Monday 7 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (106)

 


అతడు భూతేశుడే కాదు, మహదేవుడు కూడా దేవతలలో గొప్పవాడు. దేవతల పై ఆధిపత్యాన్ని తన కొడుకైన సుబ్రహ్మణ్యునకు అర్పించాడు. అంటే సేనాధిపత్యం. భూతాలను రెండుగా చేసి అందొక దానికి గణపతిని నియమించాడు. గణపతి స్తోత్రంలో భూత గణాధి సేవితం అని అంటాం. మరొక విభాగానికి అయ్యప్పను నియమించాడు. కేరళలో అయ్యప్పను భూతేశుడని అంటారు.

భూతాలను అదుపులో పెట్టడం శాస్తకు గర్వకారణమైన బిరుదు. క్షుద్ర శక్తులను గ్రామాలలో చొరబడకుండా చేస్తాడు. ప్రజల బాధలనుండి విముక్తులను చేస్తాడు. శివ సంబంధమైన వాటిని చెప్పడానికి తాతాచార్యుల వారికిష్టముండదు కనుక ఇట్టి భూతాలకు ఆదినాథుడైన ఈశ్వరునకు కొడుకునయ్యానని బాధపడుతున్నట్లు వ్రాసాడు. ఏతైః భూతైర్వతః = భూతాలచే చుట్టుబడినవాడు అని. చింతయతీహశాస్తా అని శ్లోకాన్ని ముగించాడు. ఇట్టి కర్మం దాపురించిందని బాధపడుతున్నట్లు ముగించాడు అందువల్ల ముక్కుపై వ్రేలు వేసుకున్నాడు.

శ్లోకం చెప్పినా ముక్కుమీద వ్రేలును శాస్త తొలగించలేదు. భూతాలనుండి గ్రామాన్ని రక్షించడం బాధపడవలసింది కాదు. గర్వకారణం.

No comments:

Post a Comment