Monday 28 March 2016

కంచి పరమాచార్య సూక్తి


హిందూ ధర్మం - 201 (వేదంలో గోవధ ఖండన - 1)

ఇప్పటి వరకు ధార్మిక గ్రంధాల్లో గోవధ లేదన్న సంగతి చూశాం. ఇప్పుడు ధర్మవ్యతిరేకులు చేస్తున్న ఆరోపణలను ఎంత అసత్యమో, కుట్రపూరితమో చూద్దాం. నిజానికి ఈ వాదన ఈనాడు కొత్తగా వచ్చింది కాదు, వేదంలో గోవధ ఉందని ఆంగ్లేయులు వేదాలకు భాష్యాలు రాసే సమయం నుంచి ప్రారంభమైంది. అటు తర్వాత వక్రీకరణ కారులైన డి.ఎన్.జా, మహాదేవ్ చక్రవర్తి, వెండీ డాగ్నిర్ మొదలైన అనేకమంది వేదంలో గోవధ ఉందని ఆరోపించారు. మతమార్పిడి మూర్ఖులు, జాకిర్ నాయిక్ లాంటి అబద్ధాలకోరులు ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తారు. విచిత్రం ఏమిటంటే వీళ్ళకు మద్దతుగా మీడియా కూడా వేదంలో గోవధ ఉందని, వేదకాలం నాటి హిందువులు గోమాంసం తిన్నారని తెగ ప్రచారం చేసింది. ఇటువంటి సమయంలో ఈ వాదనలను తిప్పికొట్టడం ప్రతి ధార్మికుడి తక్షణ కర్తవ్యం.

వినా గోరసం కో రసో భోజనం
వినా గోరసం కో రసో భూపతినాం
వినా గోరసం కో రసో కామీనీనాం
వినా గోరసం కో రసో పండితానాం

ఇందులో గో అనే పదం ఉంది కనుక ఇది ఆవు గురించే అనుకుంటారు. అదే కమ్యూనిష్టులు, వక్రీకరణకారులైతే గోరసం అంటే గోమాంసం అని చెప్పి, గోమాంసం లేని భోజనం రుచికరం కాదంటున్నారు అంటూ తమ పిచ్చి వాదన మొదలుపెడతారు. ఆంగ్ల భాషకు బాగా అలవాటు పడి, అదే గొప్ప అనేకునేవారికి ఇది ఒక కనువిప్పు. ఆంగ్లం సంస్కృతం వలే సాంకేతిక భాష (Technical language) కాదు. దానికి సంస్కృతానికున్నంత విసృతమైన పరిధి లేదు. అసలు విషయం ఇలా ఉంది.

ఇందులో ముఖ్యమైన పదం గో (గోవు). గోవుకు వేదంలో 24 నానార్దాలున్నాయి. అందులో ఆవు, భూమి, ఇంద్రియాలు, వాక్కు కొన్ని. రసానికి కూడా అనేక అర్దాలున్నాయి.

మొదటి పంక్తిలో ఉన్న గోరసం ఆవు నుంచి వచ్చే పాల పదార్ధాల గురించి చెప్తోంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవాటిని ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటాము. మధురపాదార్ధాల్లో నెయ్యి తప్పక వాడతాము. నూనె, డాల్డా కంటే నెయ్యితో చేసినవే మరింత రుచికరంగానూ, పుష్టికరంగానూ ఉంటాయి. భోజనం ఆఖరులో పెరుగు లేదా మజ్జిగ అన్నం తినకుండా లేవకూడదనే ఆచారం కూడా ఉంది. మజ్జిగలో ఉన్న పోషకాలు, జీర్ణశక్తి అలాంటివి. పాలు గురించే చెప్పనవసరమే లేదు. కాల్షియం పొందాటానికి పాలు ముఖ్యమైన ఆహారం. అందువల్ల మొదటి పంక్తికి 'గోవు పాలు- పాల నుంచి వచ్చే పదార్ధాలు లేని భోజనంలో రుచి ఎక్కడ ఉంటుంది?' అని అర్దం.

రెండవ పంక్తిలో గోరసం రాజ్యం గురించి మాట్లాడుతున్నది. గో=భూమి, రసం=రాజ్యం. రాజ్యమే లేకపోతే రాజు అవసరమేంటి అని రెండవ పంక్తికి అర్దం. రాజ్యం ఉన్నప్పుడే పరిపాలన కొరకు, రాజు, మంత్రులు, సభ మొదలైనవన్నీ ఉంటాయి. అసలు ఆ రాజ్యమే లేకపోతే ఇవ్వనీ ఎవరికి కావాలి?

మూడవ పంక్తిలో గో=ఇంద్రియాలు. గోరసం= ఇంద్రియాలు చక్కగా పని చేయడం, లోపాలు లేకపోవటం. ఇంద్రియాలు పని చేయకపోతే (కళ్ళు ఉండీ చూడలేకపోతే, చెవులుండీ వినలేకపోతే, నోరు ఉండీ మాట్లాడలేకపోతే), అనగా వాటి యందు శక్తి లేకపోతే, వ్యక్తి అందమైన స్త్రీని/పురుషుడిని చూసి ఏం లాభం? ఇంద్రియాలే మనసుకు సంకేతాలను పంపిస్తాయి. అసలా ఇంద్రియాలే పని చేయకపోతే ఇక వ్యక్తి ముందు ఎంత అందాన్ని పెట్టినా, అతడు దేన్నీ ఆస్వాదించలేడు. అందమైన జలపాతం వద్దకు తీసుకువెళ్ళినా, శ్రావ్యమైన సంగీతం వినిపించినా, అతడికి ఏ తేడా అనిపించదు.

నాల్గవ పంక్తి లో గో=వాక్కు. గోరసం= మధురమైన పలుకులు. ఎంతటి పండితుడైనా మధురమైన మాటలు మాట్లాడలేకపోతే, కార్యసిద్ధి ఎలా కలుగుతుంది? మాటల చేత ఇతరులను మెప్పించి పనులు జరిపించుకోవచ్చు, నొప్పించి చేదగొట్టుకోవచ్చు. కనుక మధురమైన మాటలు పలకడం రాని పండితుడి ఉపయోగమేమిటి? అని నాల్గవ పంక్తి అర్దం.

ఇప్పుడు ఈ సుభాషితం వలన అర్దం చేసుకోవలసిందేమిటంటే సంస్కృతం అంత త్వరగా అభిప్రాయాలు ఏర్పరుచుకోనుటకు ఉపయుక్తంగా ఉండే చిన్న భాష కాదు. అది ఎంతో విస్తృతమైనది. దాన్ని అర్దం చేసుకోవాలంటే ఎంతో మేధాశక్తి ఉండాలి.

ఇప్పుడు మనం అధార్మికులు చేసే ఒక ఆరోపణనను చూద్దాం.

శతపధ బ్రాహ్మణం 3-1-2-21 లో యాజ్ఞవల్క్య మహర్షి 'నేను గోవు, ఎద్దు మాంసం తింటాను, ఎందుకంటే అది చాలా రుచికరంగా, మృదువుగా ఉంటుంది' అన్నారని వక్రీకరణ కారుల ఆరోపణ. యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం గురించి అక్కడ చెప్పలేదు. ఆ శ్లోకంలో గౌ అన్న శబ్దానికి ఇంద్రియాలు అనే అర్దం వస్తుంది. నేను ఇంద్రియాలను తిని, అనగా ఇంద్రియాలను జయించి, జితేంద్రియుడనవుతాను అని అన్నారు. అట్లాగే ధేను అనగా ఆవు అనే కాకుండా ఆవుపాలు అనే అర్దం తీసుకోవాలి. కాకపోతే వక్రీకరణ కారులు ఆవుపాలకు బదులు ఆవు అని, ఎద్దు దున్నగా వచ్చిన ధాన్యాలకు బదులుగా ఎద్దు మాంసం అని తప్పుడు అర్దాలను ఆరోపించి, యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం, ఎద్దు మాంసం తిన్నారని విషప్రచారం చేశారు. నిజానికి ఆయన 'నేను ఆవుపాలను, ఎద్దు దున్నిన పొలం నుంచి వచ్చిన ధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తాను, ఎందుకంటే అవి రుచిగా, మృదువుగా ఉంటాయి' అని అన్నారు. వీటికి ప్రామాణికం పాణిని సూత్రాలు, అమరకోశం. పూర్తి వ్యాఖ్యానం తీసుకున్నప్పుడు ఆయన మాంస భక్షణకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా కనిపిస్తుంది.

To be continued .................

Sunday 20 March 2016

హిందూ ధర్మం - 200 (జంతుసంరక్షణ - విమర్శల ఖండన, ధార్మికులకు సూచనలు)

మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షంతం|
మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షే
మిత్రస్య చక్షుషా సమీక్షామహే|| - యజుర్వేదం 26-18

అన్ని జీవులు నన్ను తమ మిత్రుడి వలే చూచుగాక. నేను కూడా వాటిని నా మిత్రులవలే చూచుదునుగాక. ఓ భగవంతుడా! అందరం (సకల జీవరాసి) పరస్పరం స్నేహ భావంతో మెలిగేలా పరిస్థితులను ఏర్పరుచు.

ఈ విధంగా చెప్పిన వేదం, తదనుగుణంగా సకల జీవరాశుల పట్ల స్నేహ భావంతో మెలిగిన ఋషులు జంతువులను బలివ్వమని వేదంలో చెప్తారా? ఋష్యాశ్రమాల్లో వైరి భావం కలిగిన జీవులు కూడా స్నేహభావంతో మెలిగాయి. ప్రకృతిని తనకంటే నీచమనదిగా కాక, తనతో సమానమైనదిగా దర్శించమనే వైదిక సంస్కృతి చెప్పింది. 'ఆత్మవత్ సత్వభూతేషు' అని పునఃపునః చెప్పింది. అటువంటి ధర్మం ఆకలి కోసం, రుచి కోసం జంతువులను చంపమని చెప్తుందా?

గత భాగంలో వేదంలో జంతుసంరక్షణ గురించి చెప్పుకున్నాం. హిందువుల్లో కొందరు అర్దం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ధర్మం అంటే కేవలం గోసంరక్షణ మాత్రమే కాదు. గోవుతో పాటు సకల జీవరాశి క్షేమంగా ఉండాలి. గోవుకు ప్రాముఖ్యం ఇచ్చినా, మిగితా జీవరాశి కూడా భగవద్ సృష్టిలో భాగమే. వాటి పట్ల కూడా ప్రేమ, కరుణా, వాత్సల్యం కలిగి ఉండాలి. అష్టాంగ యోగంలో మొదటి మెట్టైన యమంలోనే అహింసను ప్రస్తావించారు. యమాలు అహింసతోనే మొదలైతాయి. మాకు మిగితా వాటి గురించి అవసరంలేదు, కేవలం గోవు గురించి మాట్లాడతాం అనడం వేదం ప్రకారం తప్పు.

'ఏ వ్యక్తైనా ప్రేమ, కరుణా మొదలైన గుణాలను ముందు తాను అలవరచుకోకుండా, భగవంతుడు తన పట్ల కరుణ కలిగి ఉండాలని భావన చేసి పూజ, జపం, యోగం మొదలైనవి ఏవి చేసినా, అవి నిష్ఫలమే అవుతాయన్న మాట సత్యం. వ్యక్తికి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, జాలి ఇత్యాది గుణాలు లేకపోతే, తన పట్ల భగవంతుని దయ ఉండాలని ఆశించే అధికారం అతనికి ఎక్కడుంది? ఇతరులకు చేసే సేవ, ఆధ్యాత్మిక ఉద్ధతి కోసం పూజాది సంస్కారాలు, రెండూ ఎలా చేయాలంటే, అవి నిన్ను, అవతలి వ్యక్తిని ......... ఇద్దరిని పవిత్రుల్ని చేయాలి' అని నడిచే దేవుడుగా పేరుగాంచిన అపరశంకరులు, కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చెప్పిన మాట. కాబట్టి కేవలం గోవు గురించి మాత్రమే మాట్లాడే హిందువులు ఈ విషయాన్ని ఆలోచించాలి. వేదం ప్రమాణంగా తీసుకుని సకల జీవుల శ్రేయస్సుకై పాటుపడాలి. ప్రతి సాధువు, గురువు, సన్యాసి సకల జీవరాశుల క్షేమం కోసమే పాటుపడ్డారు.

సమాజంలో ఒక వర్గం ఉంది. వారిని ఏమనాలో నాకు తెలియదు. కమ్యూనిష్టులు, మతమార్పిడి మూర్ఖులు, కుహనామేధావులు, ఇలా అనేకులు ఈ వర్గంలోకి వస్తారు. వీళ్ళు మూర్ఖులంటే మూర్ఖులు. వారికి ధర్మాన్ని వ్యతిరేకించడమే పని. వీరంతా అప్పుడప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతారు. కానీ గోవధకు వచ్చేసరికి వేదంలో గోవధ ఉన్నది అంటారు, గోవధ నిషేధం తప్పంటారు. అలా కాదు, వేదంలో గోవధ లేదు అంటే, గోసంరక్షణ ఉందంటే ........... చూశారా! వేదానికి పక్షపాతం. వేదం కేవలం గో సంరక్షణ గురించి మాత్రమే మాట్లాడింది, మిగితా జీవులను చిన్నచూపు చూసిందంటారు. జాతరల సమయంలో జంతుబలి మూఢనమ్మకం, చూశారా! మతాల కారణంగా జంతువులు ఎంత బాధపడుతున్నాయో అంటారు. అది కూడా కేవలం హిందూ ధర్మం కారణంగానే. అధర్మాల జోలికి వెళ్ళరు.  వీరేదో పెద్ద జంతు ప్రేమికుల మాదిరి భావించుకుంటారు. కానీ వారి జీవితాల్లో మాంసం లేకపోతే ముద్ద దిగదు. అదేంటో మరి? వీరి భావజాలం ఏంటో వీరికే తెలియదు. తాము దేని మీద పోరాటం చేస్తున్నామో కూడా స్పష్టంగా తెలియని (Clarity లేని) అయ్యోమయ్యం (Confused) గుంపు ఇది. వారందరికి ఇది కనువిప్పు కావాలి. ఇప్పుడు చర్చించుకున్న విషయం రెండు విమర్శలను తిప్పికొడుతుంది. ఒకటి వేదం గోవు పట్ల పక్షపాతం ప్రకటించిందని చెప్పడం, రెండవది వేదంలో గోవధ ఉంది అనడం. జంతువధనే వేదం వ్యతిరేకించినప్పుడు ఇక గోవధ ఎక్కడ ఉంటుంది. ఎలా ఉంటుంది?

ఇప్పుడు ధర్మద్వేషుల నుంచి ఇంకొక విమర్శ వస్తుంది. అన్ని జీవులను కాపాడమని వేదం చెప్పినప్పుడు కేవలం గో వధ నిర్మూలనకే చట్టం ఎందుకు? అన్ని రకాల హింసను ఆపివేయుటకు ధార్మికులు పోరాటం చేయచ్చు కదా అని .........
వేదం సకల జీవరాశి యొక్క క్షేమం కోరింది. భారతదేశంలో జంతు సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది. దాని ప్రకారం జంతువులను చంపిన వారికి కారాగార శిక్ష విధిస్తారు. అయితే నెమలి, పులి కూడా దీని చట్రం క్రిందికే రాగా, వాటిని జాతీయ జంతువులుగా ప్రకటించడం మూలంగా వాటికి కొంత ప్రత్యేకత ఉంది. అలానే గోవుకు కూడా. సకలజీవరాశుల క్షేమం కోరిన వేదమే గోవును అత్యంత ప్రధానమైనదిగా చెప్పింది. కనుక ముందు గోవును కాపాడమని హిందువుల ఆకాంక్ష. ధార్మికుల వలె మీకు కూడా అన్ని జీవుల పట్ల మమకారం ఉందంటున్నారు కనుక ముందు గోవధ నిషేధంతో ప్రారంభించి, అన్ని రకాల జీవహింసను నిషేధిద్దాం, కలిసి రండి అని మా ధార్మికుల పిలుపు. ఒక్క అడుగు ముందుకు పడితే, ఆ తర్వాత పెద్ద మార్పే సంభవిస్తుంది. అసలు అడుగే వేయొద్దంటే ఎలా? కనుక ఇలాంటి విమర్శలు చేస్తే మీ వాదన నిలవకపోవటమే కాదు, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం వస్తుందని గ్రహించండి.

To be continued ..............

Wednesday 16 March 2016

స్వామి వివేకానంద సూక్తి


దేశం మేలు కోరే ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు. ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది. ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా గారు 5 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

ఈ పుస్తకమేదో సంచలనం కోసమో, రెచ్చగొట్టడం కోసమో రాసింది కాదు. విఛ్ఛినకర శక్తులు సమాజంలో ఉన్నాయి. ఈ పుస్తకం చదివిన తర్వతా వారెవరో అర్దమవుతుంది. చదవకుండానే ఇదంతా ట్రాష్ అని తీర్పులివ్వకండి. కొంచం ఓప్పిగ్గా ఈ పుస్తకం చదవండి.

ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా విద్యార్ధులు, తల్లులు. స్కూల్లు, కాలేజీలకు వెళ్ళిన మీ పిల్లలు విఛ్ఛినకర శక్తుల మాయమాటలు నమ్మి రోహిత్, కన్నయ్య కూమార్ లాగా బలి కాకుండా ఉండాలంటే ప్రతి తల్లి ఈ పుస్తకం చదివి, తన పిల్లలను జాగృతం చేయాలి.

Sunday 13 March 2016

హిందూ ధర్మం - 199 (వేదంలో జంతుసంరక్షణ)

కేవలం గోరక్షణే కాదు, జంతుసంరక్షణ గురించి కూడా వేదం గట్టిగా చెప్పింది.

ఓ దంతాలు (పళ్ళు) (teeth) ! మీరు అన్నం తింటారు, యవలు (బార్లీ) తింటారు, పప్పులు, నువ్వులు తింటారు. ఈ ధాన్యాలన్నీ ప్రత్యేకించి మీ కోసమే ఏర్పడినాయి. అన్యాయంగా జంతువులను హింసించకండి, వాటిని తినవద్దు - అధర్వణవేదం 6.140.2

వండిన మాంసం, పచ్చిమాంసం, గర్భస్థ పిండాలను, గుడ్లను, స్త్రీపురుషులను చంపి వండిన అన్ని రకాల ఆహారాలను ధ్వంసం చేసేదము - అధర్వణవేదం 8.6.23

అఘ్న్యా యజమానాస్య పశూంపాహీ - యజుర్వేదం 1.1
ఓ మానవులారా! జంతువులన్నీ అఘ్న్యాలు - వధించకూడనివి.

ద్విపాదవ చతుష్పాత్పాహి - యజుర్వేదం 14.8
రెండు కాళ్ళున్న జీవులు, నాలుగు కాళ్ళున్న జీవులను రక్షించండి.

పిశాచ - పిశిత అనగా మాంసం + అశ - తినువాడు = మాంసం తినువాడు.
ఇలా వేదంలో అనేక మార్లు జీవహింసను వ్యతిరేకించింది. మాంసం తినేవారిని రాక్షసులతో సమానంగా పోల్చింది.

ఊర్జం నోదేహి ద్విపదే చతుష్పదే - యజుర్వేదం 11.83
రెండు కాళ్ళున్నవి, నాలుగు కాళ్ళున అన్ని జీవులు శక్తిని, పుష్టిని పొందుగాకా.

ఈ మంత్రాన్ని హిందువులు ఆహారం స్వీకరించే ముందు చదువుతారు. సకల జీవరాశుల క్షేమం కోరిన ధర్మమే వాటిని చంపి తినమని ఎలా చెప్తుంది?

యస్తు సర్వాని భూతాన్యాత్మనేవానుపశ్యతి
సర్వేభూతేషు చాత్మానం తతోనా విచికిత్సతి - యజుర్వేదం 40.6

ఎవరైతే ఆత్మ యందే అన్నీ జీవులను, అన్ని జీవులయందు తన ఆత్మను చూసుకుంటాడో, అతడు ఏ జీవి పట్ల ద్వేషం కలిగి ఉండడు. ఎందుకంటే అతడు అన్ని జీవులయందున్న ఏకత్వాన్ని తెలుసుకుంటాడు.

తనను ఎవరైనా బాధపేడితే, ఎంత వేదన అనుభవిస్తాడో, అంతే వేదన ఇతర జీవరాశి అనుభవిస్తుందని, శరీరాలు వేరు కావాచ్చు కానీ, బాధ వేరు కాదని, మనిషి తన బాధను చెప్పుకునే అవకాశం ఉంది కానీ, మూగజీవాలకు లేదు, మనమే అర్దం చేసుకోవాలని పై మంత్రం చెప్తున్నది. దానిలో ఎంత లోతైన అర్దం దాగి ఉంది.

యస్మిన్ సర్వాని భూతాన్యత్మైవబహుదా విజానతః
తత్రకో మోహః కః శోకః ఎకత్వమనుపశ్యతః - యజుర్వేదం 40.7

ఉపాధులు (శరీరములు) వేరైనా అన్నీ జీవులందున్న ఆత్మను చూసిన చూసినవాడు, ఏ జీవిని చూసి మోహానికి కానీ, శోకానికి గానీ గురికాడు. అతడు వాటిని వీక్షించగానే ఏకత్వం గుర్తుకువస్తుంది, అంతటా వ్యాపించిన ఏకత్వమే, ఆత్మయే కనిపిస్తుంది.

To be continued.................

http://agniveer.com/no-beef-in-vedas/ సౌజన్యంతో

Sunday 6 March 2016

హిందూ ధర్మం - 198 (వేదంలో గోసంరక్షణ - 3)

ఘృతం దుహానామదితిం జానాయాఘ్నే మా హింసీహీః - యజుర్వేదం 13.49

పుష్టినిచ్చి ఎదుగుదలకు తోడ్పడుతున్న ఆవులు, ఎద్దులు (గోజాతిని) ఎల్లవేళలా రక్షణ పొందాలి.

ఆరే గోహా నృహా వధో అస్తు - ఋగ్వేదం 7.56.17
గోవును చంపటం మనిషిని చంపటంతో సమానమైనది. ఎవరైతే గోహత్యకు ఒడిగడతారో వారికి కఠిన శిక్ష వేయండి.

వైదిక నిఘంటువు గోవును అఘ్న్యా, ఆహీ, అదితి అంటుంది.
ఆహీ అనగా వధించకూడనిది.

అఘ్న్యా అయిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదు. శుద్ధమైన నీరు, పచ్చని గడ్డి పెట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచండి. తద్వారా సద్గుణాలు, జ్ఞానము, సంప్దలు పొందండి. - ఋగ్వేదం 1.164.40, అధర్వణ వేదం 7.73.11, అధర్వణ వేదం 9.10.20.

అఘ్న్యా అయిన ఆవువులు, ఎద్దులు మీకు ఆఇస్వర్యాలను తీసుకువస్తాయి. - యజుర్వేదం 12.73

అంతకాయ గోఘాతం - యజుర్వేదం 30.18
గోవులను వధించేవారిని అంతం చేయండి.

మన ఆవులను, గుర్రాలను, ప్రజలను నశింపజేసేవారిని సీసపు గుళ్ళతో చంపండి.

ధేనుసాధనం రాయేనాం - అధర్వణ వేదం 11.1.34
గోవు అన్న సంప్దలకు సాధనం/కారణం

ఋగ్వేదం 6 మండలం 28 వ ఒక సూక్తం గోవు యొక్క ఖ్యాతిని చాటి చెప్తుంది.

గోవులను అన్ని రకాల దుర్భిక్షాల నుంచి దూరంగా ఆరోగ్యంగా ఉంచండి.
గోవులను రక్షించేవారిని భగవంతుడు ఆశీర్వదిస్తాడు.
శత్రువులు కూడా గోవులపై ఆయుధాలు వాడకూడదు.
గోవును ఎవరూ వధించకూడదు.
ఆవు ఐశ్వర్యము, బలము ఇస్తుంది.
ఆవును ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచితే, స్త్రీపురుషులు కూడా రోగరహితంగా, ఐశ్వర్యవంతులై ఉంటారు.
ఆవులు పచ్చగడ్డి తిని, నీరు త్రాగుగాక. ఆవి వధింపబడకుండు గాక, మరియు మనకు ఐశ్వర్యాన్నిచ్చు గాక.

To be continued ........