలమవుతుందా? మరి ఎందుకు నమస్కరించమన్నాడు? ...... మన కోసం, మనకు సందేశం ఇవ్వడం కోసం. మనం కూడా అనేక పనుల మీద నిత్యం బయటకు వెళుతుంటాం. దారిలో ఎన్నో దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. మనం మన పని తొందరలో ఉండి, వటిని పట్టించుకోము. మనం ఎప్పుడు దైవానికి నమస్కరించినా, దైవం నుంచి వచ్చే శక్తి తరంగాల వలన మన బుద్ధి మంచి మార్గంలో నడవడానికి ప్రేరణ పొందుతుంది, మనం వెళుతున్న కార్యంలో విజయం పొందేందుకు దోహద పడుతుంది. పెద్దవాళ్ళు, జ్ఞానులు, బ్రాహ్మణులు, వేదపండితులు కనిపించినప్పుడు వారికి
కూడా నమస్కరించాలి. పెద్దల ఆశీర్వాదం ఉంటే పెద్ద పెద్ద గండాల నుంచి సులువుగా గట్టెక్కవచ్చు. మార్కండేయుడు పెద్దల ఆశీర్వాదం పొందడం వల్లనే, మృత్యువు జయించడానికి, శివపూజ చేయాలన్న సలహా లభించింది. పూజించాడు, శివుడిని మెప్పించి, దీర్గాయుషును పొందాడు. అందువల్ల ఎప్పుడైనా, మనం వెళ్ళె మార్గంలో దేవాలయాలు, జ్ఞానులు, సన్యాసులు కనిపిస్తే, తప్పక నమస్కారం చేయాలి. ఒకవేళ మనమే వాహనం నడుపుతుంటే, అప్పుడు మనసులో నమస్కారం చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఒక్కో చేతితో నమస్కారం చేయకూడదు, అది ధర్మం అంగీకరించదు, తప్పు కూడా.

శ్రీ నివాసుడు చెప్పినట్టుగానే, వకుళమాత అగస్తేశ్వర ఆయలం చేరుకుని పూజ, అభిషేకం చేయిస్తుంటుంది. . ఇంతలో అక్కడికి ఆకాశరాజు పరివారం, పద్మావతిదేవి చెలికత్తెలు వస్తారు. (అగస్తేశ్వర ఆలయం తిరుపతికి దగ్గరలో, శ్రీనివాసమంగాపురం దగ్గర ఇప్పటికి ఉంది. అక్కడ స్వర్ణముఖి నదిలో విష్ణుపాదం కూడా ఉన్నది).

పద్మావతీదేవి చెలికత్తెలు, ఆమె పరివారం అగస్త్యేశ్వరునికి పూజలు చేయిస్తుండగా, వకుళమాత చూస్తారు. విషయమేమిటని అడుగగా, 'మా రాకుమార్తె పద్మావతీదేవీ ఉయానవనంలో ఒక యువకుడిని చూసి, జడుసుకుని, భయంతో జ్వరం పట్టింది. కారణం తెలియని తండ్రి ఆకాశరాజు తన గురువైన బృహస్పతిని సంప్రదించగా, అగస్త్యేశ్వర ఆలయంలో ఈశ్వరునకు అభిషేకం చేయిస్తే, ఆమె మనసులో ఉన్న సంకర్షణ తొలిగి కుడుటపడుతుందని సలహా ఇచ్చారు. ఆమె తరుపున మేమీ ఆలయానికి వచ్చి, పూఝ చేయిస్తున్నాము్" అంటూ వారు సమాధానం ఇస్తారు.

వారు వకుళమాతను మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటూ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా, తన పేరు వకుళ అని, వరాహస్వామి ద్వారా శ్రీ నివాసుడికి సేవ చేసే భాగ్యం కలిగిందని, వేంకటాచలం దగ్గర ఉంటున్నామని చెప్తుంది.

తాను ఎలాగూ ఆకాశరాజు ఇంటికి వెళుతోంది. భగవత్సంకల్పం వల్ల ఎదురుపడిన ఆకాశరాజు పరివారంతో తాను కూడా, నారాయణపురం వెళ్ళి, ఆకాశరాజును ధరణీదేవిని కలుసి మాట్లాడవలసిన పని ఒకటి ఉందని చెప్పి, వారితో తీసుకువెళ్ళమంటుంది.

వకుళమాత నారాయణపురం వెళ్ళెలోపు, తాను ముందే అక్కడికి వెళ్ళి, రంగం సిద్ధం చేస్తే, కార్యం త్వరగా పూర్తవుతుందని భావించిన శ్రీ నివాసుడు, ఎరుకలసాని వేషం ధరించి, సోది చెప్పడానికి బయలుదేరతాడు.

ఒక ముసలి ఎరుకలసాని వేషంలో, చిరిగిన చీర, గురిగింజలు మాలలు ధరించి, బ్రహ్మాండాన్నే వెదురుబుట్టగా తలపై పెట్టుకుని, బ్రహ్మదేవిడిని చిన్న శిశువుగా తన చీరకొంగులో వ్రేలాడదీసుకుని, రుద్రుని చేతికర్రగా పట్టుకుని నారాయణపురం వీధులలో ప్రవేశిస్తాడు.    

సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, జరిగింది చెబుతాను, జర్గేది చెబుతాను, జరగబోయేది చెబుతాను అని గట్టిగా అరుచుకుంటూ శ్రీనివాసుడు ఎరుకలసాని రూపంలో నారయణపురం వీధుల్లో తిరుతున్నాడు. ఈ ఎరుకలసాని విషయం ఆకాశరాజు భార్య ధరణీదేవి పరిచారికలు చూసి, ఆమెకు చెప్తారు. పద్మావతీదేవికి బాలేదు, విషయం అడిగితే ఏదైన పరిష్కారం చూపెడుతుందేమొనని ఆమెను పిలుచుకు రమ్మంటుంది. ఎరుకలసానిని రాజమహలుకు తీసుకురావడానికి దాసీజనం వెళ్ళగా, రానని మొండికేస్తుంది. "నన్ను అవహేళణ చేయడానికి పిలుస్తున్నారా? లేక నిజంగా చెప్పినుకోవాలనుకుంటున్నారా? నన్ను గౌరవిస్తారా?" అంటూ ప్రశ్నలు అదిగి, గౌరవంగా చూస్తామన్న హామీ ఇచ్చాకా రాణి అంతఃపురానికి వస్తుంది.

ముంది ధరణిదేవిని శుచిగా స్నానం చేసి రమ్మంటుంది. తరువాత ఒక పెళ్ళెంలో బియ్యం తీసుకురమ్మంటుంది. బియ్యం తెచ్చి ముందు పెట్టిన తరువాత 'కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు.......... అంటూ దేవతనామస్మరణ చేస్తుంది ఎరుకలసాని. సకలతీర్ధాలు, పుణ్యక్షేత్రాల స్మరణ చేస్తుంది. బ్రహ్మ మొదలైన దేవతల మీద, ఆసేతుహిమాచలం ఉన్న పుణ్య క్షేత్రాల మీద, నదీనదాల మీద, తన బిడ్డ మీద ప్రమాణం చేసి అంతా సత్యమే పలుకుతాను అంటుంది.

'నీ కూతురు పద్మావతీదేవి ఉద్యానవనంలో ఒక యువకుడిని చూసి మోహించినాదమ్మ. ఈమెకు కామజ్వరం వచ్చినాది. అతనితో లగ్గం పెడితే (పెళ్ళి చేస్తే) బ్రతుకుతాది, లెకుంటే సచ్చిపోతాదమ్మ' అంటూ రాణికి చెబుతుంది.

ధరణీదేవి చాలా బాధపడుతుంది. "అతనికిచ్చి పెళ్ళి చేయమంటావు. సరే అనుకుంటే వెంటనే చేయకపోతే చనిపోతుండంటావు. అతనెర్వరి, ఎక్కడ ఉంటాడో, అతని వివరాలు ఏమి తెలియకుండా పెళ్ళీ చేయడం ఎలా? ఇప్పుడే చేయాలంటే నేనేం చేయగలను?" అని ప్రశ్నిస్తుంది ధరణిదేవి. నీ కూతురి ఆరోగ్యం కుదుటపడి, నీ బాధ తగ్గాలంటే, అతనిచ్చి వివాహం చేస్తానని ఇప్పుడె సంకల్పం చేయ్యి. అలా చేసినవెంటనే నయమవుతుందుఇ" అంటుంది ఎరుకలసాని.

ఈ ఎరుకలసాని సోది చెబుతున్న సమయంలో ఆమె పిల్లవాడు ఏడుపు మొదలుపెడతాడు. "ఈడు (వీడు) ఎప్పుడు ఇంతేనమ్మ, ఎప్పుడు ఆకలే ఈడికి, నా పిల్లోడు తినటానికి వండినదైన, వండనిదైనా, ఏదైనా సరే, మీ దగ్గర ఉన్న ఆహారం ఇప్పించండమ్మ" అంటుద్ని ఎరుకలసాని. వెంటనే బంగారుపళ్ళెంలో పాలతో ఉడికించిన పాయసం తెప్పిస్తుంది ధరణీదేవి. ఎరుకలసాని ఎంత తినమని చెప్పినా, పాయసం ముట్టుకోడు పిల్లవాడు. తిననని మారాం చేస్తాడు. ఇక కోపగించుకున్న ఎరుకలసాని పిల్లవాడితో "ఎవరు మాత్రం ఏం చేస్తారు. కందమూలాలలు, ఆకులు అలమలు తినే నీకు ఈ పాయసాన్నం తినే అదృష్టం ఉండాలి కదా" అంటూ తానే పాయసం తినేస్తుంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. బ్రహ్మదేవుడు కూడా పరమాత్మకు నైవెధ్యం సమర్పించకుండా భోజనం చేయడని. నివేదనకు అర్దం భగవంతునకు సమర్పించడం. ఈ భగవతర్పణ వలన అహకారం నశిస్తుంది. మనం పదేపదే 'నాకు ఎవరో అన్నం పెట్టడం లేదు, నా భోజనం నేనే తింటున్నా, ఇది నేను సంపాదించుకున్నా, ఇదంతా నాది, నాది నేను తింటున్నప్పుడు, ఇంకొకడికి సమాధానం చేప్పెదేమిటి? " ఇలా అనేక మాటలు అనుకుంటాం. నిజానికి భగవంతుని అనుగ్రహం ఉంది కనుక తినగలుగుతున్నాం. ఆహారం ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతియే దైవస్వరూపం. ప్రకృతి ద్వారా అన్నాన్ని మనకు ఇస్తున్నవాడు పరమాత్మ.

కాదండీ, మేము డబ్బుతో కొనుక్కుంటున్నాం అంటారా ........... డబ్బు ఉన్న తినలేని స్థితిలో ఎందరో ఉన్నారు. కొందరికి కోట్లు ఉంటాయి కానీ, లోపలకి ఆహారం తీసుకుంటే అరగక కక్కేస్తారు, కాబట్టి పైపుల ద్వారా అన్నాన్ని ద్రవాహారంగా మార్చి శరీరంలోనికి పంపిస్తారు. ఎన్ని కొట్లు ఉండి ఏం లాభం? కడుపు నిండుగా తినడానికి అవకాశం లేనప్పుడు. ఆ అవకాశం మనకు పరమాత్ముడు ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా 'ఓ పరమాత్మ! ఈ ఆహారం నీదే. ఈ ఆహారానివి కూడా నీవే. ఇది నాకు దక్కడానికి కారణం నీవు, ఇది నేను తిన్నాకా, లోపల జీర్ణం చేసేది నీవు, జీర్ణమైన ఆహారం నుంచి ఈ దేహానికి లభించే శక్తి కూడా నీవే. అన్నీ నీవే, అంతటా నీవే, కనుక సర్వం నీకే సమర్పిస్తున్నా, నీ దయతో ఈ ముద్ద తింటున్నా, ఇది నీ బిక్ష స్వామి' అనే భావమే నివేదన. ఇక్కడ ఇక అహంకారానికి చోటు ఉండడు.  

నైవేద్యం ఆహారంలోని దోషాలను తీసివేస్తుంది. నివేదన చేసిన పదార్ధం అమృతతత్త్వాన్ని సంతరించుకుంటుంది. పూతన విషం నిండిన పాలతో కూడిన తన స్తన్యములను చిన్న కృష్ణుడికి ఇస్తుంది. ఆయన అది నివేదనగా భావించాడు. కృష్ణుడు ఒక్క గుక్కలో ఆమె దేహంలో ఉన్న విషంతో పాటు ఆమె శక్తిని, రాక్షసత్వాన్ని త్రాగేస్తాడు. ఆమెకు మొక్షాన్ని ప్రసాదించాడు.

ఇక రెండవది. తల్లిదండ్రులకు భోజనం పెట్టకుండా మనం తినడం తప్పు. చిన్నప్పటి నుంచి మనల్ని మన తల్లిదండ్రులు ఎంతో కష్టాలు ఓర్చి, పెంచి, పోషించారు. మన పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవించడానికి, పరమాత్మను చేరడానికి ఈ శరీరాన్ని ఇచ్చారు అమ్మనాన్నలు. వారి ఋణం ఎప్పటికి తీర్చుకోలేము. వారు బ్రతికి ఉన్నంతకాలం వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. వారి తినలేకపోతే, మనమే తినిపించాలి. అందుకే బ్రహ్మదేవుడు కూడా తన తండ్రి తినకుండా తాను తినడం ఇష్టం లేదు కనుక, ముందు తల్లిదండ్రుల కడుపు నింపండి అన్న సందేశం లోకానికి ఇవ్వాలి కనుక తాను, ఆకలి అని ఏడ్చి, పాయసం తాను తినకుండా విష్ణుమూర్తితో తినిపించాడు.

ధరణీదేవికున్న అనుమానాల నివృత్తి కోసం కొన్ని ఎరుకలసానిని "ఎవరూ పిల్లను అడగకుండా కన్యాదానం ఏల చేస్తాం, వరుడు ఎవరో తెలియకుండా, వరుని తరుపువారు అడగకుండా ఉంటే మీమేం చేయాలి?" అంటూ అడుగుతుంది. మేరేమి కంగారు పడకండి. నేను వెళ్ళినకాసేపటికి ఒక వృద్ధురాలు పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వస్తుంది. పద్మావతీదేవి ఉద్యానవనంలో ఎవరిని చూసి మోహించిందో, ఎవరి కోసం తపిస్తోందో, నీవు ఎవరికిచ్చి వివాహం చేస్తానని సంకల్పం చేశావో, అతని తరుపునే వస్తుంది. ఆమె తెచ్చిన సంబంధానికి ఒప్పుకోండి అని చెప్పి ఎరుకలసాని వెళ్ళిపోతుంది. రాణి వెళ్ళి తన కూతురు పర్మావతితీ మాట్లాడి, ఆమెకు ఆ పురుషుని మీద ప్రేమ ఉందని, పద్మావతీదేవి జ్వరానికి కారణం అతనే అన్న సంగతి తెలుసుకుంటుంది.

కొంత సమయం తరువాత అక్కడికి రాణిగారి పరిచారికల ద్వారా వకుళమాత రావడం, ధరణీదేవిని కలవడం, ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. వకుళమాత నుంచి సమాచారం అంతా తెలుసుకున్న ధరణీదేవి విచారామగా ఉండడం గమనించిన ఆకాశరాజుకు ఏమి చేయాలో తోచదు. తన గురువు అయిన బృహస్పతికి విషయం చెప్తే, ఆయన తగిన మార్గం సూచిస్తారని తలచి, బృహస్త్పతిని తీసుకురావడం కోసం తన కొడుకైన వసుదను స్వర్గలోకానికి పంపిస్తారు.

క్షణంలో గురువుతో ప్రత్యక్షమవుతాడు వసుద. గురువంటేనే సర్వజ్ఞుడు, ఆయనకు తెలియంది ఏముంటుంది? తన దివ్యదృష్టితో విషయం తెలుసుకున్న బృహస్పతి, భవంతునకు వివాహం చేసే అవకాశం మళ్ళీమళ్ళీ రాదని మనసులో తలచి, తప్పకుండా ఒప్పుకుని కన్యాదానం చెయమంటాడు. అయినా, మళ్ళి బృహస్పతి కల్పించుకుని 'నేను అంత జ్ఞానిని కాదు. భగవంతుని గురించి నాకంటే బాగా తెలిసిన శ్రీ శుకాచార్యులవారిని సంప్రదిస్తే బగుంటుంది, వారు పద్మసరోవరం దగ్గరే ఉంటారు' అని చెప్తారు. వెంటనే శ్రీ శుకులవారిని పిలుచుకురమ్మని, ఆకాశరాజు తన తమ్ముడైన తొండమానునికి చెప్తాడు.      

భగవంతుడి కల్యాణవార్త వినగానే శుకుడు ఆనందంతో పరవశించిపోతాడు. కమండలం విసిరేసి, కృష్ణాజినం లాగేసి, కట్టుకున్న నారవస్త్రాలు తిసేసి ఉన్మత్తునిలా నాట్యం చేస్తారు. వెంటనే బయలుదేరి ఆకాశరాజుతో సూదోర్హంగా మాట్లాడుతారు. సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే శ్రీనివాసుడని, లోకైకనాధుడైన, ఆఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడని చెప్పి, వివాహం ఒప్పుకోమని ఆకాశరాజుకు చెప్తూనే, లోకానికి సందేశం ఇవ్వడం కోసం, వివాహం విషయంలో ఆడపిల్ల తండ్రి తీసుకోవలసిన జాగ్రత్తలను పూసిగుచ్చి వివరించారని పురాణం చెప్తున్నది.

వకుళాదేవి ద్వారా శ్రీనివాసుడి కులగోత్రాలు, నక్షత్రం, జాతకం తల్లిదండ్రులు, బంధుమిత్రుల వివరాలు అడిగి తెలుసుకుంటాడు. స్వామిది శ్రవణా నక్షత్రమనీ, దేవకీవసుదేవులు తల్లిదండ్రులనీ, మిగితా విషయాలను కూడా వకుళమాత చెప్తుంది. మధ్యలో ఆవిడ శుకబ్రహ్మతో 'స్వామీ! మీకు తెలియదా కృష్ణుడి గురించి? నన్ను అడిగి తెలుసుకోవాలా? అంటుంది. వ్యాసుడు శ్రీ మద్భాగవతం రాస్తే, శుకుడు దాన్ని ప్రచారం చేశాడు. భాగవత ప్రచారం చేసిన శుకుడికి కృష్ణుడి గురించి తెలియకపోవడమేమిటి? అందుకే వకుళమాత ఈ ప్రశ్న అడిగింది.

అమ్మా! ఆయన గురించి నీకు తెలుసు, నాకూ తెలుసు, కానీ లోకం కోసం చెప్పించాలి కదమ్మా! అందుకే అంటారు. ఇంతలో దేవకీదేవికి ఒప్క అనుమానం వస్తుంది. ఎంతైనా తల్లి కదా, బిడ్డల జీఇతం కోసం పడే ఆరాటం అటువంటిది.

అబ్బాయికి 24 ఏళ్ళు వస్తున్నాయి అన్నారు, మంచి గుణవంతుడు, అయినా ఇంకా వివాహం ఎందుకు కాలేదు? ఏదైనా లోపం ఉందేమొ? అనుకుని, ఇదే విష్యం వకుళమాతను అడుగుతుంది. అప్పుడు వకుళమాత 'అదేం లేదమ్మ! మా వాడికి ఇంతకముందే వివాహం జరిగింది. కానీ, సంతానం కలుగలేదు.అందుకే మళ్ళీ పెళ్ళి చేస్తున్నాం అంటుంది.

ఇద్దరి జాతకాలు సరిపోయాయని నిర్ధారించి ఆకాశరాజును సంబంధానికి ఒప్పిస్తారు. వివాహానికి అంగీకరించినట్లు శ్రీనివాసుడికి తెలియజేసేలా ఒక లేఖను రాయిస్తారు బృహస్పతి, శుకబ్రహ్మ.

ఎంతో మర్యాదతో, అత్యంత గౌరవంతో, తానూ లేఖ రాస్తున్నది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీనివాసునకు అన్న విషయం తెలిసిన ఆకాశరాజు అందులో భక్తి కూడా జోడిస్తాడు. ఎవరి ద్వారానో పంపితే బాగుండదని, శుంక మహర్షి చేత లేఖ పమించాలనుకుంటాడు. శుకుడు వెంటనే ఆనందంతో ఒప్పుకుంటాడు. భగవంతుని దర్శనం లభిస్తుంటే అంతకంటే ఆనందం ఏముటుంది.

శ్రీనివాసుడు ఇంట్లో చాలా ఆదుర్దాగా ఎదురు చూస్తుంటాడు. సంబంధం మాట్లాడడానికి వెళ్ళిన వకుళమాత ఇంకా రాలేదేమిటి? ఆకాశరాజు వివాహానికి ఒప్పుకున్నాడా లేదా? ఇంత ఆలస్యం ఎందుకైంది? అని అలోచిస్తూ, దిగులుగా కుర్చుని ఉంటాడు. ఏమి తలియని వాడిలా, శుకుడు వెళ్ళగానే, దూరం నుంచే, కాయా? పండా? అని ప్రశ్నిస్తాడు. ఆయన జగన్నాటక సుత్రధారి, జగత్తు అనే ఒక మహానాటకాన్ని నడుపుతున్నాడు, ఇది కూడా అలాంటిదే. శుకుడు పండేనంటాడు.

మంచి కబురు చెప్పారు అంటూ శుకుడిని ఆలింగనం చేసుకుంటాడు. రామావాతారంలో సీతమ్మ జాడ చెప్పిన ఆంజనేయస్వామినే ఆలింగనం చేసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు శుకుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆయన్ను ఆలింగనం చేసుకునే భాగ్యం అందరికి దక్కదు. ఆకాశరాజు పంపిన లేఖను ఆనందంతో స్వీకరించి, గౌరవంగా తలపై పెట్టుకుని, చాలా ఆనందపడుతూ, సంతోషం పట్టలేక గంతులేస్తాడు. ఎంతైనా ప్రేమ వివాహం సఫలం అవుతోంది కదా, మరి ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పండి!?

ఆకాశరాజు రాసిన పత్రానికి సమాధానంగా శ్రీనివాసుడు ప్రత్యుత్తరం రాస్తాడు. ఎంతో వినయంగా ఉంటుంది ఆ లేఖ. వైశాఖ శుద్ధ దశమి వివాహానికి ముహూర్తమని, పెళ్ళికి తరలి వస్తున్నానని చెప్పి రాసి, శుకుడికిచ్చి పంపిస్తాడు.

శుకుడు వెళ్ళగానే వకుళమాత వస్తుంది.

వకుళమాత చాలా సంతోషంతో వచ్చి, సంబంధం కుదిరిందనీ, ఆకాశరాజు పద్మావతీ దెవిని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడని ఉత్సాహంగా చెప్తుంది. ఈ విషయం ముందే తెలిసినా, శ్రీనివాసుడు ఆమెను కించపరచలేదు. అమ్మ కళ్ళలో ఆనందం చూడాలి అనుకున్నాడు. బిడ్డల యొక్క ప్రధాన కర్తవ్యం తల్లిదండౄలను సంతోషంగా ఉంచడమే. అందుకే శ్రీనివాసుడు ఏమి తెలియనివాడిలా, ఆమె చెప్పవనీ ఆసక్తితో విన్నాడు. ఆమెయే కార్యాన్ని సాఫల్యం చేసిందనీ కృతజ్ఞతలు చెప్పాడు. ఆమె ఎంత ఉత్సాహంతో చెప్తుందో, అంతకంటే మికిలి ఉత్సాహంతో విషయాలు వింటూ ఆమెను ఆనందపరుస్తాడు. ఆమె చెప్పిందంతా వింటాడు.

కాసేపటికి 'అమ్మ! నాకీ పెళ్ళి వద్దు. నేను ఈ పెళ్ళి చేసుకోను. ఈ వివాహం జరగడం సమంజసం కాదు' అంటాడు. వకుళమాతకు మతిపోతుంది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపొతుంది. తరువాత 'అదేంటి నాయనా! పోయిన జనంలో నీవు ఎన్ని వివాహాలు చేసుకున్నా, ఒక్కటి చూసే భాగ్యం కలుగలేదు. నీ వివాహం చూపిస్తానని వరం ఇచ్చావు. ఈ జన్మ కోసం, నీ వివాహం చూడడం కోసం ఎంతో తపస్సు చేశాను. ఇంత ప్రయత్నం చేసి, పద్మావతీదేవి పరివారాన్ని ఒప్పించి, నీ పెళ్ళికి సిద్ధమవుతున్న సమయంలో కాదనటం సరికాదు. అయినా నీవు పెళ్ళి వద్దనడానికి కారణం ఏమిటి? పిల్ల నీకు నచ్చింది, నివు పిల్లకు నచ్చావు, ఇప్పుడీ ఆలోచనలేమిటయ్యా?' అంటుంది వకుళమాత.

అమ్మా! ఆకాశరాజు మహారాజు. బోలెడు పరివారం ఉంది. ఎంతో ఆస్తి ఉంది. అనేకమంది బంధువులు, స్నేహితులు ఉన్నారు, అధికారం ఉంది. మరి నా సంగతి? నాకు ఎవరున్నారు? నేనూ, నువ్వు తప్ప పెళ్ళికి వెళ్ళటానికి ఇంకెవరు ఉన్నారు? వియ్యానికైనా, కయ్యానికైనా సమఉజ్జీలై ఉండాలి. పరస్పరం వ్యతిరేకుల మధ్య వివాహం మంచిది కాదు. చూసినవారు ఏమంకుంటారు చెపు. పెళ్ళికొడుకు వాళ్ళు దరిద్రులు అనుకుంటారు. ఎంత అవమానం అంటాడు.

ఇది వకుళమాత జ్ఞానానికి, భక్తికి పరీక్ష. తాను ఎవరికి సేవ చేస్తోందో, ఎందుకు చేస్తోందో బాగా తెలుసు. అందుకే 'నాయనా! మళ్ళీ నన్ను మాయలో పడేద్దాం అనుకుంటున్నావా? నాకు నీ గురించి తెలియదనుకుంటున్నావా? నువ్వు 14 లోకాలకు ప్రభువువి, అంతటా వ్యాపించి ఉన్న పరమోత్కృష్ట తత్వానివి, చక్రవర్తులకే చక్రవర్తివి,దేవదేవలలో ఉత్తముడివి, ఆకిలాండకోటి బ్రహ్మాండా నాయకుడివి, ఆదిమద్యానరహితుడివి. ఆకాశరాజు పేరుకు మాత్రమే ఆకాశరాజు. ఎవరికి ఏది కావాలన్న నువ్వు అనుగ్రహించలసిందే. ఎవరికి ఏది ఉన్నా, అది నీ ప్రసాదమే. నువ్వు తల్చిన్న మరుక్షణం నీ ముందు దేవతలు చేతులు కట్టుకుని నిల్చుంటారు. నీకు సేవ చేయడానికి పూనుకుంటారు. నువ్వే ఐశ్వర్య కారకుడివి, లక్ష్మీపతివి, ఐహిక సుఖాలతో పాటు పరలోకపు సుఖాలను కూడా ప్రసాదించగలిగినవాడవి. పద్మావతీదేవిని, ఆకాశరాజు దంపతులను, నా వంటివారిని, నీ భక్తులను ...... ఇలా అనేకులను తరింపజేయడానికే కదా నీ ఈ లీలలు. కనుక ఇప్పటికైనా నీ ఆటలు మాని నన్ను అనుగ్రహించవయ్యా!' అంటుంది వకుళమాత.

ఇద్దరూ నిజమే చెప్పారు. ఆయనకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు. 'అజాయమానో బహుదావిజాయతే' - పుట్టక అంటూ లేనీవాడు, ఎవరికి పుట్టని వాడు అనేక రూపాల్లో తనని తాను సృజించుకుంటాడు, రూపొందించుకుంటాడు, ఒక ఆకృతిని ధరిస్తాడు. ఆయన అనాది, ఎప్పటినుంచో ఉన్నవడు, ఎప్పటికి ఉండేవాడు, ఆత్మస్వరూపుడు. ఆయనకు ఎవరు లేరని చెప్పినా, ఆయన అందరివాడు.

వకుళమాత మాట వింటూనే ఒక చిరునవ్వు నవ్వి, తన మనసులో గరుత్మంతుడిని, ఆదిశేషుడిని తలుచుకుంటాడు. వెంటనే ఇద్దరూ ప్రత్యక్షమవుతారు. దేవతలందరికీ నా వివాహవిషయం చెప్పు, అందరిని వెంటనే రమ్మను అని గరుడునితో చెప్తారు. కొడుకు బ్రహ్మకు కూడా ఒక లేక పంపుతాడు. బ్రహ్మకు చెప్తే వెంటనే దేవతలందరిని పిల్చి ఒక సభ పెట్టి, దేవతలందరిని తమ పరివారంతో కూడి రమ్మని అజ్ఞాపిస్తాడని చెప్తాడు.

ఇక్కడే ఒక చమత్కారం జరుగుతుంది.

To be continued.........

Saturday 16 November 2013

కార్తీక పూర్ణిమ - దీపారాధన

కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.

కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షే
జలే స్థలే యే  విచరన్తి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||

ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి. 

Thursday 14 November 2013

తులసి మొక్క ప్రాధాన్యత

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు?  తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుత్ఛక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట. అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఏ మధ్యే దృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు.

Monday 11 November 2013

Varnasrama - Bhagavan Ramana Maharshi

Another visitor asked Bhagavan if it was not necessary that the varnasrama differences should go if the nation was to progress.

Bhagavan: “How can one say whether it is necessary or not necessary? I never say anything on such subjects. People often come and ask me for my opinion on varnasrama. If I say anything they will at once go and publish in the papers, ‘So and so also is of such and such an opinion.’ The same scriptures which have laid down varnasrama dharma have also proclaimed the oneness of all life and abheda buddhi as the only reality. Is it possible for anyone to teach a higher truth than the Unity or oneness of all life? There is no need for anyone to start reforming the country or the nation before reforming himself. Each man’s first duty is to realise his true nature. If after doing it, he feels like reforming the country or nation, by all means let him take up such reform. Ram Tirtha advertised, ‘Wanted reformers - but reformers who will reform themselves first.’ No two persons in the world can be alike or can act alike. External differences are bound to persist, however hard we may try to obliterate them. The attempts of so-called social reformers, to do away with such classes or divisions as varnasrama has created, have not succeeded, but have only created new divisions and added a few more castes or classes to the already existing ones, such as the Brahmo-Samajists and the Arya-Samajists. The only solution is for each man to realise his true nature.”

God is guiding us - Ramana Maharshi

A visitor asked: Sri Bhagavan said last night that God is guiding us. Then why should we make an effort to do anything?

M.: Who asks you to do so? If there was that faith in the guidance of God this question would not have arisen.

D.: The fact is that God guides us. Then what is the use of these instructions to people?

M.: They are for those who seek instructions. If you are firm in your belief in the guidance of God, stick to it, and do not concern yourself with what happens around you. Furthermore, there may be happiness or misery. Be equally indifferent to both and abide in the faith of God. That will be so only when one’s faith is strong that God looks after all of us.

Mr. Chopra asked: “How shall I secure that firm faith?”

M.: Exactly. It is for such as these who want instructions. There are persons who seek freedom from misery. They are told that God guides all and so there need not be any concern about what happens. If they are of the best type they at once believe it and firmly abide by faith in God. But there are others who are not so easily convinced of the truth of the bare statement. They ask: “Who is God? What is His nature? Where is He? How can He be realised?” and so on. In order to satisfy them intellectual discussion is found necessary. Statements are made, their pros and cons are argued, and the truth is thus made clear to the intellect. When the matter is understood intellectually the earnest seeker begins to apply it practically. He argues at every moment, “For whom are these thoughts? Who am I?” and so forth, until he is well-established in the conviction that a Higher Power guides us. That is firmness of faith. Then all his doubts are cleared and he needs no further instructions.

Talk 596

Sunday 10 November 2013

బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం:

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧॥

త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨॥

సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనమ్ ।
సర్వత్రైలోక్య హర్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩॥

నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్ ।
నాగకుండలసంయుక్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪॥

అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభమ్ ।
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫॥

త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్।
విభూత్యభ్యర్చితం దేవం ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬॥

త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్ ।
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭॥

గఙ్గాధరామ్బికానాథం ఫణికుణ్డలమణ్డితమ్ ।
కాలకాలం గిరీశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮॥

శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిమ్ ।
సర్వేశ్వరం సదాశాన్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯॥

సచ్చిదానన్దరూపం చ పరానన్దమయం శివమ్ ।
వాగీశ్వరం చిదాకాశం ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦॥

శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినమ్ ।
హిరణ్యబాహుం సేనాన్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧॥

అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవమ్ ।
జ్యేష్టం కనిష్ఠం గౌరీశమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౨॥

హరికేశం సనన్దీశమ్ ఉచ్ఛైర్ఘోషం సనాతనమ్ ।
అఘోరరూపకం కుంభమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౩॥

పూర్వజావరజం యామ్యం సూక్ష్మ తస్కరనాయకమ్ ।
నీలకంఠం జఘంన్యంచ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౪॥

సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినమ్
మహాసేనం మహావీరమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౫॥

కుమారం కుశలం కూప్యం వదాన్యఞ్చ మహారధమ్ ।
తౌర్యాతౌర్యం చ దేవ్యం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౬॥

దశకర్ణం లలాటాక్షం పఞ్చవక్త్రం సదాశివమ్ ।
అశేషపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౭॥

నీలకణ్ఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరమ్ ।
మహాపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౮॥

చూడామణీకృతవిభుం వలయీకృతవాసుకిమ్ ।
కైలాసవాసినం భీమమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౯॥

కర్పూరకుందధవలం నరకార్ణవతారకమ్ ।
కరుణామృతసింధుం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౦॥

మహాదేవం మహాత్మానం భుజఙ్గాధిప కఙ్కణమ్ ।
మహాపాపహరం దేవమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౧॥

భూతేశం ఖణ్డపరశుం వామదేవం పినాకినమ్ ।
వామే శక్తిధరం శ్రేష్ఠమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౨॥

ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలమ్ ।
నీలలోహితఖట్వాఙ్గమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౩॥

కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాన్తకమ్ ।
వృషాఙ్కం వృషభారూఢమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౪॥

సామప్రియం సర్వమయం భస్మోద్ధూలిత విగ్రహమ్ ।
మృత్యుఞ్జయం లోకనాథమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౫॥

దారిద్ర్యదుఃఖహరణం రవిచన్ద్రానలేక్షణమ్ ।
మృగపాణిం చన్ద్రమౌళిమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౬॥

సర్వలోకభయాకారం సర్వలోకైకసాక్షిణమ్ ।
నిర్మలం నిర్గుణాకారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౭॥

సర్వతత్త్వాత్మకం సామ్బం సర్వతత్త్వవిదూరకమ్ ।
సర్వతత్త్వస్వరూపం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౮॥

సర్వలోక గురుం స్థాణుం సర్వలోకవరప్రదమ్ ।
సర్వలోకైక నేత్రం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౯॥

మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకమ్ ।
కమలాప్రియ పూజ్యంం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౦॥

తేజోమయం మహాభీమమ్ ఉమేశం భస్మలేపనమ్ ।
భవరోగవినాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౧॥

స్వర్గాపవర్గఫలదం రఘునాథవరప్రదమ్ ।
నగరాజసుతాకాంతమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౨॥

మంజీరపాదయుగలం శుభలక్షణలక్షితమ్ ।
ఫణిరాజ విరాజం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౩॥

నిరామయం నిరాధారం నిస్సఙ్గం నిష్ప్రపఞ్చకమ్ ।
తేజోరూపం మహారౌద్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౪॥

సర్వలోకైక పితరం సర్వలోకైక మాతరమ్ ।
సర్వలోకైక నాథం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౫॥

చిత్రామ్బరం నిరాభాసం వృషభేశ్వర వాహనమ్ ।
నీలగ్రీవం చతుర్వక్త్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౬॥

రత్నకఞ్చుకరత్నేశం రత్నకుణ్డల మణ్డితమ్ ।
నవరత్న కిరీటం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౭॥

దివ్యరత్నాఙ్గులీ స్వర్ణం కణ్ఠాభరణభూషితమ్ ।
నానారత్నమణిమయమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౮॥

రత్నాఙ్గులీయ విలసత్కరశాఖానఖప్రభమ్ ।
భక్తమానస గేహం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౯॥

వామాఙ్గభాగ విలసదమ్బికా వీక్షణప్రియమ్ ।
పుణ్డరీకనిభాక్షం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౦॥

సమ్పూర్ణకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణమ్ ।
సౌభాగ్యదం హితకరమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౧॥

నానాశాస్త్రగుణోపేతం స్ఫురన్మంగల విగ్రహమ్ ।
విద్యావిభేదరహితమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౨॥

అప్రమేయగుణాధారం వేదకృద్రూప విగ్రహమ్ ।
ధర్మాధర్మ ప్రవృత్తం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౩॥

గౌరీవిలాససదనం జీవజీవపితామహమ్ ।
కల్పాన్తభైరవం శుభ్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౪॥

సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనమ్ ।
దుఃఖావతారం భద్రం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౫॥

సుఖరూపం రూపనాశం సర్వధర్మ ఫలప్రదమ్ ।
అతీంద్రియం మహామాయమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౬॥

సర్వపక్షిమృగాకారం సర్వపక్షిమృగాధిపమ్ ।
సర్వపక్షిమృగాధారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౭॥

జీవాధ్యక్షం జీవవంద్యం జీవజీవనరక్షకమ్ ।
జీవకృజ్జీవహరణమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౮॥

విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మావజ్రహస్తకమ్ ।
వజ్రేశం వజ్రభూషం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౯॥

గణాధిపం గణాధ్యక్షం ప్రలయానలనాశకమ్ ।
జితేన్ద్రియం వీరభద్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౦॥

త్ర్యమ్బకం మృడం శూరం అరిషడ్వర్గనాశనమ్ ।
దిగమ్బరం క్షోభనాశమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౧॥

కున్దేన్దు శంఖధవలమ్ భగనేత్రభిదుజ్జ్వలమ్ ।
కాలాగ్నిరుద్రం సర్వజ్ఞమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౨॥

కమ్బుగ్రీవం కమ్బుకంఠం ధైర్యదం ధైర్యవర్ధకమ్ ।
శార్దూలచర్మవసనమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౩॥

జగదుత్పత్తి హేతుం చ జగత్ప్రలయకారణమ్ ।
పూర్ణానన్ద స్వరూపం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౪॥

సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణ కీర్తనమ్ ।
బ్రహ్మాండనాయకం తారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౫॥

మన్దారమూలనిలయం మన్దారకుసుమప్రియమ్ ।
బృన్దారకప్రియతరమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౬॥

మహేన్ద్రియం మహాబాహుం విశ్వాసపరిపూరకమ్ ।
సులభాసులభం లభ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౭॥

బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదమ్ ।
పరేశం బీజనాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౮॥

యుగాకారం యుగాధీశం యుగకృద్యుగనాశనమ్ ।
పరేశం బీజనాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౯॥

ధూర్జటిం పిఙ్గలజటం జటామణ్డలమణ్డితమ్ ।
కర్పూరగౌరం గౌరీశమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౦॥

సురావాసం జనావాసం యోగీశం యోగిపుఙ్గవమ్ ।
యోగదం యోగినాం సింహమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౧॥

ఉత్తమానుత్తమం తత్త్వమ్ అంధకాసురసూదనమ్ ।
భక్తకల్పద్రుమస్తోమమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౨॥

విచిత్రమాల్యవసనం దివ్యచన్దనచర్చితమ్ ।
విష్ణుబ్రహ్మాది వంద్యం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౩॥

కుమారం పితరం దేవం శ్రితచన్ద్రకలానిధిమ్ ।
బ్రహ్మశత్రుం జగన్మిత్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౪॥

లావణ్యమధురాకారం కరుణారసవారధిమ్ ।
భ్రువోర్మధ్యే సహస్రార్చిమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౫॥

జటాధరం పావకాక్షం వృక్షేశం భూమినాయకమ్ ।
కామదం సర్వదాగమ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౬॥

శివం శాన్తం ఉమానాథం మహాధ్యానపరాయణమ్ ।
జ్ఞానప్రదం కృత్తివాసమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౭॥

వాసుక్యురగహారం చ లోకానుగ్రహకారణమ్ ।
జ్ఞానప్రదం కృత్తివాసమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౮॥

శశాఙ్కధారిణం భర్గం సర్వలోకైకశఙ్కరమ్ ।
శుద్ధం చ శాశ్వతం నిత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౯॥

శరణాగత దీనార్తి పరిత్రాణపరాయణమ్ ।
గమ్భీరం చ వషట్కారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥౭౦॥

భోక్తారం భోజనం భోజ్యం జేతారం జితమానస్ ।
కరణం కారణం జిష్ణుమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౧॥

క్షేత్రజ్ఞం క్షేత్రపాలఞ్ చ పరార్ధైకప్రయోజనమ్ ।
వ్యోమకేశం భీమవేషమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౨॥

భవజ్ఞం తరుణోపేతం చోరిష్టం యమనాశనమ్ ।
హిరణ్యగర్భం హేమాఙ్గమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౩॥

దక్షం చాముణ్డజనకం మోక్షదం మోక్షనాయకమ్ ।
హిరణ్యదం హేమరూపమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౪॥

మహాశ్మశాననిలయం ప్రచ్ఛన్న స్ఫటికప్రభమ్ ।
వేదాస్యం వేదరూప। చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౫॥

స్థిరం ధర్మమ్ ఉమానాథం బ్రహ్మణ్యం చాశ్రయం విభుమ్ ।
జగన్నివాసం ప్రథమమేక బిల్వం శివార్పణమ్ ॥ ౭౬॥

రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షప్రియవత్సలమ్ ।
రుద్రాక్షభక్త సంస్తోమమేక బిల్వం శివార్పణమ్ ॥ ౭౭॥

ఫణీన్ద్ర విలసత్కంఠం భుజఙభరణప్రియమ్ ।
దక్షాధ్వర వినాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౮॥

నాగేన్ద్ర విలసత్కర్ణం మహీన్ద్రవలయావృతమ్ ।
మునివంద్యం మునిశ్రేష్ఠమేక బిల్వం శివార్పణమ్ ॥ ౭౯॥

మృగేన్ద్రచర్మవసనం మునీనామేకజీవనమ్ ।
సర్వదేవాది పూజ్యం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౦॥

నిధనేశం ధనాధీశమ్ అపమృత్యువినాశనమ్ ।
లిఙ్గమూర్తిమలిఙ్గాత్మమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౧॥

భక్తకల్యాణదం వ్యస్తం వేదవేదాంతసంస్తుతమ్ ।
కల్పకృత్కల్పనాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౨॥

ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మవివర్జితమ్ ।
కపాలమాలాభరణమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౩॥

మాతఙ్గచర్మవసనం విరాడ్రూపవిదారకమ్ ।
విష్ణుక్రాంతమనంతం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౪॥

యజ్ఞకర్మఫలాధ్యక్షం యజ్ఞవిఘ్నవినాశకమ్ ।
యజ్ఞేశం యజ్ఞభోక్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౫॥

కాలాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకమ్ ।
యోగిమానసపూజ్యం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౬॥

మహోన్నతమహాకాయం మహోదరమహాభుజమ్ ।
మహావక్త్రం మహావృద్ధమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౭॥

సునేత్రం సులలాటం చ సర్వభీమపరాక్రమమ్ ।
మహేశ్వరం శివతరమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౮॥

సమస్తజగదాధారం సమస్తగుణసాగరమ్ ।
సత్యం సత్యగుణోపేతమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౯॥

మాఘకృష్ణచతుర్దశ్యాం పూజార్ధం చ జగద్గురోః ।
దుర్లభం సర్వదేవానామ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౦॥

తత్రాపిదుర్లభం మన్యేత్ నభోమాసేన్దువాసరే ।
ప్రదోషకాలేపూజాయామ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౧॥

తటాకంధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయమ్
కోటికన్యామహాదానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౨॥

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్।
అఘోరపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౩॥

తులసీబిల్వనిర్గుణ్డీ జంబీరామలకం తథా ।
పఞ్చబిల్వమితిఖ్యాతమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౪॥

అఖణ్డబిల్వపత్రైశ్చ పూజయేన్నందికేశ్వరమ్ ।
ముచ్యతే సర్వపాపేభ్యః ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౫॥

సాలంకృతాశతావృత్తా కన్యాకోటిసహస్రకమ్ ।
సామ్రాజ్యపృథ్వీదానం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౬॥

దన్త్యశ్వకోటిదానాని అశ్వమేధసహస్రకమ్ ।
సవత్సధేనుదానాని ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౭॥

చతుర్వేదసహస్రాణి భారతాదిపురాణకమ్ ।
సామ్రాజ్యపృథ్వీదానం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౮॥

సర్వరత్నమయం మేరుం కాఞ్చనం దివ్యవస్త్రకమ్ ।
తులాభాగం శతావర్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౯॥

అష్టోత్తరశ్శతం బిల్వం యోర్చయేల్లిఙ్గమస్తకే ।
అధర్వోక్తమ్ అధేభ్యస్తు ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౦॥

కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనమ్ ।
అఘోరపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౧॥

అష్టోత్తరశ్శతశ్లోకైః స్తోత్రాద్యైః పూజయేద్యధాః ।
త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౨॥

దన్తికోటిసహస్రాణాం భూః హిరణ్యసహస్రకమ్ ।
సర్వక్రతుమయం పుణ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౩॥

పుత్రపౌత్రాదికం భోగం భుక్త్వాచాత్రయధేప్సితమ్ ।
అంతేజ శివసాయుజ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౪॥

విప్రకోటిసహస్రాణాం విత్తదానాశ్చయత్ఫలమ్ ।
తత్ఫలం ప్రాప్నుయాత్సత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౫॥

త్వన్నామకీర్తనం తత్త్వతవపాదామ్బుయః పిబేత్ ।
జీవన్ముక్తోభవేన్నిత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౬॥

అనేకదానఫలదమ్ అనన్తసుకృతాదికమ్ ।
తీర్థయాత్రాఖిలం పుణ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౭॥

త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ ।
భవనం శాఙ్కరం నిత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౮॥

ఉమయాసహితం దేవం సవాహనగణం శివమ్ ।
భస్మానులిప్తసర్వాఙ్గమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౯॥

సాలగ్రామసహస్రాణి విప్రాణాం శతకోటికమ్ ।
యజ్ఞకోటిసహస్రాణి ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧౦॥

అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాభికృతం చ యత్ ।
తత్సర్వం నాశమాయాత్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧౧॥

అమృతోద్భవవృక్షస్య మహాదేవప్రియస్య చ ।
ముచ్యంతే కంటకాఘాతాత్ కంటకేభ్యో హి మానవాః ॥ ౧౧౨॥

ఏకైకబిల్వపత్రేణ కోటియజ్ఞఫలం భవేత్ ।
మహాదేవస్య పూజార్థమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧౩॥

ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రునివారణమ్ ।
ద్వికాలేచ పఠేన్నిత్యం మనోరథఫలప్రదమ్ ।

త్రికాలేచ పఠేన్నిత్యమ్ ఆయుర్వర్ధ్యో ధనప్రదమ్ ।
అచిరాత్కార్యసిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ ౧౧౪॥

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః ।
లక్ష్మీప్రాప్తిశ్శివావాసః శివేన సహ మోదతే ॥ ౧౧౫॥

కోటిజన్మ కృతం పాపమ్ అర్చనేన వినశ్యతి ।


సప్తజన్మకృతం పాపం శ్రవణేన వినశ్యతి ।


జన్మాన్తరకృతం పాపం పఠనేన వినశ్యతి ।


దివారాత్రకృతం పాపం దర్శనేన వినశ్యతి ।


క్షణేక్షణేకృతం పాపం స్మరణేన వినశ్యతి ।


పుస్తకం ధారయేద్దేహి ఆరోగ్యం భయనాశనమ్ ॥ ౧౧౬॥

ఇతి బిల్వాష్టోత్తర శతస్తోత్రం సమాప్తా

Saturday 9 November 2013

Stories of Ramana Maharshi

I once remember a Harijan lady who for the past twenty-five years was gathering honey to send to Sri Bhagavan. On every occasion she was unable to bring the honey herself and had to send it with someone. After waiting for twenty-five years, she finally found the opportunity to come. The poor lady was in tattered clothes, standing before Bhagavan. Her eyesight was poor and I still vividly recall the unusual way she looked at Sri Bhagavan, calling out "Oh Darling, where are you? I want to see you." Bhagavan in all his graciousness said, "Grandmother, look this way. I am here." Looking at the honey she had brought with her, he said to me, "They are Brahmins, they won't eat this. We will share it, and eat it.

"It is often said, Bhagavan did not give direct Upadesa (spiritual teaching), but what else is all this? Although Bhagavan repeatedly pointed out human frailty, people were not prepared to rectify themselves. As if talking to himself, he looked at this poor old woman in ragged clothes and said, "Poor lady, she must be hungry. And where will she go for clothes? Who will offer her food and clothes?" Upon hearing this, Ondu Reddiyar got up and said, "We will give her food and also see that some clothes are purchased." Then Reddiyar took the woman to the Dining Hall and fed her sumptuously. He also sent someone to town to buy her a sari. As the old woman had no money, she had walked a great distance to come here. Bhagavan knowing this, said in an impersonal way, "Would anyone be interested in getting her a bus ticket?" Reddiyar again came forward and said, "We will provide her with a bus ticket and see her off." When this lady returned from the Dining Hall she was touching the ground, and then touching her eyes. That is a way of prostration and thanksgiving.

It is noteworthy that whenever the poor or untouchables came, Bhagavan took a very personal interest in them, which was a moving sight to see.

-Rajapalayam Ramani Ammal, Story of Harijan Lady, Stories of Ramana Maharshi

God, Guru and Self by Bhagavan Ramana Maharshi

Sometimes in his life a man becomes dissatisfied with it, and, not content with what he has, he seeks the satisfaction of his desires, through prayer to God etc. His mind is gradually purified until he longs to know God, more to obtain His grace than to satisfy his worldly desires. Then, God’s grace begins to manifest. God takes the form of a Guru and appears to the devotee, teaches him the Truth and, moreover, purifies his mind by association. The devotee’s mind gains strength and is then able to turn inward. By meditation it is further purified and it remains still without the least ripple.
That calm expanse is the Self.

The Guru is both ‘external’ and ‘internal’. From the ‘exterior’ he gives a push to the mind to turn inward; from the ‘interior’ He pulls the mind towards the Self and helps in the quieting of the mind. That is guru kripa. There is no difference between God, Guru and the Self.

- Bhagavan Ramana Maharshi

Thursday 7 November 2013

పాము కనిపిస్తే ఏం చేయాలి ? సర్పదోషాలు ఉన్నవారు పఠించవలసిన మంత్రం ఏమిటి?

పాము కనిపిస్తే ఏం చేయాలి ? సర్పదోషాలు ఉన్నవారు పఠించవలసిన మంత్రం ఏమిటి?

పాములను పూజించే మనం నిజంగా పాము కనిపించగానే హంగామా చేసేస్తాం. కారణం అవి కాటేస్తాయనే భయం. ఒక్కసారి ఈ దేశంలో రోజు చనిపోతున్నవారిలో పాముకాటు వల్ల చనిపోతున్నవారు ఎంత మంది అని చూడండి, వేళ్ళ మీద లెక్కించవచ్చు, ఒక్కోరోజు అసలు ఉండకపోవచ్చు. పామును దైవంగా పూజించే మనం ఒక పాము కనిపించగానే, లేనిపోని హడావుడి చేసి, పాముకు ఒక భయానక వాతవరణాన్ని సృష్టించి, జనం అందరిని పోగేసుకుని, దాన్ని చంపే ప్రయత్నం చేస్తారు. అది కాటేస్తుందంటారు.

ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పాము కాటు గురవ్వగానే ఎవరు మరణించరు. అలా భయానక విషసర్పాలు మన దేశంలో చాలా తక్కువ. పాము కాటుకు గురయ్యామన్న భయమే మరణానికి కారణమవుతుంది.  భయం కారణంగా రక్తప్రసరణ వేగం పెరుగుతుంది, విషం ఇతర శరీర భాగాలకు చేరి, శరీరం విషతుల్యమవుతుంది. పాముకాటుకు గురైన తరువాత 6 గంటల వరకు మనకు ఏమి కాదు. ఈ సమయంలో టెన్షన్ పడకుండా, ఎక్కడ కాటు వేసిందో, ఆ ప్రాంతానికి కొంతపైన భాగంలో ఒక బట్టతో గట్టిగా కట్టి, ప్రశాంతంగా, త్వరగా ఆసుపత్రికి వెళ్తే, ఆ విషానికి విరుగుడు మందు ఇస్తారు వైద్యులు. ఉదాహరణకు పాము చేతివేళ్ళ భాగంలో కాటేస్తే, మణికట్టు దగ్గర ఒక బట్టను గట్టిగా కట్టి, ఆవేశపడకుండా, భయానికి, టెన్షన్‌కు లోనుకాకుండా, త్వరగా వైద్యుడిని సంప్రదిస్తే సరిపోతుంది. ఇలా బట్ట కట్టడం వలన, రక్తప్రసరణ ఆ భగం నుంచి తగ్గిపోతుంది, ఫలితంగా విషం దెహమంతా వ్యాపించదు.

ఇంకొక విషయం ఏమిటంటే పాములు అదే పనిగా జనానికి హాని తలపెట్టాలని అనుకోవు. వాటి ప్రాణరక్షణ కోసం మాత్రమే అవి కాటు వేస్తాయి. మనం ఎలాగైతే, రోడ్డున వెళ్తామో, అలాగే అవి కూడా వెళ్తాయి. వాటి మానాన అవి ఎదో ఆహారం కోసం అన్వేషిస్తుంటాయి. అవి కనిపించగానే, అరిచి, హంగామా చేసేకంటే, మౌనంగా నిల్చుంటె, అది ఏ పొదల్లోకో వెల్ళిపోతుంది. ఇది పంటపోలాల సంగతి. ఇక నగరాల్లో జనావాసాల్లోకి వస్తే, పోని ఎవరైనా బుట్టలో పెట్టి వాటిని తీసుకువచ్చినా, వెంటనే స్నేక్‌సెల్ వారికి ఫోన్ చేయండి. మనం పూజించే సర్పజాతికి ఉపకారం చేయండి.

ఇక శాస్త్రం కూడా పాము కనిపించగానే ఆస్తిక మహర్షి శరణు వేడమని చెప్పింది. ఆస్తికమహర్షి సర్పజాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన్ను శరణూ వేడగానే, పాములు వాటంతట అవే తప్పుకుంటాయి. దీని అర్ధం, మనం పాము ముందుకు కావలని వెళ్ళి నిల్చుని ఆస్తికుడిని తలుచుకోమని కాదు, పొరపాటున మన దారిలో పాము వస్తే / కనిపిస్తే, దాని నుంచి మనకు హాని కలుగకూడదని, ఆయన్ను శరణు వేడాలి. అప్పుడే పనిచేస్తుంది.

ఇక సర్పదోషాలున్నవారు భయపడవలసిన అవసరంలేదు. సర్పజాతికి హాని తలపెట్టకుండా ఉండడంతో పాటు "ఓం నమో మనసాయై" అని మానసాదేవి మంత్రాన్ని ప్రతి నిత్యం జపించడం వలన సర్పదోషాల ప్రభావం తగ్గుతుంది.

ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోని దైవత్వాన్ని గుర్తుంచి పూజించే సంస్కృతి మనది. ప్రతి జీవి జీవవైవిధ్యంలో ఎంతో విలువైనది. అన్ని జీవరాశులను కాపాడుకుందాం. పచ్చని ప్రకృతిని భావితరాలకు అందిద్దాం. ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తున్నామో, అవి కూడా అలాగే జీవిస్తున్నాయి. మనం వాటి జోలికి వెళ్ళవద్దు, అవి మన జోలికి రావద్దని కోరుకుందాం.

Wednesday 6 November 2013

PAVANA CHALANA RODHAT

PAVANA CHALANA RODHAT' (By controlling the movement of the breath) 

- from Ramana Yoga Sutras, by Krishna Bhikshu



1. Bhagavan explains how one can enter the heart or the state of thoughtlessness. He says it can be done by controlling the movements of the breath. It is said that the word 'pavana' here is used in a technical sense. It means 'prana' or the vital force. The vital force in the body works mainly in five ways, and also in another five ways that are subsidiary. The first five movements are called the pancha pranas. The first force makes one breathe in and the second enables one to talk. Another enables one to expel things out of the body. Still another aids digestion, and the fifth spreads all over the body, keeping it alive. The pavana of the vital force here intended is that which makes one breathe in and out. It is called the 'mukhya prana.'

2. When the breath is held, it is observed that the thoughts also decrease and finally, when the breath movement is brought to a standstill, the thoughts also completely subside. This is a practical tip given by Bhagavan. He explains this rationale in a couplet of "Upadesa Saram" where he says, "Force divides into two branches. One is the mind and the second is the prana." [Verse 12] They are like two horses harnessed to a carriage. When the reins of one are held tight, it naturally has to stop, thereby rendering the other unable to proceed.

Contrary to what medical science says, stoppage of breath does not result in an increase of carbon dioxide in the blood, which should weaken one. Yogis have been said to prolong their lives for hundreds of years by completely stopping their breath (by adopting what is called 'lambikayoga'). Now, completely stopping the breath is not possible in the beginning; it is a matter of practice. Certain other things are helpful (such as remaining fixedly in an asana) for effecting control of breath.

By controlling any one prana it is seen, in practical life, that you control the other pranas also.

3. When the movements of the vital force are controlled, this vital force no longer gives any scope for the sense organs to reach out towards worldly objects. Consequently the vital force fills the body and returns to its source, the Atman, where the mind also dissolves at the same time. It is, so to speak, as if a dam were raised across a rushing torrent, which would inevitably reverse the direction of its flow.

4. It is said that if one stops talking for a dozen years the mind will be rendered fairly calm, at which time the silencing of the thoughts altogether can be practiced. With a dozen years of practice of the latter variety, the silence attained will be profound and deep, and that is the state of samadhi. Sri Rama Yogi, a well known disciple of Sri Bhagavan, practiced the silence of the first variety and the progress he made is described in Paul Brunton's book, A Search in Secret India.
IV, "satata pratyavekshanat"

BY CONSTANT WATCHING (OF THE BREATH)

1. There are several methods advocated in the practice of breath control. The method the Maharshi teaches is a rare one: if one merely watches the breath and no attempt to control it is made, the breath of itself slows down almost to the vanishing point. This is a practical tip and is the essence of several types of yoga sadhana.

2. Normally in hatha yoga the nostrils are closed and opened with the fingers for definite intervals. Some say that if the time taken for inhalation is one unit, the retention of the breath should be for four units and breathing out for two units. The sadhaka practicing in this way is fighting a battle, as it were, with the force of the breath. Were this battle to be conducted the wrong way, dangers or disasters might follow, particularly if it were to be lost. Forced effort may end in various kinds of diseases; it may even cause madness, and in some cases, if the kundalini or life force rises uncontrolled, the body gets almost burnt up and death can result. So this practice needs to be done with great care and circumspection under the personal supervision of a Master, adopting easy techniques from time to time and different restrictions as to diet, time and posture. The
Maharshi bids us strictly to avoid this method of hatha yoga.
Do not fight with the natural flow of the breath. Only watch it as if you were a witness to a process. This is called the 'sakshi bhava' in philosophical terminology,

3. The advantages of the Maharshi's method are many. It automatically turns the thoughts away from the ideas and objects of the world, effecting a severance of the world and one's self. The world of affairs will amount to zero for the practitioner of this method. All the tribulations that naturally follow any contact with the world cease, so that all disturbing factors are brought to an abrupt end. Not for him are the emotional surges and fits of despair found in the bhakti marga, nor are the anxieties of the karma marga present. The dangers of the yoga marga will never touch him; not even the troubles of the path of raja yoga will face him. One is almost the Divine, the kootastha, who is said to be the witness of the three states of consciousness – jagrat, swapna and sushupti.

4. The result will be the slowing down of the speed at which thoughts arise; they become slower. In the end, a thought arises and sinks, an interval ensues, and only then another thought arises. That means, since the thoughts arise in consciousness, the thoughts sink back again into consciousness, and before another thought ensues, there is only the consciousness free from thought. In reality, one is that consciousness, in which there is no idea of the manifested world, either gross or subtle. One is almost in the state of Divinity. It is the 'hrid' state of consciousness, which is thoughtless. One has reached the highest possible goal of individual effort in which the little self is not known; it is almost the attainment of the Atman.

5. The practice of this method needs no niyamas (observances); differences in time, circumstances, clime, personality, sex, race and religion are all extinguished. The moment you begin this practice you are taken away from the world's dualities. There, no more sastras, no more discussions trouble you. Others need not even know that you are a sadhaka of this sort. Generally people praise a sadhaka for his consistency, good nature and high spiritual attainment. This praise is the greatest danger to a sadhaka. In "Ulladu Narpadu" [Supplement, Verse 37] Bhagavan has clearly pointed out this danger. In this method, even the vanity of being a sadhaka is given up.

6. Above, I said, "almost the Divine". The reason for this reservation is that the Self, even in this state, is shrouded by the avarana sakti of Maya. No one can remove this shroud by their own effort. For when one is in the state of 'hrid', there is no individual left to make any effort for the removal of this veiling. Then what is the way? Nothing but Divine Grace can help you now. The state of 'hrid' contains in itself the unmanifested seeds which later manifest. The force of those seeds is weakened by the efflux of time and by the experience of their results in various worlds, both subtle and gross. When the force of those seeds becomes negligible, the Atman of itself emerges in all its glory. The state of 'hrid' is a negative experience. The state of the Atman is a positive one, entirely dependent upon its own Grace. So say the Kathopanishad Upanishad: "To him whom It chooses, It reveals Itself."