Saturday 30 November 2019

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు, దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 

దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగినవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు. 

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుందేమో! 

Thursday 28 November 2019

స్వామి శివానంద విచరితం- అభిషేకం యొక్క ఆంతర్యము మరియు తత్త్వము


పార్వతి లేదా ఉమా ప్రియుడు, పశుపతి అయిన, ఆనందకరమైన పరమ శివునకు నమస్కారములు మరియు ప్రణిపాతములు.

అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియః శివః - విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. శివాలయాల్లో శివలింగం మీద చిన్న రంధ్రం కలిగిన ఒక రాగి కంచు పాత్రను వ్రేలాడదీసి, దాని నుండి దాని గురించి రేయింబవళ్ళు స్వామివారి మీద నీరు పడేటట్లు ఏర్పాటు చేస్తారు. శివలింగం మీద నీరు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పంచామృతాలు మొదలైనవి పోయడాన్ని అభిషేకం అంటారు. శివునకు అభిషేకం చేస్తారు. అభిషేకం చేసే సమయంలో రుద్రం పఠిస్తారు. అభిషేకం ద్వారా పరమశివుడిని పూజిస్తారు.

సముద్రంలో నుంచి ఉద్భవించిన హాలాహలం అనే విషాన్ని పరమశివుడు త్రాగి, చల్లదనం కొరకు తన శిరస్సును గంగను మరియు చంద్రుడిని ధరించాడు. ఆయనకు భీకరమైన మూడవ నేత్రం ఉంది. నిరంతరం అభిషేకం చేయుటవలన ఈ మూడవ కన్ను చల్లబడుతుంది.

హృదయకమలంలో ఉన్న ఆత్మలింగం మీద శుద్ధమైన ప్రేమ అనే నీటిని పోయుటయే ఉత్కృష్టమైన మరియు మహోన్నతమైన అభిషేకము. బాహ్యంలో రకరకాల వస్తువులతో చేసే అభిషేకము భక్తిని వృద్ధి చేసి శివుని పట్ల ప్రేమను పెంచి, క్రమంగా మనలో ఉన్న శివునకు (ఆంతర్యంలో) పుష్కలమైన నిరంతరం ప్రవహించే ప్రేమతో అభిషేకము చేసే దిశగా తీసుకువెళుతుంది.

అభిషేకము శివపూజలో భాగము. అభిషేకం అనేది లేకపోతే శివపూజ పూర్తికాదు. అభిషేక సమయంలో రుద్రము, పురుషూసూక్తము, చమకము, మహా-మృతంజయ జపము మొదలైనవి ఒక ప్రత్యేక లయ మరియు క్రమంలో పఠిస్తారు. సోమవారం శివారాధనకు అత్యంత ముఖ్యమైనది మరియు ప్రతి పక్షంలోను వచ్చే త్రయోదశి తిథి. ఈ రోజుల్లో, శివభక్తులు ప్రత్యేక పూజతో, ఏకాదశరుద్రాభిషేకంతో అర్చన చేసి, అనేక రకములైన ప్రసాదాలను సమర్పించి, దీపాలను వెలిగించి, శివారాధన చేస్తారు.

ఏకాదశ రుద్రాభిషేకంలో ప్రతి రుద్రానికి అభిషేకంలో ప్రత్యేకమైన వస్తువులను వినియోగిస్తారు. గంగాజలము, పాలు, నెయ్యి, తేనె, సుగంధ జలము, కొబ్బరినీళ్లు, గంధము, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కూడిన తైలము, చెరుకు రసం మరియు నిమ్మరసం అనేవి అభిషేకానికి ఉపయోగిస్తారు. ప్రతి ద్రవ్యాన్ని అభిషేకించిన తరవాత, శివుని తలమీద శుద్ధ జలాన్ని పోస్తారు. రుద్రాన్ని చదివినప్పుడు ప్రతిసారీ, ప్రతి అధ్యాయం తర్వాత వివిధ పదార్థాలను అభిషేకంలో వినియోగిస్తారు. ఆ అభిషేక జలము లేదా ద్రవ్యము అనేది అత్యంత పవిత్రంగా భగవంతుని ప్రసాదంగా భావించి స్వీకరించే భక్తులకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అది హృదయాన్ని పవిత్రం చేసి అసంఖ్యాకమైన పాపాలను నశింపచేస్తుంది. మీరు దాన్ని భావము మరియు భక్తితో స్వీకరించాలి.

మీరు భావము మరియు భక్తి తో అభిషేకము ఒనరిస్తే, మీ మనసు ఏకాగ్రతమవుతుంది. మీ హృదయంలో భగవంతుని మూర్తి స్థిరంగా ఉండి, మనసంతా దివ్యమైన ఆలోచనలే ఉంటాయి. మీరు మీ శరీరాన్ని, దానితో సంబంధాన్ని మరియు మీ చుట్టుపక్కల ఉండే విషయాలను మరచిపోతారు. అహంకారం క్రమంగా నిర్మూలించబడుతుంది. ఎప్పుడైతే వీటిని మరచిపోవడం అనేవి ఉంటుందో అప్పుడు మీరు పరమ శివుని యొక్క పరమానందాన్ని రుచి చూసి అనుభవిస్తారు. రుద్రం లేదా ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని పఠించడం వలన మనస్సు శుద్ధి పొంది సత్వముతో నిండిపోతుంది.

రోగంతో బాధపడుతున్న వ్యక్తి పేరున మీరు రుద్ర పాఠం చదివి అభిషేకం చేస్తే అతి త్వరగా అనారోగ్యం నుంచి విముక్తుడు అవుతాడు. అభిషేకం వలన ఔషధానికి లొంగని వ్యాధులు సైతం నయమవుతాయి. అభిషేకము ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, పుత్రపౌత్రాభివృద్ధి మొదలైనవి ఇస్తుంది. సోమవారము చేసే అభిషేకం అత్యంత శుభకరము.

పంచామృతాలు, తేనె, పాలు మొదలైనవి భగవంతునకు అర్పించడం చేత దేహాత్మ భావన (శరీరమే నేను అనుకునే భావన) నశిస్తుంది. స్వార్థం అనేది నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోతుంది. నీవు అపరిమితమైన ఆనందాన్ని పొందుతావు. భగవంతునికి అధికముగా అర్పించుకోవడం మొదలు పెడతావు. కనుక ఆత్మ సమర్పణ/ఆత్మ నివేదన మరియు సర్వస్య శరణాగతి అనేవి వస్తాయి. 'నేను భగవంతునకు చెందిన వాడను. అందరూ భగవంతునికి చెందినవారే. అంతటా ఆ భగవంతుడే ఉన్నాడు' అనే భావన నీ హృదయము నుండి సహజంగానే ఉబికి వస్తుంది.

కన్నప్ప నాయనారు శివునకు గొప్ప భక్తుడు, వృత్తిరీత్యా వేటగాడు, దక్షిణ భారతదేశంలోని శ్రీకాళహస్తిలో ఉన్న లింగం మీద తన నోటిలో పోసుకుని తీసుకువచ్చిన నీటిని పోసి అభిషేకము చేసి శివుడిని ఆరాధించేవాడు. అతని యొక్క శుద్ధమైన భక్తిని చూసి శివుడు మెప్పు పొందాడు. మానసిక భావమే ముఖ్యమైనది కానీ బాహ్యమైన ఆడంబరము కాదు. పరమశివుడు ఆలయ పూజారికి ఇలా చెప్పారు - "నా ప్రియ భక్తుడైన కన్నప్ప నోటిలోని నీరు గంగాజలం కంటే మరింత పవిత్రంగా, నిర్మలంగా ఉన్నాయి".

భక్తుడు శివునకు అభిషేకాన్ని క్రమం తప్పకుండా చేయాలి. అతడు హృదయపూర్వకంగా రుద్ర నమక చమకాలు నేర్చుకోవాలి. ఏకాదశ రుద్రాభిషేకం అనేది అత్యంత శక్తివంతము మరియు ప్రభావవంతమైనది. ఉత్తర భారతదేశంలో ప్రతి పురుషుడు మైర్యు స్త్రీ, ఒక చిన్న పాత్రతో నీటిని తీసుకువెళ్లి శివలింగం మీద పోస్తారు. ఇది కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగించి, కోరికలను సఫలీకృతం చేస్తుంది. శివరాత్రి నాడు చేసే అభిషేకం ఎంతో ప్రభావవంతమైనది.

శివుని యొక్క వైభవాన్ని మరియు ఆయన చరాచర జగత్తులో సర్వ జీవులందు వ్యక్తమైన విధానాన్ని ప్రకటించే మీరందరూ చదువుదురుగాక. మీరంతా ప్రతిరోజూ అభిషేకం చేసి శివానుగ్రహం పొందుదురుగాక. మీ అందరిని విశ్వనాథుడు ఆశీర్వదించుగాక.

శివాలయంలో అభిషేకం మరియు రుద్ర జపం చేయుటవలన కలుగు ఫలము

చమకమ్ అనేది 11 అధ్యాయాలుగా విభజించబడింది. అందులోని ప్రతి అధ్యాయాన్ని నమకంతో కలిపి చదువుతారు. దీన్నే అంటారు రుద్రం అంటారు. అలాంటి 11 రుద్రాలు కలిపితే ఒక లఘు రుద్రం. 11 లఘు రుద్రాలు ఒక మహా రుద్రము. 11 మహా రుద్రాలు ఒక అతిరుద్రం.

సంకల్పము, పూజ, న్యాసము, అంగపూజ, పంచామృతస్నానం మరియు ధ్యానం తరవాత రుద్రాన్ని చదువుతారు. రుద్రపఠనం వలన కలుగు ఫలములు ఈ విధముగా ఉంటాయి. 

1 రుద్రము పిల్లలకు కలిగే రోగాలు - బాలారిష్టాలు నుంచి విముక్తి 
3 రుద్రాలు - వ్యక్తి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న ఆపదల నుంచి విముక్తి 
5 రుద్రాలు - జాతకంలో లో దుఃస్థానాలలో ఉన్న గ్రహాల యొక్క చెడు ప్రభావం నుంచి విముక్తి 
7 రుద్రాలు - గొప్ప భయము నుంచి విముక్తి 
9 రుద్రాలు - ఒక వాజపేయ యాగము చేసిన ఫలము మరియు మానసిక ప్రశాంతత 
11 రుద్రాలు - రాజుల యొక్క వశము మరియు గొప్ప సంపదను పొందుట 
33 రుద్రాలు - కోరుకున్న వస్తువు లభించుట మరియు శత్రు నాశనము 
77 రుద్రాలు - గొప్ప ఆనందాన్ని అనుభవించుట 
99 రుద్రాలు - పుత్రుడు, పౌత్రుడు (మనవడు), సంపద, ధాన్యము, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పొందుట మరియు మృత్యువు నుంచి విముక్తి 
1 మహా రుద్రము - రాజు యొక్క మెప్పు పొందుట మరియు గొప్ప సంపదకు అధిపతి అగుట 
3 మహా రుద్రాలు - అసాధ్యమైన పనిని నెరవేరుట 
5 మహా రుద్రాలు - విశాలమైన స్థలాలను పొందుట 
7 మహా రుద్రాలు - సప్త లోకాలు జయించుట 
9 మహా రుద్రాలు - జనన మరణ చక్రం నుంచి విముక్తి 
ఒక అతిరుద్రం - భగవంతుడ అగుట

అభిషేకానికి పదార్థములు: శుద్ధ జలము, పాలు, నెయ్యి, తేనె, పవిత్రమైన నదులు మరియు సముద్రం యొక్క జలము. 

వృష్టి/ వర్షము కొరకు శుద్ధ జలముతో అభిషేకించాలి. రోగ నాశనం కొరకు మరియు పుత్రుని పొందుటకు పాలతో అభిషేకించాలి. పాలతో అభిషేకిస్తే పుట్టు గొడ్రాలు సైతం సంతానవతి అవుతుంది. ఆ వ్యక్తికి పుష్కలమైన గోసంపద లభిస్తుంది. కుశాజలంతో అభిషేకిస్తే అతడు సర్వ రోగాల నుంచి విముక్తి అవుతాడు. సంపద కోరే వ్యక్తి నెయ్యి, తేనె మరియు చెరుకు రసంతో అభిషేకించాలి. మోక్షము కోరే వ్యక్తి పవిత్రమైన నదుల యొక్క నీటితో అభిషేకించాలి. 

స్వామి శివానంద విరచిత అభిషేకం యొక్క తత్త్వము ఇక్కడితో సమాప్తము.

ముళ్ళపూడి అభినవ్ గారు వ్యక్తిగత మెసెజ్‌లో దీన్ని తెలుగులోనికి అనువదించమని కోరినందుకు ప్రతిగా ఇది అనువదించడం జరిగింది. మనమంతా వారికి కృతజ్ఞులమై ఉండాలి.

ఓం నమశ్శివాయ 

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 32 వ భాగము



153. శిష్యుడు మొట్టమొదటగా తన గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చూపిన మార్గంలో నడవాలి.
154. శిష్యుడు గురువు యొక్క ఇంట్లోనే ఉంటూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటూ, గ్రంథాధ్యానం చేయాలి.
155. చద్ది అన్నము లేక పంచభక్ష పరమాన్నాము, మంచిదో, చెడ్డదో, ఎక్కువో, తక్కువో, ఏదైతే గురువు యొక్క పవిత్రమైన హస్తాల ద్వారా వస్తుందో/ అందుతుందో, ఆ ఆహారాన్నే శిష్యుడు స్వీకరించాలి/భుజించాలి.
156. మనస్సు యొక్క నీచమైన ప్రకృతిని శుద్ధి చేసుకోవాలి. శిష్యుడు గురువుకు ఈ విధంగా చెబుతాడు- "నాకు యోగాభ్యాసం చేయాలని ఉంది. నిర్వికల్ప సమాధిని పొందాలని ఉంది. మీ యొక్క పాదపద్మముల ముందు కూర్చోవాలని ఉంది. నేను మిమ్మల్ని శరణువేడాను". కానీ అతడు తన నీచమైన/ అల్పమైన ప్రకృతిని మరియు అలవాట్లను, అతని పాత స్వభావాన్ని, వ్యవహరించే తీరును, నడవడికను మార్చుకోడు.
157. అల్పమైన ప్రకృతిని మార్చడం అంత సులభం కాదు. అలవాట్ల యొక్క శక్తి చాలా బలంగా మరియు మొండిగా ఉంటుంది. దానికి ఎంతో సంకల్ప బలం ఉండాలి. సాధకుడు తన పూర్వపు అలవాట్ల యొక్క శక్తి వలన బలహీనుడిని భావిస్తాడు. అతడు నిరంతర జపము, కీర్తనము, ధ్యానము, నిస్వార్థ సేవ, సత్సంగము మరియు అలుపు చెందని స్వభావము ద్వారా తన సత్త్వాన్ని మరియు సంకల్ప బలాన్ని ఎంతో వృద్ధి చేసుకోవాలి. అతడు తనలోని దోషాలను ఆత్మపరిశీలన చేసుకుని తన యొక్క లోపాలను మరియు బలహీనతలను గ్రహించాలి. అతడు గురువు యొక్క మార్గదర్శనంలో జీవించాలి. గురువు శిష్యుని దోషాలను గ్రహించి/తెలుసుకుని వాటిని నిర్మూలించేందుకు తగిన మార్గాలను సూచిస్తాడు.
158. మోక్షాన్నిచ్చే నాలుగు సాధనాలను నీవు అలవర్చుకొని, అప్పుడు బ్రహ్మ శ్రోత్రియుడు, బ్రహ్మ నిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళాలి. నీ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. గురువు ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపదేశం అనే సహాయంతో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలి. నీవు సరైన విధంగా మలుచుకునే వరకు, ఆయనతోనే జీవించాలి. జీవన్ముక్తి పొందిన మహాత్ముని నీతో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండడం ఎంతో ఉన్నతిని కలిగిస్తుంది. నీకు తపన మరియు నిజాయితీ ఉంటే నీ గురువు చెప్పిన సూచనలు తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తే, నీవు నిరంతరం తీవ్రమైన ధ్యానం చేస్తే, పరమ లక్ష్యాన్ని ఆరు నెలల లోపే సాధిస్తావని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దీన్ని నా మాటగా తీసుకో. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
159. ఈ ప్రపంచమంతా ప్రలోభాలతో మరియు దురాకర్షణలతో నిండి ఉంది. కాబట్టి కొత్తగా సాధన మొదలు పెట్టినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు సరైన విధంగా రూపుదిద్దుకునే వరకు, ధ్యానంలో ఒక స్థాయికి చేరుకునే వరకు, వారు గురువు యొక్క పాదపద్మాల వద్ద కూర్చోవాలి. ఎవరైతే మొదటి నుంచి స్వతంత్రంగా ఉంటూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, గురువు గారి మాట పట్ల ఏ విధమైన శ్రద్ధ చూపించరో, వారు నిరాశాజనకమైన ఫలితాలకు దృష్టాంతాలు గా మారతారు. వారు లక్ష్యం లేని జీవితాన్ని గడుపుతూ, దశదిశ లేకుండా ప్రవాహానికిఅటు నుంచి ఇటు కొట్టుకుపోతున్న చెక్క దుంగ లాగా, సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ ఉంటారు.
160. మూర్ఖమైన శిష్యుడు తన పాత అలవాట్లనే పట్టుకుని ఉంటాడు. అతడు భగవంతునికి లేదా తన గురువుకి శరణాగతి చేయడు.
161. శిష్యుడు నిజంగా మెరుగుపడాలి అనుకుంటే అతను తన గురువు ముందు ముక్కుసూటిగా మరియు నిష్కపటంగా ఉండాలి.
162. విధేయత లేనివాడు, క్రమశిక్షణను ఉల్లంఘించి వాడు, తన గురువు ముందు యధార్ధముగా మాట్లాడనివాడు, ముక్కుసూటిగా మాట్లాడకుండా తన భావాలను దాచుకునేవాడు, గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శి కొరకు తన హృదయాన్ని తెరువలేనివాడు గురు వలన ఏ విధంగానూ లాభపడడు. అతడు తాను ఏర్పరుచుకున్న ఊబి లేదా బురదలో కూరుకుపోయి, ఆధ్యాత్మికపథంలో ఉన్నతిని పొందడు. ఎంత దయనీయమైన పరిస్థితి. నిజానికి అతనిది ఎంతో దౌర్భాగ్యము.
163. శిష్యులు భగవంతుడు లేదా గురువుకు సంపూర్ణముగా, నిష్కపటంగా, లోపరహితంగా, ఏ విధమైన ఫలములు ఆశించకుండా ఆత్మ సమర్పణ లేదా శరణాగతి చేయాలి.
164. గురువు చేయగలిగినదల్లా తన శిష్యులకు సత్యాన్ని ఎఱుకపరుచుకునే లేదా దివ్యజ్ఞానాన్ని తన ముందు ఉంచే మార్గాన్ని మాత్రమే తెలుపగలరు.
165. మోక్షానికి తగిన నాలుగు సాధనాలు కలిగి ఉన్న శిష్యుయ్డు, గురువు పాదాల వద్ద కూర్చుని శృతులను (వేదాలను) శ్రవణం చేస్తాడొ, తత్వమసి మొదలైన మహావాక్యాల ప్రముఖతను తెలుసుకొని, అటు తర్వాత లోతుగా విచారణ చేస్తాడు.

Tuesday 26 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 31 వ భాగము



131. గురువు పట్ల మర్యాదతో ప్రవర్తించడం కంటే విధేయత కలిగి ఉండటమే కంటే ఉత్తమమైనది.
132. గురువు పట్ల విధేయత కలిగి ఉండటం అనేది త్యాగం కంటే ఉన్నతమైనది.
133. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ గురువుతో సర్దుకుని ఉండటాన్ని అలవరుచుకో.
134. నీ గురువు ముందు అధికముగా మాట్లాడకు.
135. గురువు పట్ల శుద్ధమైన ప్రేమయే నిజమైన విధేయత.
136. ఉత్తమమైన వస్తువులను ముందుగా గురువుకు సమర్పించు.
137. శిష్యుడనేవాడు అహంకారము, అసూయ, ఓర్వలేనితనం నున్చి విముక్తుడై, ఎటువంటి బంధము లేకుండా, గురు భక్తి తత్పరుడై, అసహనం లేనివాడై, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన కలిగి ఉండాలి.
138. తన గురువు యందు శిష్యుడు దోషాలు/ తప్పులు వెతక రాదు.
139. తన గురువు ముందు శిష్యుడు ఎన్నడూ కూడా అనవసరమైన లేదా అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు.
140. యజ్ఞ యాగాది క్రతువుల్లో అగ్ని మధించడానికి ఉపయోగించే ఆరణిలోని ముఖ్యమైన లేదా కింద భాగాన్ని గురువుగా, పై భాగాన్న్ని శిష్యునిగా భావించాలి. గురువు చేసే సూచన మధ్యలో ఉన్న ప్రదేశం. జ్ఞానం అనేది వారిద్దరినీ కలిపి ఉంచి ఆనందాన్ని తీసుకువస్తుంది.
141. గురువు నుంచి పొందిన శుద్ధమైన జ్ఞానము మాయ లేదా భ్రాంతి ని తొలగిస్తుంది.
142. ఎవరైతే గురువు అనుగ్రహం ద్వారా ఒక్కడే అయిన భగవంతుడు మాయ చేత అనేకమయ్యడని తెలుసుకుంటాడో, అతను వేదాలను అర్థం చేసుకొని, జ్ఞానాన్ని ఎఱుకపరచుకుంటాడు.
143. గురువు పట్ల సేవా మరియు పూజ్య భావం చేత ఏర్పడిన ఏకీకృతమైన భక్తి చేత సానబెట్టిన జ్ఞానమనే పదునైన ఖడ్గంతో మౌనముగా మరియు నిరంతరము సంసారమనే వృక్షాన్ని నరికి వేయవచ్చు.
144. గురువు అనే వాడు ఓడకు చుక్కాణి, భగవంతుని అనుగ్రహమనే గాలి దాన్ని ముందుకు తీసుకువెళుతుంది.
145. ఏ వ్యక్తి అయితే ప్రపంచము చేత విసిగిపోయి వైరాగ్యంతో నిండి ఉంటాడో, అతని గురువు చెప్పిన విషయాలను అతడు మనసులో మననం చేసుకోగలుగుతాడో, ధ్యానాన్ని నిరంతరం సాధన చేస్తాడొ, అతడి సాధన వలన ఏర్పడిన పుణ్యఫలం చేత అతని మనసు చెడును వదిలివేస్తుంది.
146. గురువు నుంచి సరైన పద్ధతిలో తెలుసుకుని మంత్రోపదేశం తీసుకుంటేనే, మంత్ర శుద్ధి ఏర్పడుతుంది.
147. అనాదిగా ఉండే అజ్ఞానములో చిక్కుకున్న మానవుడు గురువు లేకుండా ఆత్మసాక్షాత్కారం పొందలేడు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలడు.
148. వివేకవంతుడైన మానవుడు గురువే భగవంతుడు మరియు ఆత్మ అని తెలుసుకొని నిరంతర భక్తితో గురువును పూజించాలి.
149. శిష్యునకు గురువు పట్ల మరియు భగవంతుని పట్ల నిజమైన భక్తి ఉండాలి.
150. శిష్యుడు గురువును విధేయతతో, జాగురూకతతో, నిజాయితీతో సేవించి, భాగవత్ధర్మాన్ని లేదా భగవంతుని యొక్క భక్తులైన వారి ధర్మాలను గురువు నుంచి తెలుసుకోవాలి.
151. శిష్యుడు గురువునే తన భగవంతునిగా సేవించాలి. అది మాత్రమే విశ్వాత్మకుడైన భగవంతునికి ప్రీతియై, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు అవడానికి నిశ్చయమైన మార్గము.
152 శిష్యుడు బంధరాహిత్యాన్ని సాధన చేస్తూ, తన సద్గురువు తో నిరంతర సంగం ఏర్పరుచుకోవాలి.

Sunday 24 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 30 వ భాగము



109. ఆత్మానుభూతి అనే ఆలయానికి మొదటి స్తంభము గురువుతో సత్సంగము.
110. భగవంతుని యొక్క అనుగ్రహము గురువుగా రూపు దాల్చుతుంది.
111. గురువుని చూడటమంటే భగవంతుడిని చూడటము.
112. దివ్యమైన సద్గురువును చూడని వాడే గుడ్డివాడు/ అంధుడు.
113. గురువు పట్ల భక్తి మరియు ప్రేమ అనే ఒకే ఒక్క మతము తప్ప మరే ఇతర మతము లేదు.
114 భౌతికమైన ఆశలు లేనప్పుడే పవిత్రమైన సద్గురువు యందు భక్తి కలుగుతుంది.
115. గురువు యొక్క సన్నిధి లేదా సహచర్యం నీ యొక్క ప్రయాసలను సులభం చేస్తుంది.
116. గురువుయందు శరణాగతి చేసి సరైన పని నిర్వహించు.
117. నీ గురువు యొక్క అనుగ్రహము యందు విశ్వాసం ఉంచి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
118. గురువు పట్ల విధేయత చూపకపోవడం అంటే ఈ సమాధిని నీవు త్రవ్వుకోవడమే.
119. సద్గురువు అంటే శిష్యునిపై ఎల్లవేళలా ఉండే ఆశీర్వచనము.
120. జగద్గురువు హృదయం అందానికి ఆలయము.
121. గురు సేవ చేయడమే జీవితం యొక్క లక్ష్యము.
122. మీ జీవితంలో కలిగే ప్రతి ప్రతిఘటన/ అప్రీతికరమైన సంఘటన, నీ గురువు యందు నీకుండే విశ్వాసానికి పరీక్ష.
123. శిష్యుడు కర్మలను చూస్తాడు. గురువు వాటి వెనుకనున్న ఉద్దేశాలను మరియు అభిప్రాయాలను చూస్తారు.
124. గురువు చేసే పనులు యందు సందేహము/ అనుమానం కలిగి ఉండుట అతిపెద్ద పాపము.
125. నీవు ఏదైతే కాదు ఆ విధంగా నీ గురువు ముందు ఎన్నడు ఎదురుపడకు/ నటించాలనుకోకు.
126. శిష్యుని యొక్క జీవితంలో విధేయత అనేది గొప్ప నియమము.
127. నీ యొక్క సద్గురువును సేవించటంలో ఏ విధమైన అవకాశాన్ని వదులుకోకు.
128. నీ యొక్క సద్గురువును సేవించే సమయంలో నిజాయితీతో మరియు చిత్తశుద్ధితో ప్రవర్తించు.
129. గురువును ప్రేమించడమంటే గురు సేవ చేయడమే.
130. సద్గురువు యొక్క సేవ కొరకే జీవించాలి.

Friday 22 November 2019

స్వామి సత్యానంద సరస్వతీ సూక్తి



Suffering is the crucible into which nature throws a man whenever she wishes to mould him into a sublime superman ..... Only when you enter the furnace can you become Gold.

- Swami Satyananda Saraswati

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 29 వ భాగము



95. గురు-భక్తి యోగాన్ని పాటించడం చేత మాత్రమే వ్యక్తికి భయం తొలగి జీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఆనందంగా ఉంటాడు.
96. గురు-భక్తి యోగాచరణ ద్వారా అమరమైన సచ్చిదానంద తత్వమైన ఆత్మను మీ లోనే తెలుసుకోండి.
97. మీ జీవితం యొక్క ఉద్దేశ్యము, లక్ష్యము మరియు ప్రయోజనంగా ఈ గురు భక్తి యోగాన్ని మార్చుకోండి. మీరు సచ్చిదానంద తత్వాన్ని చేరుకుంటారు.
98. గురు-భక్తి యోగం అనేది జ్ఞానానికి అనుబంధమైనది.
99. గురు-భక్తి యోగం యొక్క ముఖ్యమైన లక్ష్యం విచ్చలవిడిగా తిరిగే ఇంద్రియాలను నిగ్రహించి, చంచలమైన మనస్సును స్థిరముగా చేయుట.
100. గురు-భక్తి యోగం అనేది సనాతన హిందూ సంప్రదాయంలోని ప్రాచీన పద్ధతి. ఇది మానవుడిని సనాతనమైన ఆనందం మరియు భగవంతునితో ఐక్యము దిశగా తీసుకువెడుతుంది.
101. గురు-భక్తి యోగము అనేది ఆధ్యాత్మిక మరియు మానసిక అభివృద్ధికి చెందిన ఒక పద్ధతి/ వ్యవస్థ.
102. గురు-భక్తి యోగం అనేది మానవుడు సృష్టి యొక్క బంధనాల నుంచి విడిపించి, తన సహజ స్థితి అయిన దైవత్వానికి అతడిని చేరుస్తుంది.
103. గురుభక్తి యోగాచరణ శరీరాన్ని, మనస్సుని లోపాలు మరియు రోగాల నుంచి విముక్తి చేస్తుంది.
104. గురు-భక్తి యోగాచరణ ద్వారా వ్యక్తి భౌతికమైన మరియు మానసికమైన సమర్థతను, కార్యకుశలత పొందుతాడు.
105. గురు-భక్తి యోగం అనేది మానవుడిని బాధలు, కష్టాలు మరియు వృద్ధాప్యం విముక్తుడిని చేసి దీర్ఘాయువును మరియు ఎల్లప్పటికి ఉండే ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
106. గురు-భక్తియోగము తనలో అన్ని రకాల భౌతిక మానసిక, ఆధ్యాత్మిక మరియు నైతికమైన క్రమశిక్షణ ఇముడ్చుకుని, తన మీద తనే విజయం సాధించి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడుతుంది.
107. గురు-భక్తి యోగం అనేది మనస్సు యొక్క శక్తులు మీద నైపుణ్యాన్ని ఇచ్చే ఒకానొక శాస్త్రము మరియు కళ.
108. గురువును విశ్వాసం మరియు భక్తి అనే పుష్పాలతో పూజించండి.

ఈ రోజు 22 నవంబర్ 2019, శుక్రవారం, ఉత్పన్న ఏకాదశి.



కార్తీక బహుళ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు. ఏకాదశి వ్రతాచరణలో ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి అయిన ఏకాదశీ దేవిని ఉద్దేశించి ఏకాదశి ఉపవాస వ్రతాన్ని చేస్తారు భక్తులు. యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంహరించాలనుకున్న మురాసురుడిని అంతమొందించడానికి శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తియే ఏకాదశీ దేవి. అందువలన శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణ శక్తుల్లో ఏకాదశి ఒకరు. సప్తమాతృకల్లో ఒకరైన వైష్ణవి శ్రీ మన్నారాయణుని మరొక శక్తి. అందువలన ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి మాత జన్మతిథిగా జరుపుతారు. సంవత్సరమంతా ఏకాదశీ వ్రతం ఆచరించాలనుకునే వారు ఈ ఏకాదశి రోజునే ప్రారంభిస్తారు.

ఏకాదశి శ్రీ మన్నారాయణుని ఆరాధానకు అత్యంత విశేషమైనది. ఆనాడు చేసే విష్ణు నామస్మరణ, సహస్రనామపారాయణ అనేక రెట్ల ఫలితాన్నిస్తుంది.

ఓం నమో నారాయణాయ 

Thursday 21 November 2019

స్వామి దయానంద సూక్తి




The more you see Isvara’s order, the less you are away from the Lord. To recognize this order is to surrender to this order. In surrender you let the order rule your life.

- Swami Dayananda

2 ఏళ్ళ పసివాడి ప్రాణాలు కాపాడిన కుక్క.

తాను గడ్డకట్టిపోతున్నా, కదలకుండా, అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా అలాగే ఉండిపోయిన కుక్క ఇదే. 


రోడ్డున పడేసిన 2 ఏళ్ళ పసివాడి శరీరాన్ని రెండు రోజుల పాటు చుట్టుకుని, చలి కారణంగా గడ్డకట్టిపోకుండా ప్రాణాలు కాపాడిన కుక్క.

కుక్కలు అనేవి అద్భుతమైన జీవులు. మానవులకు నిరంతరం తోడు ఉండటమే కాదు, అత్యవసర సమయంలో రక్షణకు కూడా వస్తాయి. ఒక పసిపిల్లావాడు ప్రాణాలు విడువకుండా ఉండేందుకు రెండు రోజుల పాటు, వాడి శరీరాన్ని చుట్టుకుని, తాను గడ్డకట్టిపోతున్నా, కదలకుండా, అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా అలాగే ఉండిపోయి రక్షించిన కుక్క గురించి చెప్పే ఉదంతమిది.
తాను గడ్డకట్టిపోతున్నా, కదలకుండా, అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా అలాగే ఉండిపోయిన కుక్క ఇదే.   

ఇది రష్యాలోని సైబీరియాలో జరిగింది. మొత్తం ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు గల్గిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధికెక్కింది. బయట గడ్డకట్టుపోతున్న చలి. ఒక చిన్న ఇంటి ముందు రెండేళ్ళ పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. ఆ ఇంటి ముందుండే కుక్క, వెంటనే అతడిని రక్షణకు పరిగెత్తింది. అతడికి వెచ్చదనం ఇవ్వడం కొరకు తన శరీరంతో పసివాడి శరీరాన్ని చుట్టి/ కప్పి, వెచ్చదనం ఇచ్చింది. ఈ సాహసోపేతమైన చర్య వలన ఆ పిల్లవాడు రెండు రోజులు బ్రతకగలిగాడు. రెండు రోజుల తర్వాత చుట్టుప్రక్కల వాళ్ళు ఆ కుక్కను గమనించి, దాన్ని పరీక్షించటానికి వెళ్ళగా, ఆ కుక్క క్రింద ఒక పసివాడు ఉండటాన్ని గమనించి, విస్మయం చెందారు. ఇద్దరు బ్రతికినా, ఆ అబ్బాయి శరీరంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో అతడు హైపోతర్మియాకు గురయ్యాడు. కానీ ఆ కుక్క చేసిన సాయంవలన అతడు బ్రతికి బట్టకట్టగలిగాడు. చివరకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మను గుర్తించి, పిల్లవాడిని వదిలేసినందుకు శిక్షించారు.

మానవుల్లో మానవత్వం మంటగలుస్తున్నా, జంతువులే మనుషులకంటే గొప్పగా ప్రవర్తిస్తున్నాయని ఋజువు చేసే వేల సంఘటనల్లో ఇది ఒకటి.

Source: http://ketoanasa.online/home/dog-wraps-his-body-around-an-abandoned-2-year-old-child-for-2-days-to-keep-him-alive-in-freezing-weather-255.html?fbclid=IwAR1h1e9A5iCcDl0bf9cMS_nzOaEK132HD4oOTmrUkylYd-mOH4fqmmECbNY

Wednesday 20 November 2019

స్వామి చిన్మయానంద సూక్తి



Opportunities are plenty all around. You should catch them. 

- Swami Chinmayananda

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 28 వ భాగము



75. గురు భక్తి యోగాన్ని ఆచరించడం వలన లెక్కకట్టలేనంత ఆనందం కలుగుతుంది.
76. గురు భక్తి యోగాన్ని ఆచరించడం చేత సాధకులకు దీర్ఘాయువు మరియు సచ్చిదానంద స్థితి లభిస్తుంది.
77. మనసు అనేది సంసారం యొక్క మూలం వద్ద ఉంది. మనస్సే బంధానికి మరియు మోక్షానికి, సుఖదుఃఖాలకు కారణము. ఈ మనసును కేవలం గురు-భక్తి యోగము యొక్క ఆచరణ ద్వారా నియంత్రించవచ్చు.
78. గురు-భక్తి యోగాన్ని ఆచరించడం చేత అమరత్వము, సచ్చిదానందస్థితి, స్వేచ్ఛ, పూర్ణత్వము, బ్రహ్మానందం మరియు ఎల్లప్పుడూ ఉండే సుఖము లభిస్తాయి.
79.అనంతమైన సుఖానికి దారి భక్తి యోగము యొక్క ఆచరణతోనే మొదలవుతుంది.
80. సన్యాసం, తపస్సు, ఇతర యోగాలు, దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు మొదలైన వాటి చేత ఏదైతే లభిస్తుందో అది గురు భక్తి యోగాన్ని ఆచరించడం ద్వారా మరింత వేగంగా లభిస్తుంది.
81. అల్పమైన ప్రకృతిని జయంచి ఉన్నతమైన దివ్యానందాన్ని పొందడానికి ఈ గురు భక్తి యోగం అనేది ఒక ఖచ్చితమైన శాస్త్రము.
82. కొందరు వ్యక్తులు ఈ గురుసేవా యోగాన్ని అల్పమైన యోగంగా భావిస్తారు. వారు ఆధ్యాత్మిక రహస్యం అపార్థం చేసుకున్నారు.
83. గురు-భక్తి యోగము, గురుసేవా యోగము, గురు శరణ యోగము మొదలైనవన్ని పర్యాయపదాలు. అవన్నీ ఒకటే అర్ధాన్ని చూపిస్తాయి.
84. అన్ని యోగాల్లోకెల్లా గురు-భక్తి యోగమే రాజు.
85. సచ్చిదానంద తత్వాన్ని చేరుటకు ఈ గురు భక్తి యోగం అనేది సులభమైన, ఖచ్చితమైన, వేగవంతమైన, ఖర్చు లేనిది, మరియు నిరపాయకరమైన మార్గము. గురు భక్తి యోగం ద్వారా మీరంతా ఈ జన్మలోనే భగవంతుని చేరుగాక.
86. గురు-భక్తి యోగాన్ని స్వీకరించి కోల్పోయిన దివ్యత్వాన్ని తిరిగి పొందండి.
87. గురు-భక్తి యోగాన్ని ఆచరించి అద్వైతానికి మరియు బాధలకు అతీతమైన తత్వానికి వెళ్ళండి.
88. శిష్యునకు పరమ శాంతిని ఆనందాన్ని మరియు ముక్తిని ఈ గురు భక్తి యోగము తన ఆచరణ ద్వారా ప్రసాదిస్తుంది.
89. కౄరమైన పులిని, సింహాన్ని లేదా ఏనుగును పెంచుకోవడం చాలా సులభము. నీరు లేదా అగ్ని మీద నడవడం చాలా సులభము. కానీ ఒక వ్యక్తికి గురు భక్తి యోగాన్ని ఆచరించాలన్న తపన లేకుంటే సద్గురువు యొక్క పాదపద్మాలకు శరణాగతి చేయడం చాలా కష్టము.
90. గురు-భక్తి యోగము అనగా గురువు సేవ ద్వారా మనస్సును నియంత్రించుకోని, దానిని మార్చుకోవడం.
91. గురువుకు బేషరతుగా సంపూర్ణ శరణాగతి చేయడమే గురుభక్తిని పొందడానికి నిశ్చితమైన మార్గము.
92. గురువుయందు ప్రస్నాతీతమైన విశ్వాసమే గురు భక్తి యోగానికి పునాది లేదా ఆధారము.
93. నీవు నిజంగా భగవంతునికి పొందాలనుకుంటే ప్రాపంచికమైన ఇంద్రియ విషయాల నుంచి ప్రక్కకు మళ్ళి, గురుభక్తి యోగాని ఆచరించు.
94. ఎటువంటి ఆటంకమూ లేకుండా నిరంతరం గురు-భక్తి యోగాన్ని పాటించు.

Tuesday 19 November 2019

దివ్య దృష్టి - స్వామి సచ్చిదానంద సూక్తి



Divine Vision

The real world is in you; everything else is outside. So if you recognize the peace in you, then, wherever you go, you will see that peace. Until that time, you depend on something other than you, outside of you, but you cannot depend on the outside world always. You should try to find that inner world. Look within. If you don’t see the divine in you, as you, you won’t be able to see it outside. You have to have that divine vision, because it is you who sees the world outside. You see it the way you think.

- Swami Satchidananda

Monday 18 November 2019

స్వామి శివానంద సూక్తి



Fewer the thoughts, greater the mental strength and concentration. Suppose that the average number of thoughts that pass through your brain within one hour is one hundred. If you succeed in reducing it, by constant practice of concentration and meditation, to ninety, you have gained ten per cent of the power of concentration of mind.

- Swami Sivananda

Saturday 16 November 2019

మధర్ సూక్తి



All depends on the attitude with which you do the work. If done with the right attitude, it will surely bring you nearer to me.

- The Mother
17 May 1937

Thursday 14 November 2019

స్వామి వివేకానంద సూక్తి



This is the gist of all worship — to be pure and to do good to others. He who sees Shiva in the poor, in the weak, and in the diseased, really worships Shiva; and if he sees Shiva only in the image, his worship is but preliminary. He who has served and helped one poor man seeing Shiva in him, without thinking of his caste, or creed, or race, or anything, with him Shiva is more pleased than with the man who sees Him only in temples.

- Swami Vivekananda 

Wednesday 13 November 2019

శ్రీ గురు నానక్ సూక్తి



Asceticism doesn't lie in mere words; He is an ascetic who treats everyone alike. Asceticism doesn't lie in visiting burial places; it lies not in wandering about nor in bathing at places of pilgrimage. Asceticism is to remain pure amidst impurities.

- Sri Guru Nanak

Tuesday 12 November 2019

శ్రీ గురు నానక్ సూక్తి



If the people use the wealth bestowed on them by God for themselves alone or for treasuring it, it is like a corpse. But if they decide to share it with others, it becomes sacred food.

- Sri Guru Nanak

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 27 వ భాగము



44. ఈ జన్మలోనే అన్ని విధముల బాధలను తొలగించే ఏకైక పరిష్కారం గురు భక్తి యోగము.

45. అర్హత కలిగిన శిష్యునకు ఈ గురు భక్తి యోగ మార్గము త్వరగా ఫలాలను ఇస్తుంది.

46. గురు-భక్తి యోగము అహంకార నాశనముతో ముగిసి, సచ్చిదానందాన్ని అందిస్తుంది.

47. గురుభక్తి యోగము అత్యంత ఉన్నతమైన యోగము.

48. గురువు యొక్క పవిత్ర పాదాల ముందు సాష్టాంగ దండ ప్రణామాలు చేయుటకు సిగ్గు పడటం అనేది గురు-భక్తి యోగము యొక్క ఆచరణలో ఒక పెద్ద విఘ్నము/ అడ్డంకి.

49. తనను తాను సమర్ధించుకుంటూ, తన వద్దే అన్ని కలిగి ఉన్నాయి అనుకుంటూ; దురభిమానము; తనపై తనకు నియంత్రణ లేనితనము, తను చెప్పినదే వేదమని, తనకు తెలిసినదే నిజమే నమ్ముట, అలసత్వము, జడత్వము, మూర్ఖత్వం, మొండితనము, దోషములు వెతకడం, చెడు సహవాసం, నిజాయితీ రాహిత్యం, లౌల్యము, దురహంకారము, కోపము, దురాశ, పొగరు అనేవి ఈ గురు భక్తి యోగ మార్గంలో అతిపెద్ద అడ్డంకులు.

50. గురు భక్తి యోగము యొక్క నిరంతర ఆచరణ ద్వారా మనస్సు యొక్క చంచలత్వాన్ని నశింప చేసుకోండి.

51. గురు భక్తి యోగము యొక్క ఆచరణ ద్వారా చెదిరిపోయిన మానసిక కిరణాలు ఒకే దిశగా ఏకీకృతం అయి మీరు అద్భుతాలు చేయగలరు.

52. గురు-భక్తి యోగము అనే పథము గురువుకు సేవ చేయడం ద్వారా పవిత్ర హృదయాన్ని, ధ్యానము చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందటానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది.

54. ముందు గురు భక్తి యోగము యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని, ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టు. నీవు విజయం సాధిస్తావు.

55. దుర్గుణాలు అన్నింటిని నిర్మూలించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గము నిజాయితీగా గురు-భక్తి యోగాన్ని ఆచరణలో పెట్టుటయే.

56. గురు భక్తి యోగము అనే వృక్షానికి గురువుయందు అనన్యమైన విశ్వాసమే తల్లివేరు/మూలము.

57. ఎల్లప్పుడు గురువు యందు భక్తి పెరుగుతూ ఉండుట, వినయము, విధేయత మొదలైనవి ఈ చెట్టుకు కొమ్మలు. సేవ అనేది పుష్పము. గురువుకు శరణాగతి చేయుట అనేది అమరత్వాన్నిఇచ్చే ఫలము.

58. ఇది ఈ జన్మను ఉద్ధరించి రక్షించే సద్గురువు యొక్క పాదాల యందు అనన్యమైన విశ్వాసం మరియు భక్తి కలిగి ఉంటే నీవు ఈ గురు భక్తి యోగం లో విజయం పొందుతావు.

59. గురువుకు నిజమైన మరియు నిజాయితీతో కూడిన శరణాగతి గురు-భక్తియోగం యొక్క సారము.

60. గురు భక్తి యోగాన్ని ఆచరించడమంటే గురువు పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉండుట.

61. నిజాయితీ లేకుండా గురు భక్తి యోగం లో ఏ విధమైన ఉన్నతి సాధ్యం కాదు.

62. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక తరంగాలు గల ఒక మహా యోగి లేదా సమర్ధుడైన గురువు దగ్గర జీవించు. ఆయన వద్ద ఉంటూ గురువు భక్తియోగాన్ని ఆచరించు. అప్పుడు మాత్రమే భక్తియోగంలో విజయాన్ని సాధిస్తారు.

63. గురు-భక్తి యోగం లో ఘంటాపథంగా చెప్పే విషయం ఏమిటంటే బ్రహ్మనిష్ఠ-గురువు యొక్క పవిత్ర పాదపద్మాల యందు బేషరతుగా అనన్యమైన శరణాగతి చేయాలి.

64. గురు-భక్తి యోగ పద్ధతి ప్రకారం గురువు మరియు భగవంతుడు ఒక్కరే కనుక గురువుకు సంపూర్ణ శరణాగతి చేయటం అత్యవసరము.

65. గురువుకు శరణాగతి చేయుట అనేది గురు భక్తి యోగము అనే నిచ్చెనలో అత్యుత్తమమైన మెట్టు.

66. గురు భక్తి యోగ ఆచరణకు గురు సేవ చేయుట తప్పనిసరి.

67. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడమే గురు-భక్తి యోగము యొక్క లక్ష్యము.

68. మొండితనము లేదా మంకుతనం కలిగిన శిష్యుడు ఈ గురు భక్తి యోగ ఆచరణలో ఎటువంటి ఖచ్చితమైన ఉన్నతి పొందలేడు.

69. చెడు సాంగత్యము అనేది గురు-భక్తి యోగాన్ని ఆచరించే శిష్యునికి పెద్ద శత్రువు.

70. ఈ గురు భక్తి యోగాన్ని ఆచరించాలి అనుకుంటే సుఖవంతమైన/ పశుప్రాయమైన/ విష్యాసక్తితో కూడిన జీవనాన్ని వదిలిపెట్టు.

71. ఎవరైతే దరిద్రాన్ని వదిలించుకుని, ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని అనుకుంటారో వారు ఖచ్చితంగా గురు-భక్తి యోగాన్ని శ్రధ్హ, నిజాయతీతో ఆచరించాలి.

72. గురు సేవా యోగాన్ని పాటించడం చేత నిజమైన మరియు ఎల్లప్పటికి ఉండే ఆనందం కలుగుతుంది, కానీ బాహ్యమైన నశించిపోయే వస్తువుల వలన కాదు.

73. ఎల్లప్పుడూ తిరిగే జనన మరణ చక్రాలు, సుఖదుఃఖాలు, సంతోషవిచారాల మనకు బయటపడే మార్గం లేదా? శిష్యుడా, విను, దీనికి ఒక ఖచ్చితమైన మార్గం ఉంది. నీ యొక్క మనసును ఇంద్రియ విషయాల నుంచి మళ్లించి, ద్వైతానికి అతీతముగా తీసుకువెళ్లే గురుసేవా యోగమందు నిలుపు.


74. ఎవడైతే గురుసేవా యోగాన్ని లేదా గురు భక్తి యోగాన్ని పాటించడం మొదలుపెడతాడో, అటువంటి సాధకునకు నిజమైన జీవనం మొదలై, ఇహలోకంలోనూ పరలోకంలోనూ అతనికి ఎల్లప్పటికి ఉండే ఆనందం కలుగుతుంది.

Monday 11 November 2019

Sunday 10 November 2019

శారదా మాత సూక్తి



The Mother of the universe is the Mother of all. From Her have come out both good and evil.

- Sarada Mata

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 26 వ భాగము



15. వినయంతో పూజనీయమైన సద్గురువు పాదాలను ఆశ్రయించు. జీవితాన్ని కాపాడే సద్గురువు పాదాలకు నమస్కరించు. సద్గురు పాద పద్మాలయందు రక్షణ పొందు. పవిత్రమైన సద్గురువు పాదాలను పూజించు. పవిత్రమైన సద్గురుని పాదాలను ధ్యానించు. మనలోని మాలిన్యాలను తొలగించి పవిత్రతను చేకూర్చే సద్గురువు పాదాల యందు విలువైన బహుమతులు అర్పించు. దివ్యమైన సద్గురుని పాదసేవకు జీవితాన్ని అంకితమివ్వు. సద్గురుని దివ్యమైన పాదపద్మాల ధూళిరెణుగువులుగా మారు. ఇదే గురు భక్తి యోగము యొక్క రహస్యము.

16. సద్గురుని పవిత్రమైన పాదపద్మాలకు శరణాగతి చేయటమే గురు-భక్తి యోగము యొక్క పునాది.

17. గురు-భక్తి యోగ పథంలో కావలసినదల్లా నిజాయతీ మరియు దోషరహితమైన ప్రయత్నము.

18. గురువు యందు భక్తి కలిగి ఉండుట గురు భక్తి యోగము యొక్క ఆచరణలో అత్యున్నతమైన అంశము.

19. గురువు యందు విశ్వాసము కలిగి ఉండుట గురు-భక్తియోగంలో మొదటి మెట్టు.

20. శాస్త్రాల ఎందుకు నిష్ణాతుడైన బ్రహ్మ-నిష్ఠా గురువు యందు మనసా, వాచా, కర్మణా పూర్తి విశ్వాసము లేదా గుడ్డు విశ్వాసముతో ఉండుటయే గురు-భక్తి యోగము యొక్క సారము.

21. ఈ యుగంలో ఆచరించడానికి అత్యంత సులువైన మరియు ఉత్కృష్టమైన యోగమే ఈ గురు భక్తి యోగము.

22. గురుభక్తి యోగంలోని ఉన్నతమైన సూత్రం ఏమిటంటే గురువును భగవంతునిగా భావించాలి.

23. ఈ గురు-భక్తి యోగం యొక్క తత్వంలోని ఆచరణాత్మకమైన విషయం ఏమిటంటే తన ఇష్ట దేవతయే తన గురువని గుర్తెఱగాలి.

24. గురు-భక్తి యోగమనే ఈ పద్ధతి కళాశాలలో లేదా ఉపన్యాసాల ద్వారా కానీ బోధించబడేది, నేర్పబడేది కాదు. శిష్యుడు గురువు దగ్గర ఎన్నో సంవత్సరాలు జీవించి, తీవ్రమైన తపస్సు, క్రమశిక్షణ, బ్రహ్మచర్యం మరియు ధ్యానంతో కూడిన జీవనాన్ని గడపాలి.

25. గురు భక్తి యోగం అనేది అన్ని శాస్త్రాలకు మూలమైన శాస్త్రము.
26. గురు భక్తి యోగము అమరత్వాన్ని, అవధులు లేని ఆనందాన్ని, స్వేచ్ఛను, పూర్ణత్వాన్ని, సచ్చిదానంద స్థితిని, తరిగిపోని శాంతిని ప్రసాదిస్తుంది.

27. భక్తి యోగము యొక్క ఆచరణ ద్వారా బంధరాహిత్యము మరియు వైరాగ్యము ఏర్పడి కైవల్యము లేదా మోక్షము లభిస్తాయి.

28. గురు భక్తి యోగాన్ని ఆచరించడం వలన శిష్యుని యొక్క మనోభావాలు మరియు కామోద్రేకం నియంత్రించబడతాయి, అతడు బయట ప్రకృతి యొక్క ప్రలోభాలను తట్టుకొని, మనసును క్షోభ పెట్టే విషయాలను నిర్మించగలుగుతాడు మరియు అజ్ఞానాంధకారం యొక్క ఆవలి ఒడ్డుకు చేరడానికి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే పాత్రతను ఇస్తుంది.

29. గురువు-భక్తి యోగం యొక్క ఆచరణ వల్ల అమరత్వము, ఉన్నతమైన శాంతి మరియు ఎడతెగని ఆనందము లభిస్తాయి.

30. గురు-భక్తి యోగము యొక్క ఆచరణ వలన భయం, అజ్ఞానం, చెడు ఆలోచనలు, మనస్సు యొక్క గందరగోళం, రోగము, ఆందోళన నిరాశ మొదలైనవి నిర్మూలించబడతాయి.

31. గురు-భక్తి యోగం అనేది వ్యక్తిగతమైన అహంకారము, భావాలు, సంకల్పాలు, అవగాహనస్థాయి, అనంతత్తవ్వానికి దగ్గరగా మార్చుతుంది.

32. గురు-భక్తి యోగంలో చెప్పబడిన సాధనలు చాలా సులువుగా ఉంటాయి మరియు నిర్భయత్వం అనే అవతలి ఒడ్డుకు ఖచ్చితంగా చేరుస్తాయి.

33. గురు-భక్తి యోగము గురువు యొక్క అనుగ్రహం పొందడానికి పాటించే ఒక గట్టి క్రమశిక్షణతో కూడిన పద్ధతి.

34. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా గురువుకు సేవ చేయడము మరియు గురువు యొక్క పాదపద్మాల యందు భక్తి పెరుగుతూ ఉండడం అనేది గురు భక్తి యోగం నేతత్వంలోని అంతర్గతమైన సాధన.

35. నైతికమైన క్రమశిక్షణ మరియు గురువు యందు భక్తి మొదలైనవి లేని వ్యక్తి గురు భక్తి యోగాన్ని పాటించినప్పటికీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందలేడు.

36. గురుభక్తి యోగమే కర్మ యోగము, భక్తి యోగము, రాజయోగము, హఠయోగము మొదలైన ఇతర అన్ని యోగాలకు పునాది.

37. ఎవరైతే గురు భక్తి యోగ పథం నుంచి తప్పుకున్నాడో, అతడు మరింత అజ్ఞానంలోకి, మరింత అంధకారంలోకి మరియు మరణానికి వెళుతున్నాడు.

38. గురు భక్తి యోగాన్ని ఆచరించడం వలన జీవితం యొక్క పరమ లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారానికి స్పష్టమైన నిశ్చితమైన మార్గం ఏర్పడుతుంది.

39. గురు భక్తి యోగము అందరూ ఆచరించవచ్చు. మహాత్ములందరూ, మహా మేధావులందరూ గురు భక్తి యోగాచరణ ద్వారా ఎంతో గొప్ప కార్యాలను ఒనరించారు.

40. గురు భక్తి యోగంలో యోగాలను మిళితమై ఉన్నాయి. గురు భక్తి యోగాన్ని స్వీకరించని/ ఆచరించని వ్యక్తి మరింత కఠినమైన ఇతర ఏ యోగాలు పాటించే లేడు.

41. ఆచారోపాసన ద్వారా గురు కృపను పొందడానికి గురు భక్తి యోగము అనే ఈ పద్ధతి అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది.

42. వేదాలు మరియు ఉపనిషత్తులు ప్రాచీనమైనది ఈ గురు భక్తి యోగము.


43. జీవితంలోని అన్ని బాధలను మరియు చుక్కలను తుడిపివేసే మార్గాన్ని బోధిస్తుంది గురుభక్తి యోగము.

Saturday 9 November 2019

శ్రీ రామకృష్ణ పరమహంస సూక్తి



Do you talk of social reform? Well, you may do so after realizing God. Remember,the Rishis of old gave up the world in to attain God. This is the one thing needful. All other things shall be added to you, if indeed you care to have them. First see God, and then talk of lectures and social reforms.

- Sri Ramakrishna Paramahamsa

Friday 8 November 2019

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి


స్వామి శివానంద విరచిత గురుతత్వము - 25 వ భాగము



తొమ్మిదవ అధ్యాయము
గురు భక్తి యోగము

ఎలాగైతే కీర్తన మరియు సాధన అతి శీఘ్రంగా భగవంతుని దర్శనం పొందడానికి కలియుగంలో చేయగలిగిన ప్రత్యేకమైన సాధనలో, అలాగే సందేహాలు, నాస్తికత్వము, అహంకారము, పొగరుతో నిండిన ఈ యుగానికి అత్యంత ముఖ్యమైన శ్రేష్టమైన సాధన, ఒక సరికొత్త యోగము మీ ముందు ఉంచుతున్నాను. అదే గురు భక్తి యోగము. ఇది అత్యద్భుతమైనది. దాని యొక్క శక్తి మహత్తరమైనది. దాని యొక్క ప్రయోజనము ఏనాడు నిష్ఫలం అవ్వదు. గురు భక్తి యోగము యొక్క నిజమైన వైభవం వివరించలేము. ఈ యుగంలో ఈ జన్మలోనే భగవంతుడు రక్తమాంసాలతో కూడిన శరీరంతో మీ ముందు దర్శనం ఇచ్చేలా చేయగలుగే శ్రేష్ఠమైన యోగమిది. కఠినమైన రాజసిక అహంకారమే సాధకునకు ఒక పెద్ద శత్రువు. మదము మరియు దుష్టమైన అహంకారాన్ని నాశనం చేయుటకు గురుభక్తి యోగం అనేది నిశ్చ్యమైన మరియు ఉన్నతమైన సాధన. ఎలాగైతే ఒక ప్రత్యేకమైన రసాయనం ద్వారా మరణాంతకమైన క్రిమి యొక్క సమాహారం జరుగుతుందో, అలాగే అవిద్యను మరియు అహంకారాన్ని నాశనం చేయడంలో ఈ గురుభక్తి యోగం అనేది అసమానమైనది. అహంకారము మరియు మాయ అనేవి భయంకరమైనవి. ఏ వ్యక్తి అయితే గురు భక్తి యోగము ద్వారా తనను తాను తడిపి ముద్ద చేసుకుంటాడు, అతడు అత్యంత అదృష్టవంతమైన జీవుడు మరియు అతడు ఇక ఎంతకాలము మాయ మరియు అహంకారము వలన పీడింపబడదు. అతనిలో ఆ లక్షణాలు పూర్తిగా శక్తిహీనం అవుతాయి. అతి త్వరగా ఈ యోగం లోకి ప్రవేశించిన వాడు అతి త్వరగా దీవించబడ్డవాడూ. ఎందుకంటే అతడు ఇతర అన్ని యోగాలో కూడా తిరుగులేని విజయాన్ని సాధిస్తాడు. అతనికి కర్మ, భక్తి, ధ్యాన మరియు జ్ఞాన యోగాల యొక్క సంపూర్ణమైన ఫలితాలు ప్రత్యేకంగా అందుతాయి.

ఈ యోగాన్ని ఆచరించడానికి కావల్సినవి నిజాయతీ, విశ్వాసము మరియు విధేయత అనే ఈ మూడు గుణాలు. పరిపూర్ణతను పొందాలని మీ యొక్క ఆకాంక్షలో నిజాయితీగా ఉండండి. అనిశ్చితితో, అస్పష్టతతో ఉండకండి. మీరు గురువుగా అంగీకరించిన వ్యక్తి మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. ఏ కొద్దిగా కూడా సందేహానికి తావు/అవకాశం ఇవ్వకండి. ఒకసారి నీవు గురువుగా ఎంచుకున్న వ్యక్తి యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచినప్పుడు, ఆయన ఏది చెప్పినా అది నీ మేలు కొరకేనని తెలుసుకో. కనుక ఆయన యొక్క బోధనలను తప్పకుండా పాటించు. చెప్పినది చెప్పినట్టు ఆచరించు. ఈ విధంగా చేస్తే నా మాటగా చెబుతున్నాను: మీకు పరిపూర్ణత లభిస్తుంది; గట్టిగా హామీ ఇస్తున్నా.

నీకు ఇప్పుడు గురు భక్తి యోగములోని ముఖ్యమైన వివరాలు ప్రతిపాదిస్తున్నాను.
1. గురు భక్తి యోగము అనేది సద్గురువు యందు సంపూర్ణమైన శరణాగతి చేయుట.
2.ఈ గురు భక్తి యోగానికి ఎనిమిది అంగాలు ఉన్నాయి. ముఖ్యమైనవి ఇవి. (అ) గురు భక్తి యోగాన్ని ఆచరించాలని నిజమైన ఆకాంక్ష కలిగి ఉండుట. (ఆ) సద్గురువు యొక్క ఆలోచనలు, మాటలు మరియు కర్మలయందు సంపూర్ణ విశ్వాసము. (ఇ) గురువుకు వినయంతో సాష్టాంగ నమస్కారము చేయుట మరియు గురు నామాని మననం చేయుట (ఈ) గురువు యొక్క ఆదేశాలను పాటించడంలో పూర్తి విధేయత, ఆజ్ఞాపాలన కలిగి ఉండుట. (ఉ) ఏ విధమైన ఫలితాలు ఆశించకుండా సద్గురువులకు వ్యక్తిగత సేవ చేయుట (ఊ) భావము మరియు భక్తితో సద్గురువు యొక్క పాదపద్మాలను ప్రతిరోజు ఆరాధించుట (ఋ) సద్గురువు యొక్క లక్ష్యం కొరకు తన (శరీరం), మన (మనస్సును), ధనా(ధనము) లను అర్పించుట లేదా శరణాగతి చేయుట (ౠ) దయాళువైన గురువు యొక్క అనుగ్రహం కోసం ఆయన యొక్క పవిత్ర పాదాలను ధ్యానం చేయుట మరియు ఆయన యొక్క పవిత్రమైన ఉపదేశాలను విని ఆచరించుట.
3. గురుభక్తి యోగమనేది ఒక యోగము.
4. గురుభక్తి యోగాన్ని పాటించకుండా సాధకుడు భగవంతునిలో లీనమయ్యే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించలేడు.
5. గురు భక్తి యోగ తత్త్వాన్ని అర్ధం చేసుకున్నవాడు మత్రమే తన గురువుకు బేషరుతుగా శరణాగతి చేయగలడు.
6. గురు భక్తి యోగాన్ని ఆచరించడం స్వారా జీవితం యొక్క అత్యున్నత లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని సాధించవచ్చు.
7. గురు భక్తి యోగం అనేది ఎలాంటి భయం లేకుండా ఆచరించగలిగిన నిజమైన సురక్షితమైన యోగము.
8. గురువు యొక్క ఆజ్ఞలను పూర్తి విధేయతతో స్వీకరించి, ఆయన బోధలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడంలోనే గురు భక్తి యోగం యొక్క సారం ఉంది.
9. గురు భక్తి యోగం యొక్క లక్ష్యము గురువుకు సంపూర్ణ శరణాగతి ద్వారా మానవుడిని దేహం యొక్క బంధనాల నుంచి మరియు ప్రకృతి యొక్క సంకెళ్ళ నుంచి విడగొట్టి, అతని యొక్క శుద్ధమైన సచ్చిదానంద తత్త్వాన్ని తెలుసుకునేలా చేయడం.
10. గురుభక్తి యోగాన్ని ఆచరించే వ్యక్తి, ఏ కష్టం లేకుండా అహంకారాన్ని నిర్మూలించుకుని, సంసార సాగరాన్ని దాటగలడు.
11. గురు భక్తి యోగాన్ని పాటించేవానికి ఈ యోగం అమరత్వాన్ని మరియు బ్రహ్మానందాన్ని ఇస్తుంది.
12. గురుభక్తి యోగం మానసిక స్థిరత్వాన్ని మరియు ప్రశాంతతను ఇస్తుంది.
13. పరమానందాన్ని అనుభవించడానికి గురుభక్తి యోగమే కీలకమైనది.
14. జీవితం యొక్క లక్ష్యం గురు-భక్తి యోగం ద్వారా సద్గురువు యొక్క శుభప్రదమైన అనుగ్రహాన్ని పొందడం.

Wednesday 6 November 2019

కేనోపనిషత్తు నుంచి సూక్తి



He who thinks he does not know It, knows It.  He who thinks he knows It, does not know It. The true knowers think they can never know It (because of Its infinitude), while the ignorant think they know It.

- Kenopanishad 

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 24 వ భాగము



ఇది సత్సంగమా?

ఈనాడు పతనమయ్యింది. అది ఒక రకమైన మానసిక కాలక్షేపము గా మారిపోయింది. సాయంకాల సమయంలో ఒక గంట పాటు సన్యాసులు మరియు గృహస్థులు వేదాంత చర్చ పేరున కొన్ని కబుర్లు, గాలి మాటలు, రాజకీయాలు, దుష్ప్రచారాలు, చాడీలు, ముసి ముసి నవ్వులు, కొంత ఇకిలింపులు-సకిలింపులు మరియు పనికిమాలిన భావలతో కూడిన పిచ్చి ప్రేలాపనలు చెప్పుకోవడం అనేది సత్సంగం పేరున జరుపుతున్నారు. సత్సంగం చేసే సన్యాసుల మనస్సులు మరియు దాన్ని వినే ఇతరులు మనస్సులు, ఎన్నో ఏళ్ల సత్సంగం తర్వాత కూడా అదే స్థితిలో ఉంటున్నాయి. వారిలో ఏ విధమైన ఉన్నతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు.

ఈ ప్రపంచంలో సాధువులు, సన్యాసులు చరిస్తున్నప్పుడు, గృహస్థులకు వైరాగ్య జీవనానికి ఉదాహరణలుగా నిలవాలి. వారు కేవలం వారి జీవనానికి సరిపడా వస్తువులు మాత్రమే గృహస్థుల నుంచి తెచ్చుకోవాలి. వారితో వీరు స్వేచ్ఛగా కలువకూడదు. గ్రామానికి బయట ఒక ఏకాంతప్రదేశంలో జీవించాలి. ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను శ్రద్ధగా నిర్వహించాలి. భౌతికమైన విషయాలు మాట్లాడకూడదు. ఎక్కువగా నవ్వు తెప్పించే కథలను వారు చెప్పకూడదు. ఎగతాళి చేసే/ పరిహాసానికి గురి చేసే సంఘటనలు చెప్పకూడదు. అక్కడ పవిత్రమైన ప్రశాంతత ఉండాలి. మొత్తం ప్రేక్షకులు మంత్రముగ్ధలవ్వాలి. అక్కడ పూర్తిగా నిశ్శబ్దం ఉండాలి. అప్పుడు మాత్రమే గృహస్థులు ప్రభావితమవుతారు. వారికి సత్సంగం నుంచి ఇంకేదో వస్తోందని భావిస్తారు.

ఖీర్- పరోటా పక్షులు

గృహస్థుల నుంచి సన్యాసి ఎన్నో వస్తువులను పదే పదే అడిగిన మరుక్షణం నుంచి అతను తన గౌరవాన్ని, ప్రభావాన్ని కోల్పోతాడు. అతడు ఆ ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్ళవలసి వస్తుంది. కొందరు సిగ్గులేని సన్యాసులు గృహస్థుల ఇంట్లో నెలల తరబడి ఉంటారు. వారు ఖీర్- పరోటా పక్షులు. వారు నిజమైన సన్యాసులు కాదు. రాబోయే జనాభా లెక్కల్లో అధికారులు వారి నివేదికను పంపడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులు సాధువులు మరియు సన్యాసుల కోవలోకి రారు. మేక తోలు కప్పుకున్న తోడేలు వలె కాషాయం కట్టుకున్నా నిపుణులైన ముష్టి వారు వీళ్ళు. నిజమైన సన్యాసి యొక్క నడవడిక ఎంతో వాస్తవికంగా ఉంటుంది. అధికంగా సాధువులు పెరగడం వలన మరియు 74 లక్షల మంది సాధువులు ఉండటం వలన ప్రయోజనమేమి? అందులో మంచి సంప్రదాయం కలిగి ఈ దేశానికి మరియు తమకు ఉపయోగపడే సన్యాసులు, రెండు వేలకు మించి ఉండరు. నిజమైన సాధువు లేదా సన్యాసి ప్రకాశవంతమైన సూర్యుని వలె ఉంటాడు. అతడు రేయింబవళ్లు ప్రకాశిస్తూ ఉంటాడు.

సాధకులకు శిక్షణ ఇవ్వడం

సాధువులు మరియు సన్యాసులకు రిషికేశ్ మాత్రమే అత్యుత్తమమైన ప్రదేశము. ఉచిత ఆహారము, ఉచిత కుటీరాలు మరియు ఉచిత ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. అందమైన గ్రంధాలయం ఉంది. వైద్య సదుపాయం కూడా ఉంది. మీరు ఒక పక్షి వలె స్వేచ్ఛగా ఉండవచ్చు. నిజంగా ఆధ్యాత్మిక ఉన్నతి మరియు ఆత్మసాక్షాత్కారం పొందగోరే సాధువు లేదా సన్యాసి లేదా సాధకుడు, ఈ ప్రదేశంలోనే ఉంటూ ఒక్క రోజు కూడా ఊరు దాటకుండా కనీసం 12 ఏళ్లు ఉంటూ తీవ్రమైన నిరంతర సాధన చేయాలి. ప్రదేశం యొక్క మార్పు అవసరం లేదు. గంగా మరియు హిమాలయాలు ఎల్లవేళలా ప్రేరణను, ఉన్నతిని మరియు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇక్కడ నుంచి వేరొక చోటికి మారాలనుకోవడం బలహీన సంకల్పలు, పిచ్చి పట్టిన వైద్యులు మరియు యొక్క ధనికుల యొక్క మూర్ఖమైన ఆలోచన మాత్రమే.

ఒక చోటి నుంచి వేరొక చోటికి మారుతూ అనేక వేదికల మీద ప్రవచనాలు చెప్పే సన్యాసి కంటే, తన ఆశ్రమంలోనే కూర్చున్న సాధువు లేదా సన్యాసి మరింత దృఢమైన, ఘనమైన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు. ఒక పువ్వు పుష్పించగానే అది తేనెటీగలకు ఏ విధమైన ఆహ్వానాన్ని పంపనవసరం లేదు. తేనెటీగలు వాటంతట అవే వస్తాయి. సత్యం కోసం తపించే నిజమైన సాధకులు నిజమైన సన్యాసి యొక్క ఆశ్రమం ద్వారం ఉంది వెళ్లి నిలబడతారు. సన్యాసులు అనేకచోట్ల ప్రచారం చేసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక వేదికల మీద ప్రవచనాల అరగంటలో జరిగేది తాత్కాలికమైన ఉద్దీపనం మాత్రమే. అక్కడ పన్ని మూలల్లో కొంత అల్లరి, గొడవలు, తగువులాలు, చప్పట్లు, 'విను విను' అనే శబ్దాలు ఉంటాయి. నిజమైన అధికారులు (అర్హత కలిగిన సాధకులు/ భక్తులు) మాత్రమే సన్యాసులను కలవడానికి వారి ఆశ్రమానికి వెళతారు. ఇటువంటి సాధకుల యొక్క హృదయాలు సన్యాసులు ఇచ్చే ఉపదేశాలతో ప్రభావితమవుతాయి. సాధకులను తర్ఫీదు/ శిక్షణ ఇవ్వడమే సన్యాసులు చేయగలిగిన అతి గొప్ప సేవ. ప్రతి సాధకుడు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా లేదా శాంతి, జ్ఞానము మైర్యు ఆనందాన్ని పంచడానికి వీలయ్యే ఒక వాహకంగా మారుతాడు. సన్యాసులు తిరిగినప్పుడు అతని సమయం వృధా అవుతుంది. అన్ని రకాల వ్యక్తులు ఈ రోజుల్లో సన్యాసులను ఉత్సుకతతో కలవాడానికి వస్తారు. సన్యాసుల యొక్క అవసరాలను గృహస్థులు ఈనాడు తీర్చడంలేదు. వారు పూర్తిగా స్వర్ధపరులు అయ్యారు. వారు కేవలం నోటి మాటగా జాలి చూపెడతారు; "స్వామీజీ మహారాజ్! ఏమైనా సేవ చేయాల్సింది ఉంటే చెప్పండి". ఇది పూర్తిగా మోసము, కపటత్వం మరియు మాయ.

కాషాయం ధరించిన వ్యక్తి ఒక గొప్ప ఉన్నతమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాడని మరియు తన మీద గొప్ప బాధ్యత ఉందని, అతను త్వరలోనే ఈ ప్రపంచానికి ఒక ధార్మికమైన మరియు ఆధ్యాత్మిక గురువుగా మారుతున్నాడని అతను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అతడు సద్గుణాలు, దైవీ గుణాలు మరియు వైరాగ్యం, పవిత్రతతో కూడిన ఆదర్శవంతమైన జీవితం గడపడానికి తన వంతు ప్రయత్నం పూర్తిగా చేయాలి.

నిజమైన సన్యాసులు ఈ ప్రపంచానికి వెలుగు చూపేవారు మరియు లాంతర వంటివారు. దూరంగా సముద్రంలో ఉన్న నావలకు దీపగృహము (లైట్ హౌస్) ఏ విధంగానైతే వెలుగును పంపుతుందో, అలాగే సన్యాసులు సైతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న దూరదేశ ప్రజలకు వారి యొక్క దివ్యమైన కాంతి ప్రసరించాలి. వారు ప్రపంచాన్ని కదిలించగలరు.

సమస్తాన్ని త్యాజించి, సత్య మార్గంలో నడుస్తున్న నిజమైన సన్యాసులకు మంగళమగుగాక! తన స్వస్వరూపంలో, బ్రహ్మ నిష్ఠలో ఉండే సన్యాసులకు అభివందనాలు! పరివ్రాజకాచార్యలు, బ్రహ్మ విద్యా గురువులు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని దశదిశలా వ్యాపింప చేస్తున్నారో, వారికి మంగళమగుగాక! వారందరి దీవెనలు మనపై ఉండుగాక!

ఎనిమిదవ అధ్యాయము సమాప్తము

Tuesday 5 November 2019

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరభారతీ మహాస్వామి సూక్తి



TRUE SEEKERS ARE RARE
In today's materialistic world, most people have no regard for any religion or God; the few that profess such regard have only a formal sense of allegiance to their religion, which will disappear in no time, if it conflicts with their personal, selfish interests. Very, very few people are true seekers of God.
- Jagadguru Sri Chandrashekhara Bharati Mahaswamigal

Monday 4 November 2019

నీతి శాస్త్రం నుంచి సూక్తి


స్వామి శివానంద విరచిత గురుతత్వము - 23 వ భాగము



ఎనిమిదవ అధ్యాయము
సన్యాసులతో సంభాషణ

ఆపాతవైరాగ్యవతో ముముక్షూన్
భవాబ్ధిపారం ప్రతియాతుముద్యతాన్ ।
ఆశాగ్రహో మజ్జయతేఽన్తరాలే
నిగృహ్య కణ్ఠే వినివర్త్య వేగాత్ ॥

కేవలం వైరాగ్యం మాత్రమే కలిగి ఉండి, సంసార సాగరాన్ని దాటగోరే ముముక్షువులు, వారు కాంక్ష లేదా కోరిక అనేది తిమింగళం చేత పట్టుకోబడుతున్నారు. మరియు అది వారి మెడ పట్టుకొని బలవంతంగా మధ్యలోకి లాగి వారిని ముంచేస్తోంది.
వివేకచూడామణి

హరిః ఓం! బ్రహ్మమునకు నమస్కారములు! శ్రీ శంకరాచార్యులకు, మహాపురుషులకు మరియు సన్యాసులకు వందనాలు! దేహ అధ్యాస్యము (శరీర భావనను) స్వార్ధాన్ని, వాసనలను, అహంకారాన్ని, అభిమానాన్ని న్యాసము అనగా త్యజించినవాడే సన్యాసి. బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనత్కుమార ,సనత్సుజాతులు, దత్తాత్రేయులవారు, మరియు శ్రీ ఆది శంకరాచార్యులు నివృత్తి మార్గంలో అగ్రగణ్యులు, పథనిర్ణేతలు. ఈ సన్యాస ఆశ్రమానికి వారు మూల పురుషులు.

ఈ కాలపు ధోరణి

ఈ ప్రపంచానికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ, మానసిక మరియు అలాగే ఆధ్యాత్మికతను ఉన్నతి కావాలి. ఆధ్యాత్మికతను ఏనాడు విస్మరించరాదు. అదే మూలము. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజులలో కర్మయోగాన్ని ఆచరించే నేతలు కేవలం కర్మ మీద మాత్రమే తమ దృష్టిని నిలుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని వారు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎన్నో మఠాలకు చెందిన సన్యాసులు కూడా కేవలం సామాజిక సేవలోనే ఉన్నారు. కొందరు సన్యాసులకు పాడిత్యం ఉంది మరియు వారు కొంత కాలం గౌరవాన్ని పొందుతారు. వారు కూడా ధ్యాన పరమైన జీవితాన్ని అవతల పడవేసారు. జనుల మనసులో వారు నిజమైన మరియు దీర్ఘకాలం ఉండగలిగిన ప్రభావాలను చూపలేకపోతున్నారు, ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక శక్తి లేదా ఆంతరంగికమైన ఆత్మశక్తి అనేదు వారి వద్ద లేదు.

ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, జ్ఞానులు మరియు సన్యాసులు తోకచుక్క వలె లేదా కార్తీకమాసంలో వచ్చే విదియ నాటి చంద్రునివలె బయట కనిపించి, వారి యొక్క శక్తిని జనులకు ధారపోసి, గొప్ప కార్యాలకు శ్రీకారం చుట్టి, ఆ క్షేత్రం నుంచి మాయం అవ్వాలి. ఆశ్రమాల్లో చాలాకాలం పాటు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహించడం మరియు ఆశ్రమాలు స్థాపించడం అనేది చిన్న సన్యాసులు చేయాలి. ఇది ఉగ్రమైన, అగ్ని వంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తల స్వభావానికి సరిపోదు. గంగా కేవలం ఏడాదిలోనే నాలుగు నెలల్లోనే ముంచెత్తినట్టుగా, వారు ఈ భూమిని ఆధ్యాత్మిక జ్ఞానం లేదా దివ్య జ్ఞానంతో ముంచెత్తుతారు.

సౌకర్యవంతమైన జీవనం యొక్క ఆకర్షణ

సన్యాసి లేదా గృహథు కూడా తన యొక్క సౌకర్యవంతమైన జీవనం కోసం ఆశ్రమాన్ని స్థాపించకూడదు. ఆశ్రమాన్ని స్థాపించిన సమయంలో ఎందరో సన్యాసులు చాలా పవిత్రంగా ఉండేవారు, అంటే నా అర్ధంలో వారు పేదవారిగా ఉన్నారు. ఒక్కసారి వారు ధనికులవ్వగానే, వారిని పొగిడేవారు, కీర్తించేవారు మరియు భక్తులు సరిపడినంత మంది దొరకగానే, నిస్వార్థ సేవ అనే ఆలోచన వెళ్ళిపోతుంది, స్వార్ధ ఆలోచనలు అనేవాటికి హృదయాల్లో చోటు లభిస్తుంది. వారు ఏ ఉద్దేశంతో ఆశ్రమాన్ని స్థాపించారో అది విచ్చిన్నం, నిష్ఫలం అవుతుంది. అప్పుడది కేవలం ధనాన్ని సంపాదించి పెట్టే వ్యవస్థగా మారుతుంది. జనులకు దాని పట్ల ఆకర్షణ ఉండదు. ఒక వ్యవస్థకు అధిపతి అయిన వ్యక్తి వైరాగ్యంతో కూడిన జీవనం గడుపుతూ, పూర్తిగా అన్నింటినీ త్యజించి ఉంటే అటువంటి ఆశ్రమం ఈ భూ ప్రపంచంలోనే శాంతికి, ఆనందానికి, సంతోషానికి కేంద్రబిందువు మరియు వేదిక అవుతుంది. అది కొన్ని లక్షల మంది జనులను ఆకర్షిస్తుంది. ఈ ప్రపంచానికి అటువంటి గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు అధిపతులుగా గల అటువంటి ఆశ్రమాల అవసరం ఉంది.

కొందరు యువ సన్యాసులు ముష్టి కాయను గింజలు స్వీకరిస్తారు. రెండు సంవత్సరాల్లో 120 విత్తనాలను మింగుతారు. సిద్ధాంత కౌముది మరియు న్యాయ శాస్త్రాన్ని మూడు సంవత్సరాలు అభ్యసిస్తారు. వారు నిజమైన సిద్ధులు అని భావిస్తారు మరియు ప్రాపంచిక మనసు కలిగిన వ్యక్తులతో స్వేచ్ఛగా కలుస్తారు/ విహరిస్తారు. ఇది ఎంతో తప్పు. ముష్టి కాయ లేదా ముషిణి చెట్టు గింజ నంపుస్కత్వాన్ని కలిగిస్తుంది. నపుంసకత్వం బ్రహ్మచర్యం కాదు. వారు త్వరగా పతనం అవుతారు. ఇది ప్రత్య్కేమగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద, మహా జ్ఞానులు మరియు గొప్ప యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు విచక్షణారహితంగా, ఇష్టం వచ్చినట్లుగా భౌతిక ఆలోచనలు కలిగిన వ్యక్తులతో కలువకూడదు. రెండు చేపల మధ్య జరుతున్న కామకలపం అది చూసిన ఒక గొప్ప ఋషి మనస్సును ఉద్రేకపరచింది. స్త్రీ యొక్క గాజుల సవ్వడిలేదా అంచు కలిగిన మరియు రంగు రంగుల వస్త్రాలు సైతం మనస్సులో తీవ్రమైన ఉద్రేకాన్ని మనసులో కలిగిస్తాయి. వాటికి వాటి యొక్క సొంతమైన అపవిత్ర సాంగత్యం ఉంటుంది. కామం అనేది చాలా శక్తివంతమైనది. మాయ నిదూఢమైనది. కనుక ఓ సాధకులారా! జాగ్రత్త పడండి!

క్రమశిక్షణారహితులైన యువ సాధకులు, బ్రహ్మచారులు మరియు సన్యాసులు గృహస్థుల వద్ద సత్సంగం నిర్వహిస్తున్నామనే అనే ముసుగులో, వారి దగ్గరకు వెళ్ళడాంకి కారణం నాలుక మరియు రసేంద్రియం. ఓ సాధకులారా! కేవలం రన్సేంద్రియాన్ని సంతృప్తి పరచడానికి తల్లిదండ్రులను వదిలిపెట్టి, మీ ఆస్తులను సామాజిక హోదాను త్యజించి, సన్యాసం స్వీకరించారా? లేదా ఆత్మ సాక్షాత్కారం కోసం స్వీకరించారా? అది ఒకవేళ మీ రసేంద్రియాన్ని సంతృప్తిపరచడం కోసమే అయితే ప్రపంచంలో ఉంటూనే బాగా డబ్బు సంపాదించి ఆ పని చేసి ఉండవచ్చు. సన్యాస ఆశ్రమాన్నికి చెడ్డ పేరు తీసుకు రావద్దు. మీరు నాలుకను అదుపు చేయలేనప్పుడు, కాషాయాన్ని వదిలిపెట్టి, ప్రపంచంలోకి వెళ్లి, పని చేసి డబ్బు సంపాదించండి. కర్మ యోగం ద్వారా అభివృద్ధి చెందండి. నాలుకను నియంత్రించలేనప్పుడు మనస్సును నియత్రించడం సాధ్యం కాదు.

Sunday 3 November 2019

స్వామి కృష్ణానంద సూక్తి



The pain generally felt at death is due to the nature of the intensity of the desires with which one continued to live in the physical body. The more is the love for the Universal Being entertained in life, the less would be the pain and agony of departing from the body.

- Swami Krishnananda

Saturday 2 November 2019

స్వామి రామతీర్థ సూక్తి


If you seek ease and comfort for your bodies and waste your time in sensual pleasures and luxury, there is no hope for you.

- Swami Rama Tirtha

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 22 వ భాగము

దత్తస్వరూపులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు 


నిజమైన గురువు యొక్క లక్షణాలు
నిజమైన గురువు యొక్క లక్షణాలు ఇవిగో. మీరు గనక ఈ లక్షణాలను ఏ వ్యక్తి లో చూసినా, ఆ వెంటనే అతడిని మీ గురువుగా అంగీకరించండి. సద్గురువు అనేవాడు బ్రహ్మనిష్ఠ మరియు బ్రహ్మశ్రోత్రియుడై ఉంటాడు. అతనికి ఆత్మ మరియు వేదాల గురించి పూర్తి జ్ఞానము ఉంటుంది. అతడు సాధకుల సందేహాలను నిర్మూలిస్తారు. అతనికి సమదృష్టి మరియు మనస్సంయమనం ఉంటుంది. అతడు రాగద్వేషాలు, హర్షశోకాలు, అహంకారము, కోపము, లౌల్యము, దురాశ, మోహము, పొగరు మొదలైన గుణాల నుంచి విముక్తుడై ఉంటాడు. అతడు దయాసముద్రుడు. అతని యొక్క సన్నిధిలోనే మనకు శాంతి లభిస్తుంది మరియు మనసు ఉన్నతమైన స్థాయికి వెళుతుంది. కేవలం ఆయన యొక్క సన్నిధిలో ఉండడం చేతనే సాధకుల యొక్క సకల సందేహాలు నివృత్తి అవుతాయి. అతడు ఎవరి నుంచి ఏమీ ఆశించడు. అతడు ఎంతో ఉన్నతమైన, గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అతడు ఎల్లప్పుడు బ్రహ్మానందంతో నిన్డి ఉంటాడు. అతడు నిజమైన సాధకుల కోసం వెతుకుతూ ఉంటాడు.

గురువు యొక్క పాదపద్మాలకు నమస్కారములు! నేను నిజమైన గురువు యందు పూర్తి విశ్వాసం ఉంచుతాను.గురువు పట్ల నాకు ఎంతో గొప్ప ఆదరము మరియు గౌరవము ఉన్నాయి. ఆయన యొక్క పాదపద్మాలను ఎల్లవేళలా సేవించడానికి నా హృదయం తపిస్తుంది. మనస్సు యొక్క దుష్పరిణామాలను తొలగించడంలో గురుసేవ కంటే మరేది శక్తివంతమైనది కాదని నేను నమ్ముతాను. ఈ సంసారమనే సాగరం నుంచి అమృతతత్త్వమనే అవతలి ఒడ్డుకి తీసుకువెళ్ళే సురక్షితమైన నౌక గురువు సన్నిధి అని నేను పూర్తిగా నమ్ముతాను.

గురుత్వము పేరుతో వ్యాపారం

కానీ నేను గురుత్వాన్ని వ్యాపారంగా చేయడాన్ని మెచ్చుకొను, నాకు నచ్చదు. ఎవరైతే మూర్ఖులు గురువులుగా ఆచార్యులుగా ప్రదర్శించుకుంటూ, శిష్యులను తయారు చేసుకుంటూ, ధనము పోగు చేస్తారో అటువంటి వారిని చూసి నేను ఎంతగానో అసహ్యించుకుంటాను, అవమానంగా తలుస్తాను. మీరు ఈ విషయంలో నాతో అంగీకరిస్తారు. ఇందులో రెండవ అభిప్రాయానికి తావులేదు. వారు సమాజానికి పట్టిన చీడ పురుగులు. గురుత్వం అనేది ఈనాడు వ్యాపారంగా మారిపోయింది. దీనిని భారతదేశపు భూమి నుంచి పూర్తిగా నిర్మూలించాలి. ఇది భారత ప్రజానీకానికి ఎంతో నష్టాన్ని మరియు హానిని కలిగిస్తోంది. పాశ్చాత్యులు మరియు ఇతర దేశస్థులు మనస్సులలో ఎంతో చెడు ముద్రను సృష్టిస్తోంది. ఈ గురుత్వమనే వ్యాపారం వలన భారత దేశము తన యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని కోల్పోతోంది. అతి త్వరగా భయంకరమైన ఈ వ్యాధిని త్రుంచి వేసి వేళ్ళతో సహా పెకిలించి వేయడానికి తీవ్రమైన చర్యలు చేపట్టాలి. దీని నిర్మూలించడంలో ఏ అవకాశాన్ని వదలకూడదు. అది ఈ ఈనాడు ఎంతో భయంకరమైన రూపాన్ని సంతరించుకుంది. అది ఎంతో త్వరగా అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. చాలా సులభంగా, మర్యాదగల జీవనాన్ని గడపడానికి ఎంతోమంది ఈ గురుత్వం అనే వ్యాపారాన్ని తీసుకున్నారు. కుహనా గురువుల వలన ఎంతో మంది అమాయకమైన స్త్రీలు మరియు పురుషులు దోచుకోబడ్డారు. ఎంత సిగ్గుచేటు!

ఎందరో గురువులు అంతటా తిరుగుతారు. ఎన్నో చోట్ల ఉపన్యాసాలు ఇచ్చి ప్రవచనాలు చెబుతారు. బ్రహ్మ సూత్రాలు మరియు గీత అర్ధం చేసుకున్నా, వారు జ్ఞానశూన్యులు మరియు ధ్యానం గురించి అవగాహన లేదు. వారు సులభంగా ఆగ్రహానికి గురి అవుతారు. వారి యొక్క అభిమాని ఎంతో మృదువైనది. వారిలో దివ్య గుణాలు మరియు సాధుత్వం లేదు. వారికి సేవా భావం లేదు. వారు సేవ, కీర్తనలు మొదలైన వాటి గురించి చెడుగా మాట్లాడుతారు. వారు జనుల చెయ్యి పట్టుకొని దగ్గరకు పిలుస్తారు. వారి వెనుక భాగంలో చేతులు వేసి, వారిని దీవిస్తారు. కానీ వారు కనీసం ఒక్కడిని కూడా మోక్షానికి పంపలేకపోతున్నారు.

ఒక వ్యక్తి కొన్ని సిద్ధులను ప్రదర్శిస్తే జనులు అతడిని గురువుగా తీసుకుంటారు. ఇది ఎంతో ఘోరమైన తప్పిదము. ఇది అంత సులభంగా నమ్మే విషయం కాదు. ఇటువంటివారు దొంగ యోగుల వలన సులభంగా మోసపోతారు. వారు బుద్ధిమరియు విచక్షణాధికారాన్ని ఉపయోగించాలి. వారు గురువులుగా భావించే వ్యక్తుల గురించి ఏదైనా ఒక నిర్ణయానికి ముందు, ఆ గురువుల మార్గము, అలవాట్లు, స్వభావము, నడవడిక, వృత్తి, ప్రకృతి మొదలైనవి, క్షుణ్ణంగా పరిశీలించి; గ్రంథముల పట్ల, శాస్త్రముల పట్ల అతని జ్ఞ్ఞాన్ని, పరీక్షించాలి.

అటువంటి మేకవన్నె పులిలు, ఎవరైతే మన దేశ ప్రజలను తప్పు ద్రోవ పట్టించి, దోచుకునే ప్రయత్నం చేస్తారో, వారిని ఆశ్రయించడం కంటే కృష్ణుడు, రాముడు శివుడు, లేదా నీ హృదయంలో ఉన్న భగవంతుడిని గురువుగా భావించి, ఆయన యొక్క మంత్రాన్ని మననం చేయడం ఉత్తమము.

ప్రసిద్ధమైన, మహత్తరమైన భారతదేసంలో శ్రీ శంకరులు, దత్తాత్రేయులు వంటి నిజమైన గురువులు అంతటా వ్యాపించి ఉండుగాక! కుహనా గురువులు మరియు వ్యాపారపరమైన గురుత్వం అనే భయంకరమైన శాపం నుంచి భారతమాత సంపూర్తిగా స్వేచ్ఛను పొందుగాక! సనాతన ధర్మం యొక్క విశ్వజనీయమైన సూత్రాలు ప్రపంచమంతా తేజరిల్లు గాక! వివిధ మత శాఖలు మరియు మత వర్గాలను మధ్య ఐకమత్యం ఏర్పరచడంలో ఆధ్యాత్మికవేత్తలు తమకు సాధ్యమైన అన్ని ప్రయత్నములు చేయుదురుగాక! వారు కొత్త శాఖలను ఏర్పాటు చేయకుండా ఉండుదురుగాక! వర్గపరమైన బేధములు మరియు గొడవలు ఎల్లప్పటికీ నశించిపోవు గాక! ఋషులు, ద్రష్టలు, యోగులు, భక్తులు మరియు సన్యాసులు త్యాగము, సన్యాసం మరియు ఆత్మసాక్షాత్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆధ్యాత్మిక దేశమైనా ఈ భూమి యొక్క గొప్ప కీర్తి ప్రతిష్టలను నిలబెట్టుదురుగాక! ప్రపంచమంతా ఐకమత్యం, శాంతి మరియు సామరస్యం వర్ధిల్లుగాక! గురువుల యొక్క ఆశీర్వచనాలు మనందరిపై ఉండుగాక! ఆధ్యాత్మిక పథంలో వారు మనల్ని మార్గదర్శనం చేయుదురుగాక!

ఏడవ అధ్యాయము సమాప్తము