.jpg)
నిజానికి మనమంతా దీనులమే. కనిపించే ఈ రక్తమాంస నిర్మితమైన శరీరమే శాశ్వతమనుకుంటూ, ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతూ, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక, క్షణికసుఖాలే జీవతమనుకుంటూ, మాయలో మునిగిపోయిన మనమే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాం. శరణు వేడిన వెంటనే అందరిని ఇటువంటి స్థితి నుంచి ఉద్దరించి, మనం ఈ శరీరం కాదు, ఈ దేహంలో ఉన్న పరిపూర్ణ ఆనంద ఆత్మ స్వరూపలమనే జ్ఞానం కలిగజేసి,ఈ దయనీయ స్థితినుంచి ఉద్ధరించి, మన బాధ్యాతలను స్వీకరించి మనల్ని ఆ హేరంబ గణపతి సదా పాలిచుగాకా.
దీనార్ధవాచకో హేశ్చ రంబః పాలకవాచకః |
పాలకం దీనలోకానాం హేరంబం ప్రణమామ్యహం ||
ఓం గం గణపతయే నమః
No comments:
Post a Comment