Sunday 28 August 2016

సద్గురు శివానందమూర్తి సూక్తి



Adharma must be totally avoided. Dharma is a positive direction. You may or may not be able to follow that path. Not indulging in Adharma is the primary responsibility for one and all. If Adharma is practiced it does not kill you alone. It is the poison in the air, water and kills anyone.

Satguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 223 (జ్యోతిష్యం - 5)

ఈనాడు కుతుబ్ మినార్ గా పిలువబడుతున్న మేరు స్థంభం కట్టించింది వరాహమిహిరుడే.  అది తన జ్యోతిష్య (ఖగోళ) శాస్త్ర పరిశోధన కోసం కట్టించాడని చెప్తారు. ఇక్కడే ఉన్న సుమారు 2200 ఏళ్ళ క్రితం నాటిదైన లోహపు స్థంభం ఈనాటికి తుప్పపట్టలేదు, చెక్కుచెదరలేదు. దాన్ని 7 గ్రహాలకు సూచికగా, 7 అంతస్థులతో, 27 నక్షత్రాలకు సూచికగా 27 కిటికీలతో నిర్మించారట. 26 గజాల లోతు వరకు పునాది వేసి, 84 గజాల ఎత్తు వరకు నిర్మించారని, అయితే ఆ తర్వాత దాన్ని ఆంగ్లేయులు పదగొట్టి 76 అడుగులకు కుదించారని చెప్తారు. కుతుబుద్ధీన్ పాలన సమయానికి ధృవ స్థంభం/ మేరు స్థభం/ విష్ణు స్థంభం ఉంది. కానీ ఆ దుర్మార్గుడు దాని అద్భుత శిలాసంపదను, వైజ్ఞానికతను నాశనం చేసి, దానికి తన పేరు తగిలించుకుని, తన నిర్మాణంగా ప్రచారం చేసుకున్నాడు. మన ధౌర్భాగ్యం ఏమిటంటే కుతుబ్ మినార్ కుతుబుద్దీన్ జీవించిన సమయానికంటే ఎంతో పూర్వం నుంచి ఉందని, దాని మీదే ఆధారాలు ఉన్నా, అవి శాస్త్రీయమని తేలినా, ఇంకా నేటికి అది కుతుబ్ మినార్ గానే పిలువబడుతోంది.


గణితంలో త్రికోణమితి చెందిన సూత్రాలను కనుగొన్నారు. ఆర్యభట్టు రచనల్లో విడిచిన మిగిలిన సైన్ల పట్టికలను ఈయన పూర్తి చేశాడు.

ఈనాటి ఆధునికసమాజం చేపట్టిన గ్రహాంతర ప్రయాణాల్లో వెలుగు చూసిన అనేకానేక విషయాలను వరాహమిహిరుడు ఆనాడే చెప్పారు. తన పంచ సిద్దాంతికం అనే గ్రంధంలో బుధ, శుక్ర, అంగారక, శని, గురు గ్రహ వ్యాసాలను వివరించారు. అలాగే మనకు చెప్పబడ్డ నక్షత్రాలే కాక ఇతర తారల వివరణ కూడా ఆయన గ్రంధం అందిస్తుంది. ఆ గ్రంధంలో కాలం యొక్క వివిధ అంశాలు, దేవతలు, రాక్షసుల సంవత్సర కాలమానం, బ్రహ్మదేవుని పగలు, రాత్రి సమయం, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం గడిచింది మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తుంది.

సూర్యసిద్ధాంతం అనే గ్రంధంలో అంగారక గ్రహం యొక్క వ్యాసం చెప్పబడింది. అందులో 3,772 మైళ్ళని చెప్పగా, ఈ రోజు 4,218 మైళ్ళని చెప్తున్నారు. నాటికి, నేటికి 11% వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే అంగారక గ్రహం చుట్టుకొలత, అంగారక గ్రహం మీద ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణ గణనలు, ఆ చంద్రుని రంగు, అందులో పదార్ధాల వివరణ ఉంది.

అలాగే వరాహమిహిరుడు అంగారక గ్రహం మీద నీరు ఉన్నదని చెప్పారు. ఆ గ్రంధంలో అంగారక గ్రహం యొక్క పూర్తి వివరణ ఉన్నది. అంగారకుని మీద నీరు, ఐరన్ ఉందని ఆయన చెప్పారు, ఈనాడు ఇస్రో, నాసా చేసిన పరిశోధనలు దీన్ని ధృవపరిచాయి.

సూర్యుడు ద్వారానే అన్ని గ్రహాలు ఏర్పడి, ఆయన కేంద్రంగా ఎలా పని చేస్తున్నాయన్నది చెప్పిన నేటి యుగంలో తొలి వ్యక్తి ఆయనే. అంటే భారతీయ జ్యోతిష్యం 1500 ఏళ్ళ పూర్వమే ఎంత ఉన్నత స్థాయికి చేరిందో అర్దం చేసుకోవచ్చు.

To be continued ..................

సేకరణ: http://www.mysteryofindia.com/2016/03/varahamihira-predicted-water-on-mars.html

Saturday 27 August 2016

స్వామి శివానంద సూక్తి


Man sows a thought and reaps an action. He sows an action and reaps a habit. He sows a habit and reaps a character. He sows a character and reaps a destiny.

Friday 26 August 2016

స్వామి సచ్చిదానంద సూక్తి



Real truth is unspoken. The minute you open your mouth, you limit the truth. It is impossible to talk about truth because anything you say limits it according to your own understanding. If I want to show you the sea, I cannot bring the entire sea here. I can bring a cup of seawater and show it to you. In the same way, we each take different containers to the sea. One person will take a cup; another will take a bucket. The sea assumes the shape of the container. Your mind is a container and each mind is different. That is the reason why we have different religions according to our minds.

- Swami Sacchidananda

Thursday 25 August 2016

గీతలో భగవానుడు


One who is not envious but who is a kind friend to all living entities, who does not think himself a proprietor, who is free from false ego and equal both in happiness and distress, who is always satisfied and engaged in devotional service with determination and whose mind and intelligence are in agreement with Me-he is very dear to Me.

- Sri Krishna in Bhagavadgita 

Tuesday 23 August 2016

బోధిధర్మ సూక్తి



If you use your mind to study reality, you won't understand either your mind or reality. If you study reality without using your mind, you'll understand both.

- Bodhi Dharma 

Monday 22 August 2016

Sunday 21 August 2016

సద్గురు శివానందమూర్తి సూక్తి


Dharma is my religion. Hindustan is my temple.

Satguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 222 (జ్యోతిష్యం - 4)

ఆర్యభట్టు తర్వాత భారతీయ జ్యోతిష్యం మీద ఎంతో పరిశ్రమ చేసిన వ్యక్తిగా వరాహమిహిరుడిని చెప్పవచ్చు. ఈయన జ్యోతిష్య, ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు. జ్యోతిష్య శాస్త్రం మీద అనేక ప్రామాణిక గ్రంధాలు రాసారు.

బృహత్ జాతక - గోళ శాస్త్రం మరియు జాతక గ్రంథం లో గల ఐదు ముఖ్య గ్రంథములలో ఒకటి.
లఘు జాతక - దీనిని స్వల్ప జాతక అని కూడా పిలుస్తారు.
సమస సంహిత - దీనిని "లఘు సంహిత" లేదా "స్వల్ప సంహిత" అని కూడా పిలుస్తారు.
బృహత్ యోగ యాత్ర - ఇది "మహా యాత్ర" లేదా " యక్షస్వమెధియ యాత్ర" అని పిలువబడుతుంది.
యోగ యాత్ర - ఇది "స్వల్ప యాత్ర" గా పిలువబడుతుంది.
టిక్కని యాత్ర
బృహత్ వివాహ పటాల్
లఘ వివాహ పటాల్ - ఇది స్వల్ప వివాహ పటాల్ గా పిలువబడుతోంది.'
లఘ్న వరాహి
కుతూహల మంజరి
వైవజ్ఞ వల్లభ

తన బృహద్ జాతకం మరియు బృహద్ సంహితల్లో భూగోళ శాస్త్రం, గ్రహకూటములు, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రాలకు సంబంధించి ఎన్నో విషయాలను కనుగొన్నారు. మొక్కలకు వచ్చే రోగాలకు అవసరమయ్యే వైద్యశాస్త్రాన్ని కూడా ప్రస్తావించారు. ఈనాటికి జ్యోతిష్య శాస్త్రంలో (ఖగోళ విభాగంలో), ఈయన రాసిన పాంచసిద్ధాంతం గొప్ప స్థానం కలిగి ఉంది. చంద్రుడు, గ్రహలు మొదలైనవాటికి స్వయం ప్రకాశం లేదని, అవి సూర్యుని కాంతి వలననే ప్రకాశమవంతంగా ఉన్నాయని అందులో ప్రస్తావించారు. తోకచుక్కలు, భూమిపై, మానవాళిపై వాటి ప్రభావాలను వివరించారు.

గోళాకారం కలిగిన భూమిపై వస్తువులు నిలిచి ఉండటానికి ఒక శక్తి ఉందని, అదే అంతరిక్షంలో గ్రహాలు, ఇతర పదార్ధాలను సైతం తమ స్థానాల్లో స్థిరంగా ఉంచుతోందని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరించారు.


బృహ జ్ఞాతకము - జ్యోతిష ఫల విభాగానికి చెందిన బృహ జ్ఞాతకములో 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయి. దీనినే హోరా శాస్త్రమని పిలిచాడు. ఇలాంటి రచనలకు సాధారణంగా వాడే ఛందస్సులు గాక వృత్తులలో విషయాలను అందంగా అందించాడు వరాహమిహిర్డు. దీనికి సహాయకారిగా సవాంశ గణీతం కూడా రచించాడు. ఈ రెండు గ్రంథాలు ఆధారంగా సరియైన జ్యోతిష ఫలితాలు వస్తాయని ప్రతీతి. నేటి వరకు గూడా ఈ శాస్త్రం ప్రచారంలో ఉంది.

బృహత్సంహిత - బృహత్సంహితలో గ్రహాల సంచారము, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగేఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, గర్భధారణ, భూకంప ఉల్క పాతములు, ఇంద్ర ధనుస్సు, ప్రతి సూర్యుడు, పిడుగు పడటం వంటి అనేక సృష్టి వైచిత్రాలు, శకున ఫలములు, వాస్తు ప్రకరణము, భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున నీళ్ళు దొరుకుతుందనే విషయం, వృక్షాయర్వేదము, వజ్ర లేపనము, జంతువులు, మణుల పరీక్ష తిథి, గోచార ఫలితాలు వంటి అనేక విషయాలు విస్తారంగా తెలియ జేశాడు.

చంద్ర,సూర్య గ్రహణాలు రాహు,కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.

అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ,పరాశర, అసిత దేవతల, కశ్యప, భృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల అభిప్రాయం ప్రకారము అని విడివిడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ఆ రచనల్లో తెలియడమే కాక ఆ కాలములో అవన్ని లభించి ఉండేవని కూడా తెలుస్తోంది.

"దకార్గాళాధ్యాయం" లో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించాడు. మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్తము ప్రవహించినట్లు భూమిలో గల జల నాడులలో జల ప్రవాహాలు ఉంటాయని, వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లు, పుట్టలు ఉపయోగపడతాయని నిరూపించాడు. అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యములోనికి తీసుకురాలేదు. ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయటం జరుగుతోది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు. చెట్లు, ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది.

ప్రాధమికంగా గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు ఖగోళ, జ్యోతిష, ద్రవస్థితి, భూగర్బ, ఆయుర్వేద వంటి అనేక శాస్త్రాలలో తన ప్రతిభ కనబరిచాడు. జ్యోతిష శాస్త్ర చంద్రుణ్ణీ పైకి తీస్తానంటూనే తన గ్రంథము స్థానాంతరం చెందటం వలనగాని, అనేకుల నోళ్ళలో సంచరించటం వలన గానీ, వ్రాయటంలో గాని లేక తానే గాని తప్పులు చేసి ఉండవచ్చని, విద్వాంసులు ఆ దోషాన్ని పరిహరించి పరిగ్రహించమని కోరటంలో ఎంతో గౌరవం పొందాడు. ఇందులో ఆయన వినయవిధేయతలు స్పష్టంగా కనిపిస్తాయి.

To be continued .........
ఈ రచనకు సహాయపడిన లంకెలు
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81
http://www.freepressjournal.in/mind-matters/varahamihira-the-ancient-astrologer-astronomer-and-mathematician/676984
http://www.sanskritimagazine.com/vedic_science/varahamihira/

Saturday 20 August 2016

స్వామి శివానంద సూక్తి



If there is depression in the mind, the body also cannot function properly. The pains which afflict the body are called the secondary diseases, Vyadhi, while the Vasanas or desires that afflict the mind are termed mental or primary diseases, Adhi. Mental health is more important than physical health. If the mind is healthy, the body will necessarily be healthy. If the mind is pure, if your thoughts are pure, you will be free from all diseases primary and secondary.

- Swami Sivananda 

సంకష్టహరచవితి వ్రత విధానం

బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.

ఓం గం గణపతయే నమః
సంకష్టహరచవితి వ్రత విధానం :

సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి.  "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి ఆదివారం వచ్చింది.)

మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

ఓం గం గణపతయే నమః

Originally published: August 2012
Republished for every sankata hara chaviti

Friday 19 August 2016

మధర్ సూక్తి


Do not think yourself big or small, very important or very unimportant; for we are nothing in ourselves. We must only live to become what the Divine wills of us.

- The Mother 

Thursday 18 August 2016

విశ్వసంస్కృత దినోత్సవం

నేడు విశ్వసంస్కృత దినోత్సవం
ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ రోజున సంస్కృత భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ భాషలకు తల్లి సంస్కృతం.
ప్రపంచంలోనే ఏకైక పరిపూర్ణ భాష సంస్కృతం
దేవతల భాష సంస్కృతం
ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే సమయానికి కూడా సంస్కృతమే జాతీయ భాష.
అప్పట్లో భారతదేశంలో అనేక రాజ్యాలున్నాయి, ప్రాంతాలవారిగా అనేక భాషలుండేవి, సనాతన ధర్మాన్నే అందరూ పాటించినా, స్థానిక సంప్రదాయాల్లో వ్యత్యాసం ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి ఈ దేశంలో, ఆ సమయంలో ఒక ప్రాంతం ప్రజలు ఇతర ప్రాంతాల వారితో మాట్లాడాలన్నా, వ్యాపారం నిర్వహించుకోవాలన్నా, ఏ భాషను మాధ్యమంగా ఉపయోగించేవారు? దానికి సమాధానం కూడా సంస్కృతమే.
పైధాగోరస్ కూడా సంస్కృతాన్ని అభ్యసించే ఇక్కడి విజ్ఞానాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళాడు.
రాబోయే తరంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించే అన్ని ఉపగ్రహల్లో వాడబోయే భాష #సంస్కృతం.
గొంతు, నోటి క్యాన్సర్లు నిర్వారించడానికి యూరోప్ దేశ విశ్వవిద్యాలయాల్లో నేర్పబడే భాష సంస్కృతం.

సంస్కృతం వైభవం ఏమని చెప్పేది? ఎంతని చెప్పేది?
అటువంటి సంస్కృతాన్ని అందరూ నేర్చుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది.
ధర్మాన్ని రక్షించుకోవాలన్నా, జ్ఞానాన్ని సక్రమంగా తరువాతి తరాలకు అందించాలన్నా, సంస్కృతం నేర్చుకోవడం తప్పనిసరి.

పఠతు సంస్కృతం, వదతు సంస్కృతం 

కంచి పరమాచార్య స్వామి సూక్తి


Wednesday 17 August 2016

స్వామి దయానంద సరస్వతి సూక్తి



The Lord is one, effulgent, all-knowledge, without a spot of ignorance. And that Lord is the one upon whom we meditate or whom we pray to, dh¢mahi. We pray with our heart and mind to that Lord who is effulgent, all-knowing and all-consciousness and who is most worshipful.

- Swami Dayananda Saraswati

Tuesday 16 August 2016

స్వామి సచ్చిదానంద సూక్తి


You cannot find two snowflakes the same. You cannot find two grains of sand the same. That means, God purposely made everything different; everything is unique in its own way—there is no superior or inferior. If we realize that, we will respect everything and everybody. In a sense, we are one and many. If we realize this, our lives will be happy and peaceful; we won’t see people as different from us. That’s what is meant by, ‘Love thy neighbor as thyself.’

- Swami Sacchidananda

Sunday 14 August 2016

సద్గురు శివానంద మూర్తి సూక్తి


Unless Dharma is protected all around, we will not get the ideal atmosphere to live in. Unless we abide by Dharma, we cannot contribute to it. So, for the sake of the society or the country, we should live in Dharma and only when it is protected all around, it is possible.

- Satguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 221 (జ్యోతిష్యం - 3)

ఆర్యభట్టుని జ్యోతిష్య సిద్ధాంతాన్ని ఔదాయక సిద్ధాంతం అని అంటారు, ఎందుకంటే ఇది లంక దగ్గర సూర్యోదయాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. భూమి తన అక్షంపై తన చుట్టూ తానే తిరుగుతుందని, నక్షత్రాలు తిరుగుతున్నట్టు కనిపించడం భూభ్రమణం వలన కలిగే సాపేక్ష చలనం అని చెప్పారు. ఇది ఆర్యభట్టీయం మొదటి అధ్యాయంలో వివరించారు. ఇందులో ఒక యుగంలో భూమి ఎన్ని సార్లు పరిభ్రమిస్తుందో చెప్పి, గోళ పాదంలో మరింత స్పష్టం చేశారు.

సూర్య, చంద్ర గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించారు. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని గోళ పాదం 37 శ్లోకంలో వివరించారు. 38 నుంచి 48 వరకు భూ ఛాయ పరిమాణం, విస్తృతిని వివరించి, గ్రహణం ఎంత సమయం పడుతుంది, ఎప్పుడు పడుతుందనేది వివరించారు. ఆ తర్వాతి జ్యోతిష్యులు దీన్ని ఇంకా అభివృద్ధి చేశారు. ఈయన గణన ప్రక్రియ ఎంత ఖచ్చితంగా ఉన్నదంటే 18 వ శత్బాదపు సైంటిస్టు Guillaume Le Gentil, భారతదేశంలో పాండిచ్చెరిని సందర్శించినప్పుడు, భారతీయ పద్ధతుల్లో 30 ఆగష్టు 1765 గ్రహణాన్ని గణించినప్పుడు అది 41 సెకన్లు తక్కువ ఉండగా, తన పట్టిక 68 సెకన్లు ఎక్కువ చూపిందని వివరించారు. ఈ విషయాన్ని అన్సారి.ఎస్.ఎం.ఆర్. గారు రాసిన ఆర్యభట్ట 1, హిస్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అనే పుస్తకంలో ప్రస్తావించారు.

ఆంగ్ల సమయ ప్రమాణాల ప్రకారం ఆర్యభట్టు స్థిర నక్షత్రాలను సూచిస్తూ (అనుసరించి) భూ భ్రమణం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకన్లు, ఆధునికులు చెప్పిన సంఖ్య 23:56:4.091. అలాగే భూమి తన కక్ష్యపై సూర్యుని ఒకసారి చుట్టి రావడానికి పట్టే స్మయం 365 రోజుల, 6 గంటల, 12 నిమిషాల, 30 సెకన్లు (365.25858 రోజులు). ఆధునికులు చెప్పిందానికి దీనికి 3 నిమిషాల 20 సెకన్లు వ్యత్యాసం ఉంది. ఆధునిక సంఖ్య (365.25636 రోజులు). ఈ విషయాన్ని ఆర్యభట్టీయం మరాఠీ అనువాదంలో మోహన్ ఆప్టే ప్రస్తావించారు. గత 200 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని ఆధునికులు చెబితే, ఇదే విషయాన్ని ఆర్యభట్టు క్రీ.పూ. 6 వ శత్బాదంలో చెప్పారు.

ఆర్యభట్టు జ్యోతిష్య గణనలు ఎంతో ప్రభావితం చేశాయి. త్రికోణమితి పట్టికలతో పాటు, ఈ పట్టికలు కూడా అరబిక్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చి, అరబిక్ ఖగోళ శాస్త్ర పట్టికలు ఏర్పరుచుకున్నారు (zij). ఇవే అటు తర్వాత లాటిన్‌లోకి అనువదించబడి 12వ శతాబ్దం నుంచి టొలెడో పట్టికలుగా (Tables of Toledo), అతి ఖచ్ఛితమైన ఖగోళ శాస్త్ర గణననలుగా ఐరోపాలో ఎన్నో శతాబ్దాలున్నాయి. (ఇదే కదా మన ధర్మం గొప్పతనం, ప్రపంచానికే కాలమానాన్ని గణించడం నేర్పిన జాతి మనది. హిందువైనందుకు గర్వించండి.)

ఆర్యభట్టు జ్యోతిష్య గణనల ఆధారంగా హిందువులు తమ నిత్య, నైమిత్తిక కృత్యాల కోసం పంచాంగాల్లో దాన్ని స్వీకరించి, ఇప్పటికీ కొనసాగిస్తుండగా, మన సనాతన హిందూ ధర్మ జ్యోతిష్య వేత్త అయిన ఆర్యభట్టుని జ్యోతిష్యశాస్త్రం ఆధారంగానే ఇస్లామిక్ ప్రపంచం జలాలి క్యాలెండర్లను( Jalali calendar) సా.శ.1073 లో రూపొందించుకున్నారు. దీన్ని ఒమర్ ఖయ్యం మొదలైన ఖగోళ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. వీటిలోనే 1925 లో కొన్ని సవరణలు చేసి ఈనాటికి ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో జాతీయ క్యాలెండర్లుగా వాడుకుంటున్నారు. జలాలి క్యాలెండర్లలో తేదీలు సౌరమానాన్ని, ఆర్యభట్టు, ఆయనకు ముందు జ్యోతిష్యులు చెప్పిన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంటాయి. ఈ క్యాలెండర్లలో తేదీలను గణించడం కష్టమైనా, గ్రిగేరియన్ క్యాలెండర్ కంటే ఇందులో దోషాలు చాలా తక్కువ.

To be continued ..............

Wednesday 10 August 2016

Sunday 7 August 2016

సద్గురు శివానంద మూర్తి సూక్తి



We know that while both Dharma and Adharma hail from the same God, we pray and request him to be as Dharma in us. No Purana denies the existence of God in hell who permeates heaven.

Satguru Sivananda Murty Garu

హిందూ ధర్మం - 220 (జ్యోతిష్యం - 2)

విశ్వగతిలోని అంతరార్ధాన్ని వేదసంస్కృతి అర్దం చేసుకుంది. విశ్వగమనానికి, ఋతువులు, కాలనుగుణంగా జరిగే పరిణామాలకు సంబంధాన్ని తెలుసుకుంది. అనుదులో భాగంగానే గ్రహగతులు, పగులు, రాత్రి గణన, ఋతువులను నిర్ణయించడాన్ని లోతుగా పరిశీలించింది. అందువల్లనే జ్యోతిష్యం (ఇక్కడ ఫలిత జ్యోతిష్యం గురించి ప్రస్తావించడం లేదు) గ్రహాలు, గ్రహకూటములు, నక్షత్ర కూటములు, ఉల్కలు, తోకచుక్కలు, భ్రమణాలు, కాంతిని వెలువరించే ఇతర వస్తువులను వివరించింది.

ఋగ్వేదానికున్న వేదాంగ జ్యోతిష్యాన్ని అందించిన మహానుభావుడు మహర్షి లగధాచార్యులు. ఇందులో 36 శ్లోకాలున్నాయి. అలాగే యజుర్వేదానికి, అధర్వణ వేదానికి కూడా జ్యోతిష్య శాస్త్రం ఉంది. యజుర్వేద జ్యోతిష్యానికి మూలపురుషుడు శోషాచార్యులు, ఆయన 34 పద్యాల్లో దాన్ని వివరించారు. అధర్వణవేద జ్యోతిష్యంలో 14 కాండలు, 102 శ్లోకాలున్నాయి. ఇది పితామహుడు, కశ్యపుడికి మధ్య జరిగిన సంవాదం రూపంలో ఉంది, పితామహుడు చెప్పగా, కశ్యపుడు విన్నాడు.

వేదంలో జ్యోతిష్యానికి బీజం పడగా, మహర్షుల వలన అది అనుకురించింది. అటు తర్వాత ఎందరో జ్యోతిష్యవేత్తలు ఎంతో పరిశోధించి దీన్ని గొప్ప శాస్త్రంగా రూపొందించారు. అందులో పరాశర మహర్షి గురించి గొప్పగా చెప్పుకోవాలి. వారు బృహత్ పరాశరం అనే గొప్ప జ్యోతిష్య గ్రంధాన్ని రాశారు. వీరి తర్వాత ఆర్యభట్టు. ఈయన క్రీ.పూ.6 వ శతాబ్దానికి చెందినవాడు. కలియుగం 337 వ సంవత్సరంలో తాను పుట్టానాని ఆయనే తన గ్రంధమైన ఆర్యభట్టీయంలో చెప్పుకున్నాడు. ఈయన జ్యోతిష్య (ఖగోళ) శాస్త్రానికి సంబంధించి ఎన్నో రచనలు చేశారు. ఈయన ఆర్యభట్టీయంలో గణితంతో పాటు జ్యోతిష్యం (ఖగోళం) కూడా ఉంది. ఈయన తన రచనల్లో గణితం, బీజగణితం, గోళాకార త్రికోణమితి, సరళ త్రికోణమితి మొదలైనవాటికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. వాటిలో నిరంతర భిన్నాలు, వర్గ సమీకరణాలు, ఘాతక శ్రేణి కూడికలు, సైన్ల పట్టిక వంటి ఎన్నో విషయాలున్నాయి. ఈయన రాసిన ఆర్యసిద్ధాంతం అనే గ్రంధం లుప్తమవ్వగా, ఆయన జ్యోతిష్య సూత్రాలను వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యులు-1 మొదలైనవారు తమ రచనల ద్వారా తిరిగి ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఆయన రాసిన ఆర్యసిద్ధాంతం సూర్యసిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది. అందులో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక పరికరాల ప్రస్తావన కూడా ఉంది. ఉదాహరణకు శంఖుయంత్రము, ఛాయా యంత్రము, ధనుర్ యంత్రము/ చక్ర యంత్రము, యస్తి యంత్రము, అవి కాక ధనుర్ యంత్రము, యస్తి యంత్రానికి సంబంధిచిన నీటి గడియారాల ప్రస్తావన వీటి యందు ఉంది.  ఆర్యభట్టు ద్వారా ప్రపంచానికి అందించబడిన ఎంతో విజ్ఞానాన్ని సా.శ.9 లో ప్రముఖ పండితుడు, ఆల్-బెరూని అరేబియన్ భాషలోకి అనువదించాడు. అలా హిందూ విజ్ఞానం అరబ్‌లోకి వెళ్ళి అక్కడివారి అజ్ఞానాన్ని తరిమే ప్రయత్నం చేసింది.

ఆర్యభట్టియంలో 108 శ్లోకాలున్న కారణం చేత దాన్ని ఆర్యశతాష్ట అనేవారు. అది ఛంధోబద్ధమైన శాస్త్రం కనుక దాన్ని అర్దం చేసుకోవడం, అనువదించడం సనాతనధర్మాన్ని, వేదవేదాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారికే సులువుగా ఉంటుంది. 108 శ్లోకాలు, 13 పరిచయ శ్లోకాలున్న ఈ గ్రంధాన్ని 4 పాదాలుగా విభజించవచ్చు.

గీతికాపాదం - 13 శ్లోకాల ఈ పాదంలో కల్పం, మన్వంతరం, యుగం మొదలైన విశ్వానికి సంబంధించిన పెద్ద పెద్ద కాలాల వివరణ ఉంది. ఇందులో జ్యా (sine పట్టిక గురించి కూడా చెప్పబడింది. ఒక మహాయుగంలో గ్రహ భ్రమణాల వ్యవధి 43,20,000 సంవత్సరాలు.

గణితపాదం - 33 శ్లోకాల ఈ పాదంలో క్షేత్ర వ్యవహారం (క్షేత్రగణితం/ క్షేత్రమితి), బీజగణితం, రేఖాగణిత గమనాలు, శంఖు, ఛాయ, సాధారణ, వర్గ, ఏకకాలిక మరియు అనిర్దిష్ట సమీకరణాల (simple, quadratic, simultaneous, and indeterminate equations) వివరణ ఉంది.

కాలక్రియాపాదం - 25 శ్లోకాల ఈ పాదంలో కాల విభాగాలు, ఒకానొక రోజున గ్రహాల గతి, అధికమాసాన్ని గణించే పద్ధతి, క్షయ తిధులు మరియు వారాన్ని 7 రోజులుగా, 7 రోజులకు 7 పేర్లను ఇందులో వివరించారు.

గోళపాదం - 50 శ్లోకాల ఈ పాదంలో అంతరిక్ష సంబంధమైన గోళాలు (celestial sphere), ఖగోళ కక్ష్య యొక్క లక్షణాలు (features of the ecliptic), ఖగోల మధ్యరేఖ (celestial equator), node, భూగోళ ఆకారం, పగులురాత్రికి గల కారణాలు, దిగంతం (horizon)లో రాశిచక్రాల ఉదయము మొదలైనవి రేఖాగణిత, త్రికోణమితి అంశాలతో వివరించారు. వీటితో పాటు తనకు ముందు ఉన్న మహర్షులు, ఆచార్యులు, వారి రచనలు, తనపై వాటి ప్రభావాన్ని వివరించారు.

To be continued ................

Saturday 6 August 2016

స్వామి శివానంద సూక్తి



Thought is life. What you think, that you are. Your thought creates your environment. Your thoughts constitute your world.

- Swami Sivananda

Friday 5 August 2016

స్వామి చిదానంద సూక్తి



Having taught Arjuna the immortal nature of the Atman, Lord Krishna turns to the performance of action without expectation of fruit. A man should not concern himself about the fruit of the action, like gain and loss, victory and defeat. These are in the hands of the Lord. He should perform all action with a balanced mind, calmly enduring the pairs of opposites like heat and cold, pleasure and pain, that inevitably manifest during action.

- Swami Chidananda

Thursday 4 August 2016

స్వామి చిన్మయానంద సూక్తి



In the Bhagavad-gita, Sri Krishna describes how the three types of persons, with three different visions live in the world. A person with a sattvika vision lives in bliss and freedom because he/she perceives the oneness of things and beings and therefore, the heart is filled with love for all. The rajasika person is constantly struggling as he/she sees differences, which create divisions, likes and dislikes in the mind. The tamasika person lives in bondage, taking the part for the whole and getting fanatically attached to one little thing.

- Swami Chinmayananda

Wednesday 3 August 2016

స్వామి సచ్చిదానంద సూక్తి


Be Above Wants

“Most people want to be happy. So, what do they do? They start running after happiness by accumulating many things. After a while, they begin to realize that nothing fulfilled their ambition of being happy. There was temporary happiness, but that temporary happiness came with a lot of unhappiness before and a lot of unhappiness afterwards. In between, they saw a little happiness. They may even say: ‘I am sick and tired of all these things.’ When do they say that? When they begin to realize that nothing and nobody can ever give happiness. So learn to say, ‘I don’t want.’ That will make you above wants. And when you are above wants, you will always be happy and peaceful.

“God bless you. Om Shanti, Shanti, Shanti.”

- Swami Sacchidananda

Tuesday 2 August 2016

Monday 1 August 2016

స్వామి దయానంద సరస్వతి సూక్తి



I may have all the six ingredients (effort, initiative, courage, intelligence, resourcefulness and perseverance) for success but still there may be something that makes the difference between success and failure. By my prayer, I invoke daivam, the seventh factor, to take care of the unknown element.

- Swami Dayanand saraswati

ఓం భీమాయ నమః