Sunday 28 June 2015

హిందూ ధర్మం - 164 (సృష్టి- నాసదీయసూక్తం)

వేదాల్లో ఇప్పటివరకు విజ్ఞానం గురించి, స్త్రీల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఋగ్వేదం 10 వ మండలం 129 వ సూక్తంలో సృష్ట్యారంభం గురించి చెప్పబడ్డ నాసదీయసూక్తం గురించి అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సనాతనవైదిక ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది అనాది. ఎప్పటి నుంచో జరుతూనే ఉంది. సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే, సముద్రపు అలలపై నురుగులో ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంతకోటి విశ్వాలు. నీటి బుడగల మాదిరిగా విశ్వాలు నిత్యం అనేకం లయమవుతుంటాయి, కొత్తవి ఏర్పడుతుంటాయి. కనుక ఎక్కడైన హిందూగ్రంధాల్లో సృష్ట్యాది అంటే ఇప్పుడు అనంతకోటి విశ్వాల్లో ఏదో ఒక విశ్వం యొక్క సృష్ట్యాదిగానే అర్దం చేసుకోవాలి.

---------------------------------

ఈ విశ్వం ఎందుకు ఉంది? అంటే, ఈ విశ్వం యొక్క ఉనికికి కారణం ఏమిటి? ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి? ఈ విశ్వనిర్మాణానికి వాడబడ్డ ఘటకద్రవ్యాలు ఏమిటి? ఈ విశ్వం ప్రాదుర్భావానికి కారణభూతులు ఎవ్వరు? మహావిస్పోటనంతో విశ్వం పుట్టింది అన్నారు. ఈ మహావిస్పోటనం ఎందుకు జరిగింది? ఈ విస్పోటనంతోటే స్థలం, కాలం పుట్టేయని అన్నాం కదా. విస్పోటనానికి 'ముందు' స్థలమే లేకపోతే ఆ పేలిన పదార్ధం (బ్రహ్మ పదార్ధం?) ఎక్కడ ఉండేది? మహావిస్పోటనంలోనే కాలం పుట్టినప్పుడు 'విస్పోటనానికి ముందు' అనే సమాసానికి అర్ధం ఉందా?

పోనీ, పైన అడిగిన ప్రశ్నలకి వేదాంత ధోరణిలో తప్ప శాస్త్రీయ ధోరణిలో సమాధానాలు చెప్పలేమని ఒప్పేసుకుందాం – మాటవరసకి. మన ప్రశ్నలని భౌతిక శాస్త్రం విధించిన పరిధిలోనే అడుగుదాం. పదార్ధం పరమాణు రేణువులతో తయారయింది అన్నారు కదా. కొన్ని పరమాణు రేణువుల అస్తిత్వానికి నిలకడ (అంటే స్థిరత్వం) ఉండి, కొన్నింటికి లేదు. ఎందుకని? మనిషి ఎంత పొడుగున్నాడో, ఎంత బరువున్నాడో కొలిచినంత మాత్రాన ఆ మనిషి తత్త్వం అర్ధం అవుతుందా? అలాగే మనం చేసినదల్లా విశ్వంలోని అంశాలని కొన్నింటిని – దూరాలు, వేగాలు, కాలాలు, గరిమలు, ఆవేశాలు, మొదలైన భౌతిక రాశులని - కొలిచాం. అంతే కాని ఈ విశ్వం యొక్క తత్త్వాన్ని అర్ధం చేసుకోలేదు. అంటే ఇప్పుడు మన దగ్గరున్న కేవలం సమాచారం (Information) మాత్రమే. ఈ విశ్వం యొక్క అస్తిత్వానికి కారణం ఏమిటి? ఈ రకం ప్రశ్నలకి ఆధునిక భౌతిక శాస్త్రం ఆమోదకరమైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది – ఇప్పటివరకు.

అంటే ఏమిటన్నమాట? కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో మనకే తెలియటం లేదు. మరికొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఇంకా అధునాతనమైన అభిమతాలలో దొరకొచ్చనే ఆశ ఉంది. ప్రస్తుతానికి మొదటి రకం ప్రశ్నలకి సమాధానాలు మరొక కోణం నుండి వెతుకుదాం.

ప్రశ్నలను మొదట లేవనెత్తినవారు సనాతనధర్మానికి చెందిన ఋషులే.ఋగ్వేదంలో (10.129) నాసదీయ సూక్తం అనే మంత్రం ఉంది. ఎందుకంటే వర్ణించటం అనేది మనసుతో, భాషతో చేసే పని. మనసుకు చాలా వేగవనతమైనది, శక్తివంతమైనదే అయినా, దానికి కొన్ని పరిమితులున్నాయి. అది అన్నిటిని చెప్పగలదు కానీ సర్వాతీతమైన భగవంతుని గురించి చెప్పలేదు. మనసుకు ఆ స్థాయిని వర్ణించగలశక్తి లేదు. భగవంతుని అనుభూతి చెందడం తప్పించి, దాన్ని భావంలో చెప్పలేము. అటువంటిది సృష్టికి పూర్వం ఏముందంటే ఏం చెప్పగలం? సృష్టికి పూర్వం ఉన్నది కేవలం భగవత్తత్వం మాత్రమే. పరబ్రహ్మం తప్ప వేరొకటిలేదు. అయినా కరుణతో ఆ పరమసత్యం యొక్క చిన్న బింధువును ఈ సూక్తంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మంత్రంలోని భావం భాషకి అతీతం. సమాధిస్థితిలో మునులు అనుభవించి అవగాహన చేసుకున్న బ్రహ్మ సత్యాన్ని భాష విధించిన శృంఖలాలకి బద్ధులై చెప్పారు. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని భాషలో బంధించి చెప్పేసరికి సగం భావం నశించిపోయి ఉంటుంది. మిగిలినదానిని ఇంగ్లీషులోకో, తెలుగులోకో దింపి చెప్పటానికి ప్రయత్నిస్తే మరో వన్నె తరిగిపోతుంది. అయినా సరే నాసదీయ సూక్తంలోని ఏడు శ్లోకాలలోని భావాన్ని అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
---------------------------------------------------



नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत् ।
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥1॥

సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?

न मृत्युरासीदमृतं न तर्हि न रात्र्या अह्न आसीत्प्रकेतः ।
आनीदवातं स्वधया तदेकं तस्माद्धान्यन्न परः किं चनास ॥2॥

మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. అన్నిటికి అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేనీ మీద ఆధారపడిలేదు. ఆ బ్రహ్మం తప్ప వెరొకటిలేదు.

तम आसीत् तमसा गूळमग्रेऽप्रकेतं सलिलं सर्वमाइदम्
तुच्येनाभ्वपिहितं यदासीत् तपसस्तन्महिनाजायतैकम् || 3 ||

అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం (బ్రహ్మ పదార్ధం) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.)

कामस्तदग्रॆ समवर्तताधि मनसॊ रॆत: प्रथमं यदासीत् ।
सतॊबन्धुमसति निरविन्दन्हृदि प्रतीष्या कवयॊ मनीषा ॥4॥

దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.

तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासी दुपरिस्विदासी ।
रेतोधाआसन् महिमान आसन् स्वधा अवस्तात् प्रयतिः परस्तात् ॥5॥

మరియు శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైనశక్తులను తయారు చేసింది. అన్నిటికిపైన చైతన్యశక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణకు తగ్గట్టుగా నడుస్తోంది.

को अद्धा वेद क इह प्र वोचत् कुत आजाता कुत इयंविसृष्टिः ।
अर्वाग् देवा अस्य विसर्जनेनाथा को वेद यतआबभूव ॥6॥

కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు (పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే).

इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न ।
यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा नवेद ॥7॥

ఈ సృష్టిని చేసి, దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. బహుసా అతనికి కూడా తెలియదేమో! (ఎవరికి తెలుసు?)

ఈ సూక్తంలో చెప్పిన చాలా విషయాలను ఆధునిక భౌతికశాస్త్రం కూడా వర్ణించింది. విశ్వోద్భవశాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద అవగాహన ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది.

ఈ రచనకు సహయాపడిన రచనలు -
వేమూరి వేంకటేశ్వరరావు గారి విశ్వస్వరూపం అనే వ్యాససంపుటం
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct11/viswaswarupam.html
స్వామి కృష్ణానంద సరస్వతీ గారు నాసదీయసూక్తానికి రాసిన భాష్యం
http://ajitvadakayil.blogspot.in/2014/07/nasadiya-sukta-rig-veda-5000-bc.html
http://hinduismdecoded.blogspot.in/2014/10/nasadiya-sukta-of-rig-veda-creation-of.html

To be continued .................

Sunday 21 June 2015

హిందూ ధర్మం - 163 (వేదంలో స్త్రీలు)

ఆడపిల్లకు చదువువెందుకండీ, ఆమె ఎలాగూ అత్తవారింటికి వెళుతుంది కదా అంటారు కొందరు. వేదం భగవంతుని ఆదేశం, వేదం ఏమందో చూడండి.



విద్యాభ్యాసం తర్వాతే వివాహం

బ్రహ్మచర్యం ద్వారా యువతులు శాస్త్రపండితులు, యవ్వనవతులయ్యేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి, ఆ తర్వాతే వివాహం చేసుకోవాలి- అధర్వణవేదం 1 అధ్యాయం 8 వ పేజీ (క్షేమేంద్ర దాస్ త్రివేది గారు రాసిన అధర్వణవేద భాష్యం)

ఆడపిల్లలు బాహ్యవస్తువులను పట్టించుకోకుండా జ్ఞానం యొక్క శక్తి ద్వారా దూరదృష్టిని, శక్తివంతమైన శీలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడామే భూమ్యాకాశాల యందు వ్యాపించి ఉన్న సంపదను అందరికి పంచిపెట్టగలుగుతుంది. అప్పుడు మాత్రమే ఆమె వివాహానికి అర్హురాలు- అధర్వణవేదం 1 వ అధ్యాయం (క్షేమేంద్ర దాస్ త్రివేది గారు రాసిన అధర్వణవేద భాష్యం)

తల్లిదండ్రులు కూతురికి జ్ఞానాన్ని, తెలివిని, పాండిత్యాన్ని బహుమతిగా ఇవ్వాలి. భర్త ఇంటికి వెళుతుంటే ఇవ్వవలసిన సంపద (స్త్రీ ధనం) కూడే ఇదే - అధర్వణవేదం 14.1.6

పిల్లలను రక్షించేదానవు, నిశ్చితమైన జ్ఞానం కలదానవు, వేల ప్రార్ధనలకు సమానమైన దానవు, అన్ని దిక్కులను ఆకట్టుకునేదానవు, అందరికి ఆదర్శమైనదానవు. ఓ స్త్రీ, నీవు సంపద గడించు. నీకు అరుహడైన భర్తను పొందు, అతనికి సంపద పెంచే మార్గాలను చూపించు- అధర్వణవేదం 1 అధ్యాయం (క్షేమేంద్ర దాస్ త్రివేది గారు రాసిన అధర్వణవేద భాష్యం)

వధువు, విలువలు, జ్ఞానం ద్వారా భర్త ఇంటివాళ్ళను మెప్పించు - అధర్వణవేదం 1 వ అధ్యాయం

ఓ స్త్రీ! నీకు అన్నీ తెలుసు. దయతో మాకు సంపదను, సౌఖ్యాన్ని, బలాన్ని ప్రసాదించు- అధర్వణవేదం 7.42.2

వేదవిద్య గురించి

ఒకటి, రెండు లేక నాలుగు వేదాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వవేదం, అర్థశాస్త్రం, వాటితో పాటు ఇతర విద్యలు, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము, చంధస్సు మొదలైన 6 వేదాంగాలను చదివి, శుద్ధమైన మనసు కలదైన స్త్రీ, వైవిధ్య భరితమైన ఈ జ్ఞానాన్ని అందరికి పంచాలి - అధర్వణవేదం 7.47.2

స్త్రీలను సనాతనధర్మం బానిసలు చేసింది. వారికి స్వాతంత్రం ఇవ్వలేదు. భర్తకు లోబడి బ్రతకమంది, స్వేచ్చను హరించింది అంటున్నారు. ఋగ్వేదం 10.159, 1 వ అధ్యాయంలో ఉన్న మంత్రార్ధం చూడండి.

సూర్యుడు ఆకాశానంటాడు. నా సౌభాగ్యం, సంతోషం కూడా అధికమయ్యాయి. నిశ్చయంగా నేను నా ప్రత్యర్ధులపై విజయం సాధించి, నా భర్త ప్రేమ తిరిగి పొందాను. నేను తలమానికమైన దానను, అత్యున్నతమైన దానను, నేను నాయకురాలను, ఇప్పుడు శాసిస్తాను. నా భర్త నా ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. నాకు ఇప్పుడు ప్రతర్ధులెవరు లేరు. నా కూమరులు శత్రువినాశకులు, నా కుమార్తె సామ్రాజ్ఞి, నేను విజయవంతురాలను. నా మరియు నా భర్త యొక్క ప్రేమకు విస్తృత కీర్తి ఉంది. ఓ జ్ఞాని! జ్ఞానమును కలిగించువాడా! అత్యంత ప్రసిద్ధము, ప్రఖ్యాతమైన హవిస్సును నేను నీకు అర్పించాను. నా ప్రత్యర్ధుల కత్తుల నుంచి విముక్తి పొందాను. నేను ప్రత్యర్ధులను జయించాను. నేనిప్పుడు శత్రువినాశినిని, విజయను, దిగ్విజయను. ఇతరులకు అనర్హమైన కీర్తిని గడించాను. నేను వీరుడైన ప్రత్యర్ధిని జయించడమే కాక, అతని ప్రజలపై పట్టు సాధించాను. (ఇది వీరురాలైన స్త్రీ చెప్పిన మాటలు.)

To be continued ........................

ఆర్యసమాజం వారి సౌజన్యంతో 

Saturday 20 June 2015

యోగా దినోత్సవం

21 జూన్ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగా గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం.

ఇప్పుడు ప్రపంచమంతా యోగా అనే పదమే జపిస్తోంది. మనశ్శాంతి కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, పనిలో మంచి ఫలితాల కోసం, ఆరోగ్యం కోసమంటూ రకరకాల కారణాలతో యోగాసనాలు చేస్తున్నారు. యోగకు ఎంత ఖ్యాతి వచ్చిందంటే 21 జూన్ ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించేంత. ఈ సందర్భంలో అసలు యోగా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

జన్మలపరంపరకు కారణమైన చిత్తవృత్తులను నిరోధించి, జననమరణ చక్రం నుంచి ఉద్ధరించేది యోగం/యోగ అన్నారు యోగసూత్రాల్లో పతంజలి మహర్షి. మనం యోగా అంటున్నాం కానీ నిజానికి దాన్ని యోగ్ లేదా యోగం అనే అనాలిట. యోగం అనే సంస్కృతపదం యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దాని అర్దం కలియకు. ఎవరి కలియక? జీవాత్మ, పరమాత్మల కలియకకు, లేక ఆ కలియకలు కారణమయ్యే ప్రక్రియకే యోగం అని పేరు.

యోగ అంటే కేవలం ఆసనాలే అని అనుకుంటున్నారు. కాదు కాదు అలా చేశారు. ఒకప్పుడూ యోగ్ కేవలం భారతదేశానికి, తూర్పు ఆసియాదేశాలకు, సనాతనహిందూ ధర్మం వ్యాపించిన దేశాలకే పరిమితమైంది. దానికి కారణం కర్మసిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతానికి యోగకు అవినాభావ సంబంధం ఉంది. యోగకు 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాల్లో ఆఖరిది సమాధి - భగవంతునిలో లీనమైపోవటం- మోక్షం. ఆసనాలు 3 వ మెట్టు. ధ్యానం చేయండి అంటూ తరుచూ ప్రకటనలు, సలహాలు ఇస్తుంటారు. ధ్యానం యోగంలో 7 వ మెట్టు. యోగం అంటే కేవలం ఆసనాలు కాదు. యోగం యమనియమాలతో మొదలవుతుంది. యోగకు ఆహారనియమాలు తప్పనిసరి. కానీ ఈరోజు దాన్ని ప్రపంచంలో అనేకమంది మార్కెటింగ్ చేసి వ్యాపారం చేస్తున్న కారణంగా అసలు విషయాలు చెప్పడంలేదు. యోగం అనేది ఒక జీవనవిధానం. యోగం ద్వారా పరమాత్మను ప్రాతి పొందాలంటే అష్టాంగ యోగాన్ని అవలంబించాలి.

హిందూధర్మమే జీవనవిధానం. అందులో యోగం ఒక భాగం. హిందూ ధర్మం, పునర్జన్మ సిద్ధాంతం లేని యోగం అసంపూర్ణం. యోగం హిందూ షట్ దర్శనాల్లో ఒకటి. అది భగవంతుని కనుగొనే విధానం. యోగ మతాతీతం అంటున్నారు. యోగం మతాతీతమే కానీ అది హిందూధర్మంలో భాగం. దాన్ని ప్రతి హిందువు తప్పకుండా ఆచరించాలి. ఇక అన్యమతాల విషయానికి వస్తే, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే, హైందవేతరుల గ్రంధాలు యోగంతో విభేధిస్తాయి. క్రైస్తవం, ఇస్లాం మొదలైన అబ్రహామిక్ మతాలకు హిందూ ధర్మానికి అసలు ఎక్కడ పొంతన ఉండదు. ఆత్మపరమాత్మతో సమ్యోగం చెందడం, ప్రతి జీవిలో భగవంతుడు ఉండడం, జీవుడు భగవంతుడి అంశ అనడం, పునర్జన్మ, కర్మ మొదలైన అనేక విషయాలను ఆయా మతాలు అసలు ఒప్పుకోవు. కనుక వారు యోగాభ్యాసం చేయడమంటే వారి మత గ్రంధాలను వదిలేయడమే అవుతుంది. ఈ మాత్రం కూడా అవగాహన లేక, యోగం యొక్క శక్తిని తక్కువ చేయలేక క్రైస్తవయోగ అని కొత్తగా యోగకు నామకరణం చేశాయి మిషనరీలు. అంతకంటే విడ్డూరం ఇంకోటి లేదు.

యోగను ఎవరైన చేయవచ్చు అన్నమాట వాస్తవం కానీ యోగ చేసేవారు క్రమంగా వారికి తెలియకుండానే హిందువులవుతారు. యోగను చేయడం వలన క్రమంగా వారిలో మార్పు కలిగి, వారు కూడా ఆత్మానుభూతిని పొందుతారు. అయితే ఆత్మను నమ్మడం కూడా భారతీయమతాల్లోనే ఉంది. భౌద్ధం శూన్యవాదాన్ని, నిరీశ్వర వాదాన్ని చెప్పింది. కానీ భౌద్ధులు సనాతనధర్మం నుంచి యోగాన్ని స్వీకరించారు, పరమాత్మను చేరుకున్నారు. దీనిబట్టి మనం అర్దం చేసుకోవలసిందేమిటంటే యోగం మాత్రమే మతాలకు, జీవితానికి సంపూర్ణతను ఇస్తుంది. బౌద్ధ సన్యాసులు ప్రారంభంలో బౌద్ధమతాన్ని ఆచరించినా, క్రమంగా మంత్ర, తంత్ర, యంత్ర, యోగ ప్రక్రియల ద్వారా సనాతనధర్మాన్నే పాటిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతున్నారు.    

యోగం వలన ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. అవును యోగం ఆరోగ్యాన్నిస్తుంది, కానీ యోగం యొక్క లక్ష్యం భగవంతునితో కలయిక. ఎలాగైతే చెరుకు రసం తీయడంలో క్రమంగా కాస్త చెరుకుగడలు నలిగి వ్యర్ధపదార్ధం వస్తుంది, అలాగే బ్రహ్మైక్యం కోసం యోగాన్ని ఆచరిస్తే ఆరోగ్యం కూడా వస్తుంది. యోగాకున్న నియమాలను ఏమీ పాటించకుంటేనే అద్భుతఫలితాలు కనబడుతుంటే, ఇక యోగాన్ని సంప్రదాయపద్ధతిలో పాటిస్తే, ఇంకేంత ప్రయోజనం ఉంటుందో ఆలోచించండి.

చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే 'నువ్వు చేశావా?' అంటే అమ్మో, నేను కాదు, నేను కాదు అన్నట్టుగా హిందువులు యోగా మాది కాదు, మాది కాదు అనడం మూర్ఖత్వం. యోగ లంటిది అద్భుతప్రక్రియలు ఇంకేదైనా మతంలో ఉంటే వారు ఇలాగే అంటారా? అందరూ బాగుపడలాన్న నిస్వార్ధ ఆకాంక్ష హిందువులదే కావచ్చు కానీ దానికోసం యోగాన్ని త్యాగం చేయనవసరంలేదు. యోగం తమదేనని, తమ పూర్వీకులైన ఋషులు అందించారని హిందువులు గర్వంగా చెప్పుకోవాలి.

భారతదేశం ఇంతవరకు నరేంద్రమోదీ లంటి ప్రధానిని చూడలేదు. మోదీ స్వయంగా ఒక యోగి, యోగం యొక్క ఫలాలు ఎలా ఉంటాయో మోదీగారికి బాగా తెలుసు. అందుకే యోగాకు విస్తృత ప్రచారం కల్పించి, అందరి జీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో యోగాకు కూడా ఒక రోజు ఉండాలని సంకల్పించారు, దానికి ఆమోదం కూడా లభించింది. కానీ ఇప్పుడు యోగకు కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించాలి. అందుకుగానూ హైందవ యోగులతో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి, యోగ మీద భారతదేశం పేటెంట్‌లు తీసుకోవాలి. యోగ సంకరం కాకుండా చూసుకోవాలి. యోగాను నేర్పుతున్న సంస్థల నుంచి, ముఖ్యం హైందవేతర సంస్థల నుంచి రాయల్టీ తీసుకుని దాన్ని దేశంలో ఉన్న పేదలకు ఉపయోగించాలి.

అందరం యోగాను నేర్చుకుందాం. జీవితాన్ని మార్చుకుందాం.

అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

మీ అభిప్రాయాలు కామెంట్ చేసి తెలియపరచండి

వేమన పద్యం - రమణతత్వం

ఎరుక కన్నను సుఖ మేలొకమున లేదు
యెరుక నెరుగ నెవని కెరుక లేదు
యెరుక సాటి యెరుక యెరుకయే తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎరుకను మించిన సుఖం ఏ లోకంలోనూ లేదు. అయినా ఆ యెరుకను తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు.ఎరుకకు సాటి యెరుక యెరుకయే. అదే తత్వం.

ఎరుక అంటే రమణమహర్షి తత్వంలో 'నేను' అనే తలంపు. వారు చెప్పిన మాటలే చెప్పుకుందాం : ఈ లోకంలో ఏమి చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎప్పుడూ నేను అనే ఆలోచన ఉంటుంది. అసలు ఆ నేను ఎవరు? నేను అనేది శరీరమా? శరీరమైతే మరణం తర్వాత చితిలో వేస్తే దానికి నొప్పి కలగదేం? నేను అనేది మనసైతే, నిద్రలో మనసులేదు, అయినా నేను లేనని మీరు అంటున్నారా? లేదు కదా. మరి నిజంగా నువ్వెవరు? నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూ, నీవు కాని వాటిని తొలగించుకుంటే మిగిలేది నువ్వే. దాన్నే మనం ఆత్మ అంటున్నాం. ఆ నేనును (ఆత్మను) తెలుసుకోవడంలో ఉన్న సుఖం ఏ లోకంలో కూడా రాదు. ఆ నేను అనే తత్వాన్ని (ఆత్మను) తెలుసుకోవడం కంటే గొప్పగా తెలుసుకోవలసిన విషయం వేరొకటి లేదు. ఎప్పుడు నేను, నేను అంటున్నావు, ముందు ఆ నేను ఎవరో తెలుసుకో.

ఓం నమో భగవతే శ్రీ రమణాయ
నమోనమః శ్రీ గురుపాదుకాభ్యం   

Monday 15 June 2015

హిందూ ధర్మం - 162 (వేదంలో స్త్రీలు)

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమనుతాము సంఘసంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదికసంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.



స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03
స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20
స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)
స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74
స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2
స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1

పరిపాలన విషయంలో స్త్రీలు
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - అధర్వణవేదం 7.38.4
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-  ఋగ్వేదం 10.85.46
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1

కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20
స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3

ఉద్యోగాల్లో
స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2
స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజువేదం 16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం. స్త్రీలు బయటకురాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా. శ్రీ రామాయణంలో కైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చిన అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).
కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- ఋగ్వేదం 10.85.26

విద్యా విషయాల్లో
ఓ స్త్రీల్లారా! పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను- ఋగ్వేదం 10-191-3

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్రా వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు.

వివాహం - విద్యాభ్యాసం
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - అధర్వణవేదం 14-1-64 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

To be continued .................

ఈ రచనకు సహకరించింది: ఆర్యసమాజంవారి సౌజన్యంతో

Saturday 13 June 2015

త్రైలింగ స్వామి సందేశం



త్రైలింగస్వామి దిగంబరులై తిరుగుతూ ఉండేవారు. అందువలన కొందరు పోలీసులు ఆయనను పట్టుకొని పోయి జిల్లా న్యాయాధిపతిముందు నిలబెట్టారు. న్యాయాధిపతి అట్లా తిరగటానికి వీలులేదని శాసించాడు. ధోవతి కట్టుకోవాలని ఆదేశించాడు. స్వామీజీ దాన్ని పట్టించుకోలేదు. న్యాయాధిపతికి కోపం వచ్చి బేడీలు వేసి చెరసాలలో పెట్టమని ఆదేశించాడు. వెంటనే పోలీసులు ఆయనకు బేడీలు వేయటానికి దగ్గరకు వెళ్లగా, స్వామీజీ వారికి కనబడలేదు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు. వారు ఆ ప్రదేశమంతా దాదాపు గంటసేపు వెదికినా కనబడలేదు. ఆ తరువాత స్వామీజీ న్యాయాధిపతి ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. స్వామీజీ ఎట్లా మాయమయ్యారో, మళ్లీ ఎట్లా ప్రత్యక్షమయ్యారో వారికి అర్థం కాలేదు. అదిచూసి వారంతా ఆశ్చర్యచకితులైనారు. న్యాయాధిపతి కొంతసేపటికి తేరుకొని, స్వామివారు తమకు నచ్చినవిధంగా తిరుగవచ్చునని అనుమతినిచ్చాడు.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు మరొక అధికారి వచ్చాడు. ఆయన చాలా తీవ్రస్వభావం కలవాడు. ఒకరోజు ఆయన దృష్టి స్వామివారి మీద పడింది. స్వామీజీ దొంగ సాధువు అని తలంచి చెరసాలలో పెట్టి బంధించాడు. మరునాడు ప్రొద్దున ఆయనకు ఒక విచిత్ర సంఘటన కనిపించింది. అదేమిటంటే- స్వామీజీని బంధించిన చెరసాల అంతా బాగా నీళ్లతో తడిసి ఉండింది. చెరసాల తలుపుకు వేసిన తాళం అట్లాగే ఉండింది. కాని స్వామీజీ మాత్రం చెరసాల బయటివైపున అటూ ఇటూ పచార్లుచేస్తూ కనిపించారు. వెంటనే ఆ అధికారి- ‘‘నీవు చెరసాలనుంచి బయటకు ఎట్లా వచ్చావు? ఇంత నీరు చెరసాలలోకి ఎట్లా వచ్చింది?’’ అని అడిగాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి ‘‘అర్థరాత్రి నాకు మూత్రవిసర్జన చేయవలసి వచ్చింది. గదికి తాళంవేసి ఉండటంవలన గదిలోనే మూత్రవిసర్జన చేశాను.

ఉదయం కాగానే బయటకు పోవాలనే కోరిక కలిగింది. చూసేసరికి గది తలుపులు తెరిచి ఉన్నాయి. నేను బయటకు వచ్చేశాను. మీరు ఎవరి జీవితాన్నీ తాళంవేసి బంధించలేరని నిశ్చయంగా తెలుసుకోండి. ఒకవేళ ఆ విధంగా బంధించగలిగినా, వారిని మరణ సమయంలో బంధించి మరణం రాకుండా కాపాడగలరా? అంతకుముందు కూడా ఎవరూ మరణించరు. ఎవ్వరికీ అలాంటి శక్తి లేదు. మరి మీరు ఎందుకు అంతగా కోపగిస్తున్నారు?’’ అని అన్నారు. ఆ విచిత్ర సంఘటనను తన కళ్లారా చూసిన ఆ అధికారి అవాక్కయిపోయాడు.

ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.

సేకరణ: ఆంధ్రభూమి

Friday 12 June 2015

సద్గురు శివాయ సుబ్రహ్మణ్యస్వామి సూక్తి

Spiritual destiny is manifested in the lives of those who stand out from the masses and actually do something, who live a creative life for the benefit of others - Satguru Sivaya Subramuniyaswami


Wednesday 10 June 2015

కందుకూరి శివానందమూర్తి గారు

నిన్న అర్ధరాత్రి  1-55 గంటలకు శివైక్యం చెందారు సద్గురువులు , శైవమహాపీఠం అధిపతి, శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు. వీరు తెలుగు వారు, రాజమండ్రిలో జన్మించారు. ఆధునికకాలంలో భారతదేశం చూసిన ఆధ్యాత్మిక గురువులలో శ్రేష్టులు గురువుగారు. పురాణకాలంలోని దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, వేదవ్యాసుడు, మైత్రేయి, కృష్ణభగవానుడు మొదలు ఆదిశంకరులు, భగవాన్ రమణమహర్షి వంటి గురువుల సంప్రదాయానికి చెందినవ్యక్తి గురువుగారు. భారతదేశానికి ఋషులే సంపద, చరిత్ర, జీవం, శక్తి, అన్నీ. అటువంటి ఋషుల గురించి వివిధ పురాణాల్లో ఉన్న అనేక విషయాలను సేకరించి 'మహర్షుల చరిత్రలు' అనే పేరుతో రెండు సంపుటాలుగా గ్రంధాలను అందించారు గురువుగారు. భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఇప్పటికి ఎంతో మంది రోజు రుద్రాభిషేకాలు చేస్తూ, ధర్మాన్ని పాటిసున్నారంటే అదంతా వీరి అనుగ్రహమే. వీరికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు.

సనాతనధర్మాన్ని రక్షించడంలో ఎప్పుడు ముందు ఉండేవారు. ఆయన జీవితం మొత్తం సనాతనధర్మాన్ని ఉద్ధరించడానికి అనేక బోధనలు చేశారు. కాలం మారినా, నూతన పరిజ్ఞానం వచ్చినా, ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడువకండి అన్ని యువతకు పిలుపునిచ్చారు. 14 లోకాల గురించి అవగాహనే కాక, అవి ఎక్కడ ఉన్నాయి, భూమండలానికి ఎంత దూరంలో ఉన్నాయి వంటి అనేక విషయాలను ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్దమయ్యేలా వివరించిన ఘనత గురువుగారిది. అన్ని లోకాల్లో ఏం ఏం ఉంటాయో కూడా గురువులకు తెలుసు. భగవాన్ రమణమహర్షి, సద్గురు త్రైలింగస్వామి మొదలైనవారి బోధనలు స్వామి వారి జీవితంపై ప్రభావం చూపాయి. ఇప్పుడున్న కాలంలో జీవన్ముక్తుడిగా తిరిగిన మహాపురుషులు గురువుగారు.

భారతదేశంలో జరుగుతున్న అకృత్యలు, అవినీతి, అక్రమాలు, సనాతనధర్మంపై జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేకపోయారు. అనేకమంది గురువులు, సిద్ధులవలే వీరు కూడా దేశంలో హిందూ ప్రభుత్వం రావాలని తపించారు. అందుకోసం కొన్నాళ్ళు మౌనవ్రతం చేసి, తీవ్రమైన తపస్సు చేశారు. ఇటువంటి గురువుల తపఃఫలితమే ఈ రోజు మనకున్న హిందూ కేంద్రప్రభుత్వం. కొన్ని వందల ఏళ్ళ తర్వాత హిందువులు తిరిగి ఈ దేశాన్ని పూర్తి మెజారటితో పాలిస్తున్నారంటే ఇటువంటి గురువుల అనుగ్రహం ఉండడమే కారణం.

వీరికి ఈ మధ్య ఆరోగ్యం చెడిపోయినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ గారు ఫోన్ చేసి పరమార్శించారు. పూర్తి వైద్యసదుపాయాలు కలిగిస్తామని హామీ ఇచ్చారు. బిజేపీ నుంచి రాంమాధవ్ కూడా వీరిని చూడటానికి దిల్లీ నుంచి వచ్చారు.

సనాతనధర్మన్ని రక్షించడానికి, ఆర్తులను, ధీనులను ఉద్ధరించడానికి వచ్చిన ఈ మహాపురుషుని అనుగ్రహం మనపై సదా ఉండుగాకా.

సద్గురువే నమః

Monday 8 June 2015

ఆదిశంకర సూక్తి


వ్యాఖ్య : విషయాసక్తి అంటే ప్రపంచంలో ఉండే వస్తువులు, విషయాల మీద వ్యామోహం లేక ఇష్టం, వాటిని పొందాలనే కుతూహలం. దేహాభిమానం అంటే శరీరం మీద వ్యామోహం, శరీరం సుఖాల కోసం తపించడం, నేనే శరీరాన్నని భావించడం, ఈ శరీరం ఎప్పటికి ఉంటుందని భావించడం. ఆత్మ అంటే నువ్వే. నిన్ను నువ్వు శరీరం అనుకోవడం వల్ల దాని కోసం తపించి, ఆత్మను ఎరుగక ఇన్ని జన్మలు ఎత్తవలసి వస్తోంది. విషయవాంఛలు/కోరికల వలన సంస్కారాలు, వాసనలు బలపడి మోక్షానికి దూరమవుతున్నావు. ఆత్మను తెలుసుకోవాలనుకుంటే వీటి మీద ఆసక్తి వదులు అంటున్నారు ఆదిశంకరులు. అదేం కుదరదు! నేనేమీ వదలను అంటావా - మొసలని దుంగ (చెట్టు కొమ్మలాంటిది) గా భావించి, దాని మీద కూర్చుని నదిని దాటడానికి ప్రయత్నించడం లాంటిది అంటున్నారు. అనగా నీకు తెలియదు, కానీ ఎప్పుడో తప్పకుండా ఆ మొసలి నిన్ను మింగేస్తుంది. మొదటికే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలనుకున్నప్పుడు కోరికలను తగ్గించుకో. నేను శరీరం కాదు అనే స్థిరమైన భావనలో ఉండు.

Sunday 7 June 2015

హిందూ ధర్మం - 161 (వేదంలో విజ్ఞానశాస్త్రం)



యజుర్వేదం 22-26 మంత్రాలు మేఘాలు ఎలా ఏర్పడతాయో వివరణ ఇస్తాయి. అక్కడ యజ్ఞప్రక్రియ గురించి చెప్తూ, మేఘాలు ఏర్పడే విధానం, వర్షాలు కురవడానికి సూర్యుడికి ఉన్న సంబంధం వివరించారు. యజుర్వేదం 24-20 మంత్రంలో 6 ఋతువుల గురించి ఉంది.

యజుర్వేదం 17-2 లో సంఖ్యా, గణితశాస్త్రాల ప్రస్తావన ఉంది. ఒకటి, పది, పది పదులు వంద, వంద పదులు వెయ్యి, వంద వేలు లక్ష అంటూ పదిలక్షలు, కోటి, పదికోట్లు, నూరుకోట్లు, వెయ్యి కోట్లు, దానికి పదిరెట్లు మహాపద్మం, దానికి పదిరెట్లు శంఖం, దానికి పదిరెట్లు సముద్రం, దానికి పదిరెట్లు మధ్య, దానికి పదిరెట్లు ప్రర్ధం అంటూ పెద్ద పెద్ద సంఖ్యలను ఆ మంత్రం వివరిస్తోంది.
------------------------------------------------

రసాయన శాస్త్రం

గురుదత్త్ విద్యార్ధి గారు వేదంలో మిత్రా, వరుణ పదాలకు అర్దం చెప్తూ మిత్ర అంటే ప్రాణవాయువని (Oxygen), వరుణ అంటే హైడ్రోజన్ అని, రెండిటి సారమే జలమని వివరించారు.

విద్యుత్ గురించి

అధర్వణవేదం 6-111-4, 6-130-1 లో అప్సరసలకు తేజస్సు, విద్యుత్, శక్తి అనే అర్దాలున్నాయి. 6-118-1 లో దానికే సూర్యకిరణాలనే అర్దం ఉంది.

యజుర్వేదం 24-15-19 లో విద్యుత్ గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే సౌరవిద్యుత్తు, తోకచుక్కలు, కొన్ని రకాల వృక్షాల నుండి విద్యుత్తును వెలికితీసే విధానం గురించి చెప్పబడింది. అదే ఈ శ్లోకం

 రౌద్రీ భాస్వంతు సంయోగాజ్జాయతే మారికాభిదా|
 విషశక్తిస్తయా సూర్యకిరణాశని సంభవం||

అసలు విద్యుత్ అనేది ఒకటుందని సమాజానికి తెలియదని, పూర్వీకులు చీకటిలో మగ్గారని కొందరు అంటున్నారు. కానీ వేదం సౌర విద్యుత్ గురించి చెప్పడమే కాక, వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి కూడా చెప్పింది. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు కూడా వృక్షాల్లో విద్యుత్ఛక్తి ఉందని, తులసి, రావి మొక్కలో అధికశాతంలో ఈ శక్తి నిక్షిప్తమైందని చెప్తున్నాయి.

దేవీచంద్ గారి అధర్వణవేద భాష్యంలో విద్యుత్‌కు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు. సైనిక కార్యకలాపాల్లో విద్యుత్ వాడకం గురించి, విద్యుత్ఛక్తితో నడిచే అతిశీతలీకరణ యంత్రాల గురించి, వాటిలో నిల్వ ఉంచే ఔషధాల గురించి, విద్యుత్‌తో నడిచే వాహనాల గురించి, యంత్రాల గురించి ఇళ్ళను కూడా విద్యుత్ఛక్తితో వెలిగించడం గురించి అధర్వణవేదంలో ఉన్న విషయాలను వారు ప్రమాణ పూర్వకంగా విశదీకరించడం చూస్తే, ఎవరైనా సంభ్రమాశ్చర్యాలకు గురికాక తప్పరు. వేదద్వేషులైతే నాలుక్కరుచుకుంటారు.
---------------------------------------

భౌతిక శాస్త్రం

హెచ్.సి. వర్మ గారు కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం రచించారు. అందులో స్పీడ్ ఆఫ్ లైట్ అనే అధ్యాయంలో జి.వి.రాఘవరావు గారి పుస్తకం నుంచి ఋగ్వేద మంత్రాన్ని ప్రస్తావిస్తూ, అధునిక శస్త్రవిజ్ఞానం కనుగొన్న అనేక విషయాలు వేదల్లో నిక్షిప్తమై ఉన్నాయని, తెలియతని వాటిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తారానిర్విశ్వదర్శతో జ్యోతిస్కరిదసి సూర్య విశ్వంబసిరోచనం|
తాతాచస్మర్యత యోజనం సహస్రం ద్వే ద్వే శతే ద్వేచ యోజనే||
ఏకేన నిమిషర్దేనా క్రమనా నమోస్తుతే - ఋగ్వేదం 1-50-4

దీనికి సాయనాచార్యుడు 15 వ శత్బాదంలో బాష్యం రాశారు. అందులో ఆయన సూర్యకాంతి అర్దనిమిషంలో 2202 యోజనాలు ప్రయాణం చేస్తుందని వివరించారు. యోజనం అనే మాట వైదిక వాజ్ఞ్మయంలో తరచూ కనిపిస్తుంది. 1 యోజనం అంటే 4 కోసులు, అనగా బ్రిటీష్ వారి లెక్కలో 8000 గజాలు, ఒక గజం అనగా 0.9144 మీటర్లు.

సమయాన్ని లెక్కించడం గురించి శ్రీ మద్భాగవతం చెప్తోంది. ఒక 15 నిమిషాలు = 1 కాష్ఠ, 15 కాష్ఠలు ఒక లఘు, 30 లఘులు = 1 ముహూర్తం, 30 ముహూర్తాలు = 1 దివారాత్రము (పగలురాత్రి/రోజు). ఆధునిక బాషలో చెప్పుకుంటే 24 గంటలు. ఒక నిమిషం అంటే 16/75 సెకన్లు (తెలుగు నిమిషాలు కాదు, సంస్కృతపదాల గురించి మాట్లాడుకుంటున్నాం, గమనించండి).

 అర్ధనిమిషానికి 2202 యోజనాలను SI units లో మారిస్తే, 3.08*10మీటర్ ప్రతి సెకనుకు వస్తుంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం సూర్యకాంతి భూమిని చేరుటకు చెప్పిన వేగంతో సరిపోతోంది.
-----------------------------------

దేవమిత్రస్వామి తన Searching for Vedic India అనే పుస్తకంలో వెళ్ళడించిన విషయాలు చూద్దాం.

అధర్వణవేదంలో ఒక మంత్రం ఇలా అంటున్నది. 'ఓ శిష్యుడా! రాజనీతిశాస్త్ర విద్యార్ధి, సముద్రాలపై నౌకల్లో ప్రయాణించు, విమానాల ద్వారా ఆకాశంలో విహరించు, సృష్టికర్త అయిన భగవంతుని వేదాల ద్వారా తెలుసుకో, యోగం ద్వారా శ్వాసను నియంత్రించు, జ్యోతిష్యం (ఖగోళ శాస్త్రం) ద్వారా పగులు, రాత్రి యొక్క ధర్మాలను తెలుసుకో, ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను తెలుసుకో.

ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం, భూగోళశాస్త్రం ద్వారా సూర్యుడు కింద ఉన్న ఈ భూమిపై ఉండే అన్ని దేశాలకు వెళ్ళు. రాజనీతి శాస్త్రం, వృత్తి నైపుణ్య శాస్త్రాల ద్వారా మంచి జ్ఞానం పొందు, వైద్యశాస్త్రం ద్వారా వైద్య మూలికల గురించి అవగాహన కలిగించుకో, జలముల గురించిన శాస్త్రం (హైడ్రోస్టాటిక్స్) ద్వారా నీటి యొక్క వివిధ ఉపయోగాలను తెలుస్కో, మిరుమిట్లు గొలిపే కాంతి గురించి విద్యుత్ శాస్త్రం ద్వారా తెలుసుకో. నా ఆదేశాలను మనఃపూర్వకంగా ఆచరించు - యజుర్వేదం 6.21 (ఇది సాక్షాత్తు భగవంతుని ఉపదేశం).

అట్లాగే అధర్వణవేదం 20.41.1-3 మంత్రాలు అణుశక్తి గురించి చెప్తున్నాయి.
---------------------------------------

To be continued ...............

ఈ రచనకు సహకరించిన వెబ్‌సైట్లు :
ఆర్యసమాజం దయానంద సరస్వతీ విరచిత ఋగ్వేద భాష్యభూమిక
http://www.speakingtree.in/spiritual-blogs/seekers/science-of-spirituality/the-speed-of-light-rigvedic-hymn
https://cpdarshi.wordpress.com/2011/10/01/color-and-speed-of-light-as-per-vedas/
https://groups.google.com/forum/#!topic/samskrita/d8OA7E-7WOU

Friday 5 June 2015

పర్యావరణం - ఋషుల సందేశం

ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణ విషయంలో అందరిని జాగృత పరచడానికి, అవగాహన కలిగించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటికి అనేకమంది దీంతో మాకు సంబంధమేమిటి? అనేక సమస్యలుండగా ఇదే పట్టించుకోవాలా? అంటున్నారు. ఇటువంటి తరుణంలో అసలు పర్యావరణ పరిరక్షణ గురించి వేదాలు, ఋషులు, గురువులు, సాధువులు ఏం చెప్పారో చూద్దాం.

అసలు ప్రకృతిని చూడగానే మనసు పులకిస్తుంది, తెలియని ఆనందం కలుగుతుంది, పెద్దపెద్ద రోగాల బారిన పడినవారు కూడా ప్రకృతి మధ్య ఉంటే, త్వరగా కోలుకుంటున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. పువ్వులను, సీతాకోకచిలుకలను, జలపాతాలను చూడగానే ఏదో తెలియని అనుభూతి కలగడం అందరికే తెలిసింది. దానికి కారణం ఏంటో తెలుసా?

శ్రీ రవీంద్రనాధ్ ఠాగూర్ గారు వారి పుస్తకాల్లో ఇలా వెల్లడించారు. 'సమాధి స్థితిలో ఉన్న ఋషులు తొలిసారి ఈ రహస్యం గుట్టు విప్పారు. తైత్తరీయ ఉపనిషత్తులో దాన్ని పొందుపరిచారు. ప్రకృతి భగవంతుని ఆనందం యొక్క వ్యక్తీకరణ. భగవంతుడు సచ్చిదానందుడు. ఆయన తన ఆనందస్థితికి ఒక రూపం ఇవ్వాలని సంకల్పించినప్పుడు అది ప్రకృతిగా రూపాంతరం చెందింది. అందుకే ప్రకృతిలోకి వెళ్ళితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది'.

ఋషులు కూడా ఇదే విషయాన్ని స్మృతులలో పొందుపరిచారు. విద్యాభ్యాసం నగరానికి దూరంగా, అడవికి దగ్గరగా, ప్రకృతి రమణీయత మధ్య జరగాలని మనుస్మృతి చెప్తోంది. చుట్టు గోడలు కట్టి రూముల్లో పిల్లలకు భోధన చేయడం వృధా అని, అది వారి ఎదుగుదలను నిరోధిస్తుందని, వారి లాభం చేయకపోగా, నష్టం చేకూరుస్తుందని చెప్పారు. ప్రకృతి మధ్య సాగే విద్యాభ్యాసం, పిల్లల్లో ఉన్న అంతఃశ్శక్తిని జాగృతం చేస్తుందని చెప్పారు. ఈ కారణంగా రవీంద్రనాధ్ ఠాగూర్ గారి శాంతినికేతనం, పరమహంస యోగానందగారి 'యోగదా సత్సంగ్ సోసైటీ ఆఫ్ ఇండియా' ఋషులు చెప్పిన పద్ధతుల్లోనే ప్రకృతి మధ్యే విద్యాబోధన చేస్తున్నాయి. దీని బట్టి ప్రకృతి యొక్క శక్తిని అర్దం చేసుకోవచ్చు.

ప్రకృతి మాత్రమే మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తపరచగలదు. సత్యాకామ జాబాలికి గౌతమ మహర్షి చేసిన ఉపదేశం కూడా ఇదే పద్ధతిలో సాగింది.

ప్రకృతిమాత మధ్యలో మనిషి భగవంతుని యొక్క చైతన్యాన్ని తనకు తెలియకుండానే పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు కనుకనే అతడు ఆనందాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శ్రీ అరబిందో గారు ఇలా చెప్పారు. 'మనలో ఉన్న చైతన్యమే పువ్వులో కూడా ఉంది. సూక్ష్మమైన ఈ విషయాన్ని మన ఆత్మ గ్రహించినందువల్లనే, మన హృదయం ఆనందంతో నిండిపోతోంది'.

మనిషి తన భౌతికమైన పరిధుల నుంచి బయటకు వచ్చి, అన్నింటా వ్యాపించి ఉన్న ఆనంతమైన తత్వాన్ని తెలుసుకొనుటకు ప్రకృతే సహాయం చేస్తోందని శ్రీ అరబిందో గారు యోగా గురించి రాసిన లేఖల్లో వివరించారు. అందుకే ఋషులు కూడా తపస్సు చేయుటకు అడవులకు వెళ్ళమని సలహా ఇస్తారు. ప్రకృతికి మనిషిని అంతర్ముఖం చేసి, సూక్ష్మమైన రహస్యాలను వెళ్ళడించగల శక్తి ఉంది. ప్రకృతి జడపధార్దం కాదు, అందులో చైతన్యం ఉంది. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామం 'ఓం ప్రకృత్యై నమః'. జీవరాశికి కావలసిన ఆహారాన్నే కాదు, మానవుడి పరమగమ్యమైన శాశ్వత ముక్తికి కూడా ప్రకృతి దోహదపడుతోంది. అందుకే ఇప్పటికి గురువులు చెప్పే మాట ఏమిటంటే ఎక్కడైన పచ్చదనం పరిడవిల్లిన చోటుకు వెళ్ళి, రోజూ ఒంటరిగా కాసేపు మౌనంగా గడపమని లేక మంత్రంజపం చేస్తే క్రమంగా ప్రశాంతత లభిస్తుందని.

పర్యావరణం ఎంత స్వఛ్ఛంగా, పవిత్రంగా ఉంటే మానవుడు అంత స్వఛ్ఛంగా పవిత్రంగా ఉంటాడు.  ప్రకృతి నాశనమైతే మానవుడు నాశనమవుతాడు, పరతత్వానికి దూరమవుతాడు, ప్రకృతిని నాశనం చేసేవారు భగవంతుని ఆగ్రహానికి కారణమవుతారు. ముక్తి కూడా దూరమవుతారు. అనేకమంది యోగులు, సిద్ధపురుషులు తమ జీవతంలో ఇచ్చిన సందేశాల్లో ప్రకృతిని రక్షించడం ముఖ్యమైనది. పతంజలి యోగశాస్త్రం కూడా అహింసకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. అహింసను పాటించకుండా, ప్రకృతిని రక్షింకుండా ఏ వ్యక్తి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు.

ప్రకృతిని రక్షించుకోవడం మన బాధ్యత. పర్యావరణ దినోత్సవం ప్రపంచానికి పర్యావరణ హితమార్గాన్ని ఎంచుకోమని గుర్తు చేస్తుంటే, భారతీయులకు మాత్రం తమ పూర్వీకులు నడిచిన ధర్మమార్గాన్ని గుర్తు చేస్తోంది.    


సమిష్టి ప్రయత్నాలు మాత్రమే పర్యావరణాన్ని రక్షించగలవు. రండి, పర్యావరణాన్ని రక్షించుకుందాం.

Amma's message on World Environment Day


Children, natural disasters, global warming and other climatic changes are ruining humankind’s peace of mind. Because of our thoughtless exploitation of natural resources, the harmony in nature is being lost. Our air, our water, our very soil—all have become poisonous.
In the olden days, people travelled in bullock carts and horse carriages. Then came scooters and cars. Now, a single person may have two or even three cars. In olden days, we served our food on banana leaves. Today we chop down entire trees to make paper cups and plates and then throw them out after just one use. In these and other ways, because of our selfish desires, we are exploiting Mother Nature and wasting her resources.
We used to think of Mother Nature as Kamadhenu—the wish-fulfilling cow that bestowed all auspiciousness upon us. Now she is old and dried up. Our forests are diminishing. Our food supplies are vanishing. Pure air and water are a rarity. Diseases are on the increase.
Where did we go wrong? When we stopped being able to distinguish between a need and a luxury. We have to restore this understanding. It is adharmic (unrighteous) and sinful to take more from Nature than we justifiably need. I am remembering the story of a social worker. Early one morning, he went to the riverside to brush his teeth with water in a pot. At the same time, he was discussing some important matters with his colleagues. When he took the pot to rinse his mouth, he saw that there was no more water in it. “O God! I have been so careless,” he said. “I used up all the water before I even finished brushing my teeth!”
His colleagues did not understand the reason for his sadness. They asked him, “What’s the big deal? You have an entire river of water flowing right before you.”
The social worker replied, “There may be water in the river, but I have no right to take more than what is necessary.”
If our generation can reclaim the dharma bodham—the awareness of righteousness—displayed by this social worker, then famine and poverty can be eradicated. Amma has no doubt about this. Take from Nature only that which you need for your sustenance. Then humankind will still have all the food, water and clothing it needs, and Mother Nature will once again become a Kamadhenu.
A scientist once said, “If all the worms and microorganisms were to disappear from the world, life on earth would be completely wiped out within the next 50 years. On the contrary, if the human race were made extinct, then all the other living beings on earth would be thriving again within 50 years.” Children, humankind should not have to perish for the earth to live.


This world which was handed down to us by our forefathers is so beautiful! Are we going to pass it down to the next generation only after destroying it? We are bound by dharma to offer it to the next generation without even a tiny crack in it. It is our duty to protect and preserve Mother Nature as if she were our very birth mother. We have to open our eyes to this truth. In reality, this dharma is not only our dharma towards Nature but our dharma towards the entire human race as a whole. That is because humankind cannot survive without Nature.
The writer is a world renowned spiritual leader - Mata Amritananda Mayi

Tuesday 2 June 2015

పరమాచార్య వాణి

వ్యక్తికి సత్ప్రవర్తన ఉంటే చాలు, దైవభక్తి అవసరంలేదనే భావన కొందరికుంది. ఈ అభిప్రాయం తప్పు. భక్తి లేని సత్ప్రవర్తన, సువాసన లేని పువ్వు వంటిది. ఈ దేశపు ప్రజలు స్వతంత్రం కోసం తీవ్రమైన పోరాటాలు, త్యాగాలు చేస్తున్న సమయంలో 'దేశమే ప్రధానం. మిగితావి తరువాత' అని పిలుపిచ్చారు. నాకు కొందరు నాయకులతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు, దైవాన్ని, ధర్మాన్ని వెనక్కుతోసి దేశం మీదే మొత్తం దృష్టి కేంద్రీకరించండం సబబేనా అని ప్రశ్నించాను. ఒకసారి దేశానికి స్వతంత్రం వస్తే అన్నీ అవే సర్దుకుంటాయాని వారు సమాధానం ఇచ్చారు. కానీ అలా జరగలేదు సరికదా ఈ దుష్పరిణామం యొక్క ఫలితం అన్ని రంగాల్లో కనిపిస్తోంది, చిన్న పిల్లవాడిని అదుపు చేయడం కూడా కష్టమైపోతోంది.

కంచి పరమాచార్య