Showing posts with label వినాయకవ్రతం. Show all posts
Showing posts with label వినాయకవ్రతం. Show all posts

Monday, 23 November 2015

వినాయకవ్రతం

25 నవబరు 2015, బుధవారం నుంచి వినాయకవ్రతం.

సాధారణంగా గణపతి స్వామిని పూజించడానికి విశేష సమయం గణేశనవరాత్రులు అని అందరికి తెలుసు. అయితే ఒక్క గణేశనవత్రాలు కాక, వినాయకుడిని ఆరాధించి, ఆయన అనుగ్రహంతో జీవితంలో విఘ్నాలను తొలగించుకోవటానికి, శుభాలను పొందటానికి అనేక ప్రత్యేకమైన తిధులను పూర్వీకులు మనకు అందరించారు. అటువంటి వాటిలో వినాయక వ్రతం.

దీని గురించి సద్గురు శివాయశుభ్రమునియ స్వామి వారు చెప్పారు. వినాయకవ్రతం అనేది గణపతిని ఆరాధించటానికి తమిళుల కార్తిగై పూర్ణిమ నుంచి 21 రోజులు జరుపుతారు. ఈ 21 రోజులు గణపతి ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు, గణేశపురాణం, గణపతికి సంబంధించిన అనేక కధలు పఠిస్తారు, ఆలయాల్లో ప్రవచనాలు చేస్తారు. ఈ వ్రతం పాటించేవారు 21 రోజుల పాటు ప్రతి రోజు ఆలయంలో పూజకు హాజరవ్వాలి, ఏకభుక్తం చేయాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి, రాత్రి భోజనం చేయాలి.

- సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి

25 నవంబరు 2015, బుధవారం కార్తీక పూర్ణిమ సందర్భంగా ఆ విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://goo.gl/YcbMnC