Wednesday 12 September 2012


part-25
~ చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయన్నది వినాయకుడు ఇచ్చిన శాపం.చంద్రుడు సముద్రంలొకి వెళ్ళిపొవడంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువు అయ్యారు.ఔషధమూలికలు చంద్రకాంతిలొనే ఔషధులను తయారుచేసుకుంటాయని మన పురాణలవచనం.సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి కదా.ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

~ ఋషులు,దేవతలు,మునులు అందరు కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు.బ్రహ్మ దేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు.బ్రహ్మదేవుడు గణపతికి మించిన దేవుడు లేడు,ఆయనే పరిష్కారం చుపుతాడు అన్నాడు.అందరు కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు.చంద్రునికిచ్చిన శాపవాక్కును వెనక్కు తీసుకోమన్నారు.చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తా అన్నాడు.అందరు కలిసి వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి,చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు.చంద్రుడు చేసిన తప్పును ఒప్పుకొని,క్షమించమని వేడుకున్నాడు.

~ సూర్యుడి వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా?ఇప్పటికైన బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు.తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుడిని తలమీద పెట్టుకొని నాట్యం చేశాడు.అప్పుడు వచ్చింది "నాట్య గణపతి"అవతారం.ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేశాడు.ఒక్క వినాయక చవితిరోజున చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు వస్తాయని శాపాన్ని కుదించాడు మహా గణపతి.

~ చూడండి ఎంత తేడా ఉందో అసలు కధకు,మనం చదువుతున్న కధకు.లోకానికి చూపునిచ్చే వినాయకుడు చంద్రుని కంటి చూపుతో పడిపోతాడా?మనం కూడా మనం చేసిన తప్పులను స్వామి ముందు ఒప్పుకోని,ఇంకెప్పుడు చేయమని చెప్పుకుంటే మనల్ని కూడా అల నెత్తిన పెట్టుకుంటాడా గజముఖుడు.అహంకారాన్ని వదిలెసి బ్రతకడం మోదలుపెడితే చాలు,ఆయన ఆనందపడతాడు.అదే ఈ కధ సారాంశం.

~ శమంతకోపాఖ్యానం కూడా ఇలాగే మార్చబడింది.దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం.

to be continued.........        

No comments:

Post a Comment