Wednesday 31 January 2018

Tuesday 30 January 2018

Monday 29 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (8 వ భాగము)



సతతము మా భద్రగిరి - స్వామి రామదాసుడైన
ఇతర మతములనియేటి - వెతల వేటికే మనసా ||

మతములు అంటే ఆలోచనలు. వెతలు అంటే కష్టాలు. మోక్షం పొందడానికి, లేదా తరించడానికి ఎంతో ఆలోచించి, కష్టపడటమెందుకు? ఆ సాధన చేయాలి, ఈ సాధన చేయాలి, అన్ని గంటలు ధ్యానం చేయాలి, ఇన్ని గంటలు జపం చేయాలని ఇతర కష్టమైన మార్గాలను పట్టుకోవడమెందుకే మనసా. ఎల్లప్పుడూ మా భాద్రాచల శ్రీ రామునికి దాసుడవై ఉండిపో. అది ఒక్కటి చాలు. అంటే స్వామిని నీ ప్రభువుగా భావించు. దాసుడు, ప్రభువు చెప్పిన మట తప్ప అన్యమైనది వినడు, ప్రభువు చెప్పిన దారిలో తప్ప వేరే మార్గంలో నడవడు. అతనికి అతని ప్రభువు చెప్పిందే వేదం. అలానే నీవు ఆ భద్రాచల శ్రీ రామచంద్రునికి దాసుడవైపో. ఇది ఎంతో సులభమైన మార్గము. కోపం, ఆవేశం, ఈర్ష్యా, అసూయ, ద్వేషము, పరనింద, దోషాలు ఎంచడం వంటి దుర్గుణాలు ఎన్నో ఉన్నాయి. వాటికి దాస్యం చేయడం మానుకో. తిరగబడు. మన భద్రాచల రాముడు సామాన్యుడు కాడు. సకల గుణాభిరాముడు. ఈయన వైకుంఠ రాముడు. ఎక్కడైనా రాముడు ధనుర్బానాలతో ఉంటాడు. కానీ భద్రాచలంలోని రాముడు శంఖుచక్రాలను కూడా ధరించి ఉన్నాడు. ఈయన సాక్షాత్తు వైకుంఠం నుంచి భద్రగిరికి దిగివచ్చిన వైకుంఠ రాముడు. ఈయన్ను పట్టుకుంటే, నేరుగా వైకుంఠానికే తీసుకెళతాడే.

మానవుడు ఎలా జీవించాలో మన రాముడు చూపించాడు. ఆయనకు దాస్యం చేయడమంటే, ఆయనలోని గుణాలను మనలో పెంపొందించుకోవడం, ఆయన నడిచిన మార్గంలో నడవడం, ధర్మాన్ని రక్షించడం. అలా నిత్యం రాముని మార్గంలో నడువు. వేరే ఆలోచనలు పెట్టుకోకు. నేను చాలా సులభమైన మార్గం చెబుతున్నాను.

ఇవన్నీ చేస్తూ ఆ శ్రీ రాముని దివ్యనామాన్ని స్మరిస్తూ ఉండు. కఠినమైన తపస్సులను కోరవలసిన పనిలేదు. అన్నీ తీరి, మరణానంతరం ఆ రామునిలో ఐక్యమవుతామంటూ ఈ ఒక్క కీర్తనలోనే శ్రీ రామదాసుగారు ఎంతో తత్త్వాన్ని నింపి అందించారు.

ఇదంతా రాయడానికి ప్రేరణ కలిగించిన ఆ రామునికి, నా గురువుకు నమస్కరిస్తూ, సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.

Sunday 28 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (7 వ భాగము)


అతిథి వచ్చి యాకలన్న - అన్నమింత నిడిన చాలు
క్రతువు సేయవలెననే - కాంక్ష యేటికే

పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి, పూజలు చేయాలి, లేకపోతే అన్నదానం చేయాలనే కోరికలు ఎందుకు? నీ ఇంటికి వచ్చి ఆకలిగా ఉందన్నవాడికి కొద్దిగా అన్నం పెట్టు చాలు అంటున్నారు రామదాసుగారు. అంటే పూజలను, క్రతువులను ఆయన నిరసించట్లేదు, వాటిని తక్కువ కూడా చేయడంలేదు. సమస్త క్రతువులు, ఉపాసనలు మనకు నేర్పేదిమిటి? సర్వజీవుల్లో భగవంతుడిని చూడటం, సర్వజీవుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం, వారి బాధను మన బాధగా భావించడం. అదేలేనప్పుడు, ఎన్ని ఉపాసనలు చేస్తే ఏం లాభం? నీవు చేసే ప్రతి పని, నీలో దివ్యప్రేమను పెంచాలి. అలా చేయడంలో మొదటి అడుగు, పక్కవాడి బాధను నీ బాధగా భావించి, తోచిన సాయమందించడం.

నేను సర్వజీవుల్లో వైశ్వానరునిగా ఉండి, నాలుగు విధములుగా తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేస్తున్నానని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. సర్వజీవుల్లో ఉండే ఆకలి భగవంతుడే. అంతేకాదు, ఆకలిని వైశ్వానరాగ్ని అని కూడా అన్నారు. 
యా దేవీ సర్వభూతేషు క్షుదా రూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 
అని దేవీ భాగవతం కూడా చెబుతోది. సర్వజీవుల్లో ఆకలి రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు అని అర్ధము. అంటే ఆకలితో నీకు ఎవడైనా కనిపిస్తే, అది నీ భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే ఆకలి రూపంలో వానిలో భగవానుడు వ్యక్తమవుతున్నాడు. వానికి ఏ కొంచం ఆహారం పెట్టినా, అది నేరుగా భగవానునికే చెందుతోంది. అది కూడా అగ్నికి సమర్పించడమే. అంటే యజ్ఞం చేయడంతో సమానం కదా. ఇది ఎంతో సులభమైన మార్గము. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. నీవు వండుకునే దాంట్లోనే ఇంకొకరి కొంచం పంచి పెట్టు. అది చాలే మనసా! అది చేయకుండా పెద్ద పెద్ద పనులు చేస్తానంటావేమిటే?  

కబీర్ గారు ముస్లిం అనే కారణంగా వారిని దేవాలయంలోకి అనుమతించలేదట. అయితే వారు ఆలయం వెలుపలే కూర్చుని, వంట చేసుకున్నారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ కుక్క, వారు కాల్చుకున్న రొట్టె ముక్కను ఎత్తుకుపోయింది. అది చూడగానే కబీర్ గారు, నారాయణ ఆగు. ఒట్టి రొట్టే తింటే బాగుండదు, ఇదిగో ఈ నెయ్యి కూడా రాసుకుని తిను అని దాని వెంటపడ్డారట. అది చూసి, వారిని గుడిలోకి అనుమతించని మిగితావారు తలదించుకున్నారు. నిజమైన భక్తి అలా ఉంటుంది. మౌనంగా, తాను చేసేది చేస్తాడు భక్తుడు. అందరి ఆకలిని తీర్చలేకపోవచ్చు, కానీ నీకున్నదాంట్లో కొందరిదైనా తీర్చు, చాలు. అది కూడా రామునికి ఇస్తున్నాననే భావనతో. అదే రామదాసుగారి ద్వారా రాముడు పలికించాడు. 

ఇంకా ఉంది.... 

హిందూ ధర్మం - 258 (Forbidden Archaeology - 4)



ఎంతో పురాతనమైన రాతి పొరల్లో ఆధునికంగా కనిపించే అస్థిపంజరాల గురించి డార్విన్ శాస్త్రవేత్తలు వింటే, వాళ్ళు ఇలా అంటారు: "ఇందులో రహస్యమేమీ లేదు. కొన్ని వేల ఏళ్ళ క్రితం ఎవరో ఆ ఉపరితలం మీద మరణించి ఉంటారు మరియు అతని మిత్రులు అతడిని, బాగా లోతైన గొయ్యి తీసి పాతిపెట్టి ఉంటారు. దాన్నే మీరు చూసి, ఎంతో పురాతన రాతి పొరల్లో దొరికిన అస్థిపంజరం అంటున్నారు." 

వీటిని సాంకేతికముగా intrusive burial అంటారు. అది జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఈ అంశంలో, Ragazzoni, నిపుణుడైన భూగర్భశాస్త్రవేత్త,  intrusive burial గురించి బాగా తెలిసి ఉన్నాడు. ఒకవేళ నిజంగా అలాగే పాతిపెట్టి ఉంటే, దానిపైన ఉన్న పొరలు కూడా కదలిపోయేవి. కానీ తవ్వకాల సమయంలో అతను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. మిగితా పై పొరలు, ఏ మాత్రం కదలకుండా, చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. అంటే ఆ రాతి పొరలు ఎంత పురాతనమైనవో, ఆ అస్థిపంజరాలు కూడా అంతే పాతవి. అంటే ఈ సంఘటనలో 50 లక్షల సంవత్సరాలన్నమాట.

20 వ శతాబ్దం మొదటి భాగంలో, బెలిజియన్ భూగర్భశాస్త్రజ్ఞుడు A. Rutot, తన దేశంలో కొన్ని ఆసక్తికర పరిశోధనలు చేశాడు. 3 కోట్ల వయస్సు కలిగిన రాతిపొరల్లో ఆయన కొన్ని రాతి పనిముట్లు మరియు ఆయుధాలు కనుగొన్నాడు. కాలిఫోర్నియా బంగారు గనుల విషయంలో నేను చెప్పాను కదా. కొన్నిసార్లు పురాతన వస్తువులను వీక్షించే అవకాశం ఇవ్వరని. కానీ ఇక్కడ మేము పురాతన అవశేషాలు చూడగలిగాము. ఒకసారి నేను కొన్ని పత్రికల ఇంటర్‌వ్యూల కోసం బ్రుస్సెల్స్‌లో ఉన్నప్పుడు, Royal Museum of Natural Sciences కు తీసుకెళ్ళమని నా మిత్రునకు చెప్పాను. ఎందుకంటే అక్కడ Rutot’s collection ఉంటుందేమోనని. అక్కడి మ్యూజియం అధికారులతో మాట్లాడినప్పుడు, ముందు వారికి తెలియదని సమాధానం చెప్పినా, ఆ వస్తువుల గురించి తెలిసిన ఒక పురావస్తుశాస్త్రజ్ఞుని పట్టుకోగలిగాము. కానీ అక్కడి వస్తువులను జనాలకు ప్రదర్శించరు. అతను మమ్మల్ని ఆ మ్యూజియంలోని స్టొర్ రూంకు తీసుకెళ్ళగా, అక్కడే బెల్జియంలో దొరికిన 3 కోట్ల ఏళ్ళ పూర్వం నాటి పనిముట్లు మరియు ఆయుధాలను ఫోటో తీసుకున్నాను. ఇప్పటివరకు professional scientists గురించి చెప్పుకున్నాము. కానీ భూమి పొరల్లో ఉన్న పురాతన మానవ అవశేషాల మీద పరిశోధన చేసిన ఇతర వ్యక్తులకు ఏదైనా ఋజువు దొరికితే, అవి సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురించబడవు కానీ సాధారణ సాహిత్యంలో కనిపిస్తాయి.

Morrisonville అనే పట్టణంలో 1892 లో, Morrisonville Times పత్రికలో ప్రచురించబడిన అలాంటి ఆసక్తికర విషయం ఒకటి చెప్తాను. బొగ్గుపొయ్యిలో వేయడానికి ఒకావిడ పెద్ద బొగ్గు ముక్కను రెండుగా విరచగా, అందులో ఆవిడకు పది ఇంచుల పొడువైన అందమైన బంగారు గొలుసు కనిపించింది. ఆ గొలుసు బొగ్గులో గట్టిగా నిక్షిప్తమై ఉందనడానికి గుర్తుగా బొగ్గు యొక్క రెండు ముక్కలు ఇంకా అతుక్కునే ఉన్నాయి. ఆ వార్తపత్రిక నివేదిక ఆధారంగా ఆ బొగ్గు ఏ గని నుంచి వచ్చిందో తెలుసుకోగలిగాము. Geological Survey of the State of Illinois, ప్రకారం, ఆ గని నుంచి వచ్చిన బొగ్గు వయసు 30 కోట్ల సంవత్సరాలు. అంటే అదే రాష్ట్రంలో దొరికిన మానవ అస్థిపంజరం వయస్సుతో సమానం అన్నమాట.

సైంటిఫిక్ సమాచారం వద్దకు వెళదాము. 1862 లో, The Geologist (volume 5, p 470) అనే  చెప్పిందేమనగా  Macoupin County, Illinois ఉపరితలానికి 90 అడుగుల లోతులో ఒక మానవ అస్థిపంజరం దొరికింది. ఆ నివేదిక ప్రకారం, ఆ అస్థిపంజరం మీద రెండు అడుగుల డట్టమైన, విరగని/చెదరని బలపపుఱాయి ఉంది. Illinois, రాష్ట్రపు ప్రభుత్వ భూగర్భ శాస్త్రజ్ఞుని ప్రకారం నేను తెలుసుకున్నదేమిటంటే, ఆ అస్థిపంజరం కూడా, ఆ బంగారపు గొలుసులాగానే 30 కోట్ల ఏళ్ళ నాటిది. అది కూడా అదే రాష్ట్రంలో దొరికింది.

ఇంకా ఉంది....

Saturday 27 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (6 వ భాగము)



దొరకని పరుల ధనముల - దోచక యుండితే చాలు
గురుతుగాను గోపురము - గట్ట నేటికే మనసా ||

భక్త రామదాసు గారు ఇంకా ఇలా చెబుతున్నారు. నీది కానీ ధనాన్ని, పరుల సొమ్మును దోచుకోకుండా ఉంటే చాలు, నీకు ఎంతో డబ్బు ఉందని చెప్పడానికి గుర్తుగా పెద్ద ఆలయం కట్టడమెందుకు?

దేవాలయం నిర్మించడమంటే సామన్యమైన విషయం కాదు. ఆలయమంటే ఒక వ్యవస్థ. గుడి కట్టడమంటే శాశ్వతమైన వ్యవస్థను నిర్మించడం. అది ఎంతో పుణ్యం. అంతకంటే పుణ్య కర్మ పురాతన ఆలయానికి జీర్ణోద్ధరణ చేయడం. పాత గుడిని పునఃఅభివృద్ధి చేయడమంటే 100 నూతన ఆలయాలు నిర్మించడంతో సమానమని శాస్త్రం చెబుతుంది. కానీ అలాంటి పుణ్యకర్మను దోచుకున్న సొమ్ముతో నిర్మిస్తే ఏం లాభం? అవినీతికి పాల్పడిన వ్యక్తియే కాదు, అతడి అవినీతి సొమ్ముతో కొన్న దినుసులతో వండబడిన ఆహారం తిన్నవాడికి కూడా ముక్తి లభించదని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. దోచుకున్న సోమ్ముతో అన్నదానం చేస్తే, దానికి సాధువులు, సన్యాసులు హాజరవ్వకూడదని కూడా ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఆ సొమ్ముని యజ్ఞయాగాదుల్లో ఉపయోగించకూడదు. దాన్ని విరాళంగా, దానంగా తీసుకోకూడదు. ఇలా శాస్త్రం దోచుకున్న ధనాన్ని ఎన్నో రకాలుగా నిషేధించింది. అంతెందుకు, ఆ సొమ్మును భగవంతుడు సైతం అంగీకరించడు. దానికి ఉదాహరణ గాలి జనార్ధన్ రెడ్డి. ప్రకృతి సంపద అయిన ఉక్కు విషయలో అక్రమాలకు పాల్పడి, ఆ సొమ్ములో కొంత భాగంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి కిరీటం చేయిస్తే, ఇంతవరకు స్వామి దాన్ని ధరించనేలేదు. ఇక ఆ కిరీటం ఇవ్వడమెందుకు? తాను ఇచ్చానని గొప్పలు చెప్పుకోవటానికే. 

నిజంగా దైవం పట్ల భక్తి, విశ్వాసం ఉన్నవాడు, అడుక్కుతినే స్థితిలో ఉన్నా, పరుల నుంచి రూపాయి కూడా ఆశించడు. ఇతరుల వస్తువుల కోసం ఆశపడడు. పరుల ధనంలో పావలా కూడా తన ధనంలో కలవనీయడు. ఎందుకంటే ఈశ్వరాదేశంతో తనకు వచ్చినది రూపాయయైనా, అదే మహా ప్రసాదంగా భావిస్తాడు. గోపన్నగారు అదే అంటున్నారు. ఇతరుల నుంచి దోచిన ధనం పాపం. అది నిన్ను రాముడి నుంచి దూరం చేస్తుంది. నువ్వా రాముడిని ప్రేమిస్తే, ఆయన్ను చేరుకోవాలనుకుంటే గొప్పగా గుడి కట్టక్కర్లేదు. నీదికాని డబ్బును దోచుకోకుండా ఉంటే చాలు. అదే గొప్ప యోగము. పరుల సొమ్ముని ఆశించి, గుళ్ళూ గోపురలు కడతానంటావేమిటే మనసా!    

ఇంకా ఉంది....

Friday 26 January 2018

ఒక ఆటగా జీవితం- స్వామి సచ్చిదానంద బోధ



Life as a Game

Really healthy people take everything in life as a game. Whether they win or lose, it’s still a game. Often people forget that. In a way, I feel that losing is a better game. Why? When the other person wins, what do you see? A winning face. When you win and the other person loses, what do you see? A losing face. There is great joy in losing and seeing the other person win and have a happy face. Who will be the happiest person? The one who brings happiness to others. That means our minds should be well-balanced under all conditions. That is Yoga.

- Swami Satchidananda

Thursday 25 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (5 వ భాగము)



పరుల హింససేయకున్న - పరమ ధర్మమంతే చాలు
పరుల రక్షింతునని - పల్కనేటికే

ఇదిగో ఇది మనలో చాలామందికి వర్తిస్తుంది. పదిమందిని రక్షిస్తామని, లేదా పదిమందికి మేలు చేసే పనులు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు. రామదాసుగారు ఏమంటున్నారంటే, పరులకు హానీ చేయకుండా ఉంటే, పరులను హింసించకుండా ఉంటే చాలట. అదే పరమధర్మం. ఇతరులను రక్షిస్తానని పలకడమెందుకు?

ఇందులో ఎంత అర్ధముందో చూడండి. సంస్కృత సాహిత్యంలో ఒక సుభాషితం కూడా ఉంది. 
అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం
పరోపకారం పుణ్యాయః పాపాయః పరపీడనం

అష్టాదశ పురాణాలను రచించిన తర్వాత వ్యాసుడు, వాటి సారాన్ని ఈ విధంగా చెప్పాడట, ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం, పరుపలను పీడించడం పాపం అని. 

నిజానికి ఎవరికీ హాని కలిగించకుండా జీవించడమే ఉత్తమ జీవనం. మనం ఎవరిని బాధించకుండా, అపహాస్యం చేయకుండా, రెచ్చగొట్టకుండా, ఈర్ష్యాసూయలు లేకుండా ఉంటే చాలు. ఎవరి జీవితాలు వారివి. మనం ఒకరి జీవితంలో కలగజేసుకోకుండా ఉండటమే చాలు. ఒకరి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకోవడం, మనకు అవగాహన లేని విషయాల్లో చొరబడి వారి సమస్యలకు సలహాలు చెప్పడం కూడా హింసే కదా. అవి మనకు తెలియకుండా ఇతరులను తప్పకుండా నొప్పిస్తాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే చాలు. నిజానికి అందరిని రక్షించేది భగవంతుడే కానీ మీరో, నేనో కాదు. అలాంటిది ఇతరులను రక్షిస్తానని చెప్పడం అహంకారం తప్ప మరేమవుతుంది. 

ఒక చిన్న ఉదాహరణగా భూతాపం సమస్య తీసుకోండి. మానవుల వికృత చర్యల వలన కాలుష్యం పెరిగి, భూవాతావరణం దారుణంగా దెబ్బతింటోంది. రాబోయే ఒక 50-75 ఏళ్ళలో ఈ భూమ్మీద జీవం ఉండటమే ప్రశ్నార్ధకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి, భూమిని ఉద్ధరించడానికి పెద్ద పెద్ద ఉద్యమాలే చేయనక్కర్లేదు. మరింత కాలుష్యం చేయకుండా ఉంటే చాలు, అదే మనకు పరమ ధర్మం. అలా ఉండటమే సమస్త జీవరాశికి పెద్ద సహాయం చేయడం. ఎందుకంటే జరుగుతున్న వినాశనానికి అప్పుడు మనవంతు సాయం అందించకుండా ఉన్నాం కనుక. 

అందుకే భక్త రామదాసుగారు ఏమంటున్నారంటే, పరులను హింసించకుండా ఉండటమే పరమధర్మం. అది ఆచరించు, చాలు. నువ్వు ప్రత్యేకించి ఎవరిని ఉద్ధరించనక్కర్లేదు.

ఇంకా ఉంది.... 

Wednesday 24 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (4 వ భాగము)



భాగవతుల వాగామృతము - పానము జేసిన చాలు

బాగు మీర నట్టి యమృత - పాన మేటికీ మనసా ||

భాగవతులు అంటే భగవద్భక్తులని ఇంతకముందు భాగంలో చెప్పుకున్నాము. పండితులకు, భక్తులకు/జ్ఞానులకు మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. పండితులకు శాస్త్రజ్ఞానం ఉంటుంది, వారు మాటలతో మాయలు చేయచ్చు, అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా ఎన్నో విషయాలు చెప్పవచ్చు, కానీ వారిది వాచా వేదాంతమే. అంటే పుస్తకంలో చదివినది, తమకు అర్ధమైన విధంగా, లేదా తాము అర్ధం చేసుకున్న విధంగా చెబుతారు. వినేవారిని ముగ్దుల్ని చేయవచ్చు, తర్కం కూడా ఉపయోగించవచ్చు. కొందరు కుతర్కం కూడా ప్రయోగిస్తారు. కానీ దాని వల్ల లాభం ఎవరికి? 

భక్తులు అలా కాదు. భక్తులకు శాస్త్రజ్ఞానం లేకున్నా, అనుభవ జ్ఞానం ఉంటుంది. పరమాత్మతో దగ్గరగా గడిపిన ఆ అనుభవాలు ఏ పుస్తకంల్లోనూ దొరకవు. అలా అని భాగవతులు, కాలక్షేపం కోసం మాట్లాడరు లేదా ప్రసంగాలు చేయరు. వారు శాస్త్రాల మీద ప్రసంగాలు కూడా చేసే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ వారిది అనుభవవేదాంతం. అది నిజమైన అమృతం. వారి మాటలు వినే అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఎందుకంటే వారికి మాట్లాడటం కంటే స్వామిని అనుభూతి చెందుతూ ఉండటమే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. వారి ప్రతి మాట భగవద్ ప్రేరణతోనే వస్తుంది. నిజానికి పరమ భాగవతోత్తముల విషయంలో, బయటకు వారు మాట్లాడుతున్నట్లుగా అనిపించినా, వారి ద్వారా మాట్లాడేది ఆ భగవంతుడే. ఇదిగో, అలాంటి భాగవతుల గురించే భక్త రామదాసుగారు సెలవిస్తున్నారు.   

ఎక్కడో దొరికే అమృతాన్ని పానం చేయాలన్న కోరిక ఎందుకే ఓ మనసా! భాగవతులు ఎక్కడైనా దొరికితే, వారి దగ్గరకు వెళ్ళి మౌనంగా కూర్చో. వారు ఎప్పుడు మాట్లాడతారా అని తపనతో ఎదురు చూడు. వారివి కేవలం వాక్కులు కాదు, అమృతంతో కూడిన వాక్కులు, అవి దైవీ వాక్కులు. అవి ఖచ్ఛితంగా జీవుడికి అమృతతత్త్వాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి అమృతం తాగాలన్న కోరిక వదిలి, భాగవతుల వాగామృతాన్ని తాగాలనే కోరిక పెట్టుకో.

ఇంకా ఉంది....

Tuesday 23 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (3)

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు
ఘోరమైన తపములను కోర నేటికే మనసా ||
తారక శ్రీ రామనామ ధ్యానం జేసిన చాలు
వేరు వేరు దైవములను వెదక నేటికే మనసా ||

ఇలా అన్న రామదాసు గారు, తర్వాత చరణంలో ఏమన్నారో చూడండి.

భాగవతుల పాదజలము - పైన జల్లుకొన్న చాలు
భాగీరథికి పొయ్యేననే - భ్రాంతి యేటికే 
భాగవతుల వాగామృతము - పానము జేసిన చాలు
బాగు మీర నట్టి యమృత - పాన మేటికీ మనసా ||

భాగవతులు అంటే భక్తులు. భక్తుల పాదాలను కడిగిన నీరు, తలమీద చల్లుకుంటే చాలునట, గంగకు వెళ్ళాలనే భ్రాంతి ఎందుకు అంటున్నారు. నిజమైన భక్తుడు అన్నిటియందు భగవంతునినే చూస్తాడు. మంచి, చెడు, మేలు, కీడు అంటే విచక్షణ ఉపయోగించడు. మంచి జరిగినా, అది భగవత్ కటాక్షమే. కీడు వాటిల్లినా అది ఆయన అనుగ్రహమే. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదనె ఎఱుక భక్తునికి ఉంటుంది. అతను, అన్నింటా దైవాన్నే చూస్తాడు. నిజానికి అలా చూడగలగడమే పెద్ద యోగము. అలాంటి భక్తుడి పాదధూళిని తన నెత్తిన జల్లుకోవడానికి పరమాత్ముడే తపిస్తాడని మనకు నారదునికి శ్రీ కృష్ణునికి మధ్య జరిగిన ఒక సంవాదంలో కనిపిస్తుంది. భాగవతులు ఎంత గొప్పవారంటే, దేవతలు సైతం వారి పాదాలను ఆశ్రయించి ఉంటారు. ఎందుకంటే దేవతలకు స్వర్గలోక భోగాలు ఉండవచ్చు, కానీ వారికి కూడా స్వామి యందు నిరంతర ధ్యానం ఉంటుందని చెప్పలేము. భక్తునికి భగవంతునితో ఉన్న స్వతంత్రం వేరు. అది వర్ణించలేనిది. అనుభవించవలసినది మాత్రమే. అలాంటి భాగవతోత్తముని పాదాలు పరమపవిత్రం. అందుకే మనం దేవాలయాన్ని సందర్శించే ముందు, గడపుకు నమస్కరిస్తాం. ఎందుకంటే ఆ గడప మీద ఇంతకముందు ఎందరో భాగవతుల పాదధూళి సోకి ఉంటుంది. వాళ్ళ పాదస్పర్శ చేత అది మరింత పవిత్రమై ఉంటుందని.  

అలాంటి భాగవతులు కనిపిస్తే, వారి పాదజలాన్ని తలమీద జల్లుకుంటే, ఇక అంతకంటే ఏమి కావాలి? కానీ అది ఊరికే లభిస్తుందా? వారు పాదపూజలకు ఒప్పుకుంటారా? నిరంతరం ఆ దైవం మీద దృష్టి నిలిపి ఉంటారు. వారికి ఆడంబరాలేమీ పట్టవు. అయినా మన అదృష్టం కొద్దీ అలాంటి భాగవతుడు దొరికితే, ఆలస్యం చేయకుండా, ఆయన పాదాలను కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకోమంటున్నారు. ఎక్కడో దూరంలో ఉన్న గంగకు వెళ్ళాలన్న భ్రాంతి ఎందుకు? గంగ పవిత్రమైనదే. కానీ అక్కడకు వెళ్ళడం ఎంతో కష్టతరం. కానీ నడిచి వెళుతున్న భాగవతుని పాదధూళినైనా పట్టుకుని, తలమీద చల్లుకోవడం సులభమే కదా. అలాగే గంగకు వెళితే, స్నానం చేసి వచ్చేస్తాం. అదే ఒక భాగవతుని చెంతకు వెళితే, నిజమైన సత్సంగం కూడా దొరుకుతుంది. అంటే బాహ్యస్నానము, ఆంతరస్నానము. రెండూ ఏక కాలంలో జరుగుతున్నాయి. అందుకే ఓ మనసా! ఎక్కడో దూరంలో ఉన్న గంగకు వెళ్ళాలనే భ్రాంతి వదులు. నీకు దగ్గరలో ఉన్న భాగవతుని పాదాలను పట్టుకోవే. అదే రాముడిని చేరడానికి సులభమైన ఉపాయమే. 

ఇంకా ఉంది....

Monday 22 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (2)



తారక శ్రీ రామనామ ధ్యానం జేసిన చాలు
వేరు వేరు దైవములను వెదక నేటికే మనసా

తారకమంటే సంసార సాగరం నుంచి ఉద్ధరించేదని అర్ధం. శ్రీ రామనామం తారకము. ఆ నామము చాలట, ఈ సంసారమనే ఊబిలో నిండా మునిగిపోయినవాడిని సైతం బయట పడవేయడానికి. అలాంటి ఆ రామానామన్ని ధ్యానం చేస్తే చాలు. వేరేవేరే దేవతల కోసం వెతకడమందుకు అంటున్నారు. అంటే ఇతర దేవతలను తక్కువ చేయడం కాదు. శ్రీ రామ నామంలోనే అన్నీ ఉన్నాయి. రామ నామంలో 'ర'కారం అగ్నిబీజం. అది పాపాలను దహించివేస్తుంది. రామ, రామ అంటూ స్మరిస్తూ ఉంటే, సంచితమనే పెద్ద దూదికుప్ప, ఆ నామ మహాత్యం అనే అగ్నిలో కాలపోతుంది. మకారం మోక్షప్రాప్తినుస్తుంది. సంచితం ఖాళీ అయితే, జన్మపరంపర తగ్గుతుంది. దానితో పాటే మోక్షం కూడా వస్తున్నది. అందులోనే అమృతబీజం కూడా ఉన్నది. అది నీకు మృత్యు భయం లేకుండా చేస్తోంది. మరణ సమయంలో, భీతిల్లకుండా, సమయం ఆసనమవ్వగానే, ఆ శ్రీ రామనామ స్మరణతో చేస్తూ, దేహాన్ని విడిచే స్థితిని అందిస్తున్నది. దానికి ముందు శ్రీకారం లక్ష్మీ స్వరూపం. అది ధర్మబద్ధమైన సంపదలను ఇచ్చి, తద్వారా ఆ సంపదలతో ధర్మబద్ధమైన కామం తీరి, సంతృప్తికి దోహదమవుతోంది. అది వివేక వైరాగ్యాలకు దారితీస్తుంది. అంటే ఒక పక్క లౌకిక ప్రయోజనం, ఇంకొక పక్క పారమార్థిక ప్రయోజనం, రెండూ ఏకకాలంలో తీరుతున్నాయి. ఇహము, పరమూ, రెండూ దక్కుతున్నాయి. ఎందువల్ల? కేవలం తారకమైన ఆ శ్రీ రామనామ ధ్యానం వల్ల. అందుకే అది చేస్తే చాలే ఓ మనసా! ఇది చాలా సులభమైన మార్గము.

డబ్బు కోసం ఒక దేవతా స్వరూపాన్ని లేదా మంత్రాన్ని, మోక్షం కోసం వేరొక రూపాన్ని లేదా మంత్రాన్ని, ఇలా మనకున్న అనే కోరికల కోసం ఎన్నో మంత్రాలను చేయడమెందుకే? అవి చేస్తే సరిపోతాయా? వాటికి ఎన్నో నియమాలు కూడా పాటించాలే ఓ మనసా! ఇలా చూడు. శ్రీ రామనామం సులభమైనది. ఇది సూటియైన మార్గము. ఇందులోనే దేవతలంతా ఉన్నారు. శ్రీ రాముడు సర్వదేవతాత్మకుడు. రామ శబ్దంలో రా అనేది 'నమో నారాయణాయ' అనే అష్టాక్షరీ మహామంత్రంలో ముఖ్యమైన్ వర్ణం. మ అనేది 'నమః శివాయ' అనే పంచాక్షరీ మహామంత్రంలో ముఖ్యమైన అక్షరం. ఈ రెండూ రామనామంలోనే ఉన్నాయి. అంటే అటు శివుడు, ఇటు విష్ణువు.... ఇద్దరి రూపం రాముడు. ఆయనే పరతత్త్వము. అలాంటి రామనామాన్ని వదిలి, వేరేవేరే దేవతల కోసం వెతకడమెందుకే ఓ మనసా! అన్ని నామాలు ఎందులో కలుస్తాయో, సకల దేవతలు ఎక్కడ లీనమవుతారో, ఆ పరబ్రహ్మమైన రాముడి తారకనామాన్నే ధ్యానం చేయవే ఓ మనసా! 

ఇంకా ఉంది....

Sunday 21 January 2018

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు (1)


అన్నమయ్య, కంచర్ల గోపన్న (భద్రాచల రామదాసు) మొదలైన వాగ్గేయకారులు రచించిన కీర్తనల్లో భక్తి ఎంత ఉంది, వేదాంతము, సామాజిక స్పృహ, ఉపదేశ రహస్యాలు, తత్త్వబోధ అంతే ఉన్నాయి. ఈ రోజు ఉదయం రామదాసు జయంతి సందర్భంగా భద్రాచలంలో గోష్టిగానం వింటున్నప్పుడు, నవరత్న కీర్తనల్లో ఒకటైన శ్రీ రాముల దివ్యానామం అనే కీర్తన మనసుకు హత్తుకుంది. అందులో ఎంత గొప్ప అర్ధముందో చూడండి....

శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు
ఘోరమైన తపములను కోర నేటికే మనసా ||

ఆ శ్రీ రాముడి దివ్యమైన నామాన్ని కేవలం స్మరిస్తూ ఉంటే చాలట, కఠినమైన తపస్సు చేయాలని కోరుకోవడం ఎందుకే ఓ మనసా! అంటున్నారు. 

ఆధ్యాత్మికత అనగానే అబ్బో బోలెడు నియమాలు పాటించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎక్కడెక్కడో విని ఉంటాము. అది కాక అహంకారమంటూ ఒకటి ఉండనే ఉంది. అది ఊరికినే ఉండదాయే. తాను ఏమి చేసినా, అది పదిమంది ముందు చూపించుకోవాలని చూస్తుంది. డాంభికాన్ని, పొగడ్తలను ఆశిస్తుంది. అందుకే నేను ఆ సాధన చేస్తున్నాను, ఈ సాధన చేస్తున్నాను, నాకు ఆ అనుభవాలు కలిగియాంటూ చాలామంది సాధకులు మనస్సు మాయలో పడి, ప్రకటిస్తుంటారు. అదే కాక, దైవం ఊరకనే దక్కుతుందా, అది ఎంతో కష్టమని, ఎంతో తపస్సు చేయాలని, చాలా ప్రవచనాల్లో వినే ఉంటాము. అది అసత్యమే అయినా, మనసుకు సత్యంగా, వినసొంపుగా అనిపిస్తుంది. అందుకే అది ఘోరమైన తపస్సు చేయాలని కోరుకుంటుంది.  

తపస్సు అంటే తపించడం. భగవంతుని కోసం తపించడం. క్షణం కూడా ఆయన ఆలోచన తప్ప అన్యమైనది తలచకుండటం, కాదు అలా తలిస్తే, భరించలేకపోవడం. ఆయన మీదే మనస్సుని లగ్నం చేయడం. కానీ తపస్సు అంటే అది తప్ప మిగితావన్నీచేసేవారే కనిపిస్తారు. నిజానికి అలా తపించడానికి కూడా ఆయన అనుగ్రహం కావాలి. ఇలా తపించలేకపోవడం కూడా ఆయన అనుగ్రహమే. అది వేరే సంగతి. అయితే నిరంతరం ఆయన గురించి తపించడం తప్ప, ఇతర బాహ్యమైన కఠినమైన నియమాలను పాటించడానికి మనస్సు సిద్ధపడుతుంది, చాలామంది అదే తపస్సు అని కూడా అనుకుంటారు. నిజానికి అలాంటి నియమాలు ప్రారంభంలో అవసరం కావచ్చేమో, కానీ ధీర్ఘకాలం అలాగే ఉండటమంటే తపస్సు ముందుకు సాగట్లేదనే అర్ధం. మరి అసలైన తపస్సు ఏంటి? నిత్యం ఆయన ధ్యానంలో గడపడమే తపస్సు. అది అంతర్ముఖమైనా, బహిర్ముఖమైనా.... నిజానికి అది ఒక్కటి తప్ప, ఇంకేం చేయమన్నా మనస్సు చేస్తుంది.

అదే భక్త #రామదాసు గారు చెప్తున్నారు చూడండి. ఓ మనసా! వినవే! శ్రీ రాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు... పావనమైన ఆ శ్రీ రాముని దివ్య నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండవే, అది చాలే. కఠినమైన నియమాలను కోరడం ఎందుకే?   

ఇంకా ఉంది..... 

Saturday 20 January 2018

స్వామి శివానంద సూక్తి



Your thought is imprinted over your face. Thought is a bridge that connects the human with the Divine. Your body, your business, your home—they are only ideas within your mind. Thought is a dynamic force. Good thought is the first perfection. Thought is real wealth.

- Swami Sivananda 

Thursday 18 January 2018

శారదా మాత సూక్తి



We have to surrender ourselves completely to the Lord with faith and devotion in Him, serve others to the best of our capacity, and never be a source of sorrow to anybody.

- Sarada Mata

Wednesday 17 January 2018

శ్రీ రామకృష్ణ పరమహంస సూక్తి



The sun can give heat and light to the whole world, but he cannot do so when the clouds shut out his rays. Similarly as long as egotism veils the heart, God cannot shine upon it.

- Sri Ramakrishna Paramahamsa

Tuesday 16 January 2018

కంచి పరమాచార్య సూక్తి



Death too is a kind of sleep. In it, too, the mind is stilled. But with rebirth when the individual self becomes incarnate the mind starts to be active again. If we learn to control the mind voluntarily it will be able to remain in that state. Though Daksinamurti remains still without doing anything he is full of awareness. It is because he is inwardly a non-doer that he is able to do so much in an outward sense. The Daksinamurthi who remains still is the one who dances the dance of bliss, who destroys the demon Tripura and who keeps roaming as a mendicant. After granting boons to his devotees he goes from place to place. He is still inwardly but is in a frenzy outwardly. If we manage to still ourselves inwardly we will be able to do so much outwardly.

- Kanchi Paramacharya

Monday 15 January 2018

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



Then, who is Jagatguru in this context?

“One who knows the secrets of creation, one who knows the qualities of nature, one who has made God his own and is one with HIM, one who can give that path, which is the easiest and the direct from bondage to freedom, is called the Jagatguru, as we come to know.”

- Satguru Sivananda Murthy Garu

మహర్షి మహేశ్ యోగి సూక్తి



To resolve problems through negotiation is a very childish approach.
- Maharishi Mahesh Yogi

Sunday 14 January 2018

హిందూ ధర్మం - 257 (Forbidden Archaeology - 3)



ఇంకా మైకిల్ క్రీమో ఇలా చెబుతున్నారు- "'కనుగొనకూడనివి' కనుగొనడం చేత శాస్తవేత్తలు కొన్నిసార్లు వృత్తిపరంగా కష్టాలపాలవుతారు. ఈ కోవకు చెందినవారిలో వ్యక్తిగతంగా నాకు తెలిసిన వ్యక్తుల్లో అమెరికన్ భూగర్భ శాస్త్రవేత్త అయిన  Dr. Virginia Steen-McIntyre ఒకరు. 

1970 పూర్వభాగంలో, కొందరు అమెరికన్ పురాతత్త్వ శాస్త్రజ్ఞులు మెక్సికోలోని Hueyatlaco అనే స్థలంలో, కొన్ని రాతి పనిముట్లు మరియు ఆయుధాలు కనుగొన్నారు. అందులో బాణపు అలుగులు, ఈటెలు ఉన్నాయి. పురావస్తుశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, అలాంటి ఆయుధాలను మనలాంటి మానవులు ఉపయోగించారే కానీ ఆదిమానవులు కాదు. Hueyatlaco లో, శిలాకృతులు కందకాల అడుగు పొరల్లో ఉన్నాయి. అవి ఎంత పురాతనమైనవో తెలుసుకోవాలని పురావస్తుశాస్త్రజ్ఞులకు అనిపించింది. పురావస్తుశాస్త్రజ్ఞులకు ఎప్పుడైనా ఏదైనా వస్తువు యొక్క వయస్సు తెలుసుకోవాలనుకున్నప్పుడు, అది చెప్పడానికి సమర్ధన కలిగిన భూగర్భ శాస్త్రవేత్తలను పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఉన్న రాయి పొర వయస్సు ఇంత ఉండచ్చు అని వారు మాత్రమే చెప్పగలరు. అలా అక్కడకు వచ్చిన భూగర్భశాస్త్రావేత్తల్లో Dr. Virginia Steen-McIntyre ఒకరు. యూనైటేడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే కు చెందిన ఆ శాస్త్రవేత్తల బృందంఅత్యాధునిక భూగర్భ డేటింగ్ పద్ధతుల ద్వారా పరీక్షలు జరిపి, వాటి వయస్సు 3 లక్షల సంవత్సరాలని తేల్చింది. ఇది చీఫ్ పురావస్తుశాస్త్రజ్ఞునికి అందించగా, ఆయన ఇది అసాధ్యం అన్నారు. 'ప్రామాణిక(?) లెక్కల' ప్రకారం, 3,00,000 ఏళ్ళకు ముందు ఉత్తర అమెరికాలోనే కాదు, అసలు ప్రపంచంలోనే మానవులు లేరు. ప్రస్తుతమున్న 'మతము (Doctrine) (కొందరు సైంటిష్టుల అభిప్రాయము)' ప్రకారం, మానవులు 3 లక్షల ఏళ్ళకు ముందు అమెరికాలోనికి ప్రవేశించనేలేదు. మరైతే ఏం జరిగింది? 3,00,000 ఏళ్ళని ప్రచురించడానికి పురావస్తుశాస్త్రజ్ఞులు అంగీకరించలేదు, అందుకు బదులుగా 20,000 ఏళ్ళని ప్రచురించారు. మరి వాళ్ళకు ఆ కాలప్రమాణం ఎక్కడి నుంచి దొరికినట్లు? ఆ ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో దొరికిన ఒక గుల్ల/ చిప్ప ముక్కను కార్బన్-14 డేట్ చేయడం ద్వారా వచ్చింది.

ఆ ప్రదేశం యొక్క వాస్తవ కాలాన్ని ప్రచారం చేయడానికి Dr. Virginia Steen-McIntyre ఎంతగానో ప్రయత్నించింది. కానీ అందువల్ల ఆమెకు వృత్తిలో చెడ్డపేరు వచ్చింది, విశ్వవిద్యాలయంలో అధ్యాపక స్థానం కోల్పోయింది, యూనైటేడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే ఆమెను నిషేధించింది. (ఎందుకు? సైన్సు పేరుతో ముందే ఏర్పరుచుకున్న కొన్ని నమ్మకాలకు అనుగుణమైన విషయాలను కాక, వాస్తవాలను ప్రచారం చేయబూనినందుకు). చివరకు ఆమె విసిగిపోయి, Colorado లోని రాతి పర్వతాల్లోని (Rocky Mountains) చిన్న పట్టణంలో ఉంటూ,  Forbidden Archeology పుస్తకం కోసం నేను ఆమెను సంప్రదించి, ఆమె పట్ల తగు శ్రద్ధ చూపేవారకు, 10 ఏళ్ళు మౌనంగా జీవించింది. ఇప్పుడు Hueyatlaco  ప్రదేశాన్ని ఎంతో Open-minded పురావస్తుశాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారంటే అందుకు ఇది కూడా ఒక కారణం. అతిత్వరలోనే ఆమె వెల్లడించిన వాస్తవాలు తిరిగి ఋజువవుతాయని ఆశతో ఉన్నాము.

అంటే Knowledge filters అనే ప్రక్రియ ద్వారా వాస్తవలను ఎలా మరుగున పరుస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి లక్షల ఏళ్ళ క్రితాం రాముడున్నాడా? మునులు, ఋషులు నివసించారా? పురాణాలను మేము నమ్మాలా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరో చెప్పక్కర్లేదని అర్దం చేసుకోవచ్చు.

To be continued...........

Friday 12 January 2018

స్వామి వివేకానందుని గురించి సి. రాజగోపాలాచారి



Swami Vivekananda saved Hinduism and saved India. But for him, we would have lost our religion and would not have gained our freedom. We therefore owe everything to Swami Vivekananda.

– Sri C. Rajagopalachari

Sunday 7 January 2018

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



A question arises here….

“I know your question. Are the souls capable of reaching God by themselves? Does such a desire or a resolve arise in them on its own? The answer is ‘No.’ They do require someone to stir them up from their slumber. They need someone to tell them that this world is not their world but only a transit point and that they should not allow themselves to be trapped by karmic activity. Someone has to tell them that they are born on this earth, not to be bound by karma but seek God and reach Him and that alone is their duty. If not today, at least tomorrow, they should learn to free themselves from this bondage and be free. They need someone to tell them that this is the intention of the Lord towards them.”

- Satguru Sivananda Murthy Garu

Saturday 6 January 2018

స్వామి శివానంద సూక్తి



If you think again and again of an impure thing it gains new strength. It gets the force of momentum. You must drive it immediately. If you find it difficult to do so, entertain counterthoughts of God. Cultivate sublime and elevating thoughts. Evil thoughts will die by themselves. A noble thought is a potent antidote to counteract an evil-thought.

- Swami Sivananda 

Friday 5 January 2018

స్వామి సచ్చిదానంద సూక్తి



People are of different natures and different levels in their evolution. So they behave according to their nature. If someone hurts you, feel pity for them. If you can, help them not to continue that. Your getting upset doesn’t bring any benefit to anybody. On the other hand, if you harbor the hurt feeling you are allowing the poison to go into your system and affect you. Suppose somebody uses a bad word to abuse you. It is just a word. They didn’t hurt you, you got hurt by allowing that to come into your system. Remember that.

- Swami Satchidananda

Thursday 4 January 2018

స్వామి రామతీర్థ సూక్తి



Heaven is within you; the paradise, the home of bliss within you, and yet you are searching for pleasures in the objects in the streets, searching for that thing outside, outside, in the objects of the senses. How strange!

- Swami Rama Tirtha

Tuesday 2 January 2018

భీష్ముని సూక్తి



As pieces of wood, floating on the sea, at times join together and then separate, so do people in this world meet and separate.

- Bhishma Pitamaha