Saturday 14 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (83)



దేవతలారాధించిన దేవత


గజవక్తుని పూజ వల్ల విజయం


సంవత్సరాదినాడు పంచాంగ శ్రవణంలో ఈ శ్లోకాన్ని చదువుతారు: 


వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే

యం నత్వా కృతకృత్యాస్యుః: తం నమామి గజాననం


ఇందు గజానన పదం వినబడుతోంది. కనుక శ్లోకార్థం తెలియకపోయినా వినాయకుణ్ణి స్తుతిస్తున్నామని అర్ధమవుతుంది. ఏమని చెప్పింది? దేవతలు తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకొనేవారు ఈ గజాననుణ్ణి కొలుస్తారని.


బలహీనులైన మానవులే కాదు, బలవంతులైన దేవతలూ కొలుస్తారట. వారు నిర్దిష్టమైన తిథులలోనే కాదు, ఏదైనా పని ఆరంభించునపుడు నిరంతరమూ కొలుస్తారట. చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది. వీరి నమస్కారాన్ని మాత్రమే స్వీకరించడు, వారెందుకు నమస్కరించారో దానిని నెరవేరుస్తాడు. అనగా వారిని కృతకృత్యులను చేస్తాడన్నమట. అనగా వారి లక్ష్యాన్ని నెరవేరుస్తాడు.


వాగీశాద్యాః సుమనసః = వాగీశుడు మొదలగువారు. సుమనస్ అనగా దేవతలు.

No comments:

Post a Comment