Thursday 31 August 2017

వినాయక నవరాత్రుల్లో పూజించాల్సిన గణపతి స్వరూపాలు- జపించవలసిన మంత్రాలు



వినాయక నవరాత్రుల్లో రెండవ రోజు నెమలి వాహనం మీద కూర్చున్న గణపతిని 'ఓం శ్రీ సౌరబ్రహ్మణే వికటాయ నమః' అని ధ్యానించాలి లేదా ఓం వికటాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. అటుకులు నివేదించాలి. ఈ రోజు వికట వినాయకుని స్మరణ వలన కామదోషం నివారణవుతుంది. అధర్మబద్ధమైన కామం నశిస్తుంది. ఈ రోజు గణపతి సూర్యభగవానుని రూపంలో ప్రకాశిస్తాడు. సూర్యతత్త్వం కలిగి ఉంటాడు. సూర్యమండలంలో ప్రకాశిస్తూ ఉంటాడు.


వినాయక నవరాత్రుల్లో మూడవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న గణపతిని 'ఓం శ్రీ శక్తిబ్రహ్మణే లంబోదరాయ నమః' అని ధ్యానించాలి లేదా ఓం లంబోదరాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు లంబోదర వినాయకుని స్మరణ వలన క్రోధ దోషం నివారణవుతుంది. అనవసరమైన క్రోధం/ కోపం నశిస్తుంది. లంబోదర గణపతి క్రోధాసురుడిని అణిచివేశాడు. ఈయన శక్తి స్వరూపం. ఈ రోజు స్వామి వారికి పేలాలు నివేదించాలి.

వినాయక నవరాత్రుల్లో ఐదవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న మహోదర గణపతిని 'ఓం శ్రీ జ్ఞానబ్రహ్మణే మహోదరాయ నమః' అని ధ్యానించాలి. ఓం మహోదరాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు మహోదర వినాయకుని స్మరణ వలన మోహదోషం నివారణవుతుంది. మోహం నశిస్తుంది. మహోదర గణపతి జ్ఞానస్వరూపంగా వెలుగొందుతూ ఉంటాడు. స్వామి ధ్యానం జ్ఞానన్ని ఇస్తుంది.
నేడు స్వామికి కొబ్బరి కురిడీ నివేదించాలి.


వినాయక నవరాత్రుల్లో ఆరవ రోజు ఎలుక వాహనం మీద కూర్చున్న గణపతిని 'ఓం శ్రీ ఏకదంతాయ నమః' అని ధ్యానించాలి. ఓం ఏకదంతాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు ఏకదంత వినాయకుని స్మరణ వలన మద దోషం నివారణవుతుంది. మదం నశిస్తుంది.


వినాయక నవరాత్రుల్లో ఏడవ రోజు సింహవాహనం మీద కూర్చున్న వక్రతుండ గణపతిని 'ఓం శ్రీ బ్రహ్మస్వరూపాయ వక్రతుండాయ నమః' అని ధ్యానించాలి. ఓం వక్రతుండాయ నమః అని కూడా 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు వక్రతుండ వినాయకుని స్మరణ వలన మాత్సర్యదోషం నివారణవుతుంది. మాత్సర్యం నశిస్తుంది.  
వక్రతుండునికి అరటిపళ్ళను నివేదించాలి. ఈయన బ్రహ్మస్వరూపంలో వెలుగొందుతూ ఉంటారు. 



వినాయక నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఆదిశేషుని మీద కూర్చున్న విఘ్నరాజ గణపతిని 'ఓం శ్రీ విష్ణవే విఘ్నరాజాయ నమః' అని ధ్యానించాలి లేదా 108 సార్లు ఆయన నామం జపించవచ్చు. ఈ రోజు విఘ్నరాజ వినాయకుని స్మరణ వలన మమతా దోషం నివారణవుతుంది. అనవసరమైన మమకారం నశిస్తుంది. ఈయన విష్ణుస్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఆయన ఆశీనుడైన ఆదిశేషుడు మహాపితృ. ఈయన్ను పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. సత్తుపిండి నివేదన చేయాలి.


వినాయక నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మూషికం మీద కూర్చున్న ధూమ్రవర్ణ గణపతిని 'ఓం శ్రీ శివాత్మనే ధూమ్రవర్ణాయ నమః' అని ధ్యానించాలి లేదా ఓం ధూమ్రవర్ణాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. ఈ రోజు ధూమ్రవర్ణ వినాయకుని స్మరణ వలన అభిమాన దోషం నివారణవుతుంది. అనవసరమైన అభిమానం/ అహంకారం నశిస్తుంది. ఈయన శివస్వరూపుడు. అహాన్ని అణగద్రొక్కి తనలో ఐక్యం చేసుకుంటాడు. తన భక్తులు ఎక్కడ ఉన్నా, వాయువు రూపంలో ఉంటూ, వారిని గమనిస్తూ, రక్షిస్తూ ఉంటాడు.
నేతి అప్పాలు నివేదించాలి.

Wednesday 30 August 2017

వక్రతుండ మహాకాయ.... (1)



గణపతికి సంబంధించి మనకు అనేక స్తోత్రాలు లభ్యమౌతున్నాయి. అందులో అత్యంత మహిమాన్వితమైనది, అందరూ సులభంగా నేర్చుకుని చదువదగినది

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా

వివరణ- ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకోగా, ఆయనకు అనేక విఘ్నాలు ఎదురయ్యాయి. ఎంత ప్రయత్నించినా ఆయన కార్యం ముందుకు కదల్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, పరబ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఎన్నో దివ్యసంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, పరబ్రహ్మ వక్రతుండ గణపతిగా సాక్షాత్కరించి, బ్రహ్మదేవుడికి వక్రతుండ మంత్రాన్ని ఉపదేశించారు. 

అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ మాత చేత శ్రీ గణేశుడి సృష్టించబడటానికి పూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు. శివపార్వతుల కల్యాణంలో కూడా గణపతిని పూజించారు. అంటే గణపతి ఈనాటి వాడు కాదు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము. అందుకే ఒకనాడు ముద్గల, గర్గ మహర్షులతో కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతిని పరబ్రహ్మంగా స్తుతించిన స్తోత్రం కూడా ఉంది.

సనాతన ధర్మంలోనే శైవం, శాక్తేయం, వైష్ణవం వలె గాణాపత్యం అనే మతం కూడా ఉంది. ఇందులో గణపతిని పరబ్రహ్మంగా, మిగితా దేవీదేవతలంతా ఆయన అంశలుగా భావించి ఉపాసిస్తారు. ఆయనే ఆది మూలంగా ఉపాసిస్తారు.

సంపదలను కలిగించి, పోషించువాడు, నిధులను ఇచ్చువాడు, అన్నసమృద్ధిని ఇచ్చువాడు అంటూ ఆ మంత్రం ఎన్నో రకాలుగా స్వామి వైభావన్ని ప్రకటించి, చివరలో వక్రతుండ షడక్షర మంత్రంతో ముగుస్తుంది. బ్రహ్మదేవుడు ఆ మంత్రం మీద ధ్యానం చేసి, ఆ తర్వాత సృష్టి చేయడాన్ని ఆరంభించాడు. అప్పుడు ఆయనకున్న విఘ్నాలన్నీ తొలగి, సృష్టి సజావుగా సాగింది.

ఇదే విషయం ఉమామహేశ్వరుల సంవాదం రూపంలో శ్రీ కృష్ణాయామల తంత్రంలో కనిపిస్తుంది. అందులో 

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 

సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు ఎవరినైతే విశేషంగా పూజించి, ఫలసిద్ధిని పొందాడో, అటువంటి పార్వతీ పుత్రుడైన శ్రీ గణనాథుడు నా ఋణములను నాశనం చేయుగాకా అని ఉంది.

ఇప్పుడు మనకొక సందేహం వస్తుంది. బ్రహ్మదేవునకు విఘ్నాలు కలగటం ఏమిటి?.... త్వమేవ కేవలం కర్తాసి అని గణపతి అథర్వశీర్షోపనిషత్తు వర్ణించింది. అంటే ఈ సమస్త సృష్టిలో కేవలం గణపతి మాత్రమే కర్త. మిలిగినవారు అంటే పిపీలికాది బ్రహ్మ ప్రయంతం ఉన్న జీవులంతా పాత్రధారులు మాత్రమే. తానే కర్తను అనుకోవడం వల్లనే జీవులకు కర్మఫలం అంటుకుని, జననమరణ చక్రంలో కొట్టుకుపోవలసి వస్తోంది. తాను కర్తను కాదు, భగవంతుడే కర్త, అన్నీ ఆయనే చేస్తున్నాడు, నేను కేవలం పాత్రధారిని మాత్రమేననే భావన కలిగి ఉంటే, మరణానంతరం నేరుగా బ్రహ్మంలో ఐక్యమవుతాము. దీనికి ప్రధానమైన కారణం అహంకారం. అందుకే అహం నశిస్తే, అన్నీ నశిస్తాయని భగవాన్ రమణ మహర్షి అన్నారు. బ్రహ్మదేవుడు కూడా తానే ఈ సృష్టికి కర్తను అనుకుని ఉంటాడు. అందుకే ఆయనలో కలిగిన ఆ అహంభావాన్ని తొలగించడానికి పరబ్రహ్మ స్వరూపమైన గణపతి/ విఘ్నాధిపతి/ విఘ్నరాజు విఘ్నాన్ని కలిగించాడు. ఇది అస్తిత్వంలోకి రాబోయే లోకానికి, జీవులకు ఎంతో ప్రేమతో, కరుణతో వక్రతుండుడు చేసిన తొలి ఉపదేశం. దీన్ని ఒక్కదాన్ని జాగ్రత్తగా జీవితంలో పాటించినా, జీవులు త్వరితగతిన ఆ పరబ్రహ్మరూపమైన గణపతిలో ఐక్యమవుతారు.

వక్రతుండ మహాకాయ......(2)

వక్రతుండ- అంటే చాలామంది వంకర తొండం కలవాడని అర్దం చెబుతున్నారు. కానీ వక్రతుండ అనే పదానికి 'వక్రానాం తుండయతీతి ఇతి వక్రతుండః' అని వ్యుత్పత్తి. వక్రములను తుండెము చేయువాడు వక్రతుండుడు.

సృష్ట్యాదిలో బ్రహ్మదేవునకు కలిగిన విఘ్నాలను నశింపజేశాడు. తాను కర్తను అనే భావనయే వక్రము. అదే జన్మల పరంపరకు కారణమవుతుంది, అది అహం నుంచి పుడుతుంది. ఆ భావనను బ్రహ్మలో నశింపజేసినవాడు వక్రతుండుడు.
వక్రబుద్ధులను నశింపజేయువాడు వక్రతుండుడు. వక్రబుద్ధి మనలోనే ఉండవచ్చు, లేదా మన చుట్టూ ఉన్నవారిలో మనపట్ల వక్రమైన ఆలోచనలను ఉండవచ్చు. వక్రతుండ అనే నామస్మరణ చేతనే ముందు తన భక్తులలోనూ, ఆ తర్వాత వారి చుట్టూ ఉన్నవారిలో వక్రబుద్ధులను నశింపజేయువాడు వక్రతుండుడు....... ఇక్కడ వక్రం అంటే విఘ్నం అని కూడా చెప్పుకోవచ్చు. వివాహం ఆలస్యం జరగడం, సంతానం కలగపోవటం, చక్కని ఉద్యోగం లభించకపోవటం, ఉన్నత విద్యాప్రాప్తికి ఆటంకాలు.... ఇలా జీవితంలో మనకు ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. ఇవన్నీ వక్రాలు/ విఘ్నాలు. వీటిని తుండెము చేయువాడు వక్రతుండ గణపతి..... అందుకే ‘వక్రతుండ గణపతి అనేది పరిపూర్ణ రూపం. ఆయన్ను అన్నిటికోసం ప్రార్ధించవచ్చు. మంచి ఉద్యోగం, వివాహం, విద్య...... ఇలా అన్నిటికి వక్రతుండమే సమాధానం’ అని అంటారు పూజ్య గురువులు వి.వి.శ్రీధర్ గారు. అలాగే వామాచారం, అధర్మప్రవృత్తి, దుర్గుణాలు, దుష్టుల సహవాసం..... మొదలైనవి కూడా వక్రములే. వాటిని నిర్మూలించాలన్నా, వక్రతుండ గణపతిని హృదయపూర్వకంగా ప్రార్ధించాలి.

వక్రం ఆత్మ రూపం ముఖం యస్య- అని గణపతి వక్రతుండం గురించి చెబుతూ శాస్త్రం వివరించింది. అనగా ఆత్మ ప్రధానంగా వక్రించి ఉంటుంది అని. ఆత్మ వక్రించి ఉండటమేంటి? దీనికి భగవాన్ రమణ మహర్షి గారు మాత్రమే సమాధానం చెప్పారు. వారు ఎప్పుడూ షట్చక్రాల మీద ధ్యానం చేయమనలేదు, షట్చక్ర భేదనం గురించి చెప్పలేదు, ఈ జగత్తుని విడిచిపెట్టండి అని చెప్పలేదు.... వారు నేరుగా చెప్పారు. ఎందుకంటే వారంటారు.... కుండలినీ సహస్రారం చేరితే, సమాధి స్థితి వస్తుంది. కానీ వాసనలు నిర్మూలించబడవు. కాబట్టి యోగి సమాధి నుంచి బహిర్ముఖుడవుతాడు, బంధాల నుంచి విడువబడడు. కాబట్టి అతడు వాసనాక్షయం కోసం ఇంకా సాధన చేయాల్సి ఉంటుంది..... సుషుమ్నా నాడి ద్వారా మూలాధారం నుంచి సహస్రారం చేరిన కుండలినీ, అటు తర్వాత వంపు తిరిగి ఉన్న జీవనాడి ద్వారా హృదయాన్ని చేరుతుంది. ఆ జీవనాడినే అమృతనాడి అని కూడా అంటారు. అది వక్రించి ఉంటుంది. హృదయం అంటే భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. భౌతిక హృదయం ఎడమభాగంలో ఉంటే, ఆధ్యాత్మిక హృదయం కుడిభాగంలో ఉంటుంది.... అందులోకి కుండలినీ చేరితే, అప్పుడు నిరాటంకమైన సమాధి స్థితి కలుగుతుంది..... సాధారణంగా కుండలినీ సహస్రారం చేరిన తర్వాత, అప్పుడు జీవుడిలో 'నేనేవరు' అనే విచారణ మొదలై, దానికి సమాధానం దొరకగానే అది హృదయంలో కలిసిపోతుంది అని భగావన్ రమణ మహర్షి చెప్పారు. అందుకే రమణులు వేరే ఏ పద్దతి చెప్పకుండా, నేరుగా నేనెవరు అనే విచార మార్గాన్ని చూపారు. అది హృదయం వద్దే మొదలై, త్వరితగతిన ముక్తిని ఇస్తుంది, అందుకే వారు అవధూత, దక్షిణామూర్తి.....  వక్రతుండ గణపతి దానినే సూచిస్తున్నాడు. ఆయనకు వంకర తొండం ఉన్నా, అది ఏదో ఒక ప్రక్కకు తిరిగి ఉంటుంది. దీని ద్వారా స్వామి, వక్రించి ఉన్నఆత్మ తత్త్వాన్ని సూచిస్తున్నాడు.  వక్రములు కలిగిన మార్గాల నుంచి భక్తులను తప్పించి నేరుగా తనను చేరే మార్గాన్ని చూపువాడు వక్రతుండుడు.

త్వం సాక్షాదాత్మాసి నిత్యం అని గణపతి అథర్వశీర్షోపనిషత్తు అంటున్నది. అంటే సాక్షాత్తు ఆత్మ రూపంగా గణపతి ఉన్నాడు అని అర్దం.. ఆ ఆత్మయే తాను, అదే హృదయం. అందుకే గణపతిని గృత్సమదుడు ముద్గల పురాణంలో 'హృదిప్రకాశస్య ధరం స్వధీస్థం' అని స్తుతించాడు. అంటే విచారణ ద్వారా తన్ను తాను తెలుసుకుంటే, హృదయంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న గణనాథుని దర్శనం పొందవచ్చు. అదే వక్రతుండుని దర్శనం.  

వివరణ ఇంకా పూర్తికాలేదు .....

Saturday 26 August 2017

శ్రీ గణేశుని అవతారాలు - గణేశ పురాణం



మనకు వినాయకుడి గురించి తెలిసిన కథలు కొన్నే. ఆయన గురించి ఇంకా అనేక పురాణాల్లో ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి. వినాయక జననం వివిధ పురాణాల్లో వివిధంగా ఉంది. వరాహ పురాణంలో ఒక రకంగా, శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము, శివపురాణాల్లో వేరుగా ఉండటానికి కారణం అవి వేర్వేరు కల్పాల్లో జరగడమే... మనకు నాలుగు యుగాలు- సత్యయుగం(కృత యుగం), త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒకడే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కాలాల్లో వ్యక్తమై తన లీలలను చూపి, దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం, ధర్మ సంస్థాపన చేయడం సనాతనధర్మంలోనే కనిపిస్తుంది. దేవుడి యొక్క ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది. అది మామూలు బుద్ధికి అర్దం కాకపోవచ్చు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో "పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని అన్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ , ధర్మ సంరక్షణ కోసం పదే పదే అవతరిస్తాను అని చెప్పాడు . ఇదే విధంగా గణేశుడు కూడా చెప్పినట్లు గణేశపురాణంతర్గతమైన గణేశ గీతలో స్వామి వెళ్ళడించాడు. తానెత్తిన అవతారాల్లో మహోత్కట వినాయకుడు, మయురేశ్వర వినాయకుడు, గజాననుడు అవతారాలు ముఖ్యమైనవి! ఇవి గణేశ పురాణంలో చెప్పబడ్డాయి.

కృతయుగంలో అదితి కశ్యపులను తల్లిదండ్రులుగా చేసుకుని గణపతి అవతరించారు. బంగారు శరీరచ్ఛాయతో పది చేతులతో సింహవాహనమెక్కి మహోత్కట గణపతి పేరుతో ప్రసిద్ధుడై దేవాంతక నరాంతక అనే రాక్షసుల్ని వధించాడు.  

త్రేతాయుగంలో గణనాధుని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. స్ఫటిక శరీరచ్ఛాయతో 8 చేతులవాడై మయూర (నెమలి) వాహనం ఎక్కి మయూర గణపతిగా ఖ్యాతి నార్జించి సింధువనే రాక్షసుణ్ణి చంపాడు.

ద్వాపరయుగంలో పార్వతి నలుగుమట్టి ద్వారా పుట్టి, కుంకుమరంగు శరీరచ్ఛాయతో 4 చేతులవాడై ఎలుక వాహనాన్ని ఎక్కి గజావన గణపతి పేరుతో విఖ్యాతుడై సిందూరడనే రాక్షసుడిని మట్టుపెట్టాడు.

కలియుగంలో తనంత తానుగా (స్వయంభువు) పుట్టి పొగరంగు శరీరచ్ఛాయతో రెండు చేతులవాడై నీలం రంగు కలిగిన అశ్వాని (గుఱ్ఱాన్ని) వాహనంగా చేసుకుని ధూమకేతు గణపతి పేరిట, కలియుగంలోని మొదటి పాదం దాటాక (1,80,000 సంవత్సర మీదట) దుర్జనులందర్నీ వధిస్తాడు. ధర్మసంస్థాపన చేస్తాడు.

అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శివపురాణతర్గతమైన వినాయక చవితి కథ ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పంలో జరిగింది. మిగితా అవతారాలు అనేక కల్పాల్లో జరిగాయి. ఇవికాక అష్టగణపతి అవతారాలు ఉన్నాయి. మరలా 16 గణపతి రూపాలు ఉన్నాయి, 32 గణపతి రూపాలు ఉన్నాయి, కొన్ని గ్రంథాల్లో 64, 108, 1008 గణపతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రతికార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు శాసించాడు!! త్రేతా యుగాములోను, ద్వాపరయుగాములోను శివ పార్వతులకే వేరు వేరు విధాలుగా జన్మించటం చూసి ఎవరైనా గందరగోళం చెందుతారు కానీ వాస్తవం ఇది ! త్రేతాయుగంలో తనకు పుత్రునిగా పరబ్రహ్మ ఆవిర్భవించాలని పార్వతి మాత తపస్సు చేయగా, మాతకు పుత్రునిగా కలిగాడు, ద్వాపరంలో తన చేతిలో బొమ్మగా చేసి అమ్మవారు ప్రాణం పోసింది ! ఇవే కాకా వక్రతుండ, ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ అనే అవతారాలు ఉన్నాయి.

Friday 25 August 2017

ఉత్తరానికి తల పెట్టి ఎందుకు నిద్రించకూడదు? గణేశుని కథలో ఈ విషయం వెనుకనున్న అంతరార్ధం ఏమిటి?



గణేశుని కథలో ఈ విషయం వెనుకనున్న అంతరార్ధం ఏమిటి?

గౌరీ పుత్రుని తల నరికిన తర్వాత, ఆ బాలకునికి కొత్త శిరస్సు పెట్టి జీవం పోయడానికి శివుడు తన గణాలను పంపిస్తాడు. ఉత్తరదిశగా తలపెట్టి నిద్రిస్తున్న జీవి తలను పట్టుకుని రమ్మని చెప్తాడు. గజాసురుడు ఉత్తరానికి తలపెట్టి నిద్రించగా, ఆయన తలను నరికి తీసుకువస్తారు. అయితే ఈ కథ చెప్పినప్పుడు పెద్దలు గట్టిగా చెప్పేమాట- ఉత్తరానికి తల పెట్టి నిద్రపోవద్దు అని. అసలు ఎందుకు అలా నిద్రించకూడదు?

సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు ఈ విషయాన్ని అనేక మార్లు వివరించారు. దాని నుంచి కొంత.

దైవం మీ శరీరాన్ని ఎలా నిర్మించారు?

మీ గుండె, మీ శరీరం మధ్యలో ఉండదు. కిందినుండి శరీరానికి మూడు వంతులపైన అది ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, గురుత్వాకర్షణకు వ్యతిరేకదిశలో రక్తాన్ని పంపడం కష్టం, కిందికి పంపడం తేలిక. పైకి వెళ్లే రక్తనాళాలు కిందికి వెళ్లే రక్తనాళాల కంటే సన్నగా ఉంటాయి. అవి మెదడులోకి చేరుకునే సరికి, వెంట్రుక అంత సన్నగా అయిపోయి ఒక్క చుక్క రక్తాన్ని కూడా అధికంగా తీసికొని వెళ్లే సామర్థ్యం కలిగి ఉండవు. ఒక చుక్క అధికంగా పంపు చేసినా ఏదో ఒక నాళం పగిలిపోయి మీకు మెదడులో రక్తస్రావం జరుగుతుంది.

చాలామందికి వారి మెదళ్లలో రక్తస్రావం కలుగుతుంది. మిమ్మల్నిది పెద్దగా దెబ్బతీయక పోయినా చిన్న నష్టాలు మాత్రం కలిగిస్తుంది. మీరు కొంత మందబుద్దులుగా అవుతారు, చాలామంది అలానే అవుతున్నారు కదా. 35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది. మీ వ్యవహారాలు మీరు నడుపుకోగలగడానికి కారణం మీ జ్ఞాపకశక్తే తప్ప, మీ మేధస్సు కాదు.

మీరు ఉత్తరదిశగా తలపెడితే ఏం జరుగుతుంది?

మీకేదయినా రక్తసంబంధమైన సమస్య, ఉదాహరణకు రక్తహీనత ఉంటే మీ డాక్టరు, మీకు ఏమిస్తాడు? ఇనుము. మీ రక్తంలో అదొక ముఖ్యమైన పదార్థం. భూగోళం మీద అయస్కాంత క్షేత్రాల  గురించి మీరు వినే ఉంటారు. అనేక విధాలుగా భూమి నిర్మాణం దాని అయస్కాంతం కారణంగానే జరిగింది. ఈ భూగోళం మీద అయస్కాంత శక్తుల శక్తి అది.

35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది.

మీ శరీరం బల్లపరుపుగా ఉన్నప్పుడు మీ నాడి వేగం తగ్గిపోవడం మీరు గమనించవచ్చు. మీ శరీరం వెంటనే సర్దుబాటు చేసుకుంటుంది కాబట్టి ఇలా జరుగుతుంది. లేకపోతే అదే స్థాయిలో రక్తప్రసరణ జరిగినట్లయితే రక్తం మీ మెదడులోకి అధికంగా వెళ్లి హాని చేస్తుంది. మీరు ఉత్తరానికి తలపెట్టి 5, 6 గంటలు పడుకున్నట్లయితే అయస్కాంత ఆకర్షణ మీ మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. మీకు కొంత వయస్సు మళ్ళితే మీ రక్తనాళాలు బలహీనమై రక్తస్రావాలు కలుగుతాయి, పక్షవాతం వస్తుంది. మీ వ్యవస్థ దృఢంగా ఉండి ఇటువంటి సంఘటనలు మీకు జరగకపోవచ్చు కాని మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడులో ఉండవలసిన దానికంటే ఎక్కువ రక్తప్రసరణ జరిగితే మీరు ఆందోళనతో మేల్కోవలసి వస్తుంది. ఇలా జరిగితే ఒక్కరోజులో మీరు చచ్చిపోతారని కాదు. కాని మీరు రోజూ ఇదే విధంగా చేస్తే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. అలాగే ఉత్తరానికి తలపెట్టి నిద్రిస్తే, సుఖనిద్ర ఉండదు, రక్తపోటు (బీపీ) వస్తుంది. మీ వ్యవస్థ ఎంత దృఢంగా ఉందన్నదాన్ని బట్టి మీకు వచ్చే సమస్యల స్వభావం ఉంటుంది.

అందువల్ల మీరు ఏవైపు తలపెట్టి నిద్రించడం అన్నిటికంటే మంచిది? తూర్పు అన్నిటికంటే మంచిది. ఈశాన్యం పరవాలేదు, పడమర కూడా మంచిదే. తప్పనిసరి అయితే దక్షిణం. ఉత్తరం మాత్రం కూడదు. మనం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్నప్పుడు మీరు ఉత్తరానికి తప్ప మరేవైపైనా తలపెట్టుకొని నిద్రపోవచ్చు. దక్షిణార్ధ గోళంలో ఉన్నప్పుడు దక్షిణానికి మాత్రం తలపెట్టకూడదు. ఎందుకంటే అక్కడి అయస్కాంత క్షేత్రం యొక్క పనితీరు వేరు. అక్కడ ఉన్నవారు దక్షిణానికి తలపెట్టి నిద్రించకూడదు.

సేకరణ: http://isha.sadhguru.org/blog/te/2016/08/15/how-to-sleep/

Wednesday 23 August 2017

స్వామి శాంతానంద పురీ సూక్తి



Love God to the exclusion of everything else. Be obsessed and possessed by God day and night. Think of Him constantly and chant His name. All your impurities will dissolve and God will reveal Himself.

- Swami Shantanandapuri

Tuesday 22 August 2017

స్వామి రామ్ దాస్ సూక్తి



If we rightly understand life and the world around us, we will surely know that we are placed by God in a field or sphere where we are given the fullest opportunity for striving to throw off the animal and even the human mask and manifest our true divine life and existence.
-Swami Ramdas

Sunday 20 August 2017

హిందూ ధర్మం- 250 (14 లోకాలు- Scientific analysis)




7-D A Plane of All Possible Worlds With the different Start Conditions; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అవ్వడం ఈ పరిమాణం నుంచి వీక్షించవచ్చు.

5 మరియు 6 పరిమాణాల్లో ఒక సమయంలో ప్రారంభమైన లోకాల ఉనికి, వాటి స్థానాన్ని పోల్చుకునే అవకాశం ఉండగా, ఈ 7-D కి చేరగానే, ఒక సమతంలో ఉన్న విభిన్నమైన లోకాలు, వేర్వేరు సమయాల్లో ప్రారంభమై, అనేక విధాలుగా పరిణామం చెందడం ఈ Dimension లో ఉన్న వారు చూసేందుకు సాధ్యపడుతుంది.  నిజానికి ఇన్ని లోకాలను, వాటిలో జరిగే విభిన్నమైన మార్పులను చూడగల సామర్ధ్యం బ్రహ్మదేవునకు ఉంది. కాబట్టి ఇక్కడే బ్రహ్మలోకం ఉండవచ్చు.  మిగితా Dimensions లాగానే ఇక్కడి నుంచి కూడా తన క్రింద ఉన్న అన్నిDimensions ని చూసే అవకాశం ఇక్కడ ఉన్నవారికి ఉంటుంది.

8-D A Plane of All Possible Worlds, Each With Different Start Conditions, Each Branching Out Infinitely; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అయ్యి, వివిధ ఆకృతులలో  నిరవధికంగా పెరగడం.

అంటే పాలకడలిలో శేషతల్పంపై శ్రీ మన్నారాయణుడు ఉండే Dimension ఇది. సముద్రంలో ఏర్పడే కెరటాల మీదనున్న నురగలో నిరంతర ఎన్నో బుడగలు ఉద్భవించి, లయిస్తుంటాయి. అలానే దైవసృష్టిలో అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవించి, లయిస్తూ ఉంటాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన నుంచి అనేకమంది బ్రహ్మలు ఉద్భవించి, లయిస్తూ ఉంటారు, ప్రతి బ్రహ్మ- ఒక బ్రహ్మాండాన్ని సృష్టి చేస్తుంటాడు. బ్రహ్మాండంలో లోకాలు ఉంటాయి. ఇవన్నీ నిత్యం గమనిస్తూ ఉంటాడు శ్రీ మన్నారాయణుడు. ఇక్కడి నుంచి చూసినప్పుడు, ఎన్నో బ్రహ్మాండాలు ఉద్భవించి, అనంతంగా వ్యాపిస్తూనే ఉంటాయి. దాన్ని ఊహించడం కూడా అసాధ్యం.

మళ్ళీ మనం ఆదినారాయణుడని అంటాము. ఆదినారాయణుడంటే పరతత్త్వము, ఆది నుంచి ఉన్నవాడు. ఆయన నిరాకారుడని చెప్తారు.


9-D All Possible Worlds, Starting With All Possible Start Conditions and Laws of Physics; విభిన్నమైన బ్రహ్మాండాలు అన్నీ అన్ని సమతలాలలో వివిధ సమయాలలో, వివిధ సాధ్యమైన ఆకృతులలో ప్రారంభం అయ్యి నిరవధికంగా పెరగడం, ఇక్కడి భౌతిక సూత్రాలు వేరుగా ఉంటాయి. దానికి ఈ 3-D ప్రపంచంలో అంటే మనుష్యలోకంలో ఉన్న భౌతిక సూత్రాలకు సంబంధం లేదు.

అంటే ఒకనాడు మహాశివలింగం ఇక్కడే, ఈ పరిమాణంలోనే ఆవిర్భవించి ఉండవచ్చు. అదే ఈ లోకంగా మారిందని లింగపురాణం మొదలైనవి చెబుతున్నాయి. ఈ పరిమాణంలో ఉండి, తన క్రిందనున్న ఇతర పరిమాణాల్లో ఉన్న లోకాలు, బ్రహ్మాండాల చరిత్రను చూడవచ్చు, పోల్చవచ్చు, నమోదు చేయవచ్చు. అంటే వేదవ్యాస మహర్షి ఈ పరిమాణానికి చేరుకుని అక్కడి నుంచి పురాణ రచన చేశారు. పురాణాల్లో చెప్పబడిన లోకాలు అసలు ఉంటాయా? అవి సాధ్యమా? మేము నమ్మాలా? అంటారు కదా, ఈ 9-Dimension కి వెళితే, అప్పుడు అర్దమవుతుంది.

మన పురాణాల్లో చెప్పబడిన అనేక అంశాలు, ఈ 3-D ప్రపంచంలోనే జరిగినవి కావు, అవి అనేక ఇతర Dimensions లో వేర్వేరు సమయాల్లో జరిగాయి. ఆ Dimensions లో ఉన్న ధర్మాలు వేరు. అక్కడి జీవుల జీవనశైలి భిన్నమైనది. వారిది మనలాంటి రక్తమాంసాలతో కూడిన దేహం కాదు. వారు ఎంతో పరిణతి చెందిన జీవులు. పురాణాల మీద విమర్శ చేసే ముందు మనకు క్వాంటం ఫిజిక్స్ అర్దమైతే బాగుంటుందేమో?! ఈ విషయం బోధపడితే, మనం ఋషులను ఏనాడు నిందించము, కనీసం ప్రశ్నించము కూడా.


10-D Infinite Possibilities – లెక్కలేనన్ని ప్రపంచాలు , ఒక నిర్దుష్టమైన ప్రణాళిక లేకుండా పెరిగి పెద్దవ్వడం.
ఇక్కడ అసాధ్యమన్నది ఏదీ లేదు. ఇక్కడకు చేరిన జీవుడు, భగవంతుని అద్భుత సృష్టిని చూసి ఆశ్చర్యపోవటం తప్ప, దాన్ని విశ్లేషించలేడు. లెక్కలేనన్ని విశ్వాలు, లెక్కలేకుండా ఉద్భవించి, వ్యాప్తి చెంది, లయించడం, అది కూడా ఒక క్రమంలో కాదు, గందరగోళంగా జరగటం చూడవచ్చు. ఇది జీవులకు మాత్రమే గందరగోళం కానీ, పరబ్రహ్మానికి కాదు.  

11D M-థియరీ ప్రకారం ఒక నిర్దుష్ట ప్రణాళిక ద్వారా లయం కూడా అవ్వడం. వాటి పూర్తి అవగాహన ఉండడం. ఇది పరబ్రహ్మం స్థాయి. జీవుడు ఇక్కడికే చేరుకుని, పరబ్రహ్మంలో లయమవుతాడు. ఇక్కడ ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుందంటే, ఇక్కడ ఉన్న పరబ్రహ్మ మిగితా  లో ఉన్న లోకాలను, తనలోకి లాక్కునే ప్రయత్నం చేస్తాడు. వేర్వేరు వేగాలతో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించి, లయించే అనేక సృష్టిలు, తెలిసో తెలియకో, దానిలోకే వెళ్ళిపోతున్నాయి. అందుకే సనాతన ధర్మంలో "ఎవరు ఏమి చేసినా, చేయకున్నా, అందరు ఒకనాడు ఆయనవద్దకు చేరుకునేవారే........ అన్నిటి యొక్క గమ్యం ఆ బ్రహ్మమే..... ప్రతి కర్మ భగవంతునిదే...... ప్రతి క్షణం భగవంతునికి చెందినదే...... మంచి వారు, చెడ్డవారు... అందరూ ఆయనలోనే కలిసిపోతారు..... రాక్షసులు, దేవతలు, ఆయన దిశగానె పయనిస్తున్నారు........" అని బోధిస్తుంది.

To be continued ..........
(వివరణ ఇంకా పూర్తి కాలేదు)

Saturday 19 August 2017

స్వామి శివానంద సూక్తి



In the practice of Sama, the five Jnana-Indriyas or organs of knowledge, viz., ear, skin, eye, tongue and nose are also controlled. Sama is serenity of mind produced by the constant
eradication of Vasanas or desires.

- Swami Sivananda

Thursday 17 August 2017

Wednesday 16 August 2017

శ్రీ అరోబిందో సూక్తి



The heavens beyond are great and wonderful, but greater and more wonderful are the heavens within you. It is these Edens that await the divine worker.

- Sri Aurobindo

Sunday 13 August 2017

సద్గురు శివానంద ముర్తి గారి సూక్తి



If you are emerging totally pure, free from even a speck or a dust of ignorance or selfishness anywhere you are enlightened.

- Satguru Sivananda Murthy Garu

హిందూ ధర్మం - 249 (14 లోకాలు- Scientific analysis)



మనకు ఈ లోకం ఒక్కటే కనిపిస్తోంది. కానీ అనేక లోకాలు ఉన్నాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల్లో ఋషులు అనేక లోకాలకు ప్రయాణం చేశారని ఉంది. అంటే అది లోకాంతరప్రయాణం. ఇప్పటి శాస్త్రవేత్తలు చేస్తున్న గ్రహాంతర ప్రయాణం మాత్రమే..... మరి మనకు ఆ లోకాలు కనిపించవెందుకు? ఆ లోకవాసులు మనకు ఎందుకు కనిపించరు? ఆ లోకాలు ఉన్న చోటకు రాకెట్‌లు వెళ్ళలేవా? ..... ఆ లోకాలు మామూలు నేత్రాలకు, సాధరణ బుద్ధికి అందే స్థాయిలో లేవని, వాటిని చూడటానికి అతీయింద్రియ దృష్టి కావాలని ధర్మం చెబుతుంది..... కళ్ళకు కనిపించవు కనుక ఇదంతా అసత్యమని, ఏదో కల్పించి చెబుతున్నారని, ఇదంతా సైన్స్‌కు విరుద్ధమని, కళ్ళకు కనిపించేదే నమ్మమని మనదేశంలో ఉన్న కొందరు హేతువాదులు (ఆ ముసుగు వేసుకున్న హైందవద్వేషులు) వాదిస్తారు. కానీ వారికి, హిందువులకు సమాధానం క్వాంటం ఫిజిక్స్‌లో ఉంది.

ధర్మాన్ని అనుసరించి విశ్వం బహు మితీయంగా (Multi dimensional) అయినది. అందులో ప్రతి లోకం, ఒకదానితో ఒకటి మరియు పరమాత్మతోనూ పరస్పరం అల్లుకుని (Interwoven) ఉంటాయి. ఇదే సిద్ధాంతాన్ని క్వాంటం ఫిజిక్స్ ప్రతిపాదిస్తుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం కూడా ఈ విశ్వంలో అనేక ప్రపంచాలు, లోకాలు ఉన్నాయి. అవి కళ్ళకు కనిపించనప్పటికీ, వాటికి అస్థిత్వం ఉందని క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్తలు నమ్ముతారు. నిజానికి క్వాంటం ఫిజిక్స్ అధ్యాపకులు వేదాంతాన్ని, సనాతన ధర్మాన్ని చాలా బాగా మెచ్చుకుంటారు. విద్యార్ధులకు క్వాంటం ఫిజిక్స్ పాఠాలు భోదిస్తుంటే, అద్వైతం భోదించినట్లుగానే ఉంటుందని హాన్స్ పీటర్ డర్ గారు చెప్పిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాన్ని అనుసరించి - మొత్తం ఈ విశ్వంలో 10 పరిమాణాలు (Dimensions) ఉన్నాయని అనుకుంటున్నారు, పరిశోధనలు అవి పెరగవచ్చు కూడా. వాటికి సంబంధించిన ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో సూపర్ స్ట్రింగ్” సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. యజుర్వేదంలోని రుద్రం 11 పరిమాణాల (11 Dimensions) గురించి చెబుతుంది.

1-Dimension  పొడవు (length)
2-D ఎత్తు (height )
3-D లోతు (depth )

మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచం, చూస్తున్న జగత్తు, నక్షత్రాలు, గోళాలు, ఉల్కలు, అంతరిక్షం ...... దృశ్యమానమైన ఈ జగత్తంతా 3D. అయినా మనం 3-D సినిమా చూడాలంటే, ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకోనిదే కుదరదు.

4-D time, ఒక వస్తువు ఎంత సేపు ఒక స్థానం లో ఉండగలిగిందో చెప్పే పరిణామం ఇది. 3 పరిణామాలతో పాటు, కాలంలో ఒక వస్తువుకు స్థానం ఎక్కడో తెలుసుకుంటేనే, బ్రహ్మాండంలో దాని స్థానాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ Space ఉండదు. ఉన్నదంతా కాలమే (Only time).

చనిపోయిన తర్వాతా చాలా వరకు జీవులు 4-D లోకే వెళతారు. అందుకే వారు మనకు కనిపించరు. అంటే మరణం తర్వాత ఆత్మ, ఈ పాంచభౌతికమైన, దేశకాలాల (Time and Space) కు లోబడిన పరిమాణం (Dimension) నుంచి భిన్నమైన పరిమాణంలోకి ప్రయాణిస్తుంది. కానీ ఈ క్షేత్రంలో ఉన్నవారు, క్రింది Dimension  లో ఉన్నవారిని చూడగలరు, వారి మాటలు వినగలరు. అందుకే జీవుడు (ఆత్మ) మరణానంతరం ఈ 4-D లోకి ప్రవేశించినా, అది ఎరుగక, తన వారి కోసం ఏడుస్తుంది. వారికి ఏదేదో చెబుతుంది. కానీ వినేవారు ఉండరు. ఆ తర్వాత క్రమంగా ఇది పాపపుణ్యాలను బట్టి నరకానికి లేదా స్వర్గానికి ప్రయాణిస్తుంది. సనాతన హిందూ ధర్మంలో మరణం తర్వాత చేసే అపరకర్మలన్నీ ఈ Dimension లో ఉన్న జీవుడిని ఉద్దేశించి చేసేవే. కానీ ఇంతకముందు చెప్పుకున్నట్లు, విశ్వంలో అన్నీ పరస్పరం అల్లుకుని ఉన్న కారణం చేత, ఇక్కడ (3-D) చదివే వేదమంత్రాల శక్తి వలన ఆ జీవుడికి మార్గం దొరికి అది ఉన్నత లోకాలకు పయనిస్తుంది.

5-D Possible Worlds: మనకన్నా కొంత విభిన్నమైన ప్రపంచం. ఈ 5-D నుంచి చూసినప్పుడు, మనకంటే భిన్నమైన లోకాలను చూసే అవకాశం ఉంటుంది. వాటికి మనలోకానికి మధ్య ఉండే సామ్యాలను, వ్యత్యాసాలను గుర్తించే అవకాశం కలుగుతుంది. అక్కడి కాలం ఇక్కడి కాలానికి భిన్నంగా నడుస్తూ ఉండవచ్చు. అక్కడి కాలగతి (కాలం యొక్క వేగం) దీనికంటే తక్కువ ఉండవచ్చు. వారు మనకంటే ముందు నుంచి జీవిస్తూ ఉండవచ్చని క్వాంటం సిద్ధాంతం చెబుతుంది. అంటే యమలోకం, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన ఊర్ధ్వలోకవాసుల నివాసాలు ఇక్కడే ఉండి ఉండవచ్చు. అందుకే పితృదేవతల కాలానికి, దేవతల కాలానికి, మనుష్యుల కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే మానవ లోకంలో 30 రోజులు పితృదేవతలకు ఒక రోజుతో సమానం. మానవుల 1 సంవత్సరం దేవతలకు 1 రోజుతో సమానం. (వీటి గురించి గతభాగాల్లో చెప్పడం జరిగింది).

6-D A Plane of All Possible Worlds With the Same Start Conditions; విభిన్నమైన విశ్వాలు (లోకాలు) అన్నీ ఒకే సమతలం (Plane) లో ఒకే సమయానికి ప్రారంభం అవ్వడం (బిగ్ బాంగ్ లాంటిది) ఇక్కడి నుంచి చూడవచ్చు. ఎవరైతే ఈ 5-D మరియు 6-D మీద పట్టు సాధిస్తారో, వారు కాలంలో ముందుకు, లేదా వెనక్కు వెళ్ళగలరు. కాలంలో వెనక్కు ప్రయాణించి గతంలోకి వెళ్ళగరు, అలాగే ముందుకు ప్రయాణించి, భవిష్యత్తును దర్శించగలరు.

దేవలోకం అనగా స్వర్గం మొదలైనవి ఇతర లోకాల స్థానం ఇదే కావచ్చు. అందుకే దేవతలు తమ దివ్యదృష్టితో గతాన్ని, భవిష్యత్తును దర్శించగలరని ధర్మం చెబుతుంది. మానవలోకంలో నివసిస్తూనే, మన మధ్య ఉంటూనే, సాధన ద్వారా సిద్ధి పొందిన యోగులు ఈ పరిణామాన్ని చూడగలరు. అందుకే వారు కూడా పితృదేవతలను, దేవతలను చూడగలరు. వ్యక్తిని చూసి, అతడి గత జన్మ, రాబోవు జన్మలు చెప్పగలరు. అంటే సనాతనధర్మంలో చెప్పబడిన ఆధ్యాత్మిక సాధన వ్యక్తిని భౌతికమైన 3-D ప్రపంచం నుంచి ఇంకా పై స్థాయికి తీసుకువెళుతునందని స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ...............

Saturday 12 August 2017

స్వామి శివానంద సూక్తి



Whenever desires crop in your mind, do not try to fulfil them. Reject them through discrimination, right enquiry and dispassion. You will get tranquillity of mind and mental strength by constant practice. The mind is thinned out. The mind is checked directly from wandering. Its outgoing tendencies are curbed. If the desires are eradicated, the thoughts also will die by themselves. The mind is detached from the manifold sense-objects by continually observing their defects and is fixed on Brahman.

- Swami Sivananda

భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? - డా.సుబ్రమణియన్ స్వామి సమాధానం

నిజమైన భారత దేశ చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక దేశ భక్తుడి బాధ్యత !

నేను హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నపుడు ఒక సౌదీ అరేబియా విద్యార్ధి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: "భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? " నేను అన్నాను "నువ్వు అడగదలుచుకున్నది ఏమిటి?"

ఆ విద్యార్ధి ఈ విధంగా చెప్పాడు: "రియాద్ లో మా విశ్వవిద్యాలయం లో జరిగిన పరిశోధనలో ఎక్కడ ఇస్లాం ప్రవేశిస్తే ఆ దేశం 100% ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అని తెలుసుకున్నాను. ఉదా: ఇరాన్ ఒక జొరాస్ట్రియన్ (మతం) దేశం, కాని ఇస్లామిక్ దండయాత్ర జరిగిన తరువాత అక్కడ జనాభ మొత్తం 100% ఇస్లాం లోకి మారిపోయారు, 17 సంవత్సరాలలో ఇరాక్ కూడా ఇస్లామిక్ దేశం గా మారిపోయింది, 21 సంవత్సరాలలో ఈజిప్ట్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. అలాగే క్రైస్తవ మతం కూడా ఐరోపాలో 50 సంవత్సరాలలో వ్యాపించింది. కాని భారత దేశం మాత్రం 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటీషు(క్రైస్తవ) పాలనలో ఉంది. కాని ఇంకా భారత దేశం లో 80% హిందువులు ఎలా ఉన్నారు?"  

నా సమాధానం: మన దేశం పై దండ యాత్ర చేసిన విదేశీయులతో మనం ఎన్నో యుధ్ధాలలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మన పూర్వీకులు పోరాటాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వారి తుది శ్వాస వరకు పొరాటం చేశారు. అందుకే ఈ దేశంలో ఇంకా సనాతన ధర్మం మిలిగి ఉంది.

-సుబ్రమణియన్ స్వామి


నిర్విరామంగా మన పూర్వీకులు దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎంతో దారుణమైన, కష్టమైన పరిస్థితులను ఎదురుకుని నిలిచారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఎందుకోసం? ఎవరి కోసం? ....... అందుకే మనం ఇవాళ హిందువులుగా జన్మించగలిగాము అంటే అది వారి బిక్షయే..... ఇంత గొప్ప సంస్కృతికి వారసులము కాగలిగాము. వాళ్ళ శ్రమ, త్యాగాలు వృధా కాకూడదు. ఈ ధర్మాన్ని రక్షించి, మన తర్వాతి తరాలకు అందించడం మినహా మరే ఇతర విధంగానూ మనం వారి ఋణం తీర్చుకోలేము. ధర్మాచరణ, ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ, దేశరక్షణ మన తక్షణ కర్తవ్యాలు. అవే మన తాతముత్తాలకు, పితృదేవతలకు ఇచ్చే పెద్ద గౌరవం.

Friday 11 August 2017

యోగ లక్ష్యం- స్వామి సచ్చిదానంద సూక్తి



The Aim of Yoga

If your friends laugh at you and say, ‘With Yoga you are just running away from the world; you are not going to enjoy anything,’ tell them, ‘We are the people who are going to enjoy it best because we are working to bring everything under our control. We don’t want to be controlled by anything. We want to be masters of our tongues and our eyes. We won’t be slaves to our desires.’ This is the aim of Yoga.

- Swami Satchidananda

Thursday 10 August 2017

స్వామి రామతీర్థ సూక్తి



The very best method of spreading the vedantic philosophy is to live it.

- Swami Rama Tirtha

11-08-2017, శుక్రవారం, శ్రావణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ



11-08-2017, శుక్రవారం, శ్రావణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ
దీనికి హేరంబ సంకష్టహర చతుర్థి అని పేరు. కష్టాలను తీర్చేవాడు, ఎవ్వరూ లేరు అనుకున్న వారికి నేను తోడున్నాను అని చెప్పేవాడు హేరంబుడు.

శ్రావణమాసంలో వచ్చే సంకష్టహర చవితి చాలా విశేషమైనదని ముద్గల పురాణం చెబుతోంది. ఈ రోజున గణపతిని గరికతో అర్చించి, ఆయన పూజించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి తప్పకుండా గణపతి ఆలయాన్ని సందర్శించండి.

వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html

11 ఆగష్టు 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.23 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

Wednesday 9 August 2017

Tuesday 8 August 2017

ఓషో సూక్తి


The past is no more and the future is not yet: both are unnecessarily moving in directions which dont exist. One used to exist, but no longer exists, and one has not even started to exist. The only right person is one who lives moment to moment. – OSHO

Sunday 6 August 2017

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి


హిందూ ధర్మం - 248 (14 లోకాలు)

ఇంతకి ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? వాటి లోకవాసులు ఎలా ఉంటారు? వారు సాధారణ మనుష్యులేనా? లేక దివ్యలోకాలకు చెందినవారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ ప్రశ్నలకు నాస్తిక కోణం నుంచి సమాధానాలు వెతికితే, అది అర్ధ సమాచారంతో ముగుస్తుంది, అవగాహనారాహిత్యన్ని బయటపెడుతుంది. మనకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రప్రమాణం, రెండవది ఆప్తప్రమాణం, మూడవది ఆత్మప్రమాణం. శాస్త్రమనగా వేదాది శాస్త్రాలు, ఆప్తులు అంటే ధర్మం మేలు కోరేవారు; భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, త్రైలింగ స్వామి మొదలైనవారు; ఆత్మప్రమాణం అంటే వ్యక్తి యొక్క అనూభూతి/ దివ్యానుభవం. ఆత్మప్రమాణాన్ని ఆప్తప్రమాణం, శాస్త్రప్రమాణంతో పోల్చి చూసి, అప్పుడే నిర్ధారణకు రావాలి. శాస్త్రకారుల దృష్టి, జ్ఞానం, అనుభవం మనకు లేకపోవచ్చు, కనుక మలిన, సంకుచిత బుద్ధితో వీటికి అర్దాలను చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించకూడదు.



దేవ- అనే పదం ద్యు లేదా ద్యౌ అనే అక్షరం నుంచి వచ్చింది. ద్యౌ అంటే కాంతిగల లోకం. దేవతలు అంటే కాంతి శరీరం కలిగినవారు. వారివి మనలాంటి పాంచభౌతిక దేహాలు కాదు, రక్తమాంసాలతో నిండిన దేహాలు కావు, అవి దివ్యశరీరాలు. వారు కాంతి శరీరులు. అందుకే దేవతలు ప్రత్యక్షం అయ్యారని అంటాము, అంటే కళ్ళముందు కనిపించడం; అదృశ్యం అయ్యారు అంటాము- దృశ్యం అంటే కనిపించేది, కనిపించకుండా పోవటం అదృశ్యం. అంటే తమను వ్యక్తం చేసుకున్న దేవతలు తిరిగి అవ్యక్తమవ్వడం అన్నమాట. అలాగే పితృదేవతలు - మరణించిన మన కుటుంబాలకు చెందినవారు. వీరు కూడా భౌతిక దేహాన్ని కోల్పోయి, పితృలోకానికి చెందిన శరీరాన్ని పొందినవారే. దేవత అంటే ఇచ్చుటకు శక్తి కలిగి ఉన్నది అని అర్దం. పితరులు ఆశీస్సులు నిత్యజీవితంలో ఎంతో అవసరం. అలాగే ఇంద్రాది దేవతలవి కూడా. వారు మనకు ఎన్నో విధాలుగా సాయం చేస్తారు. వరాలను ఇస్తారు. అందుకే దేవతలు అన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల వృద్ధికి కారణమవుతుంది కనుక వారిని దేవతలుగా భావించమని వేదం చెప్పింది. ఇంద్రుడు, అగ్ని, ఆదిత్యుడు, యక్షులు, గంధర్వులకు పునర్జన్మ ఉంది. అయితే పరంబ్రహ్మ/ పరమాత్మ- ఈ దేవతలకంటే పైస్థాయివాడు. మనం పూజించే శివ, శక్తి, విష్ణు, గణేశ మొదలైన స్వరూపాలు ఈ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు.

ఇప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజదేవుడిని పూజించండి, మా ఏసు మాత్రమే నిజదేవుడు, అల్లాహ్ నే అసలు దేవుడు, హిందూ దేవీదేవతలు సైతాన్లు అంటూ మతమార్పిడి మూకలు ప్రచారం చేస్తున్నాయి. దేవత (తెలుగులో దేవుడు) అనేది సంస్కృతపదం. అది ఎవరికి వాడాలో కూడా శాస్త్రమే చెప్పింది. ఈ అన్యమతస్తులు చెప్పిన దేవుడికి రూపంలేదు, అది కాంతిశరీరం కలదని, దివ్యశరీరం కలదని వాళ్ళ గ్రంథాలు చెప్పలేదు. ఉంటే అలా ఎక్కడుందో reference చూపించమని అడగాలి. అసలు శరీరం ఉందని చెప్పడమే నింద అని చెప్పాయి. కానీ వాళ్ళేమో నిజదేవుడంటారు- ఈ దేవుడు అనే పదం వాళ్ళు వాడటం ఆయా గ్రంథాలను అపహాస్యం చేయడం, వాళ్ళ గాడ్‌ (God) కు ఈ పదాన్ని హిందువులు ఉపయోగించటం సనాతనధర్మాన్ని అవమానించటమే అవుతుంది. ఇది మనం గమనించాలి. వారు వాడకూడదని తెలియజేయాలి. 

అలాగే యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఇతర లోకవాసుల గురించి, సూర్యమండలం, చంద్రమండల వాసుల గురించి పురాణాలు చెబుతున్నాయి. వీరి ఎక్కడ ఉన్నట్లు? వీరిని మానవులుగా, కొండజాతి వారిగా భావించకూడదు. యక్షులు, గంధరువులు మొదలైన వారితో సంభాషించిన మహాత్ములు, సిద్ధులు ఈ భూమి మీద తిరిగారు. వారి చరిత్రలు మనలో పేరుకుపోయిన ఎన్నో సందేహాలను, అపార్ధాలను తొలగిస్తాయి. యక్షులు, గంధర్వులు మొదలైనవారు కామరూపధారులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. వీరు చెడ్డవారు అనే అభిప్రాయం చాలామంది చెప్తారు. కానీ వాస్తవంలో చక్కని జ్ఞానం, లోకహితం కోరే యక్షులు అనేకమంది ఉన్నారు. భగవంతుడు వీరిని కొన్ని అరణ్యాలకు రాజులుగా నియమించాడు. ఆయుర్వేద మూలికలపై వీరి ఆధిపత్యం ఉంటుంది. సంపదల కోసం లోకులంతా పూజించే కుబేరుడు యక్షరాజు. కొన్ని పురాతన ఆలయాలను నిర్మించినప్పుడు, ఆ ఆగమంలో భాగంగా ఆ ఆలయసంపదలకు రక్షకులుగా యక్షులను నియమించడం కనిపిస్తుంది. ఆలయ గోడలపై రకరకాల రూపాలు చెక్కి ఉండటం మనం చూస్తుంటాము. అందులో కొన్ని యక్షులవి ఉంటాయి. వారు ఆ ఆలయానికి రక్షకులుగా ఉంటారు. 

ఆలయ సంపదను, హుండీ డబ్బును ప్రభుత్వం తీసుకుని ప్రజల కోసం ఉపయోగించాలి. దేవాలయంలో స్వామికి అర్పించిన బంగారాన్ని ప్రభుత్వం కరిగించి తాకట్టు పెట్టాలి; ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటూ ఉంటాము. గుప్తనిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు జరపడం చూస్తుంటాము... ఇలాంటి మాటలు మాట్లాడేవారిని, నిధుల కోసం ఎగబడేవారిని యక్షులు శిక్షిస్తారు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా, పనులు చేయకుండా జాగ్రత్తపడండి. యక్షులకు దైవభక్తి ఉంటుంది. మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అప్పుడు మనకు తగిన ఫలితం ఇచ్చేది ఎవరు?.... యక్షిణీదేవతయే ఆ చెట్టు మీద ఉండి, మన ప్రదక్షిణకు తగిన ఫలితం ఇస్తుందని తంత్రగ్రంథాల్లో శివపార్వతుల సంవాదంలో కనిపిస్తుంది. అనగా వీరు దివ్యశరీరం కలవారని స్పష్టమవుతోంది.  దేవలోక గాయకులు గంధర్వులు. వీరు కూడా దివ్యశరీరులు. వీరికి దైవభక్తి అధికం, పరమాత్మను ఉద్దేశించి వీరు చేసే గానాలకు గంధర్వవేదం అనే ప్రత్యేక వేదం కలిగి ఉన్నారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి సన్నిధిలో హాహా, హూహూ అనే పేరుగల గంధర్వులు గానం చేశారు. అప్పుడు స్వామి వారి గానానికి మైమరిచి, తాళం వేశారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి మూలవిరాట్టు స్వయంభూః. అక్కడ స్వామి రూపం కూడా తాళం వేస్తున్నట్లుగానే ఉంటుంది. 

అహోబిలం, మాల్యాద్రి, అరుణాచలం, శేషాచలం (తిరుమల), శ్రీశైలం, పశ్చిమ కనుమూల్లో కొన్ని ప్రదేశాలు.... ఇలా అనేక పవిత్ర స్థలాల్లో యక్షులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన ఇతరలోక జీవులు ఈనాటికీ తపస్సు చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఋషుల జీవిత చరిత్రలను గమనించినప్పుడు, వారు తపస్సు చేసుకోవడం కోసం, దేవకార్యం కోసం భూలోకనికి వచ్చారాని చెప్పబడి ఉంటుంది. ఆ కార్యం పూర్తవ్వగానే తిరిగి దివ్యలోకాలకు వెళ్ళిపోయారని కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఈ లోకం కాక మరెన్నో లోకాలు ఉన్నాయని ఆప్తుల ద్వారా, గురువుల ద్వారా స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ........

Saturday 5 August 2017

స్వామి శివానంద సూక్తి



The subtle impressions, tendencies, desires and passions lying in the depths of the subconscious have a tremendous effect on your conscious life. They should be purified and sublimated. They must be given a spiritual turn. Hear what is auspicious. Behold what is auspicious. Think what is auspicious. Talk what is auspicious. Meditate what is auspicious. Understand what is auspicious. Know what is auspicious.

- Swami Sivananda

Thursday 3 August 2017

శారదా దేవి సూక్తి



I tell you one thing. If you want peace of mind, do not find fault with others. Rather learn to see your own faults. Learn to make the whole world your own. No one is a stranger, my child; this whole world is your own.

- Sarada Devi

Wednesday 2 August 2017

రామకృష్ణ పరమహంస సూక్తి



One should keep pictures of holy men in one's room. That constantly quickens divine ideas............It is true that one's spiritual feelings are awakened by looking at the picture of a sādhu. It is like being reminded of the custard-apple by looking at an imitation one.............. Therefore I tell you that you should constantly live in the company of holy men.

- Sri Ramakrishna Paramahamsa

Tuesday 1 August 2017

స్వామి వివేకానంద సూక్తి



ఒక్క అడుగు కూడా వెనక్కూ వేయవద్దు

You gain nothing by becoming cowards. ... Taking a step backward, you do not avoid any misfortune.

- Swami Vivekananda