Friday 30 June 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



Assert Your Real Nature

Know that you are the true Self and you are not the mind that always changes, which gets into moods. Realize you are the Self. The Self understands equanimity. Even though the other part of the mind gets into different moods and feelings, you are not tainted by that. You know that is the nature of the mind and you can say, ‘Okay, today my mind is happy. Tomorrow it will be unhappy. Fine.’ See? You won’t identify yourself with that. You treat the mind as a separate entity, all the time asserting your real nature as the true Self.

- Swami Satchidananda

ఈ విషయంలో వారిని ఆదర్శంగా తీసుకుంటేనే ధర్మం నిలుస్తుంది.



భారతదేశంలో 100 కు పైగా పార్శీల దేవాలయాలు ఉన్నాయి. అందులో ముంబాయిలోనే 40 ఉన్నాయి- అక్కడ అగ్ని జ్వాల ఎప్పుడూ ఆరదు. వాళ్ళు కూడా అగ్ని ఆరాధకులు. అగ్ని జ్వలించడానికి కొంత గంధవు చెక్కను వాడినా, అధికంగా బబూల్ చెట్టు చెక్కను వాడతారు. ఎందుకంటే బబూల్ చెక్క ఎక్కువసేపు మండుతుంది, మెల్లిగా కాలుతుంది, అగ్ని చాలాసేపు ఉంటుంది. ఈ కారణంగా బేకరీలు మొదలైనవి కూడా వెంట చెరుకుగా బబూల్ చెక్కనే వాడుతున్నారు. దీంతో గత దశాబ్దంలో బబూల్ చెక్క ధర 5 రెట్లు పెరిగింది. ఇలా ధర పెరగడం గురించి ఆందోళన చెందిన పారశీలు తమ స్థలాల్లో బబూల్ వృక్షాలను పెంచుతున్నారు. ఇది గుజరాత్ లో మొదలైంది, ఇప్పుడు ముంబాయిలో కూడా మొదలవుతోంది. దేశవ్యాప్తంగా దీన్ని ఆచరణలోకి తెచ్చి, తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నట్లు వార్తపత్రికల్లో వచ్చింది. వారి జనాభ దేశంలో 66,000 మాత్రమే ఉంది. అయినా వారికి ఎంత నిబద్ధత.

దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. మనకు కొన్ని పవిత్ర వృక్షాలున్నాయి. కొన్ని రకాల వృక్షాల చెక్కలనే యజ్ఞంలో సమిధలుగా వినియోగిస్తారు. ఏ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏ సమిధ వాడితే ఫలితం ఉంటుందో శాస్త్రం నిర్దేశించింది. కానీ చాలామటుకు అవి లభ్యమవ్వడం లేదు. దానికి ప్రధానమైన కారణం వృక్ష సంపద తగ్గిపోవడం. అడవులు కూడా వేగంగా తరిగిపోతున్నాయి, కాదు అభివృద్ధి పేరుతో అడవితల్లిని నాశనం చేస్తున్నాం. రోజుకు సగటున 108 అరుదైన ఆయుర్వేద మూలికలు, వృక్షాలు భారతదేశంలో అంతరిస్తున్నాయని ఒక అంచనా. పార్శీల జనాభా ఈ దేశంలో 0.006 % మాత్రమే ఉంది. కానీ హిందువుల జనాభా సుమారు 60%- 70% ఉండవచ్చు (మతమార్పిడి చేసుకున్నవారిని మినహాయించి). కానీ మనకు అలాంటి ప్రణాళికలేమీ లేవు, అసలలాంటి ఆలోచనే కలగదు. ధర్మాన్ని రక్షించండి, సంస్కృతిని కొనసాగించండి అంటాము, మరియు వాటికి అవసరమైన వాటిని మాత్రం నశింపజేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు చక్కని వర్షాలు పడుతున్నాయి. ఇదే మంచి సమయం. మనం మొక్కలు నాటాలి, మేడి, మోదుగ, జువ్వి, తెల్ల మద్ది, నల్ల మద్ది, మఱ్ఱి, రావి మొదలైన దేవతా వృక్షాలను నాటి పెంచాలి. అవి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడతాయి, ముందు భూమి చల్లబడుతుంది. మొక్కలు నాటడం వలన వచ్చే పుణ్యం గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం, వాటికి తోడు మనం నాటిని మొక్కలను సమధలుగా వాడితే, ఇంకా ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది. అలా కాకుండా చాలా ఉన్నాయండి అని కబుర్లు చెబుతూ కూర్చుంటే, కొన్నాళ్ళకు చాలా కాస్త కొన్ని అవుతాయి, ఆ తర్వాత అంతరిస్తే, మనమే బాధపడాలి. అంతెందుకు మనం వృతం చేసినప్పుడు కలశం స్థాపిస్తాము. కలశంలో పంచపల్లవాలు (5 రకాల చిగుర్లు) వేయాలని శాస్త్రం చెప్పింది. మఱ్ఱి, రావి, మేడి, జువ్వి, మామిడి. అసలీ విషయం ఎంతమందికి తెలుసు? అంతెందుకు వినాయక చవితికి మనం అర్పించే పత్రిలో ఎన్ని పత్రాలు సరైనవి? అవి మన ఇంటి దగ్గర పెంచుకోలేమా? ఉగాదికి మార్కెట్ లో వేపపువ్వు దొరకడమే గగనమైపోయింది. మనమే ముందడుగు వేసి ఓ వేప చెట్టు పెంచలేమా? ఆఖరికి మామిడాకులు కూడా కొనుక్కునే దుర్భరమైన పరిస్థితి దాపురించింది. అందరికి మామిడాకులు, వేపపువ్వు కావాలి, కానీ ఎవ్వరూ వేప, మామిడి చెట్లు నాటరు. ఇలా చెప్పుకుంటే ఎన్నో.

మొక్కలు నాటి ఆయా జాతుల వృక్షాలను పెంచి, సంరక్షించడానికి ఇది అనువైన సమయం. మనమంతా ఆ దిశగా ఒక ముందడుగు వేస్తేనే భవిష్యత్తులో #ధర్మం నిలుస్తుంది, శాస్త్రీయమైన యజ్ఞ ప్రక్రియ నిలబడుతుంది. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః అని యజుర్వేదంలో శ్రీ రుద్రం కూడా అంటున్నది. వృక్షాల రూపంలో ఉన్న రుద్రునకు నమస్సులు, పచ్చని కొమ్మలు, రెమ్మలు, ఆకులు తన కేశాలుగా కలిగిన మహాదేవునకు నమ్మస్సులు అని అర్దం.

ఇది కూడా ఒక యజ్ఞమే. దీని గురించి కూడా కాస్త ఆలోచించండి. మరి మొక్కలు నాటి పోషిస్తారా?

Thursday 29 June 2017

అరోబిందో సూక్తి



The first principle of true teaching is that nothing can be taught.

- Aurobindo

దీన్ని ఎన్నో విధాలుగా అర్దం చేసుకోవచ్చు. అందులో ఒకటి;
ఏదైనా లోపల నుంచే కలగాలి. బయట నుంచి ఎవ్వరూ ఎమీ చేయలేరు. (Think... Think.... Think ..... )

Tuesday 27 June 2017

ఎన్నో సందేహాలను పటాపంచలు చేసే చిన్న సంఘటన - శ్రీ రామకృష్ణుల జీవితచరిత్ర నుంచి



మొన్న మన పేజీలో ఒకరడిగారు. విదేశీయులు గుళ్ళను కూల్చుంతుంటే దేవుడెందుకు ఆపలేదని. అలాగే ఏదైనా గుళ్ళో దొంగతనం జరిగినప్పుడు అయ్యో! దేవుడేమీ కాపాడుకోలేకపోయాడే అంటారు. అలాంటి ఎన్నో సందేహాలను పటాపంచలు చేసి సంవాదం ఇది. శ్రీ రామకృష్ణుల జీవిత చరిత్ర నుంచి స్వీకరించబడినది. ఇది ఒకరమైన జ్ఞానగుళిక.

భగవంతుడిని ధ్యానించండి, ఆయన మహిమలను కాదు

కేశబ్‌తో శ్రీ రామకృష్ణులు - బ్రహ్మసమాజం సభ్యులెందుకు ఎక్కువగా దైవం యొక్క మహిమలను ధ్యానిస్తారు? 'ఓ భగవంతుడా, నువ్వు చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలను సృష్టించావ్!' అంటూ వాటిని వల్లెవేయాల్సిన అవసరం ఉందా? చాలామంది తోటను చూడటానికి ఇష్టపడుతున్నారే కానీ దాని యజమానికి తెలుసుకోవాలన్న తపన కొందరికి మాత్రం ఉంది. ఎవరు గొప్ప, తోటా? లేక దాని యజమానా?

కొంత సారాయి తాగిన తర్వాత, గ్యాలన్ల కొద్ది వైన్ ,నిలువలు ఉంటే ఎవరికి కావాలి? ఒక బాటిల్ చాలు నాకు.
నేను నరేంద్రను కలిసినప్పుడు, 'మీ నాన్నగారు ఎవరు? ఆయనకు ఎన్ని ఇళ్ళున్నాయి?' నేను అడగలేదు.
నేనొక సత్యం చెప్పనా? మనిషి తన సంపదలను ఇష్టపడతాడు, అందుకే భగవంతుడు కూడా ఇష్టపడతాడని తలుస్తాడు. దైవం యొక్క మహిమలను స్తుతిస్తే ఆయన సంతోషిస్తాడని భావిస్తాడు. ఒకసారి నాతో శంభు అన్నాడు - 'నా సంపదలను భగవంతుని పాదపద్మాల వద్ద విడిచి మరణించేలా దయతో నన్ను దీవించండి'. నేనన్నాను 'ఇవన్నీ నీకు మాత్రమే సంపదలు. నువ్వు భగవంతునికి ఏ సంపదలు అర్పించగలవు? ఆయనకు ఇవన్నీ కేవలం దుమ్ముతో సమానం మరియు తృణప్రాయము.

ఒకసారి విష్ణువు ఆలయంలో దొంగలుపడి, ఆ మూర్తి యొక్క ఆభరణాలు దొంగిలించారు. అసలు సంగతి తెలుసుకుందామని మథుర్ బాబు మరియు నేను వేళ్ళాము. విగ్రహాన్ని ఉద్దేశించి మథుర్ బాబు కటువుగా 'భగవంతుడా, ఎంత సిగ్గుచేటు! నువ్వు నిరర్థకుడివి! దొంగ నీ శరీరం నుంచి ఆభరణాలన్నీ తీసుకున్నాడు, కానీ నువ్వు మాత్రం ఏం చేయలేకపోయావు' అన్నాడు. అప్పుడు నేను మథుర్‌తో 'నువ్వు సిగ్గుపడాలి. ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నావు. భగవంతునికి, నువ్వు ఎంతగానో చెప్తున్న ఈ ఆభరణాలు మట్టి ముద్దలతో సమానం. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీ ఆయన ఇల్లాలు. ఒక దొంగ కొన్ని రూపాయలు తీసుకున్నాడని ఆయన నిద్రలేని రాత్రులు గడపాలని నువ్వంటున్నావా? నువ్విలాంటి మాటలు మాట్లాడకూడదు'.

ఎవరైన భగవంతుని తన సంపద ద్వారా నియంత్రణలోకి తెచ్చుకోగలరా? ఆయన్ను #ప్రేమ ద్వారా మాత్రమే పొందగలము. ఆయనకేమి కావాలి? ఖచ్ఛితంగా సంపద కాదు! ఆయనకు ఆయన భక్తుల నుంచి భక్తి, భావం, #వివేకము, వైరాగ్యం కావాలి.

శ్రీ రామకృష్ణ పరమహంస

Saturday 24 June 2017

స్వామి శివానంద సూక్తి



When the mind is vacant, evil thoughts try to enter. Evil thinking is the beginning or starting point of adultery. Through a lustful look only, you have already committed adultery in the heart. Mental actions are the real actions. Remember this! God judges a man by his motives; worldly people judge a man by his external physical actions. You will have to look to the motive of the man. Then you will not be mistaken.

- Swami Sivananda

బేరాలు చేయడం ఆపండి.



నేను బేరం చేయకుండా ఏదీ కొననండి. నేను బాగా బేరం చేస్తాను అంటూ కొంతమంది తమ గురించి బాగా గొప్పలు చెప్పుకుంటారు. అయితే ఎంతసేపు ఈ బేరాలన్నీ 10 రూపాయల కొత్తిమీర కట్ట కోసం, లేకపోతే తాటి ముజల కోసమో! అబ్బో ఇలా చెప్పుకుంటే పెద్ద లిస్టే వస్తుంది. రూపాయికి కొత్తమీర కట్టలు ఒకటే ఇస్తావా, రెండెందుకు ఇవ్వవూ, నాలుగు ఇవ్వచ్చు కదా అంటారు. దాదాపు అందరూ అంతే అనుకోండి. అదే పెద్ద ఎద్ద షాపింగ్ మాల్స్ కు వెళితే, నోరెత్తరు. బడాకంపెనీలు ఎంత చెబితె అంత చెల్లిస్తాము. ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ అంతే. మీరు త్రాగే ఒక కూల్‌డ్రింక్ ఉత్పత్తి చేయడానికి మహా అయితే 2 నుంచి 3 రూపాయలవుతుంది. కానీ దాన్ని వాడు 15 రూపాయలకు అమ్ముతాడు. దాన్లో ఎంత లాభం ఉందో చూడండి. వాడికి బడా వ్యాపారం, అనేక రాష్ట్రాలు, దేశాల్లో ఉంటుంది. అలా ఎన్ని వేల కోట్లు గడిస్తున్నాడు? అదే వీధిపక్కన కూరగాయలమ్మేవాడు, ఒక రైతు, చిన్న వ్యాపరి, టైలర్లు, చెప్పులు కుటేవారు, కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషనులు, పెయింటర్లు, కొంతమంది టూరిస్ట్ గైడ్లు, ఢోలీ వాలాలు (కొండప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కలేనివారిని మోసుకెళ్ళేవారు), కుండలు, మట్టి ప్రమిదలు లేదా ఎదైనా బొమ్మలు అమ్ముకునేవాడికి వచ్చే #లాభం ఎంత? మహా ఐతే ఆ పూట భోజనానికి సరిపోయినంత. అంతకుమించి వారికేమి వస్తుంది. నిజానికి బేరం చేయాల్సిందెక్కడ? చేకూడదనిదెక్కడ? ఈ చిన్న వ్యాపారులకు షాప్ పెట్టుకునే స్థోమత కూడ ఉండదు.

వీధిలో కూర్చునే వ్యాపరులేమీ లాభాలు గడించడంలేదు. మీరు ఆ రోజు కూరలో, పువ్వులో కొనకపోతే, అవి చెడిపోయి పూర్తిగ నష్టం వస్తుందని మీరడిగిన ధరకు ఇస్తున్నారు. అది చెక్కబొమ్మలు మొదలైనవి అమ్ముకునే వారు కూడా ఎదో కొంతైనా వస్తుందని మనకు అమ్ముతారు. ఇప్పుడు మనమొక విషయం ఆలోచిద్దాం. మీరు తినడానికి కొంటున్న వస్తువులు, లేదా అలంకరణ కోసమో, పూజ కోసమో కొంటున్న వస్తువులు అనుకుందాం- అవతల వ్యక్తిని ఏడిపించి కొంటే అది మీకు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది. వాళ్ళు ఏడుస్తూ కూరలమ్మితే, అది కొన్న మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? పూజ కోసం కొనే వస్తువులైనా, వారిని బాధపెట్టి కొంటే, దేవుడెలా సంతోషిస్తాడు. ఈ రెండే కాదు, ఇంకా చాలా వస్తువులు, ముఖ్యంగా తమ రోజు గడపడం కోసం వ్యాపారం చేస్తున్నవారి దగ్గర బేరం చేసి, వారిని క్షోభ పెట్టడం మనకు దుష్కర్మను తీసుకురాదా? అలా ఏడుస్తూ ఇవ్వకు బాబు, కాస్త నవ్వుతూ ఇవ్వు అంటారు. పైకి నవ్వినా లోపల భాద ఉండదా? చిన్న చిన్న షాపుల్లో అమ్ముకునేవారు కూడా అంతే. పెద్ద పెద్ద మాల్స్ లో అయితే మైంటెనెన్స్ అని, అదని, ఇదని బోలేడు ధర చెప్తారు. కానీ చిన్న షాపుల్లో అలా కాదు. మనమే ఆలోచించాలి.

మనమేమీ భూదానం, సువర్ణదానం, అన్నదానం మొదలైన దానాలు చేయక్కర్లేదు. ఏ పూటకాపూట తిండి కోసం వ్యాపారం చేసుకునేవారి దగ్గర బేరం చేయకుండా కొంటే చాలు. బేరం చేయకుండా కొని చూడండి, వారి కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో. అది మనకు ఆశీర్వాదం కూడా అవుతుంది. అలాగే అది వారికి, వారి కుటుంబానికి ఆ రోజు తిండికి కారణం కావచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ ధరలే కొన్నా, ఆ మిగితాది దానంగా మీకు అన్నదానం చేసిన పుణ్యం రాకుండా ఉంటుందా?

మధ్య తరగతి వాళ్ళే బేరం చేస్తారనుకోవడం పొరపాటు. పెద్దపెద్ద కార్లలో వచ్చి కూడా కొందరు బేరం చేయడం చూశాను. ఏమయ్యా! పావుకిలో నేరేడు పళ్ళు 30 కి ఇస్తున్నావా? 20 కి ఇవ్వరాదా? అంటారు, అడిగి 20 రూపాలకే తీసుకుంటే ఇంకో నాలుగు అదనంగా వెయ్యి, లేదా ఇంకో 6 వేయ్యి అంటారు. అసలు అలా అడగడానికి సిగ్గు ఉంటుందా? మనమేమీ ఈ సమాజం కోసం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్నవారి పట్ల ప్రేమతో, కరుణతో మెలిగితే చాలు. భగవంతుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి బేరాలు చేయడం ఆపండి. 

Friday 23 June 2017

పరమహంస యోగానంద సూక్తి



Most of the world is like a mental hospital. Some persons are sick with jealousy, others with anger, hatred, passion. They are victims of their habits and emotions. But you can make your home a place of peace.

Paramahansa Yogananda

Thursday 22 June 2017

ఓషో సూక్తి



The real question is not whether life exists after death.
The real question is whether you are alive before death.

- Osho

Tuesday 20 June 2017

Sunday 18 June 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



If you have faith and sraddha, the divinity will respond. Darshan is the language of divinity.

- Satguru Sivananda Murthy Garu

నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా?

ఒకరడిగారు. నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా? లేక అలా చెప్తే భయపడి తప్పులు చేయరని ఆలోచిస్తున్నారా?


తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగా కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు; సంతానం కలగదు, వ్యాపరంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది.

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది.

కొన్ని ఉదాహరణలు - ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

పచ్చని చెట్ల పై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం,  స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు.దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, 'పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో' అని పెద్దలంటారు.

భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూమలను ఆక్రమించుకుంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనెముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మనదేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి.

ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.

ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త. 

Saturday 17 June 2017

పార్వతీ మాత చాటిన మొక్క వైభవం - మత్స్యపురాణం నుంచి చిన్న కథ



దశపుత్రసమో ద్రుమః  

గణపతిని తన దేహపు మట్టి నుంచి ప్రాణం పోసి, ఆయన్ను గణాలకు అధిపతిని చేసిన తర్వాత, పార్వతీ మాత మరొక పుత్రుడు కావాలని సంకల్పించుకుంది. ఎంతో గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న పార్వతీ మాత, ఒక చిన్న ఆశోక చిన్న మొక్కను నాటి, దాన్ని సొంత బిడ్డవలే సుకుమారంగా పెంచసాగింది. (మానవులకు ఆదర్శంగా నిలవడం కోసం). ఆ సమయంలో ఒకానొక రోజు దేవగురువైన బృహస్పతి, ఇంద్రుడు మొదలైన ఇతర దేవీదేవతలతో పార్వతీ మాత వద్దకు వచ్చారు. దేవర్షులు అమ్మవారితో 'దేవి! దయ చేసి చెప్పండి. ఓ భవానీ, మీరు సమస్త సృష్టి యొక్క క్షేమం కోసం అవతరించారు. ప్రపంచంలో చాలామంది పుత్రులను, పౌత్రులను (మనవళ్ళను) పొందడానికి ఇష్టపడతారు. పుత్ర సంతానం లేని చాలామంది (పుత్రుల కోసం) తపస్సు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మర్యాదను (కట్టుపాటును) లోకానికి చూపారు. కాబట్టి దేవీ, చెట్టును పుత్రుడిగా భావించడం వలన వ్యక్తికి కలిగే ఫలం ఏమిటి:' అప్పుడు ఆనందంతో నిండియున్న పార్వతీమాత మంగళకరమైన ఈ పదాలను పలికింది.

నీటి లభ్యత లేని చోట కూపము (బావి) తవ్వించిన సద్భుద్దిమంతుడు, ఆ పుణ్యఫలం కారణంగా ఆ బావిలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో, అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. అలాగే వాపి (కొలను) తవ్వించడం 10 బావులు తవ్వించినదానికి సమానమైన పుణ్యం వస్తుంది. అదే చెరువు/ తటాకం తవ్వించడం వలన 10 కొలనులు తవ్వించిన పుణ్యానికి సమానమైన పుణ్యం వస్తుంది. ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించేవాడు, పితృదేవతలకు వారి మరణానతరం తర్పణాదులు వదిలేవాడు, దేశానికి, ప్రపంచానికి, సమస్త లోకాలకు మేలు చేసే ఒక సత్పుత్రుడిని కనడం/ పెంచడం 10 చెరువులు తవ్వించినదానికి సమానమైన పుణ్యఫలాన్నిస్తుంది. అంటే కేవలం పుత్రులు ఉంటే సరిపోదు, వారు లోకానికి మేలు చేసేవారు కావాలి. అప్పుడు అతడు చేసే పుణ్యకర్మ పితృదేవతలను సైతం ఉద్ధరిస్తుంది. అదే ఒక చెట్టును నాటి, పోషించడం వలన 10 మంది ప్రయోజకులు, లోకానికి క్షేమం చేకూర్చేవారైన సత్పుత్రులను అందించిన పుణ్యఫలానికి సమానమైన పుణ్యం వస్తుంది. ఎందుకంటే చెట్టు జీవరాశికి ఎంతో మేలు చేస్తుంది. తన సమస్త జీవితాన్ని పరుల కోసమే వెచ్చిస్తుంది. తనకంటూ ఏదీ అట్టిపెట్టుకోదు. అందుకే లోకక్షేమం కోసం, ఇతరులు ఈ మార్గంలో నడవడానికి ప్రేరణగా నేనే ఈ మర్యాదను స్థాపించాను.  (In brief, 10 బావులు ఒక కొలనుకు సమానం. 10 కొలనులు 1 చెరువుకు సమానం. 10 చెరువులు 1 పుత్రునకు సమానం. 10 సత్పుత్రులు ఒక చెట్టుకు సమానం. అందుకే నేను మొక్కలు నాటి మానవుల కోసం గొప్ప మర్యాదను స్థాపించాను.)

మత్స్య పురాణం 154.506- 154.512 (దేవర్షులు - పార్వతి దేవి సంవాదం).

మాములుగా చెప్తే ఎలాగో నాటరు, కనీసం అమ్మవారు చెప్పిందనైనా మొక్కలు నాటండి. వాటిని పెంచి పోషించండి.  మగపిల్లలు లేరన్న చింతవద్దు, మొక్క నాటితే అది 10 మంది మగపిల్లలకు సమానం. ఎన్ని మొక్కలు నాటితే అంత పుణ్యం.

Friday 16 June 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



Laughing is the best medicine. It lightens the mind and exercise the body. You don’t even have to do bastrika [a bellowslike yogic breathing technique]. Just laugh. Ha, ha, ha. See? Laughing exhilarates the whole system. It releases all the tension. We should learn to laugh well. By laughing, laughing, laughing, we are relaxing, relaxing, relaxing—freeing ourselves from all tensions. This will make you forget all your worries. Nothing is going to be permanent. Even the so-called problems will pass away soon. When you laugh at them, they become simple; they become minor. When you take them seriously, they assume big shapes.

- Swami Satchidananda

Thursday 15 June 2017

స్వామి వివేకానంద సూక్తి



If you want to reform a person, go and live with him; don't try to reform him. If you have any of the Divine Fire, he will catch it.

- Swami Vivekananda

Wednesday 14 June 2017

డేవిడ్ ఫ్రాలే సూక్తి



Hindu tradition is not one of mythology but of yogic symbolism and mantric language. Cannot be understood by the mere intellect.

- David Frawley

Tuesday 13 June 2017

Monday 12 June 2017

మొక్కలు నాటడం గురించి మత్స్య పురాణం



By Planting a single tree, (with the merit earned from it) one can reside in heaven for 30,000 years of Indra. Not only this, the planter may have the moksha, i.e., end of rebirth.

- Matsya puran

13-06-2017, మంగళవారం, జ్యేష్ఠ బహుళ చవితి, అంగారక చతుర్థి.



13-06-2017, మంగళవారం, జ్యేష్ఠ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ / అంగారక చతుర్థి.
దీనికి కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి అని పేరు.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

13 జూన్2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.50 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

Sunday 11 June 2017

Saturday 10 June 2017

Friday 9 June 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



Peace Guaranteed

The ultimate quest of the entire world is peace. Only in peace do we have joy. Not by acquiring things, not by doing things, not by earning or learning, but by dedication. Your entire life must be a sacrifice. Think for the sake of others. To such a person, peace is guaranteed.

- Swami Satchidananda

Tuesday 6 June 2017

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం- ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం కూడా;

జూన్ 6, పంజాబ్ లోని స్వర్ణదేవాలయం వద్ద ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన రోజు.
తమను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ పంజాబ్ లో రాజుకున్న ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం ఏమిటి?
వ్యవసాయానికి, అందులో కలిగిన మార్పులకు, ఖలిస్థాన్ ఉద్యమానికి సంబంధం ఏమిటి?
వ్యవసాయం, పర్యావరణం నాశనమైతే దేశంలో విభజన వాదాలు, అతివాదాలు, తీవ్రవాదాలు పుట్టుకోస్తాయా? వనరుల కాలుష్యం దేశసమగ్రతకు ముప్పా?

వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి శ్రీమతి వందనా శివ గారు చెప్పిన విషయాలు చదవండి.

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం

- వందనా శివ   04/03/2014


ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి 2014కు సరీగ్గా 30ఏళ్ళు నిండుతాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు 1984, జూన్ నెలలో పంజాబ్‌లో ఈ సైనిక చర్యను చేపట్టారు. అమృత్‌సర్‌లోని హర్‌మందిర్ సాహెబ్‌లో తిష్ఠవేసిన జర్నైల్ భింద్రన్‌వాలే..అతని నేతృత్వంలోని సాయుధ మిలిటెంట్లను ఏరిపారేసేందుకు ఈ చర్య తీసుకున్నారు. అయితే పంజాబ్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహణకు, హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి మధ్య అవినాభావ సంబంధముందన్న సం గతి బహుశా చాలామందికి తెలియని విషయం. ఒకవేళ తెలిసినా మరచిపోయి ఉండవచ్చు.



భారత్‌లో హరిత విప్లవం 1966లో ప్రారంభం కాగా, పంజాబ్‌లో 1968లో మొదలైంది. పంట సాగు, ఉత్పత్తుల విధానంలో హరిత విప్లవం సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అంతకుముందు రైతులు వేర్వేరు రకాల పంటలు పండించేవారు. కానీ ఈ హరిత విప్లవం పుణ్యమాని కేవలం వరి, గోధుమ పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. వీటి దిగుబడులు పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించారు. తొలి నాళ్ళలో రసాయన ఎరువులు, విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీని కల్పించింది. పదేళ్ళపాటు ఇదే విధానాన్ని కొనసాగించి, తర్వాత సబ్సిడీలు ఎత్తివేశారు. ఫలితంగా రైతుల ఆదాయం క్రమంగా పడిపోవడం ప్రారంభమైంది. ఇది రైతుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.


ఇదే సమయంలో భింద్రన్ వాలే ఒక మత ప్రచారకుడిగా, గ్రామ గ్రామానికి వెళ్ళాడు. సిక్కుమతం బోధించిన ప్రకారం జీవన విధానాలను కొనసాగించాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాడు. తీవ్ర అసంతృప్తితో ఉన్న సిక్కు యువతను అశ్లీలత, కల్తీ, మత్తుమందులు, పొగాకు వాడకం, మద్యం వంటి వ్యసనాలనుంచి బయటపడి ఖల్సా మార్గంలోకి తిరగి రావాలంటూ ప్రోత్సహించాడు. పై వ్యసనాలకు సిక్కు యువత అలవాటు పడటానికి కేవలం ‘హరిత విప్లవమే’ కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 1984 నాటికి పంజాబ్ పూర్తిగా హింసాకాండతో అట్టుడికిపోయే స్థితికి చేరుకుంది. ఖలిస్తాన్ బోధనలు చివరకు మిలిటెన్సీకి దారితీసాయి, దీని ఫలితంగా, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భద్రతా బలగాలను వినియోగించాల్సి వచ్చింది. ఈవిధంగా హరిత విప్లవానికి, పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసాకాండకు మధ్య ఉన్న తేడాను గుర్తించి...అసలు పంజాబ్‌లో ఏం జరుగుతున్నదనేదానిపై పరిశోధించి ‘‘ది వాయిలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్’’ అనే పుస్తకాన్ని రాయడానికి దారితీసింది. మరి ఈ హరిత విప్లవానికి పితామహుడిగా కీర్తి ప్రతిష్ఠలు అందుకున్న నార్మన్ బోర్‌లౌగ్‌కు నోబెల్ బహుమతి లభించింది మరి!


నిజం చెప్పాలంటే హరిత విప్లవం సుస్థిరమైనది కాదు. పర్యావరణం, ఆర్థిక, సామాజిక పరంగా పరిశీలించినప్పుడు దీని అస్థిరత బయటపడుతుంది. పర్యావరణ పరంగా చూస్తే, రసాయన ఎరువులను విపరీతంగా వాడటం వల్ల భూసారం చచ్చిపోయింది. పంజాబ్‌లో కేవలం ఒకటి లేదా రెండు శాతం ప్రాంతాల్లో మాత్రమే పదిశాతం సేంద్రీయ ఎరువుల వాడకం కనిపిస్తుంది. 1970-71 నుంచి 2010-11 మధ్యకాలం వరకు పరిశీలిస్తే, రసాయన ఎరువుల వాడకం 213,000 టన్నుల నుంచి ఏకంగా 1,911,000 టన్నులకు పెరిగిపోయింది. రసాయన ఎరువులను వాడటం వల్ల వ్యవసాయంలో నీటి వినియోగం బాగా పెరుగుతుంది. పంజాబ్‌లో సరీగ్గా ఇదే జరిగింది. ఆ రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమికి, 27 శాతం ఉపరితల నీటి ద్వారా, 71శాతం భూగర్భ జలం ద్వారా సాగునీరు అందించారు. నీటివాడకం విపరీతం కావడం వల్ల నీటిలో ఉప్పు పరిమాణం పెరిగిపోయి, తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా పంజాబ్‌ను నీటి కరువు ఆవహించడం మొదలైంది.


ఇక 1970 చివరి నాటికి, సబ్సిడీలు ఎత్తివేయడం, పెట్టుబడులు పెరగడంతో రాష్ట్రంలో ఋణ ఆర్థిక వ్యవస్థ చోటు చేసుకోవడం ప్రారంభమైంది. 1980 నాటికి పంజాబ్ రైతులను, భారత దేశానికే అన్నదాతలుగా కీర్తించడం పరాకాష్టకు చేరుకుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. 1986, ఏప్రిల్ 13న గురుగ్రంథ్ సాహెబ్ సమక్షంలో ‘సర్బత్ ఖల్సా’ (సిక్కులు సమావేశం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఏకరువు పెట్టారు. ‘‘నేడు సిక్కులు బానిస సంకెళ్ళతో నానా కష్టాలు పడుతున్నారు’’ అంటూ సమావేశంలో పాల్గొన్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.


1984లో పంజాబ్ రైతులు తాము అనుభవిస్తున్న బానిస బతుకులనుంచి విముక్తి కోసం ఆందోళనకు దిగారు. అదే ఏడాది జనవరి 31న ‘రాస్తారోకో’ నిర్వహించారు. మార్చి 12న వారు గవర్నర్ ఇంటి ముందు ఘెరావ్ చేశారు. తమను పీడిస్తున్న రుణ బాధలనుంచి విముక్తులను చేయాలంటూ, ‘ఖర్జా రోకో’ నిర్వహించారు. తిరిగి అదే ఏడాది మే నెలలో గవర్నర్ ఇంటి ఎదుట ఘెరావ్ చేశారు. చివరకు తాము పండించిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అమ్మకూడదని మే 23న పంజాబ్ రైతులు నిర్ణయించారు. పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసకు మూలం ‘హింసాత్మక వ్యవసాయం’లో ఉంది. ఈ హింసాత్మక వ్యవసాయానికి కారణం ‘హరిత విప్లవం’. ఈవిధంగా బీజ రూపంలో ప్రారంభమైన హింస, ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైనిక చర్యతో పరాకాష్టకు చేరింది. ఆ తర్వాతైనా శాంతి నెలకొన్నదా? అంటే అదీ లేదు. ఈ సైనిక చర్య చివరకు ఇందిరాగాంధీ హత్యకు, ఆ తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు దారితీసింది. పంజాబ్‌లోని సిక్కులకు మరియు రైతులకు ఇప్పటి వరకు జరిగిన అన్యాయం సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.


రసాయన ఎరువుల వాడకం వల్ల నేటికీ పంజాబ్ రైతులు వ్యాధులకు లోను కావడం, కొందరు మరణించడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే భూములు కోల్పోయిన సేంద్రీయ పదార్ధాలు తిరిగి కూడే పరిస్థితి లేదు. విభిన్న పంటలు పండించే పంజాబ్ రైతులను, హరిత విప్లవం పుణ్యమాని, ఖరీఫ్‌లో వరి, రబ్బీలో గోధుమ పండించడానికి మాత్రమే హరిత విప్లవం పరిమితం చేసింది. భూసారం పూర్తిగా క్షీణించి పోవడానికి ఇది కూడా ఒక కారణం. ఒక ఎకరానికి పంజాబ్‌లో ఉత్పత్తి అయ్యే ఆహారధాన్యంలో పోషకత, ఆరోగ్య లక్షణాలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇదంతా హరిత విప్లవం పుణ్యమే! హరిత విప్లవానికి ముందు పంజాబ్ రైతులు మొత్తం 41 రకాల గోధుమ పంటను, 27 రకాల వరి పంటను పండిస్తున్నారు. అదేవిధంగా నాలుగు రకాల మొక్కజొన్న, మూడు రకాల సజ్జలు, 16 రకాల చెరుకు, 19 రకాల పప్పు ధాన్యాలు, తొమ్మిది రకాల నూనె గింజల/సుగంధ ద్రవ్యాల పంటలను పండించేవారు. అప్పట్లో గోధుమకు బదులు, షర్బతీ, దర్రా, లాల్ పిస్సీ,లాల్ కనక్, బన్సీ, కథియా, మాల్వా, పక్వాన్, దావత్ ఖాన్ వంటి నాణ్యమైన రకాలు పంట నాణ్యతను, మూలాన్ని వివరించేవిగా ఉండేవి. కానీ నేడు రైతులు పండిస్తున్న రకాలపై క్రిమి కీటకాలు, వ్యాధులు తేలిగ్గా ఆవహించేవిగా ఉన్నాయి. మరి వ్యాధులు, చీడపీడల నివారణకు మరింత ఎక్కువ డోసుతో క్రిమిసంహారకాలను రైతులు వాడాల్సి వస్తోంది.

2011-12సంత్సరంలో వరి ధాన్యం ఖరీదు రూ.1700, గోధుమకు రూ. 1500 ఉండగా, కనీస మద్దతు ధర మాత్రం రూ. 1285, రూ. 1110 గా నిర్ధారించారు. అదే 1995-2001 మరియు 2001-2005 మధ్యకాలంలో పంజాబ్ రైతుల నికరాదాయం, వరికి రూ.77 నుంచి రూ.7లకు, గోధుమకు రూ. 67 నుంచి రూ. 34కు పడిపోయింది. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సగటున ఎకరానికి రూ. 41,576లు చొప్పున రైతులకు అప్పులు మిగిలాయి. విత్తనాలు, రసాయనాల వంటి ఉత్పాదకాల ఖరీదు విపరీతంగా పెరిగిపోవడంతో, రైతుల ఆర్థిక పరిస్థితి ఋణాత్మకానికి దిగజారింది. మరి ఈ పరిస్థితుల్లో పంజాబ్ రైతుల్లో ఆందోళన, ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం సహజమే. దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సానుకూలంగా అర్థం చేసుకొని అందుకనుగుణంగా స్పందించాలి. ముఖ్యంగా పర్యావరణ, ఆర్థిక పరంగా రైతులకు మేలు చేసే విధానాలను రూపొందించి అమలు పరచాలి. రైతులకు హితుడిగా, మిత్రుడిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి దోహద పడాలి. 1980 ప్రాంతంలో ఈ సంక్షోభం మిలిటెన్సీకి దారితీస్తే నేడు మరో రూపంలో..అంటే ఆత్మహత్యల రూపంలో ఇది కనిపిస్తోంది. 1984 నాటి పాఠాలను దృష్టిలో ఉంచుకొని, హింసాత్మక, ప్రమాదకారి హరిత విప్లవ పథం నుంచి వీడి, రైతు మిత్ర విధానాలను అనుసరించాల్సిన పంజాబ్ ప్రభుత్వం, మోన్‌శాంటో, అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కార్పొరేషన్లతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం దారుణం.


క్రిమిసంహారక మందులు విషపూరితాలు. ఇక జన్యు పరివర్తక మొక్కలు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. బిటి పంటల్లోని బిటి జన్యువులు, హెర్బిసైడ్ రెసిస్టెంట్ పంటల్లోని, హెర్బిసైడ్ రెసిస్టెంట్ జన్యువులు అత్యంత విషపూరితాలు. ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకారులు. మన ఆహారంలో, వ్యవసాయంలో విష పదార్ధాలకు, రసాయనాలకు తావులేదు. మనం మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. పర్యావరణానికి ఏవిధమైన హాని కలిగించని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. అయితే విష రహిత వ్యవసాయాన్ని మరియు ఆహార వ్యవస్థను రూపొందించుకోవడంకోసం మనం కంకణం కట్టుకోవాలి. నిబద్ధతతో కృషి చేయాలి. వ్యవసాయం వల్ల తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన లేదా తీవ్రమైన వ్యాధులకు గురైన వారికి మనం అర్పించే నిజమైన నివాళి ఇదే. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాదు, రైతులు అధిక దిగుబడులను సాధించగలరు. ఇదే సమయంలో పర్యావరణ వ్యవస్థ కూడా దెబ్బతినబోదు. అందువల్లనే ఆధునిక వ్యవసాయం పేరుతో విచ్చల విడిగా వాడే రసాయన ఎరువులు, బయటనుంచి కొనుగోలు చేసే విత్తనాల వల్ల పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి రైతులు నష్టపోవడం తప్ప మరే ఇతర ఫలితం కనిపించదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.

Monday 5 June 2017

పర్యావరణాన్ని పరిరక్షించడం ఎలా?

ప్రకృతిలో అనేక రకాలైన జీవులున్నాయి. ఉదాహరణకు బాక్టీరియా, క్రిములు, పక్షులు, చెట్లు, జంతువులు, మానవులు. ఈ భూమిపైన ఇన్ని రకాల జీవులు వుండవలసినదే. ఎందుకంటే జీవులన్నీ పరస్పరం ఒకదానిమీద ఒకటి ఆధారపడ్డాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక జాతిజీవి నశిస్తే అనేక జీవులు నశించే ప్రమాద ముంది. రైతుల నిత్య జీవితానికి సంబంధించిన రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం.

మినుము, పెసర, జనుము వంటి మొక్కల వేళ్ళలో బుడిపెలు వుంటాయి. అవి నత్రజని నిల్వలు. భూమికి కావలసిన నత్రజనిని ఆ వేళ్ళు అందిస్తాయి. కాని ఆ వేళ్ళలో నత్రజని బుడిపెలు తయారు కావాలంటే భూమిలో ఒక రకమైన బాక్టీరియా, ఆ వేళ్ళుద్వారా మొక్క విసర్జించే పదార్థాన్ని తిని నత్రజని బుడిపెలను తయారుచేస్తాయి. అలాగే వానపాములు భూమిని నిరంతరం గుల్లగా వుంచుతాయి. దానివలన ఆ భూమి ఎంత వాననీటినైనా పట్టి వుంచగలుగుతుంది. రైతులు చీడపీడల నివారణకు ప్రకృతి సిద్ధమైన పద్ధతులు అవలంబించక, రసాయనిక మందులను అధిక మోతాదులో వాడితే, ఆ మందులు వానకు భూమిలోకి ఇంకి ఆ బాక్టీరియాను, వానపాములను చంపుతాయి. దానివలన ప్రకృతి సహజసిద్ధంగా భూమిలో వుండే నత్రజని ఎరువును ఆ భూమిలో వేసినా, భూమి స్వీకరించలేని పరిస్థితి వస్తుంది. అలాగే వానపాములు చచ్చిపోతే నేల గట్టిపడి, వాననీరు భూమిలోకి ఇంకలేక వృధాగా పోతుంది. ఈ రెండింటి వలన భూమి సేద్యానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇది తీవ్రమైన ఆహార కొరత సమస్య సృష్టిస్తుంది. అంటే మానవాళి మనుగడయే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో 1949-68 మధ్య రసాయనిక మందుల వినియోగం, వాటి వలన రసాయనిక నత్రజని వినియోగం 40శాతం పెరిగింది. దానిని భూమిసరిగా తీసుకోలేక పోవడం వల్ల అది నైట్రేట్‌ రూపంలో కాలువలు, చెరువుల లోకి చేరి ఆ నీరు కలుషితమయింది.

మరి రసాయనిక మందులు అతిగా వాడకుండా చీడపీడల నివారణ ఎలా? ప్రకృతిలోనే అనేక కీటకాలు చీడపురుగులను ఆహారంగా కలిగినవి వున్నాయి. వాటిని పెంచి చేలలో వదిలితే చాలు, సస్యరక్షణ అద్భుతంగా జరుగుతుంది. ఇటీవల మన పత్రికలలో చీడపురుగులను కీటకాలు ఆహారంగా స్వీకరిస్తున్న దృశ్యాలు ప్రచురించి, మనకు అవగాహన కలిగించాయి. ఈ పద్ధతిని రైతులలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాలి.

కాబట్టి జీవవైవిధ్యం నాశనమయితే పర్యావరణం పెను ప్రమాదంలో పడుతుంది. అదొక్కటే కాదు. కార్బన్‌డయాక్సైడ్‌, మిథన్‌, క్లోరోఫ్లోరా కార్బన్‌ వంటి గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ కలిగించే వాయువుల వలన కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ జరిగి పర్యావరణ ప్రమాదం పెరుగుతుంది. ఈ గ్లోబల్‌ వార్మింగ్‌కి ప్రధానంగా పరిశ్రమల నుండి వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విషవాయువులు 23శాతం, విచక్షణా రహితంగా చేసే అడువుల నరికివేత మరో 23శాతం కారణాలవుతున్నాయని శాస్త్రజ్ఞుల అంచనా.

కాబట్టి పర్యావరణం, తద్వారా ఈ భూమి, సంరక్షింపబడాలంటే జీవ వైవిధ్యం కాపాడబడాలి. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల తగ్గించబడాలి. కాని వాస్తవంగా ఏం జరుగుతోంది? పారిశ్రామిక అభివృద్ధి ఫలాలన్నీ అనుభవిస్తున్న అమెరికా, అభివృద్ధి కారణంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పట్టించుకోవడం లేదు. ఈ అమానుష చర్య అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ కాలం నుండి చేపట్టబడింది.

జార్జివాషింగ్టన్‌ 1779 మార్చి 31న సైనికాధికారి జనరల్‌ సల్లివాన్‌కు ఈ క్రింది విధంగా ఆదేశాలిచ్చాడు. ''మీరు శతృవులైన ఆరు స్థానిక ఇండియన్‌ జాతులను అదుపు చేయండి. దీనికి గాను వారి పంటలను పొలాల్లోనే నాశనం చేయడం అవసరం. ఇతర పంటలేవీ పండించ బడకుండా చూడాలి.'' (అయ్యో భూగోళం, పేజీ 29) అంతే! వాషింగ్టన్‌ ఆదేశాల మేరకు ఏ ఒక్క మొక్కనూ వదలకుండా వలస సైనికులు ధ్వంసం చేశారు. ఎంతగా ధ్వంసం చేశారంటే ''నయాగరా ప్రాంతంలో గతంలో ఇండియన్‌ జాతులు నివసించి వుండేవనేందుకు ఆధారాలైన వారి ఆహార పంటలు లేకుండా నాశనం చేశాము'' అని సల్లివాన్‌ తన నివేదికలో పేర్కొన్నాడు.

ఇక వియత్నాం యుద్ధంలో విజయానికి ఆమెరికా అనుసరించిన వ్యూహం పర్యావరణ యుద్ధం. అడవులను సర్వనాశనం చేయడం, విషపూరితమైన రసాయనాలను ప్రయోగించడం అనే పద్ధతులు అవలంబించబడ్డాయి. విషరసా యనాలను ప్రయోగించడంలో ముఖ్య బాధ్యతల్లో వున్న ఒక అధికారి 1984లో ఇలా రాశారు.
''అమెరికా అనుసరించిన రసాయన యుద్ధంలో కోట్లాది మొక్కలు, వృక్షాలు చనిపోవడమే కాక నేటికీ పచ్చగడ్డి మొలకెత్తని ప్రాంతాలున్నాయి. నేలలోని పోషక జీవులు అంతరించడంతో ఆ నేల నిస్సారమైంది. వన్య మృగాలు అదృశ్యమయ్యాయి. జలచరాల ఉనికి మాయమైంది. కాలక్రమంలో వింత రూపాలతో శిశువుల జననం లాంటి దీర్ఘకాల ప్రభావాలకు ఈ యుద్ధం కారణమైంది.'' విశేషమే మంటే రసాయనిక యుద్ధానికి సైన్యాధికారులు వెనుకాడినా, అధ్యక్షుడు కెనెడీ పూర్తిగా ప్రోత్సహించాడు.

నికరాగ్వాలో కూడ శాంతినిష్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ప్రతీఘాత సైన్యాన్ని ప్రోత్సహించింది. ఈ సైన్యం పంట చేలపైన దాడికి దిగింది. 75 మందికి పైగా పర్యావరణ శాస్త్రజ్ఞులను కిడ్నాప్‌ చేయడం గాని, చంపడం గాని చేసింది. నికరాగ్వా రైతులకు విత్తనాలు సరఫరా చేసే ప్రధాన విత్తనశుద్ధి సేకరణ కేంద్రంపై దాడి చేసింది. ఇదీ ఆదేశ పర్యావరణంపై దాడి జరిగిన తీరు!

ఇక రీగన్‌ పరిపాలనా కాలంలో అమెరికా ప్రభుత్వం పథకం ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించింది. పర్యావరణ ప్రమాణాలు పరిశీలించే కౌన్సిల్‌లో ఉద్యోగులందరినీ రీగన్‌ తొలగించాడు. పర్యావరణ పరిరక్షణ సంస్థ ఉద్యోగులను నాల్గవవంతుకి తగ్గించాడు. బడ్జెట్‌లో పర్యావరణ పరిరక్షణకి కేటాయింపులు మూడో వంతుకీ, పరిశోధనల కోసం సగానికీ కోత విధించాడు. ఇటువంటి చర్యల కారణంగా బహుళజాతి సంస్థలు పర్యావరణాన్ని నాశనం చేసే చర్యల్లో అమితోత్సాహంగా ముందుకెళుతున్నాయి.
ఈ విషయంలో మన ప్రభుత్వాలు కూడా అమెరికా సామ్రాజ్యవాదానికీ, బహుళజాతి గుత్తసంస్థలకూ అనుకూలంగా వ్యవహరి స్తున్నాయి. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే బిటి విత్తనాలకు ఎర్రతివాచీ పరచడం వంటి పనులు చేస్తున్నాయి. బిటి విత్తనాలు, వాటితో వ్యవసాయం చేసే చేలలోనే కాకుండా, వాటి పుప్పొడి పాకినంత మేర, విత్తనాల పునరుత్పత్తి లేకుండా చేస్తుంది. దానితో మరుసటి సంవత్సరం విదేశీ కంపెనీవారి విత్తనాలను పక్కచేల రైతులు కూడా కొనకతప్పని పరిస్థితి వస్తుంది. కొంతకాలానికి దేశమంతా విదేశీ కంపెనీల విత్తనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశీ విత్తనాలు లేకపోతే మనకు మనుగడ లేని పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా బిటి విత్తనాలు మన స్వాతంత్య్రాన్ని హరించి, మనల్ని అమెరికాకి బానిసల్ని చేస్తాయి. ఇది నా ఊహకాదు. అమెరికా వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి ఎర్లబట్జ్‌ స్వయంగా అన్నమాట. ఆయనేమన్నాడంటే ''ఒకవేళ ఆహారాన్ని ఆయుధంగా వాడుకోదలిస్తే, సంతోషంగా దాన్ని మేం వాడుకుంటాం''. అమెరికా ఆ ప్రయత్నంలో ముందడుగు వేస్తుంటే, మన ప్రభుత్వం దానిపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇది క్రమంగా బానిసత్వానికి దారితీయదా?

మన ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై ఎంత చిన్న చూపంటే, ''ఔషధ పరిశ్రమలు ఉత్పత్తి చేసి విక్రయించే రసాయనాల మొత్తం టర్నోవర్‌పై 1శాతం పన్ను విధించి దాన్ని పర్యావరణ సంస్థల వద్ద డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల క్రితమే ఆదేశించింది. కాని ఈ ఆదేశాన్ని అమలు పరచడంలో ప్రభుత్వాలు ఇప్పటివరకూ శ్రద్ధ చూపడమే లేదు.

కాబట్టి దేశభక్తులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, పర్యావరణ విధ్వంసకారు లెవరు? వారి తైనాతీలెవరు? అనే విషయాలను ప్రజలకు వివరించి, మన భూమిని కాపాడుకొనే చర్యలను ముమ్మరం చేయాలి. భావితరాలకు పచ్చనైన భూమిని వారసత్వంగా అందజేయాలి.

కె.ఎల్‌. కాంతారావు
సెల్‌: 9490300449
సేకరణ: http://www.navatelangana.com/article/net-vyaasam/36515

చెట్లు నరకడం గురించి విష్ణుపురాణం



Asipatravana/Asipatrakanana (forest of sword leaves): The Bhagavata Purana and the Devi Bhagavata Purana reserve this hell for a person who digresses from the religious teachings of the Vedas and indulges in heresy.The Vishnu Purana states that wanton tree-felling leads to this hell. Yamadutas beat them with whips as they try to run away in the forest where palm trees have swords as leaves. Afflicted with injury of whips and swords, they faint and cry out for help in vain.

Sunday 4 June 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి



Every one should develop a keen sense of responsibility unto one self.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 245 (14 లోకాలు - 14 చక్రాలు)

ఈ 14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7 చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు. కైలాసనాథ పరంపర నందినాథ సంప్రదాయానికి చెందిన గురువు, శైవాగమ పండితులు, జగదాచార్యులు శ్రీ శ్రీ శ్రీ సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి వారు చెప్పిన ఆ విశేషాలు తెలుసుకోండి.

1. మూలాధారం - వెన్నుపూస అంత్యభాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం - బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.
3. మణిపూరం - నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం - హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం - కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ - కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం - తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.

నరకాలు, పాతాళ లోకాల గురించి చూద్దాము.

1. అతలం - అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం - బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.
5. రసాతలం - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.
6. మహాతలం - అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.7.
7. పాతాళం - కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.

కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.

To be continued .........

Saturday 3 June 2017

స్వామి శివానంద సూక్తి



Your mind will sometimes shudder when evil thoughts enter your mind. This is a sign of your spiritual progress. You are growing spiritually. You will be much tormented when you think of your evil actions committed in the past. This is also a sign of your spiritual upheaval. You will not repeat now the same actions. Your mind will tremble. Your body will quiver whenever a wrong thought of some evil action urges you to do the same act through force of habit. Continue your meditation with full vigour and earnestness. All memories of evil actions, all evil thoughts, all evil promptings of Satan, will die by themselves. You will be established in perfect purity and peace.

- Swami Sivananda

Friday 2 June 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



Healthy People

People who are healthy don’t hurt anyone. They are not afraid of anyone. Not only are they unafraid, but they see that others are not afraid of them either. The ‘others’ include animals, plants, everything. Healthy people emit always and only loving and pure vibrations.

- Swami Satchidananda