Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Friday 29 March 2019
Thursday 28 March 2019
శీతలా దేవి
ఒక చేతిలో చాట, ఇంకో చేతిలో చీపురు, ఒక చేతిలో అమృత కలశము, ఇంకో చేయి అభయముద్ర చూపిస్తూ, గాడిదని వాహనంగా చేసుకుని, మనకు దర్శనమిచ్చే ఈ మాత పేరు శీతలా దేవి. అత్యంత శక్తివంతమైన ఈ అమ్మవారి స్మరణ చేతనే జ్వరాది భయంకరమైన వ్యాధులు నిర్మూలించబడతాయి. శీతలా అంటే చల్లదనం చేకూర్చేది అనే అర్థం కూడా ఉంది. వేడి వలన కలిగే వ్యాధులను ఈ అమ్మవారు నశింపచేస్తుంది. ఈవిడ కాత్యాయని దేవి యొక్క అవతారం. ఉత్తర భారతదేశంలో శీతల నామంతో అర్చించబడుతుండగా, దక్షిణ భారతదేశంలో మరియమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ మొదలైన పేర్లతో మనం పూజిస్తాం. అనగా గ్రామ దేవతల యొక్క స్వరూపము శీతలా దేవి.
అమ్మ వారి చేతిలో ఉండే చాట మనలో దుర్గుణాలను చెరిగి అవతల పార వేస్తుంది. చీపురు చెత్తని ఊడ్చి వేసినట్టుగా అమ్మవారు మనలో ఉన్న రోగాలు అనగా వ్యాధులను, అలాగే వాటికి మూలమైన ఆదులు అనగా మానసిక రోగాలను సైతం ఉపశమింపజేస్తుంది. అంటే చీపురుతో చెత్తని ఊడ్చి వేసినట్టుగా శరీరంలో పేరుకుపోయిన రోగాలను, వాటికి కారణమవుతున్న జీవుని ఖాతాలోని దుష్కర్మ అమ్మవారు చీపురుతో ఒక పోగు చేసి, చాటతో ఎత్తి పారవేస్తుంది. కర్మ తీసిన తర్వాత మనకు కావలసినది ఏంటి? జ్ఞానం.... అది ఆవిడ చేతిలో ఉన్న కలశం ద్వారా అందుతుంది. అందులో గంగాజలం ఉంటుంది. గంగా స్వచ్ఛతకు, పరిశుద్ధతకు, పవిత్రతకు, జ్ఞానానికి ప్రతీక. అమ్మవారు మనకు కర్మ క్షయం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ జీవితంలో ఏ భయము లేకుండా జీవించమని.... అండగా తాను ఎప్పుడూ ఉంటానని చెప్పడానికి ప్రతీకగా అభయ హస్తం చూపిస్తోంది.
ఈ అమ్మ గారి గురించి శివుడే స్తోత్రం చేసినట్టుగా మనకు స్కంద పురాణంలో ఉంది. మన ధర్మం ప్రకారం రోగానికి మందు ఎంత అవసరమో, మంత్రం కూడా అంతే అవసరం. ఎందుకంటే గతంలో చేసిన పాపలే రోగాల రూపంలో బాధిస్తాయి.
అయితే మంత్రానికి కానీ ఔషధానికి కానీ లొంగని భయంకరమైన ప్రారబ్ధం వలన కలిగే రోగాలను, కేవలం తన ధ్యాన మాత్రం చేత శీతల దేవి నశింపజేస్తుందని, అంతటి తీవ్ర కర్మను భస్మం చేయడంలో తనకు శీతలాదేవి వేరొక దేవత తెలియదని, ఈశ్వరుడే అమ్మవారిని స్తుతించాడు.
ఈ అమ్మవారి ఆరాధనతో భౌతికమైన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, జ్ఞానము, ధైర్యం అలవడతాయి. ఈవిడ స్మరణ ఎక్కడ ఉంటే, అక్కడ రోగనాశనం జరుగుతుంది. భయము, ఘోరమైన ప్రమాదాలు కూడా తప్పిపోతాయి. అటువంటి అమ్మని మనం నిత్యం అర్చించాలి.
లక్ష్మి, సరస్వతి, పార్వతుల స్వరూపం శీతలా దేవి...
Monday 25 March 2019
Sunday 24 March 2019
Saturday 23 March 2019
24 మార్చి 2019, ఆదివారం, ఫాల్గుణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
24 మార్చి 2019, ఆదివారం, ఫాల్గుణ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
ఫాల్గుణ మాసంలో వచ్చింది కనుక దీనికి భాలచంద్ర/ ఫాలచంద్ర సంకష్టహర చతుర్థి అని పేరు.
వ్రత విధానం ఈ లింక్లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html
05 మార్చి 2018, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.09 నిమి||
మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html
ఓం ఫాలచంద్రాయ నమః
ఫాల్గుణ మాసంలో వచ్చింది కనుక దీనికి భాలచంద్ర/ ఫాలచంద్ర సంకష్టహర చతుర్థి అని పేరు.
వ్రత విధానం ఈ లింక్లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html
05 మార్చి 2018, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.09 నిమి||
మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html
ఓం ఫాలచంద్రాయ నమః
Friday 22 March 2019
Thursday 21 March 2019
ఇంతకీ మోదీ మనకు ఏం చేశాడు ?
ఇంతకీ మోదీ మనకు ఏం చేశాడు ?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసలు బిజెపి దేశం కోసం ఏం చేసిందో తెలుసుకోవడం చాలా అవసరం ఏమో. మోదీ-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండు సంవత్సరాల్లోనే దాదాపు 32 వేల ఎన్జీవోలకు నోటీసులు ఇచ్చి, వాటి లైసెన్స్ రద్దు చేసిందని మీకు తెలుసా?
నిజానికి సేవ ముసుగులో ఎన్నో ఎన్జీవోలు మన దేశంలో పని చేస్తూ విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాయి. అయితే అవి చేసేది సేవ కాదు, మత మార్పిడి. కొన్ని సందర్భాల్లో ఈ మత మార్పిడి ఎంత ప్రమాదకరంగా ఉందంటే- అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా ఆ ఎన్జీవోలు స్థానిక ప్రజానీకాన్ని ఉసిగొల్పుతున్నాయి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ- తమిళనాడులో ఉన్న అణు విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన ఆందోళనలు. ఆ ఆందోళనలను పసిగట్టిన స్వామినాధన్ గురుమూర్తిగారు అక్కడ ఉన్న స్థానిక చర్చిని రద్దు చేయమని సలహా ఇచ్చారు. అక్కడ చర్చి వచ్చిన తర్వాతే ఆ ఆందోళనలు మొదలయ్యాయి.
మేఘాలయాలో కాశీ పర్వతాలని ఉన్నాయి. ఈ పర్వతాల్లో యూరేనియం దొరుకుతుందని, ఆ యూరేనియం భారతదేశ అవసరాలకు వాడుకుంటే, ఇతర దేశాల మీద ఆధారపడకుండా భారతదేశం అణు రంగంలో స్వయం ప్రతిపత్తి సాధిస్తుందని తెలిసిన కొన్ని విదేశాలు, అక్కడ ఎన్జీవోలు మతమార్పిడులకు పాల్పడి, కొనిన్ బోధనల ద్వారా ఉద్యమం లేవనెత్తాయి. ఫలితంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధి ఆగిపోయింది.
అలాగే గిరిజనులకు వైద్య సేవలు చేస్తామంటూ చత్తీస్ఘఢ్ రాష్ట్రాల్లో పనిచేసే కొన్ని ఎన్జీవోలు, మావోయిస్టులకు, నక్సలైట్లకు సాయం చేస్తున్నట్టు కూడా బయటపడింది. ఈ విధంగా సేవ ముసుగులో అనేక ఎన్జీవోలు విదేశాల నుంచి నిధులు తెచ్చుకొని దేశంలో, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇటువంటివి జరగరాదని భావించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్జీవోల నుంచి వారి సేవా వివరాలు అడిగింది. ఏవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటూ ఆరా తీసింది. FEMA, FERA చట్టాలను ఉపయోగించింది. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనేక ఎన్జీవోలు, దాదాపు 20 వేల ఎన్జీవోల లైసెన్స్లను రద్దు చేసింది.
నిజానికి ఈ ఎన్జీవోలు మావోయిస్టులకు, మతమార్పిడి మూకలకు, భారతదేశ వ్యతిరేక సాహిత్యాన్ని రాసే దేశద్రోహులను ప్రోత్సహిస్తున్నాయి, ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. ఇందులో విదేశాల నుంచి డబ్బులు పొందుతూ లెక్కలు చూపని హిందూ సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ఎక్కడ పక్షవాతం చూపించలేదు. కాకపోతే దేశవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడే ఎన్జీవోలే కనుక వాటికి గట్టి దెబ్బ తగిలింది.
మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి నిధులు రావడం ఆగిపోయింది. ఫలితంగా వారిలో అసహనం పెరిగింది. మీకు గుర్తు ఉండే ఉంటుంది, మోడీ ప్రభుత్వం వచ్చిన తొలి రెండేళ్లలో మనదేశంలో అసహనం (Intolerance) పెరుగుతోంది అంటూ కొన్ని ఉద్యమాలు వచ్చాయి. కొందరు తమకు వచ్చిన అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు, విదేశాలకు వెళ్ళిపోతామని ప్రకటనలు చేశారు. నిజానికి మన దేశంలో అప్పుడు హిందుత్వవాదులు అసహనం పెరగడం కాదు, తమకు రావలసిన నిధులు అందకపోవడంతో ఈ దేశంలో ఉన్న ఎందరో 'మేధావులకు', మిషనరీలకు కడుపు మండింది. నిజానికి ఇక్కడ మనం ప్రభుత్వాన్ని గట్టిగా మెచ్చుకోవాలి ఎందుకంటారా? చట్టపరమైన వివరాలు ఇవ్వనందుకు, ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థల్లో ఒకటైన ఫోర్డ్ ఫౌండేషన్ వారి కార్యకలాపాలను కూడా భారతదేశంలో స్తంభింపజేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. వారికి తాఖీదులు ఇచ్చింది. దీని మీద అమెరికా ప్రభుత్వం మోదీని ఎంతో ఒత్తిడికి గురిచేసినా, చాలా కాలం మన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. CIA లాంటి సంస్థలు కూడా మోదీ ప్రభుత్వం యొక్క పట్టుదలను చూసి భయపడ్డాయి. ఇవన్నీ వార్తల్లో వచ్చిన అంశాలే. ప్రభుత్వం ఇంత గట్టిగా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక మన దేశంలో అసహనం పెరిగింది ఉద్యమాలు చేశారు. నిజానికి ఒక గట్టి కేంద్ర ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం ఉంది కాబట్టే ఈ విధంగా చేయడం సాధ్యమైంది.
ఇలాంటి సాహసోపేత నిర్ణయం ఇంతవరకు మన దేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఆ విధంగా చూసినప్పుడు మోదీ భారతదేశానికి మేలు చేసే విధంగా తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని, హిందూ సమాజం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఇలాంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడమే కాదు ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ఇలా మతమార్పిడులు చేస్తున్న వారిని పాల్పడుతున్నవారు మీద కఠినంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి మనం అండగా నిలబడకపోతే, ఇంకెవరు నిలబడతారు? అలాంటి వారికి మనం మద్దతు పలకకపోతే, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటారా ఆలోచించి చెప్పండి. #NamoAgain
Wednesday 20 March 2019
Tuesday 19 March 2019
Monday 18 March 2019
Sunday 17 March 2019
Monday 4 March 2019
Sunday 3 March 2019
Saturday 2 March 2019
Friday 1 March 2019
Subscribe to:
Posts (Atom)