Tuesday 29 September 2015

స్వామి రంగనాధానంద సూక్తి

Air is there in the atmosphere; wherever you search you find air. Similarly in religion, you do not have to go here and there to see God. Wherever you are, the divine is there, just like oxygen.
Swami Ranganadhananda.


Monday 28 September 2015

హిందూ ధర్మం - 177 (వ్యాకరణం)

వ్యాకరణం అనే వేదాంగాలలో ముఖ్యమైనది. ఇది వేదానికి నోరు వంటిది. వ్యాకరణము అనే పదమే 'శబ్దోత్పత్తి, శబ్ద లక్షణములను తెలిపే ఉపకరణము' అనే నిర్వచనాన్ని ఇస్తుంది. వైదికమైన శబ్దములు ఎలా ఏర్పడ్డాయి, వాటి మూలం ఏమిటి, కొత్తగా ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి, ఏ అక్షరాలను ఎలా కలిపితే, సరైన అర్దం వస్తుంది మొదలైన అనేకానేక విషయాల గురించి వ్యాకరణం వివరిస్తుంది. వ్యాకరణం గురించి అనేకమంది మహర్షులు వేల ఏళ్ళ క్రితమే వివరణాత్మకమైన గ్రంధాలను రాసినా, కాలక్రమంలో వాటిన్నంటిని భరతజాతి కోల్పోయింది. ప్రస్తుతం వ్యాకరణానికి 3000 ఏళ్ళ క్రితం పాణిని మహర్షి రాసిన అష్టాధ్యాయి గ్రంధమే సప్రమాణికం అయింది. దానికే పతంజలి మహర్షి మహాభాష్యం రాశారు. పాణిని అష్ఠాధ్యాయిలో వైదిక, అవైదిక పదాలను గురించి చర్చించారు. దీని పతంజలి మహర్షి రాసిన మహాభాష్యం ఎంత ప్రామాణికం అంటే ఎక్కడైన సూత్రాలు, వార్త్తికలు మరియు మహాభాష్యం మధ్య అభిప్రాయ బేధాలు కలిగితే, అప్పుడు మహాభాష్యంలో చెప్పబడ్డ దాన్నే ప్రామాణికంగా స్వీకరిస్తారు.

ప్రపంచంలో ఏదైనా పూర్తి సైంటిఫిక్ భాష ఉన్నదా? అనే ప్రశ్న ఉదయిస్తే, దానికి సంస్కృతం ఒక్కటే సమాధానం. సంస్కృతంలో ప్రతి పదం, అక్షరము ఎలా ఏర్పడిందన్న దానికి వివరణ ఉంటుంది. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ మాదిరిగా వ్యాకరణం సంస్కృతానికి శబ్ద ఇంజనీరింగ్ మరియు Science of word building.

ఇప్పటి పిల్లలకు మన పుస్తకాలలో పాణిని అనే పేరు కనబడదు. ప్రపంచంలో అందరు కంప్యూటర్ సైన్సు వారికి ఆ పేరు సుపరిచితం. ప్రపంచ భాషలలొ సంస్కృతమునకు గల ప్రత్యేక స్థానమునకు కారకుడు పాణిని. పంచతంత్రం ఆయనను ముని అంటుంది. ఆయన లేకపొతె నాటికీ నేటికీ భాషాశాస్త్రమే లేదు. ఆయన కాలం మూడు వేల సంవత్సరాలకు ముందే. పుట్టిన స్థలము గాంధారదేశము (నేటి వాయువ్య- పాకిస్తాన్). ఆయన వ్యాకరణ గ్రంధం 3959 సూత్రాల అష్టాధ్యాయి. భారతీయ తత్త్వ శాస్త్రములొ శబ్దమునకు, భాషకు ఉన్నతమైన స్థానము ఉంది. శబ్దాన్ని వాగ్దేవిగా, దేవతా స్వరూపముగా భారతీయులు ఆరాధిస్తారు.. వ్యాకరణమే అన్ని శాస్త్రాలకు మూలం.

వేదాన్ని అర్దం చేసుకోవటానికి వైదిక సంస్కృతాన్ని ఔపోసన పట్టడం ఎంతో అవసరం. దానికి వ్యాకరణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక పదం గురించి వివరించినప్పుడు దాని మూలం గురించి, దానికి జత చేసిన అక్షరాల గురించి వ్యాకరణం వివరిస్తుంది. పదం యొక్క మూలాన్ని ప్రకృతిని అని, దానికి జత చేసిన దాన్ని ప్రత్యయము అని అంటారు. పాణిని వ్యాకరణం సూత్రాల రూపంలో ఉంటుంది. వీటినే పాణిని మహేశ్వర సూత్రాలు అంటారు. ఇవి మొత్తం 14.

మహేశ్వర సూత్రాలు: 1(అ,ఇ,ఉ,ణ్),2 (ఋ,ఌ,క్) 3 (ఏ,ఓ,ఙ్) 4 (ఐ,ఔ,చ్) 5 (హ,య,వ,ర,ట్) 6 (ల,ణ్) 7(ఞ,మ,ఙ,ణ,న,మ్) 8 (ఝ,భ,ఞ్) 9 (ఘ,ఢ,ధ,ష్) 10 (జ,బ,గ,డ,ద,శ్) 11 (ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్) 12 (క,ప,య్) 13 (శ,ష,స,ర్) 14 (హ,ల్)
(అ,ఇ,ఉ,ణ్) = అణ్ - string notation to represent the above sequences
(అ,ఇ,ఉ,ఋ,ఌ,ఏ,ఓ,ఐ,ఔ,చ్) = అచ్ = అచ్చులు
(హ,య,వ,ర,ల,ఞ,మ,ఙ,ణ,న,ఝ,భ,ఘ,ఢ,ధ,జ,బ,గ,డ,ద,ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,క,ప,శ,ష,స,ల్)= హల్ = హల్లులు
వీటిని ప్రత్యాహారాలంటారు. పాణిని సూత్రాలను స్వల్పాక్షరాలలో చెప్పడానికి ఇది ఉపయోగించాడు.

శివుడు తాండవానంతరం ముక్తాయింపులో ఢమరుకం మీద పధ్నాలుగు అక్షరాల ధ్వనులు మ్రోగించాడు. అవే శివసూత్ర జాలంగా ప్రసిద్ధికెక్కాయి. ఢమరుకం లోంచి వెలువడిన పదునాలుగు అక్షర ధ్వనులతో పాణిని ప్రఖ్యాత వ్యాకరణం రచించాడు.
నృత్తావసానే నటరాజ రాజో సనాదఢక్కామ్ నవ పంచ వారమ్
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధానేతద్విమర్శే శివ సూత్ర జాలమ్||
नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवपञ्चवारम्।
उद्धर्त्तुकामो सनकादिसिद्धादिनेतद्विमर्शे शिवसूत्रजालम् ||

బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాది సిద్ధులు ఈ శబ్దాలను గ్రహించి పాణిన్యాదులకు ప్రసాదించారు. అందుకే అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయ, సిద్ధం నమః అని వీరిని స్మరించడం జరుగుతుంది.
పతంజలి, భర్తృహరి పాణిని తరువాత వ్యాకరణాన్నీ, శబ్ద శాస్త్రాన్నీ అభివృద్ధి పరచినవారు. పతంజలి మహాభాష్యం పాణిని రచనకు భాష్యమేకాక, వ్యాకరణాన్ని తత్త్వ శాస్త్ర స్థాయికి తీసుకొని వెళ్ళింది. పతంజలి యోగదర్శనానికి ఆద్యుడు. భర్తృహరి రచన వాక్యపదీయము.

To be continued .....................

సేకరణ: Vvs Sarma

Saturday 26 September 2015

గణపతి ప్రాముఖ్యం గురించి కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని వచనం


ఇండోనేషియాలో గణపతి గురించి 2 అద్భుత విషయాలు

ఇండోనేషియా ఇప్పుడు ముస్లిం దేశమైనా, వారు తమ హిందూ వారసత్వాన్ని, గతాన్ని గర్వంగా చెప్పుకుంటారు. ఆ విషయంలో ఎక్కడా సందేహించరు. ఇండోనేషియా కరెన్సీ మీద ముద్రించిన గణపతి చిత్రమిది. ఇదేకాక అక్కడ అనేక ప్రదేశాల్లో హిందూ సంస్కృతిని ప్రతిబింబించే ఆకృతులు, శిలాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు.

ఇండోనేషియా ప్రజలు గణపతిని విద్యలకు, జ్ఞానానికి, సంపదలకు అధిదేవతగా పూజిస్తారు. ఈ కారణంగానే అక్కడి ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైన బన్‌డుంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోగో మరియు ట్రేడ్‌మార్క్ మహాగణపతే. ఆ విశ్వవిద్యాలయం చిరునామా కూడా గణేశ రోడ్ నెం.10, బన్‌డుంగ్, వెస్ట్ జావా. ఇదిగో ఈ చిత్రం చూడండి.

కావాలంటే మీరే ఆ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ పరిశీలించండి. http://www.itb.ac.id/
ఆ లోగో ని జాగ్రత్తగా గమనించండి. ఆగమాలు చెప్పిన గణపతి రూపమే దర్శనమిస్తుంది. వారు కూడా అదే అంటారు. గణపతి చేతిలోని విరిగిన దంతం త్యాగానికి ప్రతీకయట. విద్యార్ధులు విద్య కోసం సుఖాలను త్యాగం చేసి కష్టపడాలని ఇందులోని ఒక సందేశం. మిగితా ఆయుధాలు జ్ఞానానికి, స్థిరత్వానికి ప్రతీకలట.
జావా ఒకప్పుడు గాణాపత్యభూమి అని చెప్తారు. అక్కడ గాణాపాత్యం అధికంగా ఉండేది.


Thursday 24 September 2015

దయానంద సరస్వతీ శివైక్యం

స్వామి దయానంద సరస్వతీ నిన్న రాత్రి (23-09-2015) 10.40 నిమిషాల ప్రాంతంలో ఋషికేష్‌లో భౌతిక దేహాన్ని వదిలి, శివైక్యం చెందారు. స్వామి దయానంద వద్ద శిష్యరికం చేసిన దయానందులు, సమకాలీన సమాజంలో వేదాంతాన్ని అందరికి సులభంగా, వివరంగా, స్పష్టంగా అర్దమెయ్యేలా బోధ చేశారు. 130 దేశాల్లో వీరు పర్యటనలు చేసి, సనాతనధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచంలో అనేకదేశాల్లో ఆశ్రమాలను, ఆర్షవిద్యా గురుకులాలను స్థాపించి, జ్ఞానబోధ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పరిపూర్ణనంద స్వామీజికి ఈయనే గురువు. ఏ గురువైనా శిష్యులను తయారు చేస్తారు, కానీ దయానందులు తనలాంటి అనేక గురువులను తయారు చేశారు.

ప్రపంచంలో అత్యంత మేధావిగా గురువు గారిని కొనియాడవచ్చు. 2000 సంవత్సరంలో ఐక్యరాజ సమితి నిర్వహించిన అంతర్జాతీయ సభకు అన్ని మతాల తరఫున అనేక మత గురువులు హాజరు కాగా, హిందూ ధర్మం తరఫున దయానందులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి కోసం అన్ని మతాలు సహనంతో జీవించాలి అని ఒక క్లాజ్‌తో ఉన్న ఒప్పందం మీద సంతకం చేయాల్సి వచ్చినప్పుడు, దాన్ని గురువు గారు తిరస్కరించారు. సహనం అనేది పాత శతాబ్దపు మాట. సహనంతో వ్యవహరించడమంటే అన్యమతాలు ధూషిస్తున్నా, వారిని ఎదురించక, ఓర్పు వహించి మౌనంగా ఉండడం. క్రైస్తవం, ఇస్లాం అన్యమతాల పట్ల దాడులు కొనసాగించినా, వారు మౌనం వహించాల్సి వస్తుందని, దానికి బదులుగా పరస్పర గౌరవం అనే నిబంధనను చేర్చాలని పట్టుబట్టి, అందరిని ఓప్పించినవారు దయానందులు. ఆ సమావేశానికి ఇప్పటి పోప్ కూడా హాజరు కాగా, దయానందులు చెప్పిన సవరణతో ఖంగు తిన్నారు. క్రైస్తవం, ఇస్లాం మొదలైన మతాలు అన్యమాతలను గౌరవించవు, వాటిని సత్యమని అంగీకరించవు. అటువంటప్పుడు అలా గౌరవిస్తామని ఒప్పుకోవడం ఆ మతస్థులకు ఇష్టంలేదు. అయినా దయానందుల వాదనే నెగ్గింది. అవతలివారు గౌరవిస్తేనే మనం కూడా గౌరవించాలి. అవతలివారి ప్రవర్తనను బట్టే మన ప్రవర్తనా ఉండాలి. అదే పరస్పర గౌరవం. అలా ఉన్నప్పుడు మాత్రమే సామరస్యంతో ప్రపంచం ముందుకు సాగగలదనేది దయానందులు వాదన.

అంతేకాక హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి 100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న మఠాలను, సంప్రదాయ పీఠాధిపతులను సనాతన ధర్మ ఆచార్య వేదిక అంటూ ఒకే వేదిక మీద తీసుకువచ్చి, ధర్మం కోసం అందరూ ఐక్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చింది దయానందులే. అలా వచ్చిన ఆచార్య సభ అనేక విజయాలను సాధించింది. తిరుమల వెంకన్నవి 7 కొండలు కాదు, 2 కొండలే అని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవో ని వెనక్కు తీసుకునేలా చేసింది ఈ ఆచార్యసభయే. రామసేతును కూల్చాలని చూసినప్పుడు కూడా ఆచార్యసభ గట్టి వాదనను వినిపించి, ప్రతిపాదనను ఆపింది. ఇలా దయానందులు సనాతనధర్మ రక్షణ కోసం అనే కార్యక్రమాలు చేసి, తమ జీవితాన్ని సనాతనధర్మానికి, వేదాంత ప్రచారానికి అంకితం చేశారు.

దయానంద చరణౌ మనాసా స్మరామి   

Tuesday 22 September 2015

అవ్వయ్యార్ పై గణపతి అనుగ్రహం

గణపతి అనుగ్రహం వర్షించాలే కానీ అసాధ్యమంటూ ఏదీ లేదు. పూర్వం తమిళనాట అవ్వయ్యార్ అనే అవ్వ ఉండేది. ఆవిడ గొప్ప గణపతి భక్తురాలు. ఒకసారి ఆవిడ వినాయకుడిని పూజిస్తున్న సమయంలో కొందరు యోగులు కలిసానికి వెళుతూ, అవ్వా! నువ్వు కూడా మాతో పాటు కైలాసానికి వస్తావా? అని అడిగారు. నేను ఇప్పుడు గణపతిని పూజిస్తున్నాను, కాబట్టి రాలేను, మీరు వెళ్ళండి అని అవ్వ చెప్పింది. కైలాసానికి వెళ్ళడం అంటే మాటలు కాదు. అలా వెళ్ళడం కూడా ఊరికే వచ్చే అవకాశం కూడా కాదు. అయినా తనకు గణనాధుడే చాలనుకుంది అప్పయ్యర్. అవసరమైతే నన్ను గణపతే తీసుకువెళతాడని, తన పూజలో తాను నిమగ్నమైంది. ఈ యోగులు కైలాసానికి వెళ్ళేసరికల్లా అవ్వ కైలాసంలో ఉంది. అదేంటి అవ్వా! ఇందాక అడిగితే రానన్నావు, ఇంతలోనే కైలాసానికి ఎలా వచ్చావు అని ఆ యోగులు అడగ్గా, నా పూజ ముగియగానే వినాయకుడే తన తొండంతో నన్ను ఎత్తుకుని, కైలాసంలో కూర్చోబెట్టాడు అని చెప్పింది. ఇది గణపతి అనుగ్రహం అంటే. ఇది భక్తుల పట్ల గణపతికున్న ప్రేమ.

గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే అని ఆడిశంకరులు గణేశభుజంగంలో అంటారు. అంతటా వ్యాపించిన గణపతి ప్రసన్నుడైనచో పొందలేందంటూ ఏముంటుందని దాని అర్దం. దానికి ఇదే ప్రయక్ష ఉదాహరణ. అటువంటి సులభప్రసన్నుడు, క్షిప్రప్రసాది అయిన గణపతిని త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం.

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం గం గణపతయే నమః

త్రైలింగ స్వామి సూక్తి


Monday 21 September 2015

హిందూ ధర్మం - 176 (ఛంధస్సు - 4)

వైదిక విజ్ఞానాన్ని రక్షిచడంలో ఛంధస్సు ఎంతో ఉపయోగపడుతుంది. యజ్ఞాల్లోనే కాక వైదిక గ్రంధాల యందు ఎటువంటి మార్పులు, చేర్పులు జరగకుండా చూడటం, జరిగినవాటిని పసిగట్టడం, దోషాలను దిద్దడానికి ఇది సహాయపడుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ. భారతదేశాన్ని అక్రమంగా తమ గుప్పిటలోనికి తీసుకున్న ఆంగ్లేయులు, తమ మత ప్రచారం కోసం ఈ దేశపు సంస్కృతిని, చరిత్రను నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నించారు. అందులో భాగంగా చరిత్రను వక్రీకరించారు. సుమారు 3000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు. ఎందరో రాజులు, కవులు, శాస్త్రజ్ఞుల కాలాన్ని తగ్గించి వేశారు. అలాంటిదే ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్టు విషయంలో జరిగింది. ఆర్యభట్టు కలియుగం 360 (క్రీ.పూ.2742)వ సంవత్సరంలో జన్మించనట్టుగా పురాణాలు నిర్ధారించాయి. ఆర్యభట్టు కూడా ఈ విషయాన్ని ఆర్యభట్టియం అనే గ్రంధంలో స్వయంగా తానే చెప్పుకున్నాడు. ఆర్యభట్టీయం కాలక్రమపాదంలోని ఈ శ్లోకాన్ని కోట వేంకటాచలం తమ 'భారతీయ శకములు' అనే గ్రంధంలో ఉటంకించారు.

షష్ట్యబ్దానాం షడ్భిః యదావ్యతీతాఃత్రయశ్చ యుగపాదాః
త్ర్యధికావింశతిరబ్దాస్తదేవ మమజన్మనః అతీతాః

కలియుగమునందు 6 సార్లు 60 ఏళ్ళు గడిచినప్పటికి నాకు 20 ఏళ్ళు .......... అని ఆర్యభట్టు చెప్పుకున్నాడు. అంటే ఆర్యభట్టు కలియుగం 337 లో జన్మించారు. కానీ ఈ విషయం బ్రిటీష్ వారికి మింగుడుపడలేదు. ఆ సమయానికి భారతదేశంలో ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందిందని చెప్పడం వారికి నచ్చలేదు. వారు భారతీయుల కోసం రాసిన బానిస చరిత్రలో క్రీ.పూ. నాటికి ఇంకా వేదాల రచనే పూర్తి కాలేదు. అలాంటిది అప్పటికి ఖగోళ శాస్త్రవేత్త భారత్‌లో జన్మించాడని చెప్తే, వారి చరిత్ర తప్పని తేలుతుంది. కలియుగ ప్రారంభ కాలాన్ని క్రీ.పూ.1900 కు కుదించాలని అనుకున్న విలియం జోన్స్ వంటివారికి, ఋగ్వేదాన్ని క్రీ.పూ. 1200 వ ఏట రాసి ఉంటారని భావించిన మాక్స్ ముల్లరి కి, ఆర్య్భట్టు క్రీ.పూ.2742 లో జీవించారని చెప్పడం కొరకరాని కొయ్యగా, అంగీకరించకూడిన సత్యంగా కనిపించింది. అందువల్ల వారు కలియుగం క్రీ.పూ.3102 లో ప్రారంభం కావడం, ఆర్యభట్టు కలియుగం 337 లో జన్మించడం అసత్యమని ప్రచారం చేశారు. ఎందుకంటే పాశ్చాత్య మత విశ్వాసాల ప్రకారం ఈ ప్రపంచం యొక్క సృష్టి క్రీ.పూ.4004 సంవత్సరంలో మాత్రమే జరిగింది. అంతకముందు ఏమీ లేదన్నది వారి మతగ్రంధాల సారం. అందువల్ల 18 వ శత్బాదపు పాశ్చాత్య చరిత్రకారులు ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని అంగీకరించలేకపోయారు. అందుకే లక్షలు, కోట్ల సంవత్సరాల క్రితం చారిత్రఘటనలను (పురాణాలను) కల్పితాలని ప్రచారం చేశారు. మనవారి మాటల కంటే ఆ తెల్లవారి మాటల మీదే అధికనమ్మకమున్న మనవారు కొందరు ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా ఆర్యభట్టీయంలోనే మార్పులు చేశారు. సుధాకరద్వివేది అనే వక్రీకరణకారుడు ఆర్యభట్టియంలోని శ్లోకాన్ని మార్చివేసి, ఆర్యభట్టును కలియుగం 3600 వ సంవత్సరానికి లాక్కొని వచ్చారు. పై శ్లోకంలో షడ్భిః - ఆరు చేత అనే పదాన్ని షష్టిః - అరవై అని మార్చేశాడు. క్రీ.శ.18 వ శతాబ్దంలో వ్రాతప్రతులను అచ్చువేయించి ఆయన చేసిన వక్రీకరణ, ఘోరమైన తప్పకు కారణమైంది. క్రీ.పూ.28 వ శతాబ్దికి చెందినవాడైన ఆర్యభట్టు క్రీ.శ.6 వ శత్బాది వాడనే భ్రమ వ్యాపించింది.

ఆర్యభట్టు రాసిన శ్లోకం ఛంధోబద్ధం. అందువల్ల అందులో మార్పులు చేయడం అసాధ్యం. షడ్భిః అన్న పదానికి 6 చేత గుణించడం అనే అర్దముంటే, షష్టిః అనే పదానికి 60 అనే మాత్రమే అర్దం వస్తుంది. కానీ 60 చేత గుణించడమని మాత్రం రాదు. 60 చేత అని చెప్పడానికి షష్టిభిః అని ఉండాలి. కానీ అలా అని షడ్భిః బదులు షష్టిభిః అని మారిస్తే, పద్యంలో ఒక అక్షరం ఎక్కువైపోతుంది, అప్పుడు ఛంధస్సు దెబ్బతింటుంది. అందుకోసమే షష్టిః గా మార్చాడు ద్వివేది. కానీ టియస్ నారాయణ శాస్త్రి అనే జాతీయచరిత్రకారుడు దొంగను పట్టుకున్నారు. ఏజ్-ఆఫ్-ఆదిశంకర అనే తన గ్రంధంలో ద్వివేదిని కడిగేశారు శాస్త్రిగారు. దక్షిణభారతదేశంలోని వ్రాతప్రతులన్నింటిలో షడ్భిః అనే ఉంది కానీ, ఎక్కడా షష్టిః అనే లేదని నిరూపించి నిలదీశారు. ఇప్పటికి వందేళ్ళు గడించినా, ద్వివేది నుంచి కానీ, ఆయన మిత్రులు, అనునూయుల నుంచి కానీ సమాధానం రాలేదు. ఇలా ఒక్క అక్షరం కూడా మార్చడానికి లేకుండా, కొత్త అక్షరం చేరిస్తే పట్టుకునే విధంగా, ప్రతుల్లో మార్పులు చేస్తే, అర్ధరహితం అయ్యేవిధంగా ఉంటాయి ఛంధోబద్ధమైన రచనలు. ఈ విధంగా ఛంధస్సు వైదిక గ్రంధాలను కాపాడుతోంది.

ఈ మధ్య క్రైస్త్వ మిషనరీలు, ఇస్లాం మతమార్పిడి కారులు కూడా వైదిక రచనల్లో కొత్త శ్లోకాలను చొప్పించి, సనాతనగ్రంధాల్లో ఏసు, మహమ్మద్ ఉన్నారని మభ్యపెట్టి మతమార్పిడి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. హిందువులందరి దగ్గర వేదాలు ఉండవు కనుక, వేదంలో ఫలాన చోట ఇలా ఉంది, ఫలాన చోట మా ప్రవక్త గురించి అలా ఉందని మాయమాటలు చెప్తున్నారు. కానీ వారు చూపిన శ్లోకాలను వైదిక ఛంధస్సు తెలిసిన పండితుని వద్ద చూపిస్తే, అసలు గుట్టు బయటపడుతుంది. వేదం మొత్తం ఛంధోబద్ధంగా ఉంటుంది. కానీ వీరు కల్పించిన శ్లోకాలకు ఛంధస్సు ఉండనే ఉండదు. ఆ శ్లోకాలు చదివిన పండుతులకు ఎక్కడ లేని నవ్వోస్తుంది. వైదిక ఛంధస్సు నేర్చుకోవడం చాలా కష్టం. కానీ మతమార్పిడి కోసం రక్తబలి, రక్తతర్పణం అంటూ కొన్ని శ్లోకాలని తయారుచేసి, వాటిని ఆ వేదంలో అక్కడ ఉంది, ఈ వేదంలో ఇక్కడ ఉందంటూ చెప్పి వేదాల్లో ఏసును చూపే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా బూటకం. వేదాల్లో ఏసు లేడు, మహమ్మద్ లేడు. ఇటువంటి అనేక విషయాల్లో తప్పులను పట్టుకోవడానికి, నిజానిజాలను తెలుసుకోవటానికి ఛంధస్సు ఇప్పటికీ ఉపయోగపడుతోంది.

To be continued ...........

ఈ రచనకు సహాయపడిన గ్రంధం - తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారి 'తరతరాల భరతజాతి. చరిత్రలొ వక్రీకరణలు... వాస్తవాలు'  

Friday 18 September 2015

గణపతి గురించి ఆదిశంకరాచార్య


సార్వజనీన గణపతి

ఒక్క హిందూ ధర్మమే కాక, భౌద్ధం, జైనం వంటి అనేకమతాలు, భిన్న సంస్కృతులు, ప్రపంచ నలుమూలల అనేమంది ప్రజలచే ఆరాధించవడే దైవం గణనాధుడు. గణపతి ఆరాధన ప్రజలలో ఐక్యతను పెంచుతుంది. సనాతనధర్మంలో అనేకమంది దేవతామూర్తులను చెప్పబడ్డాయి. ఒక్కో దేవతను అనుసరించి, ఆ శక్తిని అనుసరించి, ఆ దేవతార్చనకు అనేకానేక నియమాలు ఉంటాయి. అవి అందరికి సాధ్యమయ్యేవి కావు. కానీ వినాయకుడికి విషయానికి వచ్చేసరికి మాత్రం, ఆయన ఆరాధనకు ప్రత్యేక నియమాలను స్మృతికారులు చెప్పలేదు. ఆయన ఆరాధన అందరు సులభంగా చేయవచ్చని చెప్పారు.

వినాయకుడి ఆరాధన యుగయుగాల నుంచి ఉంది. శివపార్వతుల కల్యాణంలో కూడా ముందు గణపతిని పూజించాకే వివాహక్రతువు మొదలుపెట్టారు. సృష్టిపూర్వం బ్రహ్మదేవుడు కూడా గణపతి పూజించి, విఘ్నాలను తొలగించుకున్నాడు. కానీ అప్పటికి గణపతి నిరాకారుడు. పార్వతీదేవి వరం కోరగా, దాన్ని తీర్చడం కోసం శ్వేతవరాహకల్పంలో గజముఖుడిగా గణపతి రూపాన్ని స్వీకరించారు. ఏనుగుతల ఉన్న గణపతి రూపం ఈ కల్ప ప్రారభంలో జరిగిన చరిత్రకు గుర్తు.

ఈ వినాయకుడే హిందూసామ్రాజ్య స్థాపన చేసిని మరాఠాలకు ఇలవేల్పు. అందుకే ఇప్పటికి మహారాష్ట్రలో వినాయక భక్తులు ఎక్కువ. మరాఠీ ప్రాంతంలో గణాపత్యం అధికంగా ఉంది. గణపతి ఆరాధాన ఏమి చేస్తుంది అని ప్రశ్న వేసుకుంటే అది జనం మధ్య ఐక్య్తను తీసుకువస్తుందని చెప్పాల్సి ఉంటుంది. గణపతి ఆరాధాన వలన కుటుంబసభ్యులలో మైత్రి, స్నేహభావం పెరుగుతాయి. అదే దేశమంతా చేస్తే? అక్కడా అదే ఫలితం కనిపిస్తుంది. అందుకే గణపతి ఆరాధకులైన మరాఠాలు తన వీరత్వంతో భారతదేశ సరిహద్దుల్ని ఆఫ్ఘనిస్థాన్ వరకు విస్తరించి, అఖండభారతం కోల్పోయిన అనేక ప్రాంతాలను అందులో తిరిగి చేర్చగలిగారు. కానీ అటు తర్వాత కూడా ఆంగ్లేయుల కుట్ర కారణంగా భారతీయ సమాజం విఛ్ఛినం అయ్యింది. హిందువుల్లో ఏర్పడిన బేధభావాలు కూడా స్వాతంత్రపోరాటానికి అడ్డంకిగా మారాయి. దాన్ని గమనించిన బాలగంగాధర్ తిలక్ గారు కూడా హిందువుల్లో ఐక్యత కోసం వినాయకుడినే ప్రాతిపదిక చేసుకున్నారు. గణపతి ఉత్సవాలను సాముహికంగా నిర్వహించడం ప్రారంభించింది వారే. వారి ఆలోచన ఫలించింది. ఒక పక్క భక్తిభావం పెరిగింది, ధర్మజాగరణ జరిగింది, ప్రజల మధ్య బేధభావలు తగ్గాయి. వినాయక ఉత్సవాల్లో కోసం బయటకు వచ్చిన ప్రజలకు నాయకులు దేశభక్తిని ప్రసంగాల ద్వారా అందించారు. అది స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించింది.

అయితే ఈ తర్వాత కూడా ఇది అవసరమా అని కొందరి సందేహం. కొందరేమో ఇప్పుడు పోటీ పెరిగి ఎక్కడపడితే అక్కడ గణేశ విగ్రహాలను ప్రతిష్ఠ చేసి నవరాత్రులు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజం లేదు. గణేశరాత్రి ఉత్సవాలు స్వామి అనుగ్రహం లేకపోతే జరగవు. అందరికి భక్తి లేకపోవచ్చు, కానీ కేవలం పోటీ వల్లనే జరుగుతున్నాయనడం తప్పు. పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం చెప్తూ 'కులమతాలకు అతీతంగా సకల జనుల చేత వేదమంత్రాలు చదివించుటకు గణపతి వీధుల్లోకి వస్తాడు' అని అన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ధనికపేద, కులమత బేధాలకు తావు లేకుండా ఈ ఉత్సవాల పేరిట గణపతి అందరిని ఒక చోటుకు తీసుకువస్తున్నాడు. అందరి చేత పూజలు చేయించుకుంటూ, అందరికి విద్యాబుద్ధులను ప్రసాదిస్తున్నాడు. ఎంతో నియమనిష్ఠలతో ఆలాయాల్లో పూజలు చేస్తుంటే, వీధుల్లోకొచ్చిన గణపయ్య, మాములు నియమాలకే సంతసించి వరాలు కురిపిస్తున్నాడు. ఏ కారణంతో గణపతిని పూజించినా, వారిపై అనుగ్రహాన్ని వర్షించి, క్రమంగా భక్తి భావన కలిగిస్తున్నాడు. గణపతిని వీధుల్లోకి లాగడం కాదు, సనాతనధర్మాన్ని రక్షించడానికి గణపతే వీధుల్లోకి వస్తున్నాడు. అందుకే ఈయన కేవలం వరసిద్ధి గణపతే కాదు, సార్వజనీనగణపతి కూడా. గణపతి అందరివాడని నిరూపించుకుంటున్నాడు. వీధుల వెంట అనేక మండపాలను ఏర్పరిచి గణపతి పూజించినా, ఈ సంప్రదాయం దేశనలుమూలల వ్యాపించినా, అది ధర్మక్షేమం, లోకక్షేమం కోసమే.

Wednesday 16 September 2015

గణేశ చతుర్థీ నియమాలు

వినాయక చవితి గురించి చెప్తూ ప్రాతః శుక్లతిలైః స్నాత్వా మధ్యాహ్నే పూజయేన్నృప అని బ్రహ్మాండపురాణ అంటున్నది. అనగా వినాయక చవితి రోజున ప్రాతః కాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసి, మధ్యాహ్నం సమయంలో గణపతిని పూజించాలి అని. ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి గంటన్నర సమయం ముందు. ఆ సమయంలో తలపై తెల్లని నువ్వులు ధరించి స్నానం చేయాలి. మధ్యాహ్న సమయం వరకు ఉపవసించి, అటు తర్వాత గణపతిని పూజించాలి. మద్యాహ్నసమయం అంటే 12 అనుకోనవరసరంలేదు. 10 గంటల తర్వాతి నుంచి దాన్ని మద్యాహ్న సమయంగానే చెప్పడం కొన్ని గ్రంధాల్లో కనిపిస్తుంది. ఈ పూజలో భాగంగా గంధము, పువ్వులు, అక్షతలు  కలిసిన గరికపోచలు సమర్పించాలి. కుటుంబసభ్యులంతా కలిసి పూజించడం శ్రేష్టం. అది కుదరని పక్షంలో, ఎలా వీలైతే అలా పూజించాలి.

భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను వివరించారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. ఒకవేళ గణపతి ప్రతిమ అందుబాటులో లేకపోతే, మట్టిబెడ్డను పూజించినా, అది కూడా లేనిపక్షంలో చిన్న పసుపు ముద్దూలోకైనా గణపతి ఆవహన చేసి యధాశక్తి పూజించాలి. గణపతి శాపం కారణంగా ఈ రోజున చంద్ర దర్శనం చేసుకోకూడదు. గణపతి జన్మవృత్తాంతం, చంద్రునికి శాపం, శమంతకోపాఖ్యానం వినాలి, లేక చదివి, అక్షతలు తలపై ధరించాలి.

భాధ్రపద శుద్ధ చవితి నాడు పూజించే గణపతికి వరసిద్ధి గణపతి అని పేరు. వరములను సిద్ధిమజేసేవాడు ఈయన. కోరినవన్నీ ఇచ్చేస్తాడు. కావల్సింది గణపతి పట్ల భక్తి, ప్రేమ, ధర్మనిష్ఠ. ఈ రోజు గనక గణపతిని యధాశక్తి పూజించి, ఆయన అనుగ్రహం పొందితే, జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు.

సాధ్యమైనంతవరకు ఓం శ్రీ గణేశాయ నమః అనే గణపతి మంత్రాన్ని జపించాలి.

ధృక్ పంచాంగం ప్రకారం రేపు మద్యాహ్న గణేశ పూజా సమయం - హైద్రాబాదు వారికి - ఉదయం 10.58 ని|| నుంచి 01.23 ని|| వరకు.
మీ ప్రాంతాల్లో గణపతి పూజా సమయం కోసం ఈ లింక్ లో తెలుసుకోవచ్చు.
http://www.drikpanchang.com/festivals/ganesh-chaturthi/ganesh-chaturthi-date-time.html

గతేడాది, అంతకముందు సంవత్సరాలు ప్రచురించిన అనేక విషయాలను ఈ లింక్ లో చూడవచ్చు లేదా వినాయక చవితి లేబుల్ లో చూడవచ్చు.
http://goo.gl/6ADYw6

Sunday 13 September 2015

హిందూ ధర్మం - 175 (ఛంధస్సు - 3)

భూమ్యాకర్షణ పరిధిలోగానీ, అంతరిక్షంలో కానీ నీరు లేదనుకుందాం. ఇక మిగిలింది సూర్యమండంలం, నక్షత్ర మండలం. సూర్యునిలో మనకు అప్పుడప్పుడు కొన్ని మచ్చలు కనపడుతుంటాయి. సూర్యగోళంలో హైడ్రోజన్, హీలియం వాయువుల ఘర్షణల వల్ల, హీలియం హైడ్రోజన్ గా మారే క్రమంలో వెలువడే రేడియోధార్మిక శక్తి వల్ల ఎగిసిపడే పెద్ద పెద్ద మంటలవి. ఈ మంటలే మనకు మచ్చలుగా కనిపిస్తుంటాయి. గ్రహణం సమయంలో వీటిని గమనిస్తారు. ఇవి కూడా ఎల్ల కాలం ఉండవు. కొంతకాలం ఉండి మాయమవుతుంటాయి. వీటిని సన్‌స్పాట్స్ అంటున్నారు. ఈ సన్‌స్పాట్స్‌లో జరిగే మార్పులు భూవాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి కారణంగా కూడా తుఫానులు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయి. అనగా సూర్యునిలో జరిగే మార్పులకు, భూమికి సంబంధం ఉన్నదని స్పష్టమవుతోంది. వీటిని సరి చేయడం ద్వారా ప్రాకృతిక ఉపద్రవాల నుంచి భూమిని, భూవాతావరణాన్ని రక్షించడం కోసం ఋషులు మనకు కొన్ని రకాల యజ్ఞప్రక్రియలను అందించారు. వాటిలో సప్తఛంధస్సులలో చివరిదైన జగతీ ఛంధస్సు కలిగిన మంత్రాలను పఠిస్తారు. ఇవి పఠించడానికి పట్టే సమయం చాలా ఎక్కువ. హోమగుండం కూడా భారీగా ఉంటుంది. అందువల్ల అందులో నుంచి యజ్ఞాగ్ని కూడా ఉధృతంగా ప్రజ్వరిల్లుతుంది. అటువంటి అగ్నిలో వేయబడిన హవనసామగ్రిలోని మూలికలు, ఇతర ద్రవ్యాలు అతి సూక్ష్మాణువులుగా విడిపోయి, తేలికపడి సూర్యమండలాన్ని కూడా చేరుతాయి. దాంతో అక్కడ ఏర్పడిన మచ్చల వల్ల సంభవించే విపత్తులను నివారించవచ్చు. అందుకే యజుర్వేదం జగతీఛంధస్సు, సూర్యుడిని, నక్షత్రలోకాలను వశపరుచుకుంటుందని చెప్తోంది.

సాధారణ యజ్ఞంలో వేయబడిన ఆవునెయ్యి, ఇతర సామగ్రి, సూక్ష్మీకరించబడి భూఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పై వరకు వెళుతుంది. అక్కడకు చేరు 10 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి, ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందులో మంత్రం కీలకపాత్ర పోషిస్తుంది. రాకెట్‌ను అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టాడానికి, దాన్ని కేవలం ప్రయోగించి ఊరుకోరు. రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ, కంప్యూటర్ల ద్వారా దానికి ఆదేశాలు పంపిస్తుంటారు. అట్లాగే యజ్ఞంలో కూడా. యజ్ఞంలో ఆహుతివ్వబడినవి అణువులుగా మారి, అంతరిక్షాన్ని చేరి, నిర్దేశిత ప్రయోజనాన్ని కలిగంచేందుకు వీలుగా, వాటి గతిని నిర్దేశిస్తుంది మంత్రం. మంత్రం యొక్క తరంగాలకు అంత శక్తి ఉంది. అవి కేవలం మర్త్యలోకన్నే కాదు, అనేకానేక ఇతర లోకాలను సైతం ప్రభావితం చేస్తాయి. ఇందులో ఛంధస్సు ప్రధానం. ఏదో మామూలుగా మంత్రం పఠిస్తే సరిపోదు. మంత్రాన్ని ఛంధోబద్ధంగా చదవాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. ప్రయోగశాలలో ఒక వాయువును ఉత్పత్తి చేయటానికి కొన్ని నిర్దేశిత పద్ధతులను పాఠిస్తారు రసాయనశాస్త్ర విద్యార్ధులు. ఎలా పడితే అలా, ఎప్పుడంటే అప్పుడు రసాయనాల కలపరు. దానికి నిర్దేశిత పరిణామం ఉంటుంది. రసాయనచర్య జరగడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు వేచి ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలం కనపడుతుంది. యజ్ఞంలో కూడా అంతే. దానికి ఛంధస్సు ఉపయోగపడుతుంది.


To be continued ......................

ఈ రచనకు సహాయపడిన గ్రంధం: శ్యాం ప్రసాద్ గారు రాసిన 'రండి,మన భూగోళాన్ని కాపాడుకుందాం, యజ్ఞం ద్వారా.' 

Saturday 12 September 2015

రామకృష్ణ పరమహంస సూక్తి


ప్రణవస్వరూపం ఫనిరాజభూషం - గణపతి భజన

ప్రణవస్వరూపం ఫణిరాజభూషం - గణపతి భజన - గణపతి సచ్చిదానందస్వామి

ప్రణవస్వరూపం ఫణిరాజభూషం
అణిమాదిసిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం

ప్రణవస్వరూపం ఫనిరాజభూషం
అణిమాదిసిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం

గణరాజ యోగిగణ వంద్యాపాదం
ప్రణమామి గిరిజా శివనంద నందనం

గణరాజ యోగిగణ వంద్యాపాదం
ప్రణమామి గిరిజా శివనంద నందనం

ప్రణవస్వరూపం ఫణిరాజభూషం
అణిమాదిసిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం

గణరాజ యోగిగణ వంద్యాపాదం
గణరాజ యోగిగణ వంద్యాపాదం
ప్రణమామి గిరిజా శ్రీ సచ్చిదానంద
శ్రీ సచ్చిదానంద .............

ప్రణవస్వరూపం ఫణిరాజభూషం
అణిమాదిసిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం

ప్రణవస్వరూపం ఫణిరాజభూషం
అణిమాదిసిద్ధిప్రద శ్రీ విఘ్నరాజం
శ్రీ విఘ్నరాజం ........ శ్రీ విఘ్నరాజం .......... 

Thursday 10 September 2015

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం - గణపతి భజన

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం - గణపతి భజన - శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం
నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం
ముద్గలాది సేవితం భజేమతం గణేశ్వరం

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం
సుందరం సిద్ధిబుద్ధి సుందరేశ నందనం
సుందరం సిద్ధిబుద్ధి సుందరేశ నందనం
భక్తబంధ మోచనం సర్పసూత్రబంధనం

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం
మూషికావాహనం సకలలోక వీక్షణం
అర్కరూపధారిణం ఆదిశక్త్యావరణం
అర్కరూపధారిణం ఆదిశక్త్యావరణం

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం
ముద్గలాది సేవితం భజేమతం గణేశ్వరం

రక్తవర్ణ రూపిణం విరక్తలోక భావితం
రక్తవర్ణ రూపిణం విరక్తలోక భావితం

ఆత్మవిద్యా ధారిణం నందసచ్చిదనందనం
ఆత్మవిద్యా ధారిణం నందసచ్చిదనందనం

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం
ముద్గలాది సేవితం భజేమతం గణేశ్వరం

నాయకం వినాయకం సర్వసిద్ధిదాయకం
ముద్గలాది సేవితం భజేమతం గణేశ్వరం 

Tuesday 8 September 2015

శ్రీ శారదా మాత సూక్తి


పాలయ గణనాధ - గణేశ భజన


పాలయ గణనాధ పరిపాలయ గణనాధ - గణపతి సచ్చిదానంద స్వామి భజన

పాలయ గణనాధ పరిపాలయ గణనాధ
పాలయ గణనాధ పరిపాలయ గణనాధ

పాలయ గణనాధ పరిపాలయ గణనాధ
పాలయ గణనాధ పరిపాలయ గణనాధ

భోదయ తత్త్వం గణనాధ
సంపాదయ తత్త్వం గణనాధ

పాలయ గణనాధ పరిపాలయ గణనాధ

పాతయ యోగం మైనాధ
పరిపాలయ సంవిధ మతనాధ

సాధయ నితరాం ధీశుద్ధిం
మమ బాధయ చాంతరమల వృద్ధిం

పాలయ గణనాధ పరిపాలయ గణనాధ

సత్యం నిత్యం జ్ఞానమనంతం
శాంతం కాంతం సౌఖ్యమఖండం
అచలం ప్రచలం సుచిరం చనవం
తవమమ చైకం తత్త్వం భోధయ

పాలయ గణనాధ పరిపాలయ గణనాధ

దిశమే సౌఖ్యం మరణావధి
అత తత్ సౌఖ్యం చరమావధి
సర్వత్ర చైతన్య దృష్టిం శివాం
శ్రీ సచ్చిదానంద యోగోధ్భవాం

పాలయ గణనాధ పరిపాలయ గణనాధ
పాలయ గణనాధ పరిపాలయ గణనాధ 

Monday 7 September 2015

గణపతి సచ్చిదానంద స్వామి సూక్తి


వారణాస్య వక్రతుండా - గణపతి భజన

గణపతి భజన - శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ

వారణాస్య వక్రతుండా సూర్పకర్ణా పాలయ
హేరంబా చారుహాసా సర్పసూత్ర పాలయ
వారణాస్య వక్రతుండా సూర్పకర్ణా పాలయ
హేరంబా చారుహాసా సర్పసూత్ర పాలయ

ప్రమధనాధ ప్రధమవంద్యా స్కందగురువర వరమతే
రక్తవసన లంబజఠర ఏకదంతా గణపతే
రక్తవసన లంబజఠర ఏకదంతా గణపతే

వారణాస్య వక్రతుండా సూర్పకర్ణా పాలయ
హేరంబా చారుహాసా సర్పసూత్ర పాలయ

క్షిప్రవరదా అర్కలసనా ప్రశ్నగణపతి నామకా
యోగసుగుమా విఘ్నహరణా సర్వలోక వినాయక

వారణాస్య వక్రతుండా సూర్పకర్ణా పాలయ
హేరంబా చారుహాసా సర్పసూత్ర పాలయ

ఆఖువాహన పత్రపూజిత సిద్ధిబుద్ధి ప్రదాయక
గణపతే సచ్చిదానంద సుముఖవికటా పాలయ

వారణాస్య వక్రతుండా సూర్పకర్ణా పాలయ
సూర్పకర్ణా పాలయ .......

హిందూ ధర్మం - 174 (ఛంధస్సు - 2)

యజ్ఞాల్లో ఛంధస్సు ప్రాముఖ్యత - యజ్ఞం అనేది ఏదో మాములు క్రతువు కాదు. దానికి ఒక ఉద్ద్యేశం ఉంది, విధానం ఉంది, ప్రయోజనముంది. ఏ ఫలితాన్ని ఆశించి యజ్ఞం చేస్తున్నామనే దాన్ని అనుసరించి ఛంధస్సును నిర్ణయిస్తారు. భూ ఉపరితలం నుంచి కొంత ఎత్తువరకు గాయత్రి ఛంధస్సు పరిధి, ఆ పొరలో షడ్జః స్వర ప్రభావం, దానిపైన ఉష్ఠిక్ ఛంధస్సు, అందులో రిషభ స్వర ప్రభావం, దానిపైన గాంధార, అలా చివరి పరిధిగా జగతి చంధస్సు, దాని స్వర ప్రభావం ఉంటాయి. వేదపండితుడికి కేవలం యజ్ఞం ఎలా చేయాలనే అవగాహనయే కాక, మేఘమండలం యొక్క పరిస్థితి, యజ్ఞం చేయబడే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితి, పర్యావరణం మొదలైన అనేక విషయాల గురించి అవగాహన ఉంటుంది. ఒకవేళ వర్షం కోసమై యజ్ఞం నిర్వహిస్తుంటే, అక్కడున్న మేఘమండలాన్ని అనుసరించి ఏ ఛంధస్సుతో కూడిన వేదమంత్రాలతో ఆహుతులిస్తూ యజ్ఞం చేస్తే, ఆ ఆహుతి ప్రభావం వల్ల వర్షం కురుస్తుందో పరిశీలించి, ఆ ఛంధస్సునే వాడతారు. అప్పుడు తప్పక వర్షం కురుస్తుంది.


అది ఎలాగంటే ఛంధస్సులో మొదటిదైన గాయత్రి ఛంధస్సులో 24 అక్షరాలుంటాయి. ఇది తక్కువ అక్షరాలు గల మంత్రం. దీన్ని చదవడానికి ఒక క్రమపద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చదువుతూ, మంత్రం పూర్తయ్యాక స్వాహా అంటూ ఆహుతులిస్తారు. ప్రతి ఆహుతికి, ఆహుతికి మధ్య మంత్రం చదవటంలో కొంత సమయం పడుతుంది. యజ్ఞం అనేది సామాన్యమైన ప్రక్రియ కాదు. సైన్సు పరిభాషలో చెప్పాలంటే అందులో అనేక రసాయనిక పరిచర్యలు (కెమికల్ రియాక్షన్లు) చోటు చేసుకుంటాయి. అగ్నిలో ఏది పడితే అది ఆహుతి ఇవ్వరు. దానికి శాస్త్రప్రమాణం ఉంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి యజ్ఞం చేస్తున్నామనే దాన్ని అనుసరించి ఏమి ఆహుతు ఇవ్వాలనేది ఉంటుంది. విషయంలోకి వస్తే, ఆహుతులిచ్చిన తర్వాత, ఆ కొద్ది సమయంలో, ఇవ్వబడిన ఆహుతి కొంతవరకు సూక్ష్మీకరింపబడి గాలిలో కలుస్తుంది. పూర్తిగా సూక్ష్మికరించబడి ఉండదు కనుక భూమ్యాకర్షణ శక్తిని మించి పైకి పోలేదు.  ఆకాశంలో ఒక పరిధివరకు మాత్రమే ఈ అణువులు వెళతాయి. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలుండి వాతావరణం తేమగా ఉంటే, గాయత్రి ఛంధస్సుతో కూడిన మంత్రాలతో ఆహుతులివ్వడం చేత వర్షం కురుస్తుంది. (ఎలా జరుగుతుందన్నది కూడా సశాస్త్రీయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు విషయం అది కాదు.) ఈ విషయాన్నే యజుర్వేదం 'పృధివ్యాం విష్ణుర్వ్యక్రసంగ్ గాయత్రేణ ఛంగసా్' - యజుర్వేదం 2-25 అంటున్నది. అయితే ఈ విధంగా నీటి అణువులు భూమ్యాకర్షణ పరిధిలో లేనప్పుడు అంతరిక్ష, ద్యులోకముల నుంచి వర్షం కురిపించే ప్రయత్నం చేయాలి.

ఇందుకోసం వేదపండితుడు త్రిష్టుప్ ఛంధస్సుతో కూడిన మంత్రాలతో ఆహుతులివ్వాలి. ఈ మంత్రాలు 44 అక్షరాలు కలిగి ఉంటాయి. ఆకాశంలో మేఘాలుండవు. మేఘాలు నిర్మించి, అంతరిక్షంలో నుండి (ఇక్కడ అంతరిక్షం అంటే భూమి మొదలు గ్రహాలు మొదలైనవి ఉన్న శూన్య ప్రదేశం కాదు) నీటిని ఆకర్షించి, వర్షం కురిపిస్తారు. దీని కోసం పెద్ద హోమగుండాన్ని నిర్మిస్తారు. దానికి నిర్దేశిత ప్రమాణాలున్నాయి. వాటి గురించి వేదంగామైన కల్పం వివరిస్తుంది. త్రిష్టుప్ ఛంధస్సులో 44 అక్షరాలు ఉన్నందున, ఈ ఛంధస్సు కలిగిన మంత్రాల ఉఛ్చారణకు గాయత్రి ఛంధస్సు మంత్రానికి పట్టిన సమయానికి రెట్టింపు సమయం పడుతుంది. అందుచేత యజ్ఞాగ్ని కూడా రెట్టింపుగా ప్రజ్వరిల్లుతుంది. ఇందులో వేయబడిన ద్రవ్యం అధికసమయం ఖాళీ సమయం దొరకడం వలన, మరింత సూక్ష్మీకరించబడి, సూక్షమైన అణువులుగా విడిపోయి, మరింత తేలికగా మారి, భూమ్యాకర్షణ పరిధిని అంతరిక్షాన్ని చేరుకుంటుంది. దీన్నే యజుర్వేదంలో త్రిష్టుప్ ఛంధస్సు అంతరిక్షాన్ని వశపరుచుకోవటం అన్నారు. అలా అక్కడకు చేరి, నీటి అణువులను ఆకర్షించి మేఘనిర్మాణం చేసి, వర్షం కురిపిస్తుంది.      

To be continued ...........................

సేకరణ: శ్యాం ప్రసాద్ గారు రాసిన 'రండి,మన భూగోళాన్ని కాపాడుకుందాం, యజ్ఞం ద్వార.' పుస్తకం నుంచి 

Saturday 5 September 2015

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

ఓం నమో భగవతే వాసుదేవాయ

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

కృష్ణుడిని దొంగా అంటున్నారు. శ్రీ కృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలో, బృందావనంలో గడిచింది. యశోదానందుల ప్రేమానురాగల మధ్య ఆప్యాయంగా పెరిగాడు కృష్ణుడు. నందుడి ఇంట్లో 1000 ఆవులు ఉండేవి. ఇన్ని ఆవుల నుంచి ఎన్ని పాలు వస్తాయి, ఎంత పెరుగు వస్తుంది, ఎంత వెన్న ఇంట్లో ఉండాలి. ఇంత వెన్న ఇంట్లో ఉంటే ఇక బయటకు వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం కృష్ణుడికేంటి? ఒకవేళ అలా చేశాడే అనుకుందాం, నందుడు బృందావనానికి రాజు. మరి తన కుమారుడు మిగితా ప్రజల ఇళ్ళలో దొంగతనం చేస్తుంటే నందుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? చిన్నప్పుడు మనం అల్లరి చేసినట్టుగానే కృష్ణుడూ చేశాడు. కాలక్రమంలో కృష్ణ భక్తుల ఆయన చేసిన ఒకటి రెండు చిలిపి పనులను భక్తితో బాగా వర్ణించడం మొదలుపెట్టారు. భక్తితో చూసినప్పుడు అది భగవానుడి ఆడిన దివ్యలీల. అంతకుమించి ఆయన దొంగా కాదు, ఆయనకు దొంగతనం చేయవలసిన అవరసము లేదు.

కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి ఆయన్ను చంపడానికి వచ్చి, కృష్ణుడెవరో తెలియక ఆయన వయసున్న మగపిల్లలందరిని చంపేసింది. ఇక ఆయన పెరిగి పెద్దవాడయ్యేసరికి బృందావనంలో ఆయన తప్ప ఆయన వయసు మగపిల్లలు ఎవరూ లేరు. ఉన్నది ఒక్కడే మగపిల్లవాడు, పైగా వాళ్ళ రాజైన నందుడి కొడుకు, మహా సౌందర్యవంతుడు, చిలిపివాడు, చలాకీవాడు. అందువల్ల అందరిచే ప్రేమించబడ్డాడు. అందరు ఆయన్ను ముద్దు చేశారు, గారాభంగా చూశారు. అదే చనువుతో కృష్ణుడు అందరి ఇళ్ళలోకి వెళ్ళి పాలు, పెరుగు తిన్నాడు. బృందావనంలో తన వయసు మగపిల్లలు ఎవరు లేకపోవడంతో ఆయన ఆడపిల్లలతోనే ఆడుకోవలసిన పరిస్థితి. అందుకే ఆయన గోపికలతో ఆడుకున్నాడు (రాసలీల కాదు). వాళ్ళతోనే కలిసి తిరిగాడు. స్నానం చేస్తున్న గోపికల చీరలను ఎత్తుకోపోయాడు, ఇదేనా మీ దేవుడి వ్యక్తిత్వం అంటూ విమర్శించే వారున్నారు. 7 ఏళ్ళు కూడా లేని పసిపిల్లవాడిని పట్టుకుని, అతనిలో అశ్లీలభావాలున్నాయని చెప్పడం ఎంతవరకు తార్కికంగా, సమంజసంగా  ఉంటుంది. అది ఆలోచించకుండా కృష్ణుడిని విమర్శించేవారు మూర్ఖులు మాత్రమే. రాసలీల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిన అంశం. అక్కడ శరీరాలు ఉండవు. జీవాత్మ, పరమాత్మ మాత్రమే ఉంటారు. జీవాత్మతో పరమాత్మ ఆడే దివ్యలీలనే రాసలీల. ఆ స్థాయిలో జీవుడిని స్త్రీగా, పరంధాముడిని పురుషుడిగా సంబోధిస్తారు.  ఇదంతా భౌతికస్థాయిలో బ్రతికేవారికి ఎప్పటికి అర్దం కాదు.

ఇదంతా కృష్ణుడికి 7 ఏళ్ళ వయసు వచ్చేవరకు మాత్రమే జరిగింది. ఆయన 7 ఏళ్ళ వయసు రాగానే సాందీపాని మహర్షి వద్ద చదువుకోవడానికి వెళ్ళాడు. ఆ కాలంలో విద్యాభ్యాసం కనీసం 12 సంవత్సరాలు. విద్యాభ్యాసం ముగియగానే మళ్ళీ బృందావనానికి రాకుండా నేరుగా మధురకు వెళ్ళిపోయాడు. తర్వాత రుక్మిణీ దేవితో వివాహం జరిగింది. వివాహం తర్వాత రుక్మిణి దేవితో కలిసి బధ్రీనాధ్ వెళ్ళి ఒక ఋషి దగ్గర 8 ఏళ్ళ పాటు ఆశ్రమవాసం చేశారు. కఠోరబ్రహంచర్య నియమాలతో, భూశయనం చేస్తూ గడిపారు. ఎలా చూసిన కృష్ణుడు గోపికలతో కలిసి ఆడుకున్నది ఆయనకు 8 ఏళ్ళు రాకముందు, పసిపిల్లవాడిగా. 8 ఏళ్ళ పిల్లవాడు ఆడిన ఆటను రాసలీల అని భక్తులు పవిత్రభావనతో అంటే, కొందరు ఇదే విషయాన్ని పెట్టుకుని ఆయనకు గోపికలతో శారీరిక సంబంధం ఉన్నదని దుష్ప్రచారం చేస్తున్నారు. హవ్వ!................. 8 ఏళ్ళ పిల్లవాడి మీద ఇన్ని అపనిందలా? పరమపురుషుడైన శ్రీ కృష్ణుడి శీలాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి ఇటువంటి విషయాలు. ఆఖరికి హిందువులు కూడా ఎవరైనా రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల బ్రతుకును నాశనం చేస్తే, ఈయన కలియుగ కృష్ణుడంటారు.కృష్ణుడు పరమధర్మాత్ముడు, కృష్ణుడిని విమర్శించే స్థాయి మనకు లేదు. కృష్ణుడుని విమర్శించే ముందు ఇవి కాస్త గుర్తుంచుకోండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ  

Originally Published: 27-Aug 2013
1st Edit: 5-sep 2015

గీతా సూక్తి


Friday 4 September 2015

శ్రీ కృష్ణాష్టమి

5-9-2015, శనివారం, శ్రావణ బహుళ అష్టమి, శ్రీ కృష్ణాష్టమి.

5242 ఏళ్ళ క్రితం, కారుమబ్బులు కమ్ముకునే వర్షఋతువులో శ్రావణమాస బహుళ ఆష్టమి వేళ రాత్రి 12 గంటల సమయంలో దేవకీవసుదేవుల 8 సంతానంగా మధురలో కారాగారంలో అవతరించారు శ్రీ కృష్ణ పరమాత్మ. శ్రీ కృష్ణ పరమాత్మ జాతక చక్రంలోని గ్రహగతులని ఆధారంగా చేసుకుని ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకోవలసి వస్తే క్రీస్తు పూర్వం 3228, 21 జూలైన అవతరించారు. ద్వాపరయుగాంతంలో ఈ భూమి పైన నడయాడిన యుగ పురుషుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక సందేశం.

నారయణుడు, నారాయణి(పార్వతీ దేవి) అన్నాచెళ్లెలు. ఇద్దరు ఎప్పుడూ కలిసే జన్మిస్తారు. కృష్ణుడు ఇక్కడ మధురలో దేవకివసుదేవులకు జన్మిస్తే, పార్వతీదేవి యోగమాయగా యశోదా నందులకు అదే సమయంలో జన్మించింది. తాత్వికంగా అర్దం చేసుకుంటే మధుర అంటే మంచి ఆలోచనలున్న మనసు. అటువంటి మంచి, పవిత్ర ఆలోచనలున్న మనసులు కలవారికి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడని అర్దం. ఆయన పుట్టగానే వసుదేవుడి కాళ్ళకు, చేతులకున్న సంకెళ్ళు తెగిపొయాయి. పరమాత్మ దర్శనం కలిగితే కర్మబంధాలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్తుంది ఈ సంఘటన. కంసుడి కోటలో ఉన్న అందరిని మాయ కమ్మి స్పృహ కోల్పోయారు.

ఆయన్ను వసుదేవుడు యమున దాటించి రేపల్లెకు చేర్చాలి, కాని యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం ఆగదు.ఆగకూడదు. అందులోనా యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే. అటువంటి యమున, వసుదేవుడు పసి కందైన శ్రీ కృష్ణునితో పాటు దాటడానికి మార్గం ఇచ్చింది, తన ప్రవహాన్ని ఆపివేసింది, అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లోబడి ఉంటుందని,ఆయన కనుసన్నల్లో కాలం కూడా ఉంటుందని అర్దం చేసుకోవాలి. అంతేకాదు, నదిని సంసారానికి సంకేతంగా భావిస్తే, ఎవరు తమ నిత్య జీవితంలో పరమాత్ముడిని గుండేల్లో పెట్టుకుంటారో, వారు ఈ సంసారమనే మహాప్రవాహాన్ని సులువుగా దాటగలరని అర్దం. భగవంతుని నమ్మకుని ముందుకు నడిచేవారి జీవితం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది చెప్తుందీ ఘటన. కృష్ణుడు రేపల్లెకు చేరాడు. రేపల్లేలో జనం అమాయకులు, భగవద్భక్తి కలవారు, శాంతస్వభావులు. ఎక్కడ ప్రజలు ధర్మ మార్గంలో జీవిస్తూ పరోపకార బుద్ధితో బ్రతుకుంతుంటారో అక్కడికి పరమాత్మ తానే వెళతాడని అందులో అంతరార్ధం. ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ

Originally Published: Sri Krishnasthami
1st Edit: 16-08-2014
2nd Edit: 05-09-2015

Tuesday 1 September 2015

అంగారక చతుర్థి కధ

ఓం గం గణపతయే నమః

సప్త మోక్ష పురాలలో ఒకటైన అవంతికాపురి (ఉజ్జయిని,మధ్యప్రదేశ్ లో ఉంది) లో నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు, సమస్త శాస్త్రకోవిదుడు, వేదస్వరూపుడైన భరద్వాజముని నివసిస్తుండేవారు. గంగా తీరానికి వెళ్ళి 3 సంధ్యలలోనూ సంధ్యావందనం, అనుష్ఠానం మొదలైనవి నిర్వర్తించేవాడు.

ఒకనాడు భరద్వాజ మహర్షి ఉషోదయాన అనుష్ఠానం నిర్వర్తించుకుని తిరిగి వస్తుండగా, గంగా తీరంలో విహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస ఆతన దృష్టిలో పడింది. ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించిందంటే మహతప్పశాలి, అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షిని విచలితుణ్ణి చేసింది.

ఆ అప్సరస కారణంగా భరద్వాజుడికి రేతస్సు (వీర్యము) పతనమై భూమిపైన పడింది. (స్వేదం (చెమట) పడిందని అని కొందరు అంటారు. ఏది ఏమైనా కధ తెలుసుకోవడంలో ఇది అడ్డంకి కాకుడదు.) ఒక కారణజన్ముడు జన్మించాలి కనుక,భూమాత దానిని స్వీకరించింది. తద్వారా ఒక ఆజానుబాహుడు, ఎర్రని దేహకాంతి కలవాడు, విశాలమైన నేత్రాలు గల బాలకుడు ఉదయించాడు.

తన జన్మకు మహర్షి కారణమని తెలియని ఆ బాలుడు నిరంతరం తల్లిని తన తండ్రి ఎవరని వేధించేవాడు. తగిన సమయం వచ్చినప్పుడు, తెలియజేయాలని అనుకున్న భూదేవి మౌనంగా ఆ బాలుని పెంచసాగింది. 7 సంవత్సరముల వయసులో ఆ బాలకుడిని తీసుకుని, భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళిన భూదేవి "మహర్షీ! నీ కారణంగా ఈ బాలుడూ జన్మించినందున, ఇతడిన పుత్రుడుగా పరిగ్రహించు. చౌలము, ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి, అమోఘ విద్యాప్రాప్తి కలిగించు" అని ఆ కూమారుని అప్పగించింది.

సాక్షాత్ భూదేవి తనకు అప్పగించిన పుత్రుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నాడు భరద్వాజుడు. ఉపనయనాది సంస్కారాలు యధావిధిగా జరిపించి, గణపతి మహామంత్రమును ఉపదేశించాడు. "నాయనా! ఈ గణేశ మంత్రాన్ని స్వామి ప్రీతికొరకు జపించి ఆయన అనుగ్రహం పొంది, నీ జన్మ ధన్యం చేసుకో!" అని చెప్పాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు నర్మదా నది తీరాన కఠోర తపస్సు చేశాడు. ఒకానొక మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థీ (చవితి) దినాన చంద్రోదయ వేళలో "ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేస్తాడో, ఎవరి ఆజ్ఞతో విష్ణువు స్థితికారకుడిగా రక్షిస్తాడో, ఎవరి ఆజ్ఞతోనే పరమశివుడు లయం చేస్తాడో, ఎవరి అనుగ్రహం వలన యోగులు, సిద్ధులు సిద్ధిని పొందారో, ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరంగా ఉంటాడో, అట్టి పరబ్రహ్మ అయిన మాహా గణపతి" ఆ బాలునకు దర్శనమిచ్చాడు. సర్వాభరణ భూషితుడైన గజానన మహారాజును ఆ బాలుడూ స్తూతించాక, గణపతి ప్రసన్నుడై "కుమారా!.........కోఠరమైన నీ తపోదీక్షకు మెచ్చి నీకు వరం ఇవ్వదలచాను. ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు.

"గణనాధా! నీ దర్శనమాత్రాన నా జన్మ చరితార్ధమైంది. నాకు కోరికలు ప్రత్యేకంగా ఏమీ లేవు. నేనూ దేవతాగణాలలో ఒకడిగా ఉండేలా అనుగ్రహించు. చాలు!" అన్నాడు ఆ బాలుడు.

"నీవు నిరపేక్షతో నన్ను ప్రసనున్నుణ్ణి చేసుకునందుకు నీకు వారాలలో ఒక రోజుకు ఆధిపత్యం ఇస్తున్నా. నీకు గ్రహాలలో స్థానం కల్పిస్తాను. నేటి నుంచి నీవు "మంగళుడు" అనే పేరుతో ప్రసిద్ధుడవవుతావు. అనగా ప్రజలకు "మంగళాలను" (శుభాలను) కలిగించే వాడవు. నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా "చవితి తిధి" ఏర్పడితే, ఇంకా ఎక్కువ పుణ్యఫలదాయకం అయ్యేలా అనుగ్రహిస్తున్నాను. భూదేవి పుత్రునిగా నీవు "కుజుడు"అనే పేరుతో వ్యవహరించబడతావు" అని అనుగ్రహించాడు గణపతి.

అనంతరం దశభుజ గణపతిని, కుజుడు కామదాతృక్షేత్రంలో ప్రతిష్టించి తన పేరిట అంగారక చవితి వ్రతాన్ని చేసినవారికి సర్వసౌఖ్యాలు ఓనగూడెలా దీవించమని విఘ్నరాజును ప్రార్ధించాడు. చింతితమైన (కోరిన) అభీష్టాలను (కోరికలను) మణివలె ప్రసాదించేవాడైన ఈ గణపతిని చింతామణి గణపతి అంటారు .నేటికి కామాదాతృ క్షేత్రంలో చంద్రోదయ సమయంలో సిద్ధులు,యోగులు,గంధర్వులు గణపతిని సేవిస్తుంటారు.          

ఇదండీ అంగాకర చతుర్థీ కధ.         

చిత్రంలో ఉన్నది శ్రీ చింతామణి గణపతి స్వామి. భక్తులపాలిట చింతామణియై సర్వాభీష్టాలు తీరుస్తున్నాడు.

ఓం చింతామణి గణపతయే నమః

Originally Published: 1st Jan 2013
Will be Republished on every angaraka chaturthi

స్వామి సచ్చిదానంద సూక్తి