Monday 14 October 2024

శ్రీ గరుడ పురాణము (299)

 


తరువాత మహాలక్ష్మికీ, వసుదేవునికీ, నందబలరామ యశోదలకూ అర్ఘ్యమివ్వాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి.


అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం ॥

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం |


వరాహంపుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం ॥

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం |


గోవింద మచ్యుతం దేవమనంతమప రాజితం ॥

అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంత కారణం |


అనాది నిధనం విష్ణుం త్రిలోకేశంత్రివిక్రమం ॥

నారాయణం చతుర్భాహుం శంఖ చక్ర గదాధరం |


పీతాంబర ధరం దివ్యం వనమాలావిభూషితం ॥

శ్రీ వత్సాంకం జగద్ధామం శ్రీ పతిం శ్రీధరం హరిం | 


యేదేవం దేవకీ దేవీ వసుదేవాదజీ జనత్ ॥

భౌమస్య బ్రాహ్మణో గుప్త్య తస్మై బ్రహ్మాత్మనే నమః॥ (131/10-16)


ఈ ప్రకారంగా శ్రీకృష్ణభగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్గతికై ఇలా ప్రార్ధించాలి.


త్రాహిమాం దేవ దేవేశ హరే సంసార సాగరాత్ | 

త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖశోకార్ణవాత్ ప్రభో ॥


దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ | 

దుర్వృత్తాం స్త్రాయసే విష్ణో యే స్మరంతి సకృత్సకృత్ ॥


సోఽహం దేవాతి దుర్వృత్త స్త్రాహి మాం శోక సాగరాత్ ।

పుష్కరాక్ష నిమగ్నో హం మహత్యజ్ఞాన సాగరే ॥ 


త్రాహి మాం దేవ దేవేశ త్వామృతేఽన్యో న రక్షితా |

స్వ జన్మవాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ॥


జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయనమో నమః । 

శాంతి రస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్య భాక్॥ (ఆచార.. 131/17-21)


ఈ ప్రార్థనలో వేడుకొన్నవన్నీ అనగా, అశాంతినుండి రక్షణ, దురాచారం నుండి విడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, విఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసినవారికి లభిస్తాయి.

(అధ్యాయం -131)

No comments:

Post a Comment