Saturday 3 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (43)


రాముడు-వినాయకుడు


మహా విష్ణువు, గణపతి పట్ల ఎట్టి మర్యాదను చూపించాడో చెబుతాను. రావణవధానంతరం, రామేశ్వరంలో రాముడు శివుణ్ణి అర్చించడం రామలింగాన్ని ప్రతిష్టించడం మీకు తెలిసిందే. సేతు నిర్మాణానికి ముందు నవ గ్రహాలని పూజించడం, రామనాథపురం సముద్ర ప్రాంతంలో నవపాషాణంలో అర్చించడం తెలిసిందే. ఈ నవ పాషాణ ప్రాంతం నేడు దేవీ పట్నం. ఈనాటికీ యాత్రికులు ఈ నవ పాషాణాన్ని దర్శిస్తారు. ఇది కాక మరొక ప్రాంతాన్ని కూడా యాత్రికులు చూడాలి. తెలిసినవారు సేతు యాత్రను ఇక్కడ నుండే మొదలు పెడతారు.


అదేమిటంటే రాముడు విఘ్నేశ్వరుణ్ణి పూజించిన చోటు. దీనిని ఉత్తర ప్రాంతం నుండి రాముడు బయలుదేరడం వల్ల ఉప్పూర్ అని అంటారు. ఉప్పూర్, నవపాషాణానికి ముందుగా ఉంటుంది. నవగ్రహాలను పూజించడానికి ముందు గణపతిని నుతిస్తాం.


రాముడు శాస్త్ర మర్యాదలను తు.చ. తప్పక పాటించేవాడే కదా. నవ గ్రహాలను పూజించడానికి ముందు అనగా సేతు బంధానికి ముందు గణపతిని పూజించాలి కనుక ఈ ఉప్పూర్ గణపతిని ముందుగా పూజించాడు. అతడు వరప్రసాది కాబట్టి అక్కడున్న స్వామికి ఎట్టి అచ్చాదన ఉండదు. ఆలయంపై విమానాన్ని కట్టడానికి ఆ గణపతి, అంగీకరించలేదట. నిరాడంబరంగా కూర్చొని ఉంటాడు. శీతాతపాలను భరిస్తూ ఉంటాడు. ఎండ తగిలే వినాయకుడి తమిళులంటారు.


No comments:

Post a Comment