Tuesday 31 May 2016

హనుమంతుని గురించి స్వామి శివానంద



Hanuman is one of the seven Chiranjivis. He is the only learned scholar who knows the nine Vyakaranas or sciences of granunar. He learnt the Sastras from the sun-god. He is the personification of Brahmacharya. He is the wisest of the wise, the strongest of the strong and the bravest of the brave. He is the Sakti or energy of Rudra. He who meditates on Hanuman and repeats his name attains power, strength, glory, prosperity and success in life.

- Swami Sivananda

హనుమజ్జయంతి - స్వామి శివానంద ప్రవచనం




హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి గురించి వినాలి, లేదా చదవాలి. ఎవరికి హనుమంతుడి అనుగ్రహం కలగాలని స్వామి హనుమ భావిస్తారో, వాళ్ళు మాత్రమే ఆ పని చేస్తారట. జీవన్ముక్తులు స్వామి శివానందగారు హనుమంతుడి గురించి చెప్పిన ఈ విషయాలను చదివి, స్వామి అనుగ్రహాన్ని పాత్రులుకండి.
ఓం శ్రీ హనుమతే నమః

----------------------------

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

ఎక్కడ రాముని కీర్తిస్తున్నా, అక్కడ అంజలి ముద్రతో తన దోసిలిని నుదుటిపై ఉంచి, నీళ్ళు నిండిన కళ్ళతో కనిపించే, రాక్షాసాంతకుడైన మారుతికి నమస్కారాలు.

శ్రీ హనుమంతులవారిని భారతదేశమంతా, రామ సహితంగా, లేక మాములుగానైన పూజిస్తారు. శ్రీ రాముడున్న ప్రతి ఆలయంలో హనుమంతుడుంటాడు. ఆంజనేయస్వామి శివుడి అవతారం. వాయుదేవుడికి, అంజనాదేవికి జన్మించారు. పవనసుతుడు, మరుతసుతుడు, పవనకుమారుడు, భజరంగబలి, మహావీరుడు అంటూ ఆయనకు అనేక నామాలున్నాయి.

శ్రీ రామనామం మూర్తీభవించిన స్వరూపం హనుమంతుడు. ఆయన ఆదర్శవంతమైన నిస్వార్ధ సేవకుడు, నిజమైన కర్మయోగి, నిష్కామంగా, వేగంగా కార్యాలు నిర్వర్తించాడు. ఆయన గొప్ప భక్తుడు, గొప్ప బ్రహ్మచారి. శ్రీ రాముడి నుంచి ఏమీ ఆశించకుండా, శుద్ధమైన ప్రేమతో, భక్తితో సేవించాడు. ఆయన జీవించిందే రాముడిని సేవించడం కోసం. ఆయన వినయవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిశాలి. దైవలక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతరలకు అసాధ్యమైనవన్నీ ఆయన చేసి చూపించాడు - రామనామం మహిమతో సముద్రాన్ని దాటాడు, లంకాదహనం చేశాడు, సంజీవిని మూలికను తెచ్చి, లక్ష్మణుని ప్రాణాన్ని నిలబెట్టాడు. పాతాళలోకంలో అహిరావణుడి చెరనుంచి రామ, లక్ష్మణులను తీసుకువచ్చాడు.

ఆయనకు భక్తి, జ్ఞానం, నిస్వాధ సేవాతత్పరత, బ్రహంచర్య బలం, నిష్కామం ఉన్నాయి. ఆయన తన బుద్ధి, వీరత్వం గురించి ఏనాడు గొప్పలు చెప్పుకోలేదు.

'నేను వినయం కలిగిన రామదూతను. నేను ఇక్కడకు వచ్చింది రాముడిని సేవించడానికి, ఆయన కార్యం నెరవేర్చడానికి. రాముని ఆదేశం మేరకే నేను ఇక్కడకు వచ్చాను. రామానుగ్రహం వలన నాకు ఏ భయంలేదు. నేను చావుకు భయపడను. ఒకవేళ రాముని సేవలో మరణం వస్తే, దాన్ని స్వాగతిస్తాను' అని స్వామి హనుమ రావణునితో అన్నారు.

ఇక్కడ గమనించండి, హనుమంతుడు ఎంత వినయసంపన్నుడో! రాముని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో! 'నేను వీరుడైన హనుమంతుడను. నేను ఏదైనా చేయగలను' అని ఆయన ఏనాడు అనలేదు.

'నేను నీకు చాలా ఋణపడి ఉన్నాను ఓ వీరుడా! నీవు అద్భుతమైన, మానవాతీత కృత్యాలు చేశావు. నీవు ప్రతిఫలం కూడా ఏదీ ఆశించలేదు. సూగ్రీవునకు, అతని రాజ్యం అతనికి వచ్చింది. అంగదునకు పట్టాభిషేకం జరిగింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఏదీ అడగలేదు. సీతాదేవి నీకు ఇచ్చిన అమూల్యమైన హారాన్ని విసిరేశావు. నీ పట్ల నా ఋణాన్ని, కృతజ్ఞతను ఎలా తీర్చుకోను? నేను నీకెప్పుడు ఎంతో ఋణపడి ఉంటాను. నీవు చిరంజీవిగా ఉండే వరాన్ని ఇస్తున్నాను. అందరూ నిన్ను నాతో సమానంగా పూజించి, గౌరవిస్తారు. నీ మూర్తి నా ఆలయద్వారం వద్ది ఉండి తొలి పూజ అందుకుంటుంది. ఎప్పుడాఇనా సరే, నా కధలు, మహిమలు గానం చేసే ముందు నీ కధలు, మహిమలు గానం చేయబడతాయి. నేను చేయలేని పనులు కూడా నువ్వు చేయగలవుతావు' అని శ్రీ రాముడు ఆంజనేయస్వామితో అన్నారు.

ఆ విధంగా రాముడు సీతాదేవి జాడ కనుక్కుని లంక నుంచి వచ్చిన హనుమంతుడిని పొగిడినా, ఆయన కొంచం కూడా గర్వించలేదు. రాముడి కాళ్ళ మీద సాష్టాంగ పడ్డాడు.

ఓ వీరుడా! సముద్రాన్ని ఎలా దాటావు అని రాముడు అడిగాడు.
నీ నామం యొక్క శక్తి, వైభవం వల్లనే స్వామి అని హనుమ వినయపూర్వకంగా సమాధానమిచ్చారు.

మళ్ళీ రాముడు 'నువ్వు లంకను ఎలా కాల్చగలిగావు' అని అడిగారు.
నీ అనుగ్రహం వలననే స్వామి అని హనుమ సమాధానమిచ్చారు.

నమ్రత/ వినయం హనుమంతుని యందు మూర్తీభవిస్తున్నాయి.

ఎంతో మంది తాము చేసిన సేవకు ప్రతిఫలంగా సంపదను ఆశిస్తారు. కొందరికి సంపద అవసరంలేదు, కీర్తి, పేరు కావాలి. కొందరికి ఇవి కూడా అవసరంలేదు, కానీ పొగడ్తలు కావాలి. ఇంకొందరికి ఇవి అక్కర్లేదు, కానీ వాళ్ళు చేసిన పనులను ప్రచారం చేసుకుంటారు. హనుమంతుడు వీటికి అతీతుడు. అందుకే ఆయన్ను ఆదర్శవనతమైన కర్మయోగి అని, భక్తికి పరాకాష్టగా గుర్తించబడ్డాడు. ఆయన జీవితమంతా ఎన్నో సందేశాల సమాహారం. ప్రతి ఒక్కరు ఆంజనేయస్వామి వారిని ఉత్తమమైన ఆదర్శంగా తీసుకుని, అనుసరించేందుకు పూర్తి ప్రయత్నం చేయాలి.

ఆయన జయంతి చైత్రశుక్ల పూర్ణిమ నాడు వస్తుంది. ఆ రోజు స్వామిని పూజించడం, ఉపవాసం ఉండడం, హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం, రోజంతా రామ నామాన్ని జపించడం వలన హనుమంతుడు ఎంతో సంతృప్తి చెంది, మీరు చేపట్టిన కార్యాలన్నిటిలో విజయం ప్రసాదిస్తాడు.

హనుమంతులవారికి జయము జయము! ఆయన ప్రభువు, శ్రీ రామచంద్రులకు జయము జయము!!

- స్వామి శివానంద సరస్వతీ
(డివైన్ లైఫ్ సొసైటీ, ఋషికేశ్)

*భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. 

Sunday 29 May 2016

సద్గురు శివానందమూర్తి గారి సూక్తి


హిందూ ధర్మం - 211 (కల్పం - 1)

కల్పం - ఇది వేదంగాల్లో ఒకటి. దీన్ని వేదానికి చేతులుగా వర్ణించారు. చేతులు క్రియకు సంబంధించినవి. అలాగే కల్పం అనే వేదాంగం వేదంలో చెప్పబడ్డ కర్మల గురించి, వాటిని నిర్వహించే పద్ధతుల గురించి వివరంగా చెప్తున్నా, ఈ కల్పంలోనే గణితశాస్త్రం దాగి ఉంది. అంకగణితం (Arithmetic), రేఖాగణితం (Geometry), బీజగణితం (Algebra), త్రికోణమితి (Trigonometry) మొదలైన అనేక శాస్త్రాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.


శ్రీ రాయల విశ్వనాధ గారు కల్పం గురించి చెప్తూ, 'కకారం ప్రధమ స్పర్శగల అక్షరమవటం వలన అది క్రియాసంధి. రకారం జీవుడు. లకారం ఆ జీవుడు దేహభావంలో ఉన్న స్థితి (అంటే తాను ఆత్మ కాదు, దేహం అనుకునే భ్రాంతి). పకారం మూడుదేహాలకు సంబంధించినది (స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు). మకారం మనసకు సంబంధించినది. కల్పమంటే మనసుతో, మూడు దేహాలను, దేవభావమునకు ఉన్ముఖం చేయడం. ప్రాణము, అపానము, వ్యానము, కన్ను, చెవి, మనస్సు, వాక్కు, ఆత్మ, యజ్ఞము - ఇప్పుడు చేయబడుతున్న యజ్ఞం వలన దైవీ భావాల దిశగా ఉన్ముఖులువుగాక! అంటే మనం కూడా దేవతల వంటి మంచి ఆలోచనలు కలిగినవారం కావాలని అర్దం. యజ్ఞం అందుకోసమే. మనలో ఉన్న దైవభావలను, శక్తులను పెంపొందిచుకోవటం కోసమే.

వేదశబ్దాలకు లోకంలో కనిపించే సామాన్యమైన అర్దాలు చెప్పకూడదని నిరుక్తకారులు చెప్పి, వేదశబ్దాలను అనేక కోణాల నుంచి దర్శించి, కొత్త అర్దాలు వ్రాసారు. ఒకే శబ్దానికి అనేక అర్దాలు వ్రాసారు. వేదం కేవలం పైకి, కళ్ళకు కనిపించే లోకాల గురించే కాక, కనబడని, అంతర్లీనంగా ఉండే అనేక లోకాల గురించి చెప్తుందని తెలియని విదేశీయులు (వక్రీకరణకారులు, వీరి మతంలో అన్ని లోకాల గురించి వివరణ లేదు. అంత స్థాయికి అవి ఎదగలేదు. వాటిని అవి దర్శించలేదు, లేవు కూడా. అందువలన వారికి మన వాళ్ళు చెప్పినవి అర్దం చేసుకునే స్థాయి లేదు) వేదశబ్దాలకు సంస్కృత శబ్దాలతో తమకు తోచిన అర్దాలు చెప్పి, వేదం మానవులే వ్రాసారని, అది సామన్య గ్రంధమని ప్రకటించారు.

యాస్కుడు వేదంలో ఉన్న 'భారతి' అనే శబ్దానికి 'సూర్యుడు' అనే అర్దం సాధించారు. లౌకిక దృష్టితో చూస్తే, సంస్కృత భాషా సంప్రదాయంలో భారతికి, సూర్యునికి సంబంధంలేదు. సాయణాచార్యులు ఋగ్వేద భాష్యారంభంలో అగ్ని అనే శబ్దానికి 5 అర్దాలను చెప్పారు. కాబట్టి వేదంలో శబ్దాలకు ఇది మాత్రమే అర్దమని చెప్పలేము. 'ఇది మాత్రమే' అందులో చెప్పబడిందని కూడా చెప్పరాదు. (వేదంలో చెప్పబడినవి ఒక్కో వ్యక్తికి, అతని తపశ్శక్తిని బట్టి ఒక్కో స్థాయిలో అర్దమవుతాయి. ఒక కాలంలో, ఒక వ్యక్తి ఇచ్చిన అర్దం మాత్రమే సరైనది అని చెప్పకూడదు. కాలప్రవాహంలో అంతకంటే ఉన్నతమైన భావాలను అందులో దర్శించే అవకాశం ఉంది. అంతమాత్రాన పాతభావాలు పనికిరావని, వాటిని కాల్చివేయడం, నాశనం చేయడం ధర్మంలో లేదు - రాజీవ్ మల్‌హోత్ర)

వేదానికి అర్దం చెప్పడానికి ప్రయత్నించే శాస్త్రాలన్నీ ఒక ఎత్తు. కల్పశాస్త్రం ఒక ఎత్తు. మిగితా శాస్త్రాలు అర్దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే, కల్పం అర్దాన్ని చేతల్లో చూపించటానికి ప్రయత్నించింది, క్రియాపరంగా. మంత్రంలోని భావానికి అనుగుణమైన కర్మను కల్పించి, ఆ మంత్రాన్ని క్రియా సమయంలో (కర్మ చేస్తూ) పఠింపజేసేది కల్పము. వేదంలో చెప్పబడిన కర్మ చేస్తున్నాము, చేయడం చూస్తున్నాము, మంత్రాన్ని పఠిస్తున్నాము. అప్పుడు ఆ మంత్రం యొక్క భావం సులభంగా తెలుస్తుంది'.

To be continued .............

Saturday 28 May 2016

స్వామి శివానంద సూక్తి



Who is a Dheera? Not the Brigadier in the Army who has won many battles or one who has died on the battlefield. He is of a Rajasic type. He and he alone is a Dheera who can withdraw his mind and senses from the external object and direct them inward. This is Pratyahara. It is one of the Angas of Raja Yoga. You should first have physical discipline. Then comes ethical discipline: Ahimsa, Satyam, Brahmacharya, Self-restraint and observances. The spiritual seed the Yoga-seed, must be sown now, when you are young.

- Swami Sivananda

Monday 23 May 2016

హిందూ ధర్మం - 210 (యజ్ఞంలో బలి ఖండన - 4)


వైదిక పదాలకు ప్రామాణికమైన నిఘంటువు (Dictionary) రాసింది యాస్కాచార్యులు (యాస్కుడు). ఆయన కాలంలో ఒక్క యజ్ఞంలో కూడా జంతుబలి లేదు. యాస్కుడు జంతువధ గురించి వివరించే 33 ధాతువులను ఆ నిఘంటువులో ప్రస్తావించగా, అందులో ఒక్క ధాతువు కూడా యజ్ఞంలో జంతుబలి గురించి ప్రస్తావించలేదు. వేదానువాదానికి వేదాంగమైన నిరుక్తమే ప్రమాణం కానీ విదేశీయులు తమకు తోచినట్టు రాసిన భాష్యాలు కాదు.

మహాభారతానికి పూర్వం ఉపరిచరమనువు ఉండేవాడు. ఆయన చేసిన అశ్వమేధ యాగాన్ని అహింస్ర అని వర్ణించారు. అనగా హింసలేనిది అని. ఆ యాగం గురించి మహాభారతం శాంతిపర్వం 333 అధ్యాయంలో, ఆ యాగంలో ఏ జంతువులను చంపలేదు అని ఉంది.

అన్ని యజ్ఞాలు బలి లేకుండానే జరగాలని మనుమహర్షి ఆదేశించారు. జనులు జంతువులను బలిచ్చేది కేవలం తమ జిహ్వ చాపల్యం కోసమేనని చెప్పారు - మహాభారతం శాంతిపర్వం 266 అధ్యాయం.

మహాభారతానికి పూర్వం ఉపరిచరమనువు ఉండేవాడు. ఆయన చేసిన అశ్వమేధ యాగాన్ని అహింస్ర అని వర్ణించారు. అనగా హింసలేనిది అని. ఆ యాగం గురించి మహాభారతం శాంతిపర్వం 333 అధ్యాయంలో, ఆ యాగంలో ఏ జంతువులను చంపలేదు అని ఉంది.

అన్ని యజ్ఞాలు బలి లేకుండానే జరగాలని మనుమహర్షి ఆదేశించారు. జనులు జంతువులను బలిచ్చేది కేవలం తమ జిహ్వ చాపల్యం కోసమేనని చెప్పారు - మహాభారతం శాంతిపర్వం 266 అధ్యాయం.

యజ్ఞంలో 'అజ'ను ఆహుతిగా వేయాలని చెప్పబడింది. అజ అంటే మగమేక అని అర్దం చెప్పారు. కానీ యజ్ఞంలో విషయంలో ఆ అర్దం తప్పు. యజ్ఞంలో అజ అంటే మొలకెత్తడానికి పనికిరాని పాత విత్తనాలు అని అర్దం. అందువల యజ్ఞంలో మగ మేకను బలివ్వకూడదు, పాతవిత్తనాలను ఆహుతివ్వాలి - మహాభారతం శాంతిపర్వం 337 వ అధ్యాయం.

పాపకార్యాలు చేసేవారు మాంసం తినాలన్న తమ సొంత కోరికలను తీర్చుకోవడం కోసం జంతువులను భూతయజ్ఞం (భూతయజ్ఞం అంటే జంతువులకు ఆహారం అందించడం. సనాతనధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువు ఆచరించాల్సిన పంచ మహాయజ్ఞాల్లో ఒకటి.), పితృ యజ్ఞం నెపంతో బలి ఇస్తారు - శ్రీ మద్భాగవతం 11 వ స్కందం, 5 వ అధ్యాయం.
ఇక్కడ మాంసాహారులను దూషించలేదు. మాంసం తినడం ధర్మంలో కొన్ని వర్ణాలకు తప్పుకాదు. కానీ ఆధ్యాత్మిక జీవనం గడపాలి, ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని తపించే సాధకులు, వారు ఏ వర్ణంలో పుట్టినా, ఆధ్యాత్మిక జీవన ఆరంభంలోనే మాంసాహారాన్ని విడిచిపెట్టాలని గ్రంధాలన్ని స్పష్టంగా చెప్తున్నాయి. కేవలం మాంసాహారాన్ని విడిచిపెట్టడం కాక, మితసాత్త్వికాహార నియమం విధించాయి. శాఖాహారంలో కూడా సాత్త్వికాహారాన్నే స్వీకరించాలని, అప్పుడు మాత్రమే మనస్సు శుద్ధి అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఆహారశుద్ధ్వే సత్త్వశుద్ధిః అని ఉపనిషత్తు చెప్పింది. అయితే ఇక్కడ పాపకార్యాలు చేసేవారని అన్నది తమ రుచి కోసం మాంసం తినాలని నిశ్చయించుకుని, దానికి యజ్ఞాన్ని, దైవాన్ని నెపంగా పెట్టి, దేవుడికి బలి ఇచ్చాం కనుక తింటున్నాం చెప్పేవారిని. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ధర్మం దేశకాలాలను అనుసరించి మారుతుంది. బ్రాహ్మణుడు ఎప్పుడూ మాంసాహారం తినకూడదు. అదే సైనికుడి (క్షత్రియుడి) విషయంలోకి వస్తే, అతడు పని చేసే ప్రదేశంలో అన్ని రకాల ఆహారం దొరకకపోవచ్చు. దొరికినవి బలమైనవి కాకపోవచ్చు. అప్పుడు అతడికి ఇలాంటి ఆహార నియమాలు ఉండవు. తన శరీరాన్ని తాను బలంగా, పుష్టిగా ఉంచుకున్నప్పుడే క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తించగలుగుతాడు. కనుక స్వధర్మ రక్షణ కోసం అతడు భుజించవచ్చు.

యజ్ఞాల్లో జంతుబలి ఇచ్చేవారు మూర్ఖులు. వాళ్ళకి వేదహృదయం అర్దం కాలేదు - పంచతంత్రంలో 3 వ తంత్రం, 2 వ కధ)

ఇలా సంస్కృత వాజ్ఞమయంలో అనేక చోట్ల వేదంలో హింసలేదని చెప్పబడడమే కాదు, ఎక్కడైనా ధర్మాన్ని అడ్డంగా పెట్టుకుని హింస చేస్తే, అది అధర్మమని ఖండించబడింది.

సేకరణ - వెజిటెరినిజం అండ్ ది వేదాస్ - అరుణభ్ తల్వార్

To be continued ..............

Saturday 21 May 2016

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన - అన్నమయ్య కీర్తన



ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ||

కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు |

తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు |

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు |

సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ||

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు |

శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు ||

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు 

బుద్ధుడిని కమ్యూనిష్టులు, దేశద్రోహుల నుంచి రక్షించుకోవాలి

ఇప్పుడు హిందువులను, హిందూ ధర్మాన్ని తులనాడటానికి ధర్మద్వేషులు తగిలించుకున్న ముసుగు బౌద్ధం. బుద్ధుడి గురించి, ఆయన చేసినవాటి కంటే చేయని ఎన్నో విషయాలను కల్పించి, బుద్ధుడు సనాతనధర్మాన్ని వ్యతిరేకించాడని ఆయన్నూ ధర్మవ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. భారతదేశంలో బౌద్ధం గురించి చదివిన వారు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధం మూల గ్రంధాలు చదివిన వారు భారతదేశం పట్ల, హైందవ సంస్కృతి పట్ల అపారమైన గౌరవం ప్రదర్శిస్తున్నారు. అసలు బుద్ధుడు ఎప్పుడూ హైందవ ధర్మాన్ని వ్యతిరేకించలేదని వాళ్ళు నిర్ధారిసున్నారు. ఈ సమయంలో అసలు బుద్ధుడు చేసిందేమిటో మనం తప్పక తెలుసుకోవాలి.

జీవితంలో ఎదురైన సంఘటనల వలన తనలో కలిగిన అంతర్మధనానికి సమాధానంగా ఆయనకు వటవృక్షం క్రింద జ్ఞానోదయం అయింది. దానికి ముందు ఆయన సమాజాన్ని త్యజించాడు కానీ వైదిక ధర్మాన్ని కాదు. వేదంలో జ్ఞానకాండ, కర్మ కాండ అని రెండు విభాగాలున్నాయి. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. సమాజం ముందుకు వెళ్ళడానికి, వ్యక్తి మోక్షాన్ని పొందడానికి రెండు అవసరం. బుద్ధుడి కాలం వచ్చేనాటికి సమాజంలో జ్ఞానకాండ కంటే కర్మ కాండకు అధికప్రాధాన్యం ఏర్పడింది. ఇది మానవ స్వభావానికి సహజం. బుద్ధితో విచారణ చేసే ప్రక్రియ కంటే పనులు చేసి మౌనంగా ఉండడానికే చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. తనకు జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు ఈ పరిస్థితిని గమనించాడు. సమాజానికి జ్ఞాన బోధ జరగాలి. కానీ ఆత్మజ్ఞానం ఇంద్రియాలకు అతీతమైనది. దానికి ఎంతో సూక్ష్మమైన బుద్ధి, విచారణ శక్తి కావాలి. భగవంతుని విషయం కూడా అంతే. అందుకని బుద్ధుడు అంత లోతైన బోధనలు చెప్పదల్చుకోలేదు. తన దగ్గరకు వచ్చిన వారికి తక్షణం (instant) శాంతిని ఇచ్చి, భాధలు, దుఃఖాలను అధిగమించే భోధనలు సులభ శైలిలో అందించాడు. ఎక్కడా ఆత్మసాక్షాత్కారం వంటి ప్రక్రియల గురించి చెప్పలేదు. భగవంతుడున్నాడా? అని ఆయన్ను ప్రశ్నించగా, దానికి ఆయన లేడు అని చెప్పలేదు. 'పవిత్రమైన మౌనం' వహించాడు. ఈశ్వరసాక్షాత్కారానికి అతీయింద్రియ జ్ఞానం కావాలి. దానికి పాటించాల్సిన విధులు కూడా అనేకం ఉంటాయి. అవన్నీ మాములు స్థాయిలో ఉన్నవారికి చెప్తే, అర్దంకాక పోగా గందరగోళానికి దారి తీస్తుంది. ఈ విషయాన్ని తర్వాతి కాలంలో బౌద్ధులు వేరేగా అర్దం చేసుకున్నారు. బుద్ధుడు ఆత్మ గురించి మాట్లాడలేదు కనుక ఆత్మలేదని, అనాత్మవాదాన్ని తీసుకువచ్చారు. ఈశ్వరుడి విషయంలో మౌనం వహించగా, దాన్ని తప్పుగా అర్దం చేసుకుని నిరీశ్వరవాదాన్ని ప్రచారం చేశారు.

బుద్ధుడు సమాజంలో ఎక్కడ వైదిక క్రతువులను ఖండించలేదు. అప్పటికే కర్మకాండ బాగా ప్రచారంలో ఉంది. ఇక దాని గురించి ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదు. కనుక ఆ విషయాన్ని విడిచి తక్షణ ఫలితాలనిచ్చే జ్ఞానాన్ని ప్రచారం చేశాడు. సమాజానికి బలం చేకూర్చే 7 అంశాలను బుద్ధుడు చెప్తూ, ప్రాచీన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండటం మరియు పుణ్యక్షేత్రాలను నిలుపుకోవడం, ప్రాచీన క్రతువులను గౌరవించడం [Dīgha Nikāya 2:73] వంటివి అందులో చేర్చారు. ఈ క్రతువులు ఒట్టికర్మలు కాదని, సమాజంలో ఐక్యతను తీసుకువచ్చేవేనని అభిప్రాయపడ్డాడు.ఇక బుద్ధుడు వేదాన్ని ఖండించడమేంటి? బుద్ధుడు వాటి గురించి మాట్లాడలేదని, ఆయన తర్వాత చాలాకాలానికి ఏర్పడ్డ బౌద్ధం వైదిక క్రతువులను ఖండించింది.

వేదంలో చెప్పిన మార్గం కాక, కొత్తమార్గాలను జనం పట్టుకున్నారు. అందువల్లే జంతుబలి వచ్చింది. దాన్ని ఖండిస్తూ, అహింసను ప్రభోధించాడు. జీవుల పట్ల కారుణ్యం కలిగి ఉండమన్నాడు. ధర్మంలో ఇలాంటి హింస లేదని, బుద్ధిని ఉపయోగించమని హితవు పలికాడు. బుద్ధుడు చెప్పిన అహింస వేదం మొదలు ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాల్లో చెప్పబడి ఉన్న అంశమే కానీ కొత్త విషయం కాదు. బుద్ధుడు తాను మొదటి వాడిని కానని, ఇంతకముందు అనేక మంది బుద్ధులు (అతీయింద్రియ జ్ఞానం ద్వారా కలిగిన బుద్ధిని ఉపయోగించేవారు, ఋషులు) వచ్చారని వెళ్ళడించాడు. సనాతన ఋషి పరంపరను ఎక్కడా ఖండించలేదు.

తాను శ్రీ రాముడి అంశ అని, అందువల్లే సూర్యవంశంలో జన్మించానని చెప్పుకున్నాడు. బౌద్ధుల జాతక కధలలో రామాయణం కూడా ఉంది. ఇంకో చోట తాను విష్ణువు అంశ అని చెప్పుకున్నాడు. అలాంటి బుద్ధుడు శ్రీ రామ, శ్రీ కృష్ణులను ఇచ్చిన సంస్కృతిని ఖండిస్తాడా?

బుద్ధుడు కుల వ్యవస్థను వ్యతిరేకించాడని ఈ రోజు అనేకులు చెప్తున్నారు. అసలు బుద్ధుడి కాలానికి అంటరానితనం కానీ, కుల వ్యవస్థ కానీ లేదు. బుద్ధుడు అందరిని ఆర్యులుగా బ్రతకమన్నారు. వేదంలో ఆర్య అంటే శ్రేష్టమైన అనే అర్దం ఉంది. 'చత్వారి ఆర్య సత్యాని', 'ఆర్య అష్టాంగిక మార్గం' అనేవి బౌద్ధంలో ఉన్నాయి. తన తర్వాత వచ్చే బుద్ధుడు పేరు మైత్రేయుడని, అతడు బ్రాహ్మణ వంశంలో జన్మిస్తాడని స్వయంగా బుద్ధుడే చెప్పాడు. అనేక బౌద్ధ గ్రంధాల్లో కూడా బోధిసత్త్వుడు బ్రాహ్మణ, క్షత్రియ వంశాల నుంచే మాత్రమే వస్తారని చెప్పబడింది.

బుద్ధుడు ఆనాటి కాలానికి తగ్గట్టుగా బోధనలు అందించాడు. కానీ కాలక్రమంలో ఆయన శిష్యులు పొరబడి, వేదం నుంచే ధర్మం, కర్మసిద్ధాంతం, అహింస వంటి అంశాలను స్వీకరించి, చివరకు వేదాన్నే ఖండిస్తూ బౌద్ధం అనే మతాన్ని ఏర్పరిచారు. వైదిక మతం నుంచి ఆయుర్వేద, యోగ రహస్యాలను తీసుకుని, వారు కూడా అనేక స్వస్థత ప్రక్రియలను రూపొందించుకున్నారు. ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్యాలను స్వీకరించి, వాటి మీద వారు కూడా పరిశోధించి, మనసుకు సంబంధించిన అనేక విషయాలను అందించారు.

పాశ్చాత్య దేశాల్లో ఎందరో చిన్న వయసులోనే సత్యాన్వేషణకు పూనుకుని, క్రైస్తవం నుంచి ఇస్లాంకు, అక్కడి నుంచి టోయిజం మొదలైన మతాలకు వచ్చి, బౌద్ధం స్వీకరిస్తున్నారు. కమ్యూనిష్టులు రాసిన బౌద్ధ రచనలు కాక, మూలగ్రంధాలు నిజాయతీగా చదివి, బౌద్ధం కంటే సనాతనధర్మమే పరిపూర్ణమని, బుద్ధుడిని ఇచ్చింది హైందవమేనని, ఇదే మోక్షానికి మార్గమని బౌద్ధం నుంచి ఇందులో ప్రవేశిస్తున్నారు. అటువంటి బౌద్ధం నుంచి హైందవంలోకి వచ్చిన పాశ్చాత్యులు అనేకమంది, కొన్రాడ్ లెస్ట్ వంటి చరిత్ర పరిశోధకుల అనుభవాల ఆధారంగా ఇది రాయడం జరిగింది. నిజమైన బౌద్ధం అర్దమవ్వాలంటే కమ్యూనిష్టులు, హైందవ వ్యతిరేకులు రాసిన రచనలు కాక, బౌద్ధ దేశాల్లో లభ్యమయ్యే గ్రంధాలు చదివితే తెలుస్తుంది. భారతదేశంలో బౌద్ధులు బుద్ధుడిని కమ్యూనిష్టులు, దేశద్రోహుల నుంచి రక్షించుకోవాలి.

http://koenraadelst.blogspot.in/2012/05/buddha-and-caste.html

సత్యాన్వేషకులకు, నిజమైన బౌద్ధులకు, హిందువులకు బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు.

Friday 20 May 2016

నృసింహ జయంతి శుభాకాంక్షలు



సృష్టి గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాను అనే మనిషిలో కొంత అహంకారం పెరిగి, చివరకు తానే సృష్టికర్తనని, తనను మించిన వారు లేరని భ్రమ పడుతుంటారు. ఆ భ్రమకు నిదర్శనం హిరణ్యకశిపుడు. మనిషికి తెలిసింది కొంచమే, అతడు ఎంత తెలుసుకున్నా ఈశ్వర సృష్టిలో ఒక వంతు మాత్రమే తెలుసుకోగలడని, మిగితా 3 వంతులు ఇంకా మిగిలే ఉంటుందనే విషయాన్ని పురుష సూక్తం చెప్తోంది. దానికి నిదర్శనమే నృసింహావతారం.

పురు’ష ఏవేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృ’తత్వ స్యేశా’నః | యదన్నే’నాతిరోహ’తి ||
ఏతావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’‍శ్చ పూరు’షః |
పాదో”‌உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”‌உస్యేహా‌உ‌உభ’వాత్పునః’ |
తతో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే అభి ||

అటువంటి నరసింహ స్వామి మనలో కూడా పేరుకున్న అజ్ఞానధకారాన్ని నశిమజేయాలని, దేహాత్మ భావనను పటాపంచలు చేసి, తాను దేహం కాదు, ఆత్మ అన్న సత్యం ఎరుక పరచాలని కోరుకుంటూ, అందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు.

Thursday 19 May 2016

జ్ఞాన గుళిక

భగవంతుని దృష్టిలో హిందూ, మూస్లిం, క్రైస్తవుడు అనేవారు ఉండరు. వీరు ధర్మంగా ఉంటున్నాడా? లేదా అనేది చూసి, దానికి తగిన ఫలితం ఇస్తాడు. ఆయన దృష్టిలో ఉన్న కేవలం రెండే వర్గాలు. ధర్మాత్ములు, అధర్మాత్ములు అని. ఎవరు చేసిన కర్మకు తగిన ఫలం వాళ్ళకి ఇస్తాడు.

శారదామాత సూక్తి



Open your grief-stricken heart to the Lord. Weep and sincerely pray, 'O Lord, draw me towards You; give me peace of mind.' By doing so constantly you, will gradually attain peace of mind.

- Sarada Devi

వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి.

మే 20, శుక్రవారం, వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి.

హిరణ్యకశిపుడుని చంపటానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టడానికి శ్రీ మన్నారయణుడు నరసింహస్వామి రూపంలో వైశాక శుద్ధ చతుర్దశి నాడు అవతరించారు. సాధారణంగా నృసింహం అంటే సగం నరుడు, సగం సింహం అనే అర్దం చెప్తారు. కానీ తత్త్వంలోకి వెళితే జీవుల దేహాత్మ భావనను (ఈ శరీరమే నేను) అనే భావనను తొలగించే తత్త్వమే నృసింహ తత్త్వం. నరసింహస్వామి నమ్మకానికి, తక్షణమైన రక్షణకు ప్రతీక. అందరూ నృసింహ స్వామిని ఉగ్రస్వరూపం అంటారు కానీ ఆయన అందరికి ఉగ్రుడు కాదు. తాను ఈ దేహమే అనుకున్న భక్తుడికి ఆ భావన పోగట్టడంలో ఆయన ఉగ్రస్వరూపాన్ని చూపుతాడు.

హిరణ్యకశిపుడేమీ ధర్మం, శాస్త్రం తెలియని వాడు కాదు. వేదాంతం ఔపోసన పట్టాడు. అయినా బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, మరణం ఉండరాదని వరం అడుగుతాడు. అది కుదరదని, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని బ్రహ్మ చెప్పగా, తనకు మనిషి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ మరణం ఉండరాదని, పగలు, రాత్రి, ఇంట్లో, బయట మరణం సంభవించకూడదని, ఆయుధాలు తనను ఏమీ చేయరాదని, ఆకాశంలో కానీ, భూమిపై కానీ మరణించకూడదని, ఇలా అనేక విషయాలను వరం అడుగుతాడు. సరేనంటాడు బ్రహ్మ. తనకు ఇక మరణం లేదని, విర్రవీగి యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేస్తాడు. తానే దేవుడినని, తననే పూజించమని ఆజ్ఞ ఇస్తాడు.

వేదాంతాన్ని కంఠస్థం చేయడం కాదు కావల్సింది, దాన్ని జీర్ణించుకుని, దానికి అనుగుణంగా జీవించాలి. మనిషి ఎంత గొప్పవాడైనా, సృష్టిని గురించి ఎన్ని రహస్యాలను తెలుసుకున్నా, ఈ సృష్టిని, తనను సృష్టించినవాడు ఒకడున్నాడని, వాడు మనకంటే గొప్పవాడని, సర్వజ్ఞాని అని, సర్వాంతర్యామి అని స్థిరమైన భావన ఉన్నవాడే వివేకవంతుడు. హిరణ్యకశిపునికి ఆ వివేకం లోపించింది. తానే దేహం అనుకున్నప్పుడు, దాన్ని నిలుపుకోవటానికే ప్రయత్నిస్తారు కానీ సత్యం తెలుసుకోరు. అలాంటివాడిని సంహరించటానికి వచ్చినవాడే నృసింహుడు.

సగం మనిషి, సగం సింహం రూపంలో, తన గోర్లనే ఆయుధంగా చేసుకుని, పగలు, రాత్రికి సంధికాలమైన సంధ్యాసమయంలో, ఇంట్లోనూ కాక, బయట కాక, ఇంటి గడప మీద, నేల మీద కాక, ఆకాశంలో కాక, తన తొడల మీద పెట్టుకుని హిరణ్యకశిపుని సంహరించాడు నారసింహుడు. అసాధ్యమనుకున్నది కూడా విష్ణువు తల్చుకుంటే సుసాధ్యమవుతుందని చెప్తుందీ కధ.

లక్ష్మీనరసింహస్వామికి ప్రీతికరంగా కొందరు భక్తులు నృసింహ జయంతి రోజున ఉపవాసం చేస్తారు. స్వామికి వడపప్పు, పానకం నివేదన చేయడం శ్రేయస్కరం. అసలేమీ చేయలేకపోయినా, కేవలం ఒక్క నమస్కారం హృదయపూర్వకంగా చేసుకున్నా, స్వామి అనుగ్రహం లభిస్తుంది. నరసింహ స్వామి స్తోత్రాలు పఠించడం, అవి రాకపోతే ఓం నృసింహాయ నమః/ ఓం నారసింహాయ నమః అని జపించడం ఉత్తమం. అది కూడా చదవడం రాకపోతే కనీసం 'జయ నరసింహ, జయ జయ నరసింహ' అని నామం చెప్పుకున్నా అంతే ఫలితం వస్తుంది. స్తోత్రం చదివామా? మంత్రం చేశామా? నివేదన చేశామా? అన్నది ఈశ్వరుడు చూడడు. నిర్మలమైన మనసుతో ఆయన్ను హృదయంలో ధ్యానించామా లేదా అన్నదే చూస్తాడు. ఈ పూజలన్నీ మన చిత్తశుద్ధి కొరకే కనుక వీలున్నవాళ్ళు అలా చేయవచ్చు.

నృసింహ స్వామిని సాయం సంధ్యావేళ ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరుతాయి.

జయ సింహ జయ నరసింహ
జయ జయ ప్రహ్లాద వరదా లక్ష్మీ నృసింహ 

Monday 16 May 2016

చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి సూక్తి


హిందూ ధర్మం - 209 (యజ్ఞంలో బలి ఖండన - 3)

ఇప్పుడు వేదంలో యజ్ఞాల గురించి, అవి జంతుబలిని ఎలా ఖండించాయో చూద్దాం. వైదిక కర్మకాండకు ముఖ్యమైనది యజుర్వేదం. యజుర్వేద పండితుడిని అధ్వర్యుడు అంటారు. అధ్వర అంటేనే అహింస అని అర్దం. హింసకు పాల్పడనివాడని. ఇక ఆయన ఆధ్వర్యంలో జరిగే యజ్ఞంలో హింస ఎలా ఉంటుంది?

'వెజిటేరియనిజం అండ్ ది వేదాస్' అనే పుస్తకంలో అరుణబ్ తల్వార్ గారు ఇటువంటి అనేక విషయాలు చరించారు. యజ్ఞం జంతుబలిని కోరలేదు. మనిషిలో పశులక్షణాలను మాత్రమే బలి కోరింది. దీనికి సంబంధించిన అంశాన్ని కధ రూపంలో శతపధ బ్రాహ్మణం (1-2, 3, 6-9)లో ఋషులు పొందుపరిచారు. ఆదిలో (ఈ సృష్ట్యాదిలో) దేవతలను మనిషిని యజ్ఞంలో అర్పించారు. వెంటనే మేధ (ఆహుతివ్వాల్సిన వస్తువు), మరణించిన ఆ వ్యక్తి నుంచి వెళ్ళి, అశ్వంలోకి చేరింది. వాళ్ళు అశ్వాన్ని అర్పించారు. అప్పుడు మేధ ఆవులోకి ప్రవేశించింది. వారు ఆవును అర్పించారు. అప్పుడది మేకలోకి ప్రవేశించింది. వారు మేకను కూడా అర్పించారు. అప్పుడు మేధ భూమిలోకి ప్రవేశించింది. మేధను వెతుకుతూ దేవతలు భూమిని తవ్వగా, అది బియ్యం, బార్లో లోకి దాక్కుంది. వాటిని యజ్ఞంలో అర్పించినా, వాటి నుంచి మేధ ఎక్కడకు వెళ్ళలేదు. యజ్ఞ ఫలితానిచ్చింది. కనుక బార్లీ, బియ్యం మొదలైనవి మాత్రమే హవిస్సుకు (యజ్ఞంలో ఆహుతిచ్చే పదార్ధాలను హవిస్సు అంటారు) శ్రేష్టమని తేల్చారు. ఇక్కడొక విషయం గమనించాలి. బ్రాహ్మణాలు వేదానికి (మంత్రసంహిత) వేదద్రష్టలైన ఋషులు ఇచ్చిన బాష్యాలు. అవి ప్రసాదించక ముందు ఏ విధమైన యజ్ఞయాగాది క్రతువులు జరగలేదు. ఎందుకంటే యజ్ఞ ప్రక్రియలను ఋషులే వెలికి తీశారు కనుక. అందువల్ల బ్రాహ్మణంలో చెప్పిన కధ కేవలం సూచకంగానే (symbolic) గ్రహించాలి కానీ, ఐతిహ్యం (Historical event) గా కాదు.

యజ్ఞంలో చెఱువు అన్న పేరుతో హవిస్సు వేయడానికి అన్నం వండుతారు. అది మాములు పద్ధతికి భిన్నంగా ఉంటుంది. అదే కాక కొన్ని యగాల్లో ఆ చెఱువులోనే బార్లీ గింజలు, నవధాన్యాలు కలుపుతారు. యాగం ఏ కారణం నిమిత్తం చేయబడుతున్నదో, దానికి తగిన వస్తువులను అందులో కలుపుతారు. కొన్ని సందర్భాల్లో నవధాన్యాలను పొడి చేసి, హవిస్సుగా అర్పిస్తారు. ఈ చెఱువులోనే పెరుగు, తేనే కలిపి కూడా అర్పిస్తారు. ఇవన్నీ మానవునిలో పశుత్వ లక్షణాలను ఆహుతివ్వడానికి సూచనలు. కొన్ని పెద్ద పెద్ద యాగల్లో మేకబలి ఇస్తారని వక్రీకరించారు. పరాశర మహర్షి పిండితో చేసిన మేకను బలి ఇవ్వాలని తన గ్రంధాల్లో స్పష్టంగా వెల్లడించారు. ఆ పిండి మేక మనిషిలోని పశులక్షణానికి, బద్ధకానికి సూచన. మహిషాసుర మర్ధిని మహిషుడిని మర్దించడమంటే దున్నపోతును చంపడం కాదు. మానవునిలోని మహిషత్వాన్ని, జడత్వాన్ని, నీచమైన పశుస్వభావాన్ని మర్దించడం.

To be continued .....................

Saturday 14 May 2016

స్వామి శివానంద సూక్తి



He who spreads happiness will always get such favourable circumstances as can bring him happiness. He who spreads pain to others will, doubtless, get according to the law of thought such unfavourable circumstances as can bring him misery and pain. Therefore, man creates his own character and circumstances, by the manner of his own thinking.
- Swami Sivananda 

Friday 13 May 2016

ధర్మరక్షణలో అదే స్పూర్తి - విద్యారణ్య భారతీ స్వామి

1336 లో విజయనగరాన్ని స్థాపించిన రాజ గురువులు శ్రీ విద్యారణ్య స్వామి వారు హంపిలో విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాన్ని (పీఠాన్ని) స్థాపించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ పీఠం ధర్మప్రచారానికి, ధర్మరక్షణకు ఎనలేని కృషి చేస్తోంది. చరిత్రలో ఎన్నో సార్లు దేవాలయాలు ధ్వంసమై పూజలు ఆగిపోతే, ఎంతో ధైర్యంతో ఈ పీఠం వారే అక్కడకు తరలివెళ్ళి తిరిగి పూజాదికాలు మొదలుపెట్టారు. ఒకప్పుడు నిజాం పరిపాలన కొనసాగుతున్న తరుణంలో, తెలంగాణా రాష్ట్రం వ్యాస మహర్షి ప్రతిష్ట అయిన బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయంపై ఆధిపత్యం చెలాయించి, పూజాదికాలు ఆపివేశారు. ఆలయాన్ని ముసివేశారు. అప్పుడు అక్కడి ప్రజలు, తమను ఏ పీఠం రక్షిస్తుందా అని విచారించి, హంపికి చేరుకున్నారు. అప్పటి పీఠాధిపతి మతోన్మాదులకు భయపడకుండా, వీరికి అభయం ఇచ్చి, తిరిగి ఆలయంలో నిత్యక్రతువులను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాసరలో నిత్యం పుజాది కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం విద్యారణ్య స్వామి పరంపరలో 46 వ పీఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి పీఠాధిపత్యం వహిస్తున్నారు. సంవత్సరంలో 8 మాసాలను పూర్తిగా భారతదేశంలో 8 రాష్ట్రాల్లో సంచార యాత్రకు కేటాయించి, ధర్మ ప్రచారం చేస్తున్నారు. అలనాటి విద్యారణ్యులు ఏడాదిలో ఒక్క రోజు కూడా విడువకుండా ప్రతి రోజు ఒక అలాయానికి కుంభాభిషేకం నిర్వహించారు. ఎన్నో ప్రతిష్టలు చేశారు. అదే స్ఫూర్తిని వీరూ కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు కొత్తగా నిర్మించబడిన దేవాలయం, పురాతన ఆలయాల పురరుద్ధరణ, కుంభాభిషేకం వీరు చేతుల మీదుగానే జరుగుతాయి. ఇన్ని చేస్తున్నా, స్వామి నిరాడంబరులు. మీడియాలో ఉండాలని కానీ, పేరుప్రఖ్యాతుల కోసం కానీ ఎన్నడూ ప్రాకులాడలేదు. మీడియాను ఆమడ దూరంలో ఉంచుతారు.

పొలీసులు సైతం భయపడే విధంగా నక్సలైట్ల ప్రంతాల్లో కూడా వీరు ఏ భయం లేకుండా వెళ్ళి, అక్కడ కూడా ధర్మప్రచారం చేయడమే కాక, అక్కడున్న ఆలయాలను పునరుద్ధరిస్తున్నారు. వీరు ఎక్కడకు వెళ్ళిన, వీరితో పాటు వీరు పీఠం కూడా తరలి వెళుతుంది. దానికి నిత్యం పూజాదికాలు నిర్వహిస్తారు. దలితవాడల్లోకి, పూరి గుడిసెల్లోకి సైతం వెళ్ళి, అందరిని అక్కున చేర్చుకుంటున్నారు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి. ధర్మ రక్షణ, గోసంరక్షణ, ఆలయాల పునరుద్ధరణ, దేశసేవ, పర్యావరణ పరిరక్షణ స్వామి వారి లక్ష్యాలు.

జై విద్యారణ్య! జై జై విద్యారణ్య!
http://hampividyaranyamath.org/

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || 

Wednesday 11 May 2016

ఆదిశంకరుల గురించి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి సూక్తి


శంకరభగవత్పాదుల గురువుగారి మఠం

శంకరభగవత్పాదుల గురువుగారి మఠం.

శంకరాచార్యుల దీక్షా గురువుగారు గోవిందా భగవత్పాదులవారు. వారిని ఆదిశంకరులు నర్మదా నదీ తీరంలో కలుసుకున్నారు. ఆ గోవింద భగవత్పాదుల గురువులు (అనగా శంకరులకు పరమగురువులు) గౌడపాదాచార్యుల వారు. శంకరాచార్యులు మఠాలను స్థాపించిన సమయంలోనే, గోవింద భగవత్పాదుల శిష్యుడు స్వామి వివర్ణానంద గౌడపాదాచార్య మఠం అనే మఠాన్ని స్థాపించారు. ప్రస్తుతం అది గోవా రాష్ట్రాంలో ఉంది. దీన్ని ఒకప్పుడు కైవల్య మఠమని అనేవారట. కంచి మఠం పరంపరలో ఈ విషయం కనిపిస్తుంది. ఇప్పుడు దీని కవలో మఠ్ అని సంబోధిస్తున్నారు. శంకరుల కాలమానం గురించి వీరి పరంపర స్పష్టంగా చెప్తోంది. కలియుగం 2593 (క్రీ.పూ. 509) సంవత్సరంలో శంకరులు జన్మించారు. క్రీ.పూ. 482 లో కంచిమఠాన్ని స్థాపించారు. ఆ సమయంలోనే ఈ మఠం కూడా స్థాపించబడిందని ఇక్కడ వారు చెప్తున్నారు.

చరిత్రలో ఈ మఠం ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. 14, 15 శతాబ్దాల్లో గోవా మీద వ్యాపారం ముసుగులో విరుచుకుపడ్డ పోర్చుగీస్ క్రైస్తువులు, ఇక్కడి హిందువులను ప్రపంచంలోనే అత్యంత కౄరంగా హింసించి, మతమార్పిడులకు ఒడికట్టారు. ఈ హత్యాకాండ మానవ చరిత్రలో Goa Inquisition పేరుతో నిలిచిపోయింది. దేవాలయాలను ధ్వంసం చేశారు. 1564 లో కేలోషి మఠాన్ని ధ్వంసం చేశారు. తమ పరంపరను రక్షించుకోవడానికి అప్పటి 57 వ పీఠాధిపతి పూర్ణానంద సరస్వతీ శ్రీ గౌడపాదాచార్యులవారు ఈ మఠాన్ని గోల్వన్ మఠానికి తరలించారు. అటు తర్వాత ఈ మఠాధిపతులు వారణాశికి తరలివెళ్ళారు. 63 వ పీఠాధిపతి మళ్ళో గోవాకు తరలివాచ్చారు.

అటు తర్వాత 1630 లో గోవాలో హిందూ రాజ్యంలో ఇప్పుడున్న మఠాన్ని నిర్మించి, ధర్మప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆదిశంకరులు స్థాపించిన మఠాలతో పాటు అంతే ప్రాచీనత కలిగిన మఠం ఇది. ప్రస్తుతం 77 వ పీఠాధిపతిగా శ్రీ శివానంద సరస్వతీ స్వామి గౌడపాదాచార్యులవారు ఉన్నారు.


శంకరుల గురువుల మఠం గురించి తెలుసుకోవడం చాలా అనదంగా ఉంది కదూ.

జయ జయ శంకర హర హర శంకర

http://www.shrikavalemath.org.in/history.htm

శంకర జయంతి సందేశం


శంకరాచార్యుల అవతరణకు ముందు దేశంలో పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడే అవే పరిస్థుతులున్నాయి. అప్పుడు ఒక శంకరులే అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడవ్వాలి. ఆయనే మనకిప్పుడు స్పూర్తి. ఆయన ఇప్పటికి మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనమీ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. మన మాతృ ఋణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. సనాతనధర్మం మన తల్లి. మన గ్రంధాల మీద వేరేవాడు అధికారం చెలాయించడం ఏమిటి? మన గురించి వాడు పిచ్చిరాతలు రాయడమేమిటి? ఈ హిందువా! మేలుకో! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, శక్తి సంపాదించి, స్పూర్తి పొంది, నీ మీద, ధర్మం మీద స్పష్టతతో మరో శంకరుడివై, ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. కర్తవ్యాన్ని విస్మరిస్తే, నీవు అధోగతి పాలుగాక తప్పదు. గుర్తుంచుకో. శంకరులు మనల్ని విడిచి పోలేదు. మేలుకో భారతీయుడా! కలియుగ గురువైన ఆ ఆదిశంకరుల రక్ష నీకు సదా ఉన్నది.

శంకర జయంతి శుభాకాంక్షలు.

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ||

జయ జయ శంకర హర హర శంకర

Sunday 8 May 2016

హిందూ ధర్మం - 208 (యజ్ఞంలో బలి ఖండన - 2)

వక్రీకరణ - నరమేధంలో మనిషిని బలి ఇస్తారు.
వాస్తవం - మానవదేహానికి వేదం చెప్పిన విధంగా అంత్యేష్టి సంస్కారం (దహనసంస్కారం మొదలైనవి) చేయడమే నరమేధం - సత్యార్ధప్రకాశంలో స్వామి దయానంద సరస్వతీ.

వివరణ - భారతీయ సమాజం ఆటవికమని, తమ మతమే శ్రేష్టమని నిరూపించడానికి ఏ విధంగా అవకాశాం లేదని గ్రహించిన వక్రీకరణకారులు, యజ్ఞయాగాది క్రతువుల్లో మనుష్యులను బలిస్తారని వక్రీకరించారు. అదేకాక సంస్కృతిని నాశనం చేయడంలో పత్రికలు ముందుంటాయి. ఎవరైనా జనాలను మోసం చేస్తే, అవినీతి అధికారి జనాలకు శఠగోపం పెట్టాడని ప్రచురిస్తారు. భాషను తామేదో కాపాడుతున్నామని చెప్పుకునే ఈ పత్రికల వాళ్ళకు భాషలో పదాల అర్దం కూడా కనీసం తెలియదు. శఠగోపం మీద స్వామి పాదాలుంటాయి. ఆలయంలో శఠగోపం పెట్టించుకోవడం స్వామి పాదాలను నెత్తిన పెట్టించుకుని, ఆశీర్వాదం పొందడం. స్వామి పాదాలు పట్టుకున్నవాడు ఉద్ధరించబడతాడే కానీ నశించడు. మరి ఈ పద ప్రయోగాన్ని పత్రికలు నీచంగా ఎందుకు చేస్తాయో వారికే తెలియాలి. ఇలాంటిదే నరమేధం కూడా. ఎక్కడైన ఉగ్రవాద దాడి జరిగి, అనేకులు మరణిస్తే, భారి నరమేధం అంటూ ఆ పదానికి లేని అర్ధాన్ని ఆపాదించి, సమాజాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారు.

శతపధబ్రాహ్మణం 13 వ అధ్యాయంలో నరమేధం గురించి చెప్పబడింది. 7 1/2 అడుగుల పొడవు, 5 1/2 అడుగుల వెడల్పు, 4 1/2 అడుగుల లోతుతో గొయ్యి త్రవ్వాలి. పైన ఉన్న వెడల్పులో సగం మాత్రమే క్రింద ఉండాలి. అందులో కనీసం 49 పౌండ్ల గంధపుచెక్క, పలాశ (మోదుగ) చెట్టు చెక్క వేయాలి. శవానికి సమాన బరువుతో ఆవునెయ్యి తీసుకుని, కస్తూరి కలిపి, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కర్పూరం మొదలైనవి వేయాలి. దాని మీద శవాన్ని ఉంచాలి. శవం మొత్తం ఆవునెయ్యిని చల్లి, నిప్పు అంటించాలి. ఈ విధంగా చేయడం వలన శవం కాల్చిన వాసన రాదు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దహన సంస్కారానికి యాగానికి సమానమైన స్థానం కల్పించారు. అసలు శవ దహనం అనకుండా దహన సంస్కారమని, అంత్యేష్టి అని అనడంలోనే ఎంతో అర్దం దాగుంది. సంస్కారం అనగా సంస్కరించునది. దేహన్ని, సూక్ష్మ శరీరాన్ని సంస్కరించి, ఆత్మ ఉద్ధతికి సహాయపడే కర్మలకు సంస్కారం అని పేరు. దానికి మరే ఇతర భాషలోను సమానమైన అర్దంలేదు. తాను దేహం కాదు, ఆత్మ అని స్థిరమైన భావన ఉన్నవారు, దేనీ మీద వ్యామోహం లేనివారికి మినహాయించి మరణం సంభవించగానే అందరి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదు. అది అక్కడే, ఆ దేహం మీద మమకారంతో రోదిస్తూ ఉంటుంది. ఆ రోదన ఎవరికి (సామాన్య మనవులకు) కనపడదు, వినపడదు. జీవుల కర్మ తీరడానికి కొత్త దేహం ధరించాలి. కానీ దేహమే తానన్న మమకారం వలన అది కొత్త ప్రదేశానికి దేహాన్ని విడిచి వెళ్ళెందుకు ఇష్టపడదు. ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తే, అది కుళ్ళిపోతుంది. తన దేహం కుళ్ళిపోవడం దీనికి ఇంకా బాధను కలిగిస్తుంది. అలా కాక ఆత్మను ఉద్ధరించడం కోసం వచ్చిందే ఈ దహన సంస్కారం. అప్పుడు చదివే మంత్రాలు, ఆత్మకు ఈ దేహం తనది కాదని, ఇక తాను అక్కడి నుంచి విడిచి వెళ్ళాలని, తనకంటూ వేరే దేహం, జన్మ నిర్దేశించబడ్డాయని తెలియజేస్తాయి. శరీరాన్ని పూడ్చిపెట్టక, దాన్ని కాల్చివేయడం, మిగిలిన అస్థికలు, ఎముకలను నదిలో కలపడం వలన దేహం పూర్తిగా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక అక్కడ ఆత్మ తనది అంటూ కూర్చుని ఏడ్వడానికి ఏమీ మిగలదు. అలా జీవులను శవ దహనం ద్వారా ఉద్ధరించి, వెరొక జన్మకు పంపుతుంది కనుక దీనికి దహన సంస్కారం అని పేరు వచ్చింది. ఇందులో దహనం చేసేవారికి స్వార్ధం ఉండదు. వారు తమ ధర్మాన్ని నిర్వర్తించడం తప్పించి, ఏమీ ఆశించటం కూడా ఉందదు.

అంతేగాక, ఒక శరీరాన్ని అలాగే వదిలేస్తే అది కుళ్ళి రోగాలు వ్యాపిస్తాయి. కొన్ని భయంకరమైన రోగాలు, అంటువ్యాధులతో మరణించినవారిని పూడ్చిపెట్టడం కంటే కాల్చివేయడం మంచిదని కూడా ఇప్పుడు ఋజువు అవుతోంది. ధర్మం కూడా అదే చెప్పింది. అనాధ శవాలను కూడా ఎవరూ లేరని వదిలేయక, ఆ జీవుడిని ఉద్ధరించడం కోసం వాటికి కూడా కర్మకాండ నిర్వహించమంటోంది. అది చేసింనందుకు ఎంతో పుణ్యం వస్తుందని కూడా ఈశ్వరుడు నిర్దేశించాడు. ఈ చర్య నిస్వార్ధతతో కూడినదై, రోగాలు వ్యాపించకుండా ఇటు సమాజాన్ని, జీవుడి ప్రయాణాన్ని సులభతరం చేసి ఆత్మను ఉద్ధరిస్తున్న కారణాన దీన్ని యాగం అన్నారు. అంతేకాని నరమేధం అంటే వ్యక్తిని చంపి యాగంలో వేయడం కాదు.

To be continued ................

స్వామి చిన్మయానందులవారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు

గురు వైభవం - స్వామి చిన్మయానందులవారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు

బాలకృష్ణ మీనన్ నేషనల్ హెరాల్డ్ పత్రికలో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. హిందూ సాధువుల పట్ల వ్యతిరేకత ఉన్న ఆయన, వారు దేశాన్ని మాయలో పడేస్తున్నారని, వారు చెప్పేదాంత అబద్దాలనే భావన బాలకృష్ణకు ఉండేది. ఆ భావనతోనే అప్పట్లో సన్యాసాశ్రమంలో గొప్ప గురువుగా ప్రసిద్ధి చెందిన స్వామి శివానంద సరస్వతీ వారి ఆశ్రమానికి ఋషికేష్ చేరారు. స్వామి శివానంద జీవన్ముక్తులు, త్రికాలవేత్త, సనాతనధర్మానికి చెందిన ఎంతో జ్ఞానాన్ని వెలికితీసి, ఎందరో పంచారు. డివైన్ లైఫ్ సొసైటి స్థాపకులు.

అటువంటి వారికి బాలకృష్ణ మీనన్ ఆశ్రమానికి ఎందుకు వచ్చారో శివానందులకు తెలుసు. అయినా వారిని స్వాగతించారు. ఇక్కడేన్ని రోజులుంటారు అని అడిగి, రెండు రోజుల్లో వెళ్ళిపోతానని బాలకృష్ణ అనగానే రెండు రోజులేంటీ? దిల్లి నుంచి ఇది చాలా దూరం. ఇంకా చాలా రోజులుండూ అన్నారు స్వామి శివానంద. సద్గురువు అగ్ని వంటి వాడు. అతని దర్శనమే అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఇక అతని సాంగత్యంలో ఉండడం ఎంత ఫలిస్తానిస్తుందో ఎవరు చెప్పగలరు? సాధువలు పట్ల ఉన్న భ్రమలు బాలకృష్ణకు తొలగిపోయాయి. అటు తర్వాత స్వామి శివానందులే ఒక శివరాత్రి నాడు బాలకృష్ణ మీనన్‌కు సన్యాసం ఇచ్చి స్వామి చిన్మయానంద సరస్వతీ అని నామకరణం చేశారు. ఆస్తికుడైన బాలకృష్ణను సాధకుడిగా చేశారు స్వామి శివానంద.

ఇది గురువైభవం

చిత్రంలో కుడి నుంచి మూడవ వారు స్వామి చిన్మయానంద, నాలుగవ వారు స్వామి శివానంద.



స్వామి చిన్మయనందలోని జ్ఞానతృష్ణను, సూక్ష్మ బుద్దిని స్వామి శివానంద పరిశీలించారు. ఇతనికి వేదాంత జ్ఞానాన్ని తెలియపరిస్తే లోకానికి ఎంతో మేలు చేస్తాడని ఊహించి, చిన్మయానందులవారిని ఉత్తరకాశీలో గంగా తీరాన చిన్న కుటీరంలో నివాసముంటున్న స్వామి తపోవనం వద్దకు పంపారు. తపోవనం వేదాంతంలో నిష్నాతులు. కానీ ఆయన దగ్గర శిష్యరికం చేయడం అంత సులువు కాదు. వేదాంతం ఒకపట్టాన అర్దం కాదు. కానీ ఆయన చెప్పినవి ఒక్కసారే అర్దం చేసుకోవాలని, మళ్ళీ అడిగితే, ఆశ్రమం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందని, ఆ ఆశ్రమంలో అందైరికి నియమం విధించారు. సూక్ష్మబుద్ధి కల స్వామిజీ, తపోవనం స్వామి వద్ద 8 ఏళ్ళ పాటు శిష్యరికం చేశారు. చిన్మయుడి సూక్ష్మబుద్దికి స్వామి తపోవనం కూడా ఆశ్చర్యపోయేవారు.

హిందూ ధర్మ పునరుజ్జీవనం స్వామి తపోవనం వారి బలమైన కోరిక. ఈ ధర్మానికి ఎదురవుతున్న ఇబ్బందులను చూసి మౌనంగా ఉండలేకపోయేవారు. ఒకసారి స్వామి చిన్మయానందుల వారు, గురువుగారితో, నేను ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా ప్రచారం చేస్తానని, అందుకు అనుమతి కావాలని అడుగగా, ఎంతో సంతోషించారు స్వామి తపోవనం. స్వామి శివానంద కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతో ఆనందించి, స్వామి వివేకనందా వలే గర్జించు అని చిన్మయానందకు లేఖ రాశారు. అలా గురువుల అనుగ్రహంతో స్వామిజీ ఎన్నో ప్రసంగాలిచ్చి, వేదాంతాన్ని వ్యాప్తి చేశారు.

స్వామి శివానంద స్వామి చిన్మయానందను సాధకుడిని చేస్తే, స్వామి తపోవనం వేదాంతాన్ని బోధించి వారికి సదృష్టి కలిగించి, పరబ్రహ్మ తత్త్వాన్ని అందించారు. స్వామి తపోవనం వారి అనుగ్రహమే ప్రపంచానికి అంత గొప్ప వేదాంతిని అందించింది.

ఇదే కదా గురువైభవం అంటే.

ఙ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః ||


Saturday 7 May 2016

నాస్తికత్వం నుంచి ఆస్తికత్వానికి నా ప్రయాణం - స్వామి చిన్మయానంద

8 మే 2016 స్వామి చిన్మయానంద శతజయంతి. ఆ సంధర్భంగా వారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన గురించి తెలుసుకుందాం.

చిన్మయా మిషన్ స్థాపకులు స్వామి చిన్మయానంద యవ్వనంలో నాస్తికులు. వారు ఆస్తికులుగా మారిన విషయాన్ని, భగవాన్ రమణ మహర్షి గురించి స్వయంగా తామే రాసుకున్నారు.

'నేను (స్వామి చిన్మయానంద, పూర్వాశ్రమంలో బాలకృష్ణ మీనన్), అప్పుడే హైస్కూల్ విద్య నుంచి బయటకు వస్తున్నాను, పరీక్షలు ముగిసాయి. రైల్యే పాకేజీ టికెట్ మీద దక్షిణభారతాన్ని సందర్శిస్తున్నాను. రైలు ఆగాలని నెమ్మదిగా వెళుతూ ఒక ఊరి వద్దకు రాగానే, హఠాత్తుగా నా బోగిలో ఉన్న ప్రయాణికులందరూ ఎంతో కుతుహలంతో కిటికీల్లోంచి చూస్తూ, భక్తితో ఒక ఆలయానికి మొక్కుతున్నారు. దాని గురించి అడుగగా, అది తిరువణ్ణామలై (అరుణాచలం) దేవాలయమని తెలిసింది.

అటు తర్వాత నాతోటి ప్రయాణికుల సంవాదం భగవాన్ రమణమహర్షి వైపు తిరిగింది. మహర్షి అన్న పదమే నా మనసుకు పురాతన కాలంలో వనాల్లో ఉంటూ, దివ్య ప్రకాశం గల మాహపురుషులను గుర్తుకు తెచ్చింది. అప్పటికి నేను నాస్తికుడినే అయినా, మహర్షి ఆశ్రమం నన్ను ఎందుకో తనవైపు లాగింది. దాన్ని సందర్శించాలని అనిపించింది. తదుపరి రైలులో తిరువణ్ణామలైకు చేరాను.

మహర్షి హాలులో ఉన్నారని, లోపలకి వెళ్ళి స్వేచ్చగా మాట్లాడవచ్చని,  అందరికి ఆ అవకాశం ఉందని, ఆశ్రమంలో చెప్పారు. నేను ప్రవేశించగానే, సోఫా మీద, కౌపీనం ధరించి, గుండ్రని దిండుపై వాలిన ఒక పెద్దవయసు వ్యక్తిని చూశాను. ఆ సోఫా పక్కనే నేను కూర్చున్నాను. ఉన్నట్టుండి మహర్షి కళ్ళు తెరిచి నేరుగా నా కళ్ళలోకి చూశారు. నేను ఆయన కాళ్ళలోకి చూశాను. కేవలం చూశారు, అంతే. మహర్షి క్షణంలోనే నా అంతరం లోతుల్లోకి చూస్తున్నారనిపించింది. ఆయన నాలోని డొల్లతనాన్ని, గందరగోళాన్ని, అవిశ్వాసాన్ని, అసంపూర్ణతలను, భయాలను చూశారన్నది నిశ్చయం.

ఆ క్షణంలో ఏమి జరిగిందో నేను చెప్పలేను. నేను వికశించాను, శుద్ధమయ్యాను, స్వస్థతను పొందాను. (పాతభావల నుంచి) ఖాళీ చేయబడ్డాను. గందరగోళాల సుడిగుండాలు మొదలయ్యాయి. నా నాస్తికత్వం నశించసాగింది. అదే సమయంలో సంశయవాదం వరదలా ప్రశ్నలుగా, ఆశ్చర్యంగా, అన్వేషణగా మారిపోయింది. నా తర్కం నాకు బలాన్నిచింది. ఇదంతా ఇంద్రజాలమని, నా మూర్ఖత్వమని నాకు నేనే చెప్పుకున్నాను. ఆ హామీతోనే లేచి, వెళ్ళిపోయాను.

కానీ ఆ హాలు నుండి బయటకు వెళ్ళినవాడు ఆ హాలులోనికి పది నిమిషాల ముందు వెళ్ళినవాడు కాడు. నా కాలేజీ రోజుల తర్వాత, రాజకీయాల తర్వాత, సంవత్సరాలుగా ఉత్తరకాశీలో నా గురువు తపోవనం వద్ద నివసించిన తర్వాత, గంగా తీరంలో నేను ఏదైతే పొందానో, అదే కేవలం తన దృష్టి చేత అరుణాచల మహర్షి ఆ ఎండాకాలపు రోజున నాకిచ్చారు.

ఇది స్వామి చిన్మయానందులు 1982 లో ఒక ప్రసంగంలో చెప్పారు.
'శ్రీ రమణుడు' చర్చించే అంశం కాదు. ఆయన ఒక అనుభూతి. ఆయనోక చైతన్య స్థితి. శ్రీ రమణుడే ఉత్కృష్టమైన సత్యం, అన్ని గ్రంధాల యొక్క సారం. బంధరహితంగా ఒక గురువు ఎలా జీవించగలడో, ఆయన అందరికి చూపారు. మానవరూపంలో ఉన్నా, సుందరంగా, శుద్ధమైన పరబ్రహ్మతత్వంగా జీవించారు.

బాలకృష్ణ మీనన్ కాలక్రమంలో స్వామి చిన్మయాందులై వేదంతసారాన్ని ప్రపంచం దశదిశల వ్యాపింపజేశారు. అతి క్రిందస్థాయి ప్రజలకు కూడా వేదాంతాన్ని అందించిన ఘతన స్వామి వారిదే.

ఇద్దరి పాదాలకు నా ప్రణామాలు

Friday 6 May 2016

భవ రోగానికి మందు - స్వామి చిన్మయానంద బోధ



భవరోగాన్ని (జన్మలపరంపరను) ఎలా నయం చేయాలి?

స్వామి చిన్మయానంద
అనేకత్వ దృష్టినే భవరోగం అంటారు. ఇది 'అహం' అనే శక్తివంతమైన క్రిమి వలన వస్తుంది. ఇది మనసు, బుద్ధుల వలన వృద్ధి చెందుతుంది. నువ్వు ఈ క్రింది మిశ్రమాన్ని తీసుకుంటే, రోగనివారణ తధ్యం.

నిష్కాపట్యం - 11 గ్రాములు
ప్రేమ - 10 ఔన్సులు
క్రమబద్ధత - 10 గ్రా
ధ్యానం - 9 ఔ
నిజాయతీ - 8 గ్రా
ధైర్యం - 9 గ్రా
లక్ష్యం - 7 గ్రా
అందరికి సేవ చేయడం - 6 గ్రా
స్వఛ్ఛత - 3 గ్రా

ఉపయోగించే ముందు సీసాను (బుద్ధి) కదిలించాలి. అటు తర్వాత మనోనియంత్రణ అనే మూత పెట్టాలి.
1. దోపిడిని ఎన్నడూ రుచి చూడకు. అవసరమైతే పుష్కలంగా ఓంకార జపాన్ని సేవించు.
2. అధికంగా భౌతిక, ఇంద్రియ విషయాల్లో తిరగకు.
3. ధ్యానంలో విశ్రాంతి పొందు. 

Wednesday 4 May 2016

ఈశ్వరుడు - సృష్టి- స్వామి చిన్మయానంద బోధ



ఈశ్వర్ సత్య్ హై - భగవంతుడే సత్యము. మరి ఆయన సృష్టి వాస్తవం కాకుండా ఉంటుందా?

స్వామి చిన్మయానంద బోధ - అవును. కానీ భగవంతుడు సృష్టించిన వస్తువులను మనం 'ఆయనవి'గా పిలుస్తున్నామా? లేదు. 'మనవి' అంటున్నాము. ఎప్పుడైతే 'నేను', 'నాది', 'నీవు', 'నీదు'లను ఆయన సృష్టిలోకి తీసుకువస్తామో, అప్పుడా ప్రపంచాన్ని సంసారం అంటాం. (సంసారం - నశ్వరం, అసత్యం). ఆయన్నే సత్యంగా భావించి, ఈ ప్రపంచాన్ని (నీతో పాటు) ఆయనదిగా చూస్తే అంతా సత్యమే. ఆ మాటకువస్తే, అన్నీ ఆయనవిగా, లేక ఆయనగా చూసినప్పుడు అన్నీ సత్యమే. అసత్ (మిధ్య) అంటూ ఏదైతే ఉందో, అది కేవలం విడిచిపెట్టవలసినవి మన భావాలు మాత్రమే.  

వేదాంత వ్యాక్యాలను గురువు, గ్రంధం లేదో ఎవరో చెప్పినవిగా పరిగణించినప్పుడు, జ్ఞానం అస్పష్టంగానే ఉంటుంది. అలా కాక వాటిని నీలోకి జీర్ణించుకుని, సాధన చేసినప్పుడు, అవి స్పష్టము, అర్ధవంతము అవుతాయి. భగవంతుడే సత్యమని అనుభవంలో తెలుసుకో, అప్పుడు ఆయన చేసిన సృష్టిని కూడా సత్యంగా చూడవచ్చు.        

రమణుల మహాసమాధి చిత్రాలు

1950, ఏప్రియల్ 14, శ్రీ వికృతి నామ సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నాడు భగవాన్ రమణ మహర్షి భౌతిక దేహాన్ని విడిచి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. నేడు చైత్ర బహుళ త్రయోదశి, భగవాన్ రమణులు మహాసమాధి చెందిన రోజు, ఆ సందర్భంగా ఉదయం రమాణాశ్రమంలో భగవాన్ ఆరాధానోత్సవాలు నిర్వహించారు.

మహాసమాధి చెందేనాటికి రమణుల దేహం చాలా బలహీనపడింది. అసలు లేవలేకపోయింది. ఆహారం కూడా స్వీకరించలేదు. రాత్రి 8 గంటలకు, తమని కూర్చోబెట్టమని రమణులు అన్నారు. (కూర్చోబెట్టడమంటే దిండుని ఆనుకుని కూర్చోవడమే. శరీరం సహకరించలేదు). మూతపడి ఉన్న కుడి కన్ను నుంచి చెంపైపైకి ఎందుచేతనో నీళ్ళు ధారగా కారసాగాయి. పక్కనే ఉన్న స్వామి సత్యానంద వాటిని తుడుస్తూ ఉన్నారు. భగవాన్ నోటి నుంచి కూడా ఊపిరి గ్రహించటం కష్టంగా ఉంది. ఇంతలో హాలులో కూర్చున్న జనం 'అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా' అంటూ పాడసాగారు. ఆ నామం వినగానే స్వామి ముఖం దివ్యంగా వెలిగిపోయింది. (తన తండ్రి అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళిపోతున్నానే ఆనందం ఏమో!) ఇంతలో ఆకాశంలో ఒక దివ్యమైన, ప్రకాశవంతమైన కాంతి పుంజం అద్భుతకాంతులు విరజుమ్ముతూ ఆ చోట (ఆ ఆశ్రమం నుంచే) నుంచి పైకి లేచి, ఈశాన్యం దిశగా అరుణాచాల శిఖరం దిశగా పయనించి వెళ్ళిపోయింది. దీన్ని దేశదేశాల ప్రజలు దర్శించారు. అదే సమయంలో 8-47 నిమిషాలకు (రాత్రి) భగవాన్ దేహం శ్వాస తీసుకోవడం ఆపేసింది. అరుణాచలేశ్వరుడు వెలిగించి జ్ఞానజ్యోతి (భగవాన్ రమణులు) తన సహజ రూపంలో (జ్యోతి రూపంలో) జనులందరూ చూస్తుండగా, వెళ్ళి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. అవధూత, అవతారమూర్తి, జీవన్ముత్కుడు, దక్షిణామూర్తి స్వరూపమైన రమణులు భౌతిక దేహాన్ని విసిరివేశారు.

రమణుల మహాసమాధి చిత్రాలను ఫోటో తీసింది హెర్ని కార్టిర్ (1908-2004), ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫోటొగ్రాఫర్, ఆధునిక ఫోటోజనర్లిజం పితామహుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన రమణుల మహాసమాధికి ముందు ఏప్రియల్ 1950 లో అరుణాచలం వచ్చారు. ఆయనే ఈ చిత్రాలను తీసు భద్రపరిచారు. ఈ సృష్టిలో ఏదీ కాకతాళీయం ఉండదు. కార్యముంటే కారణముంటుందని వేదాంతం ప్రకటించింది. బహుసా రమణులే ఈ సమయానికి వీరిని ఇలా ఇక్కడకు రప్పించి, మనలాంటి వారిని అనుగ్రహించడానికి ఈ కార్యం జరిపించారేమో!

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

రమణులు సమాధి చెందేరోజు ఆశ్రమంలో పురి విప్పిన నెమలి











Tuesday 3 May 2016

సంసారం - స్వామి చిన్మయానంద బోధ



సంసారజీవితంలో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. మరి హిందూధర్మం ఆజన్మబ్రహ్మచర్యం గురించి గట్టిగా ఎందుకు చెప్పలేదు?

స్వామి చిన్మయానంద - హిందూ ధర్మంలో సంసారం అని ఉపయోగించిన పదం పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనడాన్ని సూచించదు. సంసారం అంటే ప్రాపంచిక జీవితంతో బంధం. తాను భౌతిక దేహం అనుకోవడమే అన్ని సమస్యలకు మూలం. అటువంటి భావనతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. బ్రహ్మచారులందరూ సంసార బంధాల నుంచి విముక్తులు కాలేదు. సత్యజ్ఞాన సముపార్జన ముఖ్యం. కేవలం బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్లనే అది సాధ్యం కాదు. సరైన (ధార్మికమైన, వేదాంతపరమైన) ఆలోచనా విధానం కూడా అవసరం.

Monday 2 May 2016

రోగనివారణ చేసిన చిన్మయానందులు



దిల్లీలో ఉండే ఒకామెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని అనేక వైద్యపరీక్షల్లో తేలింది. ఆమె స్నేహితుడు కృష్ణవర్మ ఆమెను గురుదేవులు, స్వామి చిన్మయానందుల వద్దకు తీసుకువచ్చారు. కృష్ణ స్వామీజి గదికి వెళ్ళగానే, సమస్య ఏంటని అడిగారు గురుదేవులు. తన స్నేహితురాలి గురించి, ఆమె క్యాన్సర్ గురించి కృష్ణ గురుదేవులకు చెప్పారు. 'ఇదంతా ఒక స్నేహితురాలి కోసమే - సరే' అన్న గురుదేవులు సత్సంగం జరిగే గదికి వెళ్ళి, ఆమెను హత్తుకున్నారు. 'ఆపరేషన్ గురించి నువ్వు భయపడుతున్నావా?' అని అడిగి, 'నవ్వుతూ వెళ్ళి, చిరునవ్వులతో బయటకు రా' అన్నారు (ఆమె స్వామిజీని ఏమీ అడగలేదు). వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధమైనప్పుడు, ఆమెలో క్యాన్సర్ లక్షణాలు కించిత్తూ కూడా కనిపించలేదు. ఆ తర్వాత స్వామిజీ, సాయంకాల ప్రసంగాల్లో చెప్పారు 'ఏ భక్తుడైతే ఏదీ అడగరో - అతడికి (ఆమెకు) నారాయణుడు 'కాదు' అని ఎలా చెప్తాడు?'