Wednesday, 13 February 2013

సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది ఎందుకు?

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ || 

ॐ మిగితా దేవీదేవతలందరూ కలువ,తామర పువ్వుల్లోనూ కూర్చుంటే చదువుల తల్లి సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది ఎందుకు?

ॐ ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది.ఉదయానికి వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది.కాని రాయి మాత్రం పదిలంగా ఉంటుంది.అంటే మనకు సరస్వతి దేవి ఇస్తున్న సందేశం విద్య,జ్ఞానం మాత్రమే శాశ్వతం.సంపదలు కొంత కాలం మాత్రమే ఉంటాయి అని అర్దం.

ॐ అంతేకాదు మనకు చిన్నప్పటి పద్యాల్లో చదువు గురించి ఒక పద్యంలో"పోదు యుగాంతపు వేళనైనా"అని చదువుకున్నాం.అంటే ప్రపంచ ప్రళయకాలంలో అన్ని నశించినా కూడా విద్య నశించదు. 

ॐ హర్తకుగాదు గోచరం అంటూ దొంగలు పడి అన్నీ ఎత్తుకుపోయినా, విద్యను మాత్రం తీసుకుపోలేరని మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా. విద్య పదిలమైనది, శాస్వతమైనది అని తెలియజేయడానికే మన విద్యలతల్లి సరస్వతి దేవి రాయి మీద కూర్చును ఉంటుంది. 

ॐ ఫిబ్రవరి 15, వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి. ఆ రోజు తప్పకుండా అందరూ ఆ తల్లిని ఆరాధించండి.

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

సరస్వతి దేవికి హంస వాహనంగా ఉంటుంది ఎందుకు?

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

ॐ సరస్వతి దేవికి హంస వాహనంగా ఉంటుంది ఎందుకు?

ॐ పాలు,నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగుతుంది.మనలో కూడా ఎవరైతే సమాజంలో ఉన్న మంచి గ్రహించి చెడును విడిచిపెడతారో,అటువంటి వారిని అనుగ్రహిస్తుంది సరస్వతి దేవి. 

ॐ ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ..ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించడం, చెడును విసర్జించడం చేసే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని అర్ధం.

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

ॐ హంస అంటే ఊపిరి. మనం విడిచే గాలి(నిశ్వాసను) బయటకు "సః" అని వెలువడుతుంది. బయటనుంచి లోపలికి ప్రవశించే ప్రాణవాయువు(ఉచ్చ్వాశం) "అహం" అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఈ ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు.సః అంటే అతడు, పరమాత్ముడు అని, అహం అంటే నేను అని అర్ధం. ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి అహం సః, అహం సః........ అంటూ హంసో హంసో హంససోహం హంసః అంటు బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది. అంటే అతడు, నేను అనేది అతడే నేను గా మారుతుంది. అతడు పరమాత్మ. నేను అంటే జీవాత్మ అంటే మనం. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే అసలైన విద్య. దానికి అధిదేవత మన సరస్వతి దేవి. అందుకే ఆవిడ హంస వాహన అయ్యింది.

ॐ ఫిబ్రవరి 15, వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి. ఆ రోజు తప్పకుండా అందరూ ఆ తల్లిని ఆరాధించండి.

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

Sunday, 10 February 2013

మన దేవాలయాలు-10

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం
మన దేవాలయాలు-10
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ప్రదక్షిణం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
ప్రదక్షిణలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చూట్టు ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని పొంది, గణాధిపతి అయ్యాడు. గౌతమ మహర్షి గోవు చూట్టు ప్రదక్షిణ చేసి బ్రహ్మమానస పుత్రిక, మహా సౌందర్యవతి అయిన అహల్యను భార్యగా పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలుంటాయి.

అయితే ప్రదక్షిణ వలన కలిగే ఫలితాలను సంపూర్ణంగా పొందాలంటే శ్రద్ధతో చేయాలి. ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటునో,లేక ఏదో పందెంలో పరిగెత్తినట్టు పరుగులు తీస్తేనో, ప్రక్క వాళ్ళతో మాట్లడుతూనో, ప్రదక్షినలు చేస్తే ఒరిగేదేమి లేదు.

ప్రదక్షిన సమయంలో, మనం ఏ దైవం చూట్టు ప్రదక్షిణం చేస్తామో, ఆ దైవానికి సంబంధించిన శ్లోకాలనో, కీర్తనలనో, మంత్రాలనో పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఉదాహరణకు, శ్రీ వేంకటేశ్వర స్వామి చూట్టూ ప్రదక్షిణం చేస్తుంటే, "ఓం నమో వేంకటేశాయ " అనే నామన్ని ఉచ్చరించాలి. ఒకవేళ మనకు కీర్తనలు, పాటలు, మంత్రాలు ఏవి తెలియవనుకోండి, అప్పుడు "ఓం " కారాన్ని ఉచ్ఛరిస్తూ ప్రదక్షిణం చేయండి.

ఓంకారం చాలా శక్తివంతమైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని దృవీకరించాయి. ఒక జెర్మన్ శాస్త్రవేత్త ఓంకారం మీద పరిశోధన చేసి, ఓం కారాన్ని కనుక గదిలో కూర్చుని, ఒక విధమైన స్వరంతో కనుక ఉచ్ఛరిస్తే, అక్కడ పుట్టే తరంగాలు, శక్తికి ఆ గది గోడలు బద్దలయిపోతాయని చెప్పారు.

ప్రదక్షిణం నిర్మలమైన మనసుతో చేయాలి. అలా చేయడం వలన మనకు మంచిమంచి ఆలోచనలు వస్తాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటాం.        

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............

Friday, 8 February 2013

గంగానదితో భారతదేశానికి స్వర్ణయుగం

గంగానదితో భారతదేశానికి స్వర్ణయుగం

అవును గంగానది భారతదేశానికి పునర్వైభవం తీసుకువస్తుందని మీకు తెలుసా? అయితే ఇది చదవండి.

భారత్ వ్యవసాయప్రధానమైన దేశం. మన దేశంలో వ్యవసాయం అత్యధికంగా ఋతుపవనాలు, నదుల మీదే ఆధారపడింది. మన దేశంలో ఉత్తరభారతంలో ప్రవహించే నదులు హిమాలయాల్లో ఉధ్భవిస్తాయి. హిమాలయాల్లో ఉన్న మంచుకరగడం వలన వచ్చే నీటి ప్రవాహంతో హిమనీనదులు సంవత్సరం మొత్తం నిండుగా ప్రవహిస్తాయి. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో అంటే ఎండాకాలం హిమాలయల్లో మంచు ఎక్కువగా కరగడం వలన వీటికి ఈ కాలంలో వరదలు వస్తాయి. ఈ కాలంలో ఎంతో విలువైన వరద జలాలను నిలువ చేసుకునే సామర్ధ్యం లేక క్రిందకు విడిచిపెడతారు.

ఇందుకు భిన్నంగా, దక్షిణ భారతంలో నదులు ఎక్కువగా ఋతుపవనాల మీద ఆధారపడి ప్రవహిస్తాయి. అవి వర్షాల మీద ఆధారపడడం వలన జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో వరద పోటెత్తుతుంది. కాని ఈ నదులు ఎండాకాలానికి దాదాపుగా ఎండిపోతాయి. ఒక చోట నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంటే, మరొక చోట నీరు లేక కరువుతో అలమటించే పరిస్థితి. ఒక చోట అతివృష్టి, మరోక చోట అనావృష్టి. దీనికి తోడు భారత్ లో విద్యుత్ లోటు ఎక్కువ.

దీనికి పరిష్కారం " జాతీయ నదుల అనుసంధాన విధానం ". అంటే మన దేశంలో ఉత్తరభారతంలో ఉన్న నదులను దక్షిణ భారతంలో ఉన్న నదులతో కాలువల ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రతి నదికి అనేక కాలువలు త్రవ్వి, వాటి ద్వారా ఎండాకాలంలో హిమనీనదులకు వచ్చే వరద నీటిని ఆ సమయంలో నీరు లేక ఎండిపొయి ఉన్న దక్షిణ ప్రాంత నదులలోకి విడుదల చేస్తారు. తద్వారా అక్కడ వరద నష్టం తగ్గుతుంది, అత్యధిక శతం నీరు వృధగా సముద్రంలో కలువదు, అదే సమయంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న పంటలకు నీరు అందించవచ్చు. అలాగే త్రాగు నీటి అవసరాలు కూడా తీర్చవచ్చు. ఇందులో గంగ కీలక పాత్ర పోషిస్తుంది.

గంగా, బ్రహ్మపుత్ర నదులు మన దేశంలో వచ్చే వరదలో 60% వాటా కలిగి ఉంటాయి. ఈ నదులను, వాటి ఉపనదులను, మిగితా నదులను ఒక దానితో ఒకటి కాలువల ద్వారా కలపాలనే తొలి ఆలోచన 100 సంవత్సరాల క్రితమే ఊపిరి పోసుకుంది. దీని గురించి మొదట ప్రస్తావించింది మన తెలుగు వ్యక్తి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.            

ఏ ఏ నదులను అనుసంధానం చేస్తారు? దీని వలన మన దేశానికి లాభం ఎంత? దీనికి ఎంత ఖర్చవుతుంది?

జాతీయ నదుల అనుసంధాన విధానంలో మన దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న దాదపు 37 నదులను కాలువల ద్వారా అనుసంధానం (లింక్) చేస్తారు.

1) ఇందులో అతి పెద్ద లింక్ గంగా-కావేరి లింక్. గంగా జలాలను గంగానది నుండి సోన్, నర్మద, తాపి( తపతి), గోదావరి, కృష్ణ, పెన్నా నదులను కలుపుకుంటూ కాలువ ద్వారా కావేరిలోకి తరలిస్తారు. 2636 కిలోమీటర్లు ( 1650 ) మైళ్ళ అతి పోడవైన మానవనిర్మిత కాలువ ద్వారా జరిగే ఈ ప్రక్రియతో త్రాగునీరు, సాగునీరు ప్రధానమైన అంశాలు. వీటికి తోడు అతి పెద్ద కాలువ ద్వారా భారీజలవిద్యుత్ ఉత్పాదన, నౌకయానం, వరద నష్ట నివారణ, పర్యాటకరంగ అభివృద్ధి దీనిలోని ఇతర అంశాలు. ఈ కాలువ ద్వారా మళ్ళించిన నీటితో బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థన్ రాష్ట్రాలకు నీరు అదనంగా అందిస్తారు. అదే విధంగా 50,000 క్యూసెక్కుల గంగా మిగులు జలాలను ఏడాదిలో 150 రోజులు, నీటు లభ్యతను బట్టి అంతకంటే ఎక్కువరోజుల పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళ్ నాడులో ఉన్న కరువుప్రాంతాలకు నీటిని మళ్ళించే వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం చేపడితే మనం కూడా పరమ పవిత్రమైన గంగ నీరు నిత్యం త్రాగే అవకాశం కలుగుతుంది.

2)అలాగే గంగా - బ్రహ్మపుత్ర లింక్ రెండవ అతి పెద్ద ప్రాజెక్టు. బ్రహ్మపుత్రా నది కరువుకాలంలో కూడా 3500-5000 క్యూసెక్కుల జలప్రవహాన్ని కలిగి ఉంటుంది. గంగా దిగువభాగంలో కరువుకాలంలో ఏర్పడే నీటి కరువును ఇది తీర్చి, ఈ ప్రాంత అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ గంగా-బ్రహ్మపుత్రా లింక్ 320 కిలోమీటర్లు. ఇది లింక్ కాలువ బంగ్లాదేశ్ మెదుగ ప్రవహించడం వలన బంగ్లాదేశ్ లో కూడా ఈ నీరు వ్యవసాయ, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇరు దేశాల మధ్య నౌకాయానానికి దారులు మరింతగా తెరుచుకుంటాయి. కాకపోతే ఇది అంతర్జాతీయ ఒప్పందం కనుక మన ప్రభుత్వాలు కాస్త శ్రమించాలి.

3)నర్మదా లింక్ కాలువ ద్వారా గుజారత్, మూఖ్యంగా కచ్చ్ ప్రాంత, అలాగే పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలకు నీరు అందించవచ్చు.

4)500 కిలోమీటర్ల పొడవైన చంబల్ లింక్ కాలువను ఇందిరాగాంధీ కాలువకు అనుసంధానం చేస్తారు.

4)అలాగే దక్షిణ భారతంలో పడమ దిశగా ప్రవహించే నదులు వర్షాకాలంలో చాలా వరద నీటిని మోసుకుపోతాయి. ఈ నదులను మన దక్షిన భారతంలో తూర్పు దిశగా ప్రవహించే నదులతో అనుసంధానం చేయడం కూడా ఈ జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగం.

6)ఈ ప్రాజెక్టు లో భాగంగా మన గోదావరి నదిలో ఉన్న నీటిని కృష్ణలోకి మళ్ళించే ఆలోచన కూడా ఉంది.

దీని వలన కలిగే దేశానికి ప్రయోజనాలేమిటి? దీనికయ్యే ఖర్చు ఎంత?

నదుల అనుసంధానం వలన మన దేశంలో అధనంగా 3.5-3.9 కోట్ల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. అనేక మంది మళ్ళీ వ్యవసాయ రంగంలోకి తిరిగివస్తారు. చాలా జలవిద్యుత్ కేంద్రాలు(Hyder Power Stations) ఏర్పాటు చేయడం వలన ఇప్పటికి అధనంగా 34,000 మిల్లియన్ కిలోవాట్ ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. గత 65 ఏళ్ళలో వెలుగు చూడని అనేక గ్రామాలు శాశ్వతంగా వెలిగిపోతుంటాయి.

మన దేశంలో కొత్తగా 60,00 కిలోమీటర్ల జలమార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. దీనివలన మన దేశంలో ప్రయాణం ఈ జలమార్గాల ద్వారా జరగడం డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గిపోతుంది. పెట్రోల్, డీజిల్ దిగిమతికి కోసం ఉపయోగించే ఎంతో విలువైన కొన్ని కోట్ల విదేశీమాదకద్రవ్యం మనకే మిగులుతుంది. దీనితో మనం మన దేశంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరపవచ్చు.

దేశంలోని ప్రతి ప్రాంతానికి 24 గంటలు, 365 రోజులు త్రాగునీరు, సాగు నీరు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో మన దేశం ప్రపంచ ఆకలిని తీర్చే స్థితికి చేరుకుంటుంది. మరొక ముఖమైన విషయం నదుల అనుసంధానం వల్ల భారతదేశంలో రాబోయే 10,000 సంవత్సరాల వరకు కరువు పరిస్థితి ఏర్పడదు. ప్రపంచ దేశాలకు ఇక్కడి నుండి ఆహారపదార్ధల ఎగుమతి వలన మన దేశం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంది. అత్యంత ధనిక దేశం అవుతుంది. పేదరికం సంపూర్ణంగా తొలగిపోతుంది. అతి కొద్దికాలంలోనే భారత్ అమెరికా, చైనాలను అందుకోలెనంత స్థితికి చేరుకుంటూంది.నిత్యం నీరు పారుతుండడం వలన దేశంలో భూమి సారవంతమవుతుంది, దిగుబడి పెరుతుంది.  అంటే ఎంతలేదనుకున్నా భారతదేశానికి 10,000 సంవత్సరాల పాటు స్వర్ణయుగంగా గడిచిపోతుంది.

చాలామంది ఈ ప్రాజెక్టుని ఎత్తిపోతల(Drift irrigation project) పధకం అనుకుంటారు. కానీ మహానుభావులు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు ఎంతో ఆలోచించి ఈ అనుసంధాన ప్రక్రియ గ్రావిటి(gravity) ఆధారంగా జరిగేలా రూపొందించారు. అందువల్ల నీరు మళ్ళించడంలో దాదాపుగా విద్యుత్ అవసరం ఉండదు.

సాంస్కృతికంగా:
హిందువులకు నదులు పరమపవిత్రమైనవి. అందుకే ఉత్తరభారతంలో నదులకు ప్రతి సాయంకాలం హారతులిస్తారు. ఇందులో ముఖ్యమైనది గంగా హారతి. ఇది చూడడానికే అనేకమంది విదేశీయులు భారతదేశానికి వస్తారు. అటువంటి గంగ, యమున, ఇతర నదులు దక్షిణభారతంలో కూడా ప్రవహిస్తుంటే ఇక దేశామంతట అడుగడుగునా నదులకు నీరాజనం పడతారు హిందువులు. ఆ రమణీయ దృశ్యాన్ని తిలకించడానికి అనేకమంది  పర్యాటకులు ఆకర్షింపబడతారు. పర్యాటక అభివృద్ధి , తద్వారా అనేక కొత్త ఉద్యోగాలు పుట్టుకోస్తాయి.

ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. దేశంలో ప్రతి ఏటా ఏదో ఒకనదికి పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని నదులు కలవడం వలన ఇక దేశమంతటా నిత్యం పండుగ వాతావరణం ఉంటుంది.

గంగనీటిని ఇతర నదులలోకి మళ్ళించడం వలన, గంగలో ఉన్న అనేక ఔషధ గుణాలు ఇతరనదులకు కూడా వస్తాయి. దేశంలోని ప్రతి నదీ జలం కూడా అమృతం అవుతుంది.

నదుల అనుసంధానానికి ఖర్చు ఎంత? ఇబ్బందులేమిటి?
భారతదేశ నదులు అనుసంధాన ప్రాజెక్టుకు దాదాపుగా 10 లక్షల కోట్లవుతుందని అంచనా. ఇది పూర్తవ్వడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. చాలా అటవీప్రాంతం మునిగుపొతుంది. అనేక మంది నిరాశ్రయులవుతారు. దానికి తోడు బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ ఒప్పందాలు అవసరం.

జరిగే మేలుతో పోల్చినప్పుడు ఇదంతా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. స్విస్ బ్యాంకులో 72 లక్షల కోట్ల నల్లధనం మన భారతదేశానిది ఉంది. అదంతా వెనక్కు తెస్తే, ఈ ప్రాజెక్టు లాంటివి 7 కట్టచ్చు. మన దేశంలో కొత్తగా 70 కోట్ల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. భారత్ ప్రపంచంలో సంపన్న దేశమవుతుంది. ఇవన్నీ ఈ చెత్త రాజకీయనాయకులు చేయరు. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలి.

15 సంవత్సరాల సమయం పడుతుందంటే మన రాజకీయనాయకులు ముందడుగు వేయరు. వారికి అధికారం కావాలి. అది పూర్తెయ్యే సమయానికి  ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు. అది చేపట్టినా ప్రజలు తమకు ఓటు వెస్తారనే నమ్మకం వాళ్ళకు లేదు. అందుకే అది ఇంకా అలా మూలనపడి ఉంది. అందుకే, ఓటు బ్యాంకు రాజకీయలను ప్రజలు సమర్ధించకూడదు.

అటవీప్రాంతం ముగిపోతుందని చెప్తున్నా, కాలువలు తవ్వి నీరు మళ్ళించడంలో కొంత నీరు అడవులకు కూడా చేరుతుందని, వృక్షసంపద మరింత పెరుగుతుందని కొందరు చెప్తున్నారు. ఇక నిర్వాసితుల విషయానికి వద్దాం. శ్రీ శైలం జలాశయం నిర్వాసితులకే ఇంకా ఫలితాలు దక్కలేదు. రాజకీయనాయకులు న్యాయం చేస్తామని మ్యానిఫేస్టొల్లో పెట్టడం తప్ప అది అమలు చేస్తారా? అంటే అది లేదు. పేదరికం అంతం చేస్తాం అంటారు. కానీ నిజంగా పేదరికాన్ని నిర్మూలిస్తే వీరి ఓటు బ్యాంకు దెబ్బతింటుందని ఆ పని చేయరు. ఒప్పందాలు విషయానికి వస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు నష్టం జరగదని భారత్ భరోసా ఇవ్వాలి. వారికి కూడా ఇది ఉపయోగకరమని వివరించాలి. కాని మన దేశ సమస్యలనే చర్చించుకునే సమయం మన రాజకీయ నాయకులకు లేదు. ఇక ఇతర దేశాలతో చర్చలేంటి?

వీటికి పరిష్కారం దేశభక్తి, హిందు ధర్మం పట్ల గౌరవం, ఆధ్యాత్మికత ఉన్న యువత రాజకీయల్లోకి రావాలి. మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి.

ఇక గంగ విషయానికి వద్దాం. చాలా మంది, హిందువులు నదులను, చెట్లను, చేమలను పూజిస్తారని హేళన చేస్తుంటారు. మన దేశ భవిస్యత్తును మార్చగల శక్తి మన నదీమతల్లులకే ఉంది. మనకు వాటి విలువ తెలుసు కనుకే మనం పూజిస్తున్నాం. దానికి తోడు మనకు కృతజ్ఞత భావం ఎక్కువ. మన జీవనానికి ఆధారమైన పంచభూతాలను(ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి) కి కృతజ్ఞతగా హారతులిస్తున్నాం. అంతేకాదు, మన హిందువులకు దైవం ఎక్కడొ వేరే లోకం లేదు. మన చూట్టు అంతా వ్యాపించి ఉన్నది. ఆ దైవమే నీటిలోను, చెట్టులోనూ, పుట్టలోనూ ఉంది. అందుకే మన వాటిని పూజిస్తున్నాం.

ఏవరైనా మీరు నదులను ఎందుకు పూజిస్తారు ? అని అడిగితే, మేము కేవలం నదులను పూజించడం లేదు, వాటిలో ఉన్న దైవత్వాన్ని పూజిస్తున్నాం. వాటి అధ్భుత శక్తికి నీరాజనమిస్తున్నాం అని సమాధానం చెప్పండి. నలుగురికి మన ధర్మ విశిష్టత తెలియజేయండి. ధర్మాన్ని ఆచరించండి.   

Monday, 4 February 2013

Sacred secrets of River Ganga

Om
Sacred secrets of River Ganga 

It is estimated that 100 million people take Holy bath at Allahabad during this Kubha Mela. Most people raise question that if this many people take bath in such a small place in a water body, will it not cause contagious and harmful diseases?

As we discussed in previous posts, River Ganga Water contains bacteriophage. The bacteria which phages feed on can come from human sewage, or from human bodies when they bathe. The human body in water in fact acts as a catalyst. The higher the concentration of bathers the more food for the phages to feast on. So wherever there are major bathing festivals (the various Kumbh Melas) and high numbers of bathers (Varanasi, Allahabad) phages will flock.


      ‘When there is a Kumbh Mela, that phages help. When sixty million people bathe in a small area, huge amounts of bacteria are rinsed off from their bodies. Suddenly the bacterial concentration is very high. Even though the phage concentration is initially very low, the chance of the proper bacterium meeting a phage is very likely. Having found out its prey, the phage will multiply and the whole area suddenly becomes rich in phages.

 Hence, As more people bathe in Ganga, the river seems to acquire greater powers of self-purification. To some it may also sound like an open invitation to encourage people to dump untreated sewage into Ganga. But no one is advocating this. 

Another interesting fact was revealed in British research during this khumba Mela. Those people who took holy bath in Sacred River are getting free from Psychological and mental problems and to some extent diseases. This is the power of River Ganga. This is the reason why Hindus worship her with utmost respect.

We, Hindus consider River Godavari as sacred and also give equal importance as we give to Ganga. The 2003 Ardh Mela at Nasik (on the Godavari river) that Godavari has also bacteriophages similar to that of River Ganga but anyhow Ganga has its own importance . ‘Six million people bathed there.  Researhers took water samples and found about eight or nine different phages in that water,’ just about what you’d expect when several million take a ‘holy dip’ together.’   

Devendra Swaroop Bhargava is now a retired professor of Hydrology from Roorkee University. In the 1980s and 1990s, Bhargava published many papers in respectable international journals, arguing that Ganga has special chemical and biological properties that allow the river to absorb organic wastes at an astonishingly high rate due to a remarkable ability to re-oxygenate itself. One that stuck in my mind was the claim that animal bones submerged in a tank at IIT-Kanpur had been dissolved within three days. 

and some part is taken from Paper and NEWS media.

Sunday, 3 February 2013

Sacred secrets of River Ganga

Om
Sacred secrets of River Ganga

‘Fifty years ago, you could put a few drops of Ganga jal into polluted water and it would kill all the bacterial growth. It has been recorded.’

This is reason why Hindus , while returning from their piligrimage used to carry Sacred Ganga Water and distribute it to their neighbours and relatives and  In most of the Ancient Hindu Texts also we come across certain lines which tells us that Ganga water is used in many rituals.

‘Ganga is unique because of this bacteriophage. It comes from the Gangotri glacier and flows downwards. This bacteriophage has the capacity to totally kill off bacterial pathogens. This phage grows so vast and so rapidly that it can spread throughout the entire length of Ganga from Gangotri to Ganga Sagar in just twenty four hours!

‘Twenty four hours? Twenty six hundred kilometres? That’s phenomenal!’

‘The growth of this killing virus is very rapid. It comes up in the water, it grows and multiplies and then vanishes automatically in twenty four hours time.’

Presumably leaving no trace. Here today, gone tomorrow and Ganga has been swept clean of disease. Extraordinary!

But what existed then can no longer exist today because there will soon be no more continuous flow of Ganga out of the Himalayas because of The Tehri dams  which will be the death of Ganga’s extraordinary self-purifying capacity. This is happened 50 years back.

Don’t Ganga water get polluted if millions of people bath in it? Will this not spread contagious diseases?

To be continued………………………………

మన దేవాలయాలు-9

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం
మన దేవాలయాలు-9
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ప్రదక్షిణం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.

దేవాలయంలో విగ్రహప్రతిష్ట చేసే సమయంలో విగ్రహం క్రింద పంచలోహాలు వేస్తారు. అలాగే ద్వజస్థభం క్రింద కూడా పంచలోహాలు వేస్తారు. ఇవి భూమిలో ఉన్న విద్యుతయస్కాంత్ శక్తిని ఆకర్షిస్తాయి. సైన్సు ఏమి చెబుతోందంటే?  Nulei/ Nucleus చుట్టూ Electrons వృతాకారంలో తిరుగుతుంటాయి. అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది. వీటికి దగ్గరలో కూడా ఇదే విధమైన ప్రక్రియ( Nucleus/ Nulei చుట్టు Electrons తిరగడం) జరుగుతుంటే, ఇవి పరస్పరం ఆకర్షణకు గురవుతాయి. వాటి మధ్య మరింత బలమైన బంధం ఏర్పడి, అక్కడ ఉన్న  Electrons అన్నీ కూడా వృత్తాకారంలో అంటే కుడి నుంచి ఎడమకు తిరగడం వలన అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది.

దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆలయంలో ఉన్న మూలవిరాట్టు(ప్రధాన విగ్రహం), ఆయన వాహనం, ద్వజస్థభం మధ్య ఒక శక్తివంతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. మనం కూడా కుడి నుండి ఎడమకు దైవం చుట్టూ తిరిగితే,మన శరీరంలోనికి ఆ విద్యుతయస్కాంత్ శక్తి ప్రవేశిస్తుంది.  అందుకే ప్రదక్షిణంలో మనం కుడి నుండి ఎడమకు తిరుగుతాం. అంటే మన కుడి చేయి వైపు దైవం ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రదక్షిణంలో ఉన్న అంతరార్ధం.

అసలు ప్రదక్షిణ ఏలా చేస్తే మన శరీరానికి శక్తి అందుతుంది? ప్రక్షిణం ఎలా చేయాలని శాస్త్రం చెప్తోంది?

ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ద్వజస్థంభం దగ్గర నమస్కరించి మొదలుపెట్టాలి. ఎలా పడితే అలా వేగంగా తిరగడం కాదు, పచ్చికుండలో నిండుగా నూనె నింపుకుని, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ ఆ పచ్చి కుండను ఎత్తుకుని, ఆ నూనె క్రింద పడకుండా ఎంత జాగ్రత్తగా, మెల్లగా నడుస్తుందో, అంతే మెల్లగా, నెమ్మదిగా ప్రదక్షిణం చేయాలని శాస్త్రం చెప్తోంది. అలా చేస్తేనే దేవాలయంలో ఏర్పడే విద్యుతయస్కాంత్ క్షేత్రం యొక్క శక్తి మనకు అందుతుంది. రోజూ వేగంగా 100 ప్రదక్షిణలు చేయడం కంటే శాస్త్రానుసారం 3 ప్రదక్షిణలు చేయండి చాలు.

మరిన్ని వివారాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.      

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............