Sunday 4 May 2014

శంకరాచార్యులు - ఆధునిక పరిశోధనలు

శంకరాచార్యులను మనం కేవలం ఒక ధర్మ ప్రబోధకుడిగా మాత్రమే చూస్తున్నాం కానీ, నిజానికి ఆయన ఒక శాస్త్రకారుడు, మానవ సమాజానికి విజ్ఞానం అందించిన మహాపురుషుడు. శంకరులే కాదు, సనాతన హిందూ ధర్మాన్ని ప్రబోధించిన ప్రతి ఆచార్యుడూ ఒక శాస్త్రకారుడే, మానవ ఇతిహాసంలో వైజ్ఞానికంగా కొత్త కోణాన్ని ఆవిష్కరించిన మహానుభావుడే.

శంకారాచార్యులవారు అద్వైతాన్ని ప్రభోదించారు. అద్వైతాన్ని వైజ్ఞానిక దృష్టితో చూసినప్పుడు అద్వైతంలో అణుశాస్త్రం కనిపిస్తుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితమే శ్రీ శంకరభగవత్పాదులు Concept of Indivisible atoms ను అద్వైతంలో వివరించారు. ఈ సృష్టిలో ఉన్న తత్వం ఒక్కటే. జీవుడికి, ఈశ్వరుడికి అభేధం.
బ్రహ్మ సత్యం జగత్ మిధ్యా జీవో బ్రహ్మైవనాపరః  
బ్రహ్మం ఒక్కటే సత్యము, ఈ జగత్తు అంతా మాయ, జీవుడు(ఆత్మ) బ్రహ్మం తప్ప వేరొకటి కాదు అన్నారు శంకర భగవత్పాదాచార్యులు. ఆత్మ కూడా పరమాత్ముడు నుండి వేరుపడిన పదార్ధమే. ఆత్మ పరమాత్మ రూపమే. జీవుడే దేవుడు, కాని మాయ చేత మనిషి తన స్వరూపం తాను తెలుసుకోలేకపోతున్నాడంటూ ఈయన ప్రబోధించిన అద్వైతం Albert Einstein కు ప్రేరణ ఇచ్చింది. శంకరులవారి అద్వైతసిద్ధాంతం చదివి ప్రేరణ పొందిన Albert Einstein, Thoery of Relativity ని అందించారు.

శంకరాచార్యులవారి రచనలు భక్తినే కాకా విజ్ఞానాన్ని కూడా అందించాయి. పైకి భక్తి రచనల్లా కనిపించినా, వాటిలో శాస్త్ర రహస్యాలు అనేకం అందించారు. సౌందర్యలహరిలో శంకరులు అమ్మవారిని సహస్రదళ కమలంలో కూర్చున్నట్టుగా వర్ణించారు. ఆధునిక సైంటిస్టుల పరిశోధనలో దైవ పధార్ధమే ఆ సహస్రదళ పద్మం అని ఈ మధ్యే జరిగిన పరిశోధన ఆధారంగా తెలుసుకుని విస్తుపోయారు. శ్రీ చక్ర మహామేరు సృష్టి ఆరంభం గురించి రహస్యాలను తెలుపుతుందని, శ్రీ చక్రానికి ఉన్న త్రికోణాలు లయం గురించి చెప్తాయని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శంకరాచార్యులే పార్టికల్ ఫిజిక్సుకు పితామహులని (father of particle physics) వర్ణిస్తున్నారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శంకరులు ప్రవచించిన అద్వైతం మామూలువారి కంటే Quantum physics ఫీల్డ్ లో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు బాగా అర్దమవుతుంది. నిజానికి విదేశాల్లో అద్వైతాన్ని వారే ప్రచారం చేస్తున్నారు.

శంకరులు ప్రభోదించిన అద్వైతం సృష్టిలో ఏకత్వాన్ని చాటుతోంది. 20వ శతాబ్దపు ఫిజిక్స్ శాస్త్రవేత్తలకు పరిశోధనల ఫలితంగా స్పష్టంగా అర్దమైంది. ఇది స్పష్టమైంది. పెద్ద సూర్యగోళం నుంచి చిన్న అణువు వరకు, జీవులలోను, అజీవాలలోనూ ఒకే శక్తి ఉన్నదని, ఒకటే అనేకంగా కనపడుతోందని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తూ, ఇదంతా శంకరులు అద్వైతంలో చెప్పినదేనని స్పష్టం చేయడం హిందువులకు గర్వకారణం. ఆధునిక పిజిక్స్ మీద జరిగిన ప్రతి పరిశోధన అద్వైత సిద్ధాంతాన్ని నిరూపణం చేస్తోంది.  కావాలంటే ఈ లింకుల్లో ఉన్న సైంటిస్టుల అభిప్రాయాలను చదవండి.
http://bhagavatulu.blogspot.in/2013/11/david-ohm-and-advaita-vedanta.html
http://bhagavatulu.blogspot.in/2013/09/entanglement-and-advaita.html

E=mc²  సూత్రం చెప్పిన తర్వాత Albert Einstein మాట్లాడుతూ, నేను చెప్పిన  E=mc² సూత్రం మానవసమాజాన్ని ముందుకు తీసుకువెళుతుందో లేదో స్పష్టంగా చెప్పలేను  కానీ, శ్రీ శంకరాచార్యులవారి మిథ్యా సిద్ధాంతం మాత్రం మనిషి మనిషిగా బ్రతికేందుకు తప్పక ఉపయోగపడుతుందని సుస్పష్టంగా చెప్తున్నా అన్నారు.

స్వామి వివేకానందుడు భవిష్యవాణి  చెప్తూ, 21వ శతాబ్దంలో సమస్తప్రపంచానికి అద్వైతం మార్గదర్శకమవుతుంది. అద్వైతం వైభవం ప్రపంచమంతా వ్యాపిస్తుందంటూ చెప్పినమాట వాస్తవంలో కనిపిస్తూనే ఉంది.

జయ జయ శంకర! హర హర శంకర!!          

No comments:

Post a Comment