Saturday 1 August 2015

ఇది ధర్మవైభవం

ఇది ధర్మవైభవం

కుంబమేళా లో అశేష జన వాహిని చూసిన ఒ ఆంగ్లేయుడు మన హిందూ సన్యాసిని ఇలా ప్రశ్నించాడు. కుంభమేళాలో ఇన్ని లక్షల జనం ఓ క్రమపద్ధతిలో తమ పని తాము చేసుకోవడమే కాక ఎంతో సౌభ్రాతృత్వం తో వున్నారు. వీరు మరి ఒక ప్రాంతం వారు కారు, ఒక భాషా కలిగిన వారు కాదు, ఒకే ఆచారాలు ,ఆహారము కలిగినవారు కాదు, అయినా వీరిలో ఇంత సోదర భావమా? ఇదే మా దేశములో అయితే ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత గొడవలు వస్తాయి. చాలా ఆశ్చర్యం అయినా ఇంత మంది ఇక్కడా రావడానికి చాలా ప్రకటనలు, చాలా ఖర్చుతో కుడివుంటింది, కాదా? .............అంటే దానికి ఆ హిందు సన్యాసి ఇలా జవాబు ఇచ్చాడు. ఒక పైసా కుడా ఖర్చు కాలేదు. అవ్వదు కూడా. మన పంచాంగం, (జ్యోతిషం) ఆధారముగా, మీ ప్రకారం చెప్పాలంటే కాలేండర్ లో విశేష దినముగా మనవాళ్ళు ముందే రాసిపెట్టి వుండం........ ఒక చిన్న లైను చూసి ఇన్ని లక్షల మంది ఇక్కడకు రావడం జరిగింది. హిందూ ధర్మం పాటించే వారు శాంతితో ప్రతి ఒక్కరిలో దేవుని చుసే గుణం కలిగి ఉంటారు. అలా చూడగలిగినది, వుండగలినది నా హిందు ‪‎ధర్మము‬ మాత్రమే అని చెప్పడం తో ఆ విదేశీయుడు మన హిందు ధర్మానికి ధన్యవాదాలు తెలిపాడు.

చెప్పిన ఆ హిందూ సన్యాసి ఎవరో కాదు అపర ఆదిశంకరులు, కంచికామకోటి పీఠాధిపతి, శ్రీ శ్రీ శ్రీ చందశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.

జయ జయ శంకర హర హర శంకర

No comments:

Post a Comment