Tuesday 31 March 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (1 వ భాగం)



ఎక్కడో వూహాన్ నగరంలో పుట్టిన ఒక చిన్న క్రిమి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వేల సంఖ్యలో మనుషులను బలిగొంటొండి. అది మానవుల సృష్టించిందా లేదా సహజంగా ప్రకృతిలో ఏర్పడిందా అనేది ఇంకా మనకు తెలియదు... కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మానవాళికి మృత్యువు ఎక్కడి నుంచి ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి. ఎవరికీ ఎలా ఉందో, ఎవరిని నమ్మవచ్చో, ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి. అందరూ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ గడిపే స్థితి. దేశాల సరిహద్దులు మూతబడ్డాయి, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దులు సైతం మూసివేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది ఉంది.. ప్రకృతి ఈ విపత్తు ద్వారా మనకేమీ నేర్పిస్తోంది....
ఈ విపత్తు తొలగాలని, అందరూ బాగుండాలని ఆశిద్దాము. కానీ మన తప్పులు కూడా మనం తెలుసుకుందాము, పునరాలోచన చేద్దాము. ఈ వ్యాసాల ఉద్దేశం భయం కలిగించడం కాదు, మన పంథాను మార్చుకోవాలని గుర్తు చేయడమే....

అయితే ఒకసారి మనం వెనక్కు అనగా 2019 ఆగస్టుకు వెళదాము. అమెజాన్ అడవుల్లో నిప్పు రాజుకుంది....
ప్రపంచంలోనే అతి పెద్ద అడవులు అమెజాన్ అడవులు. అవి బ్రెజిల్, పేరు, బొలివియా మొదలైన తొమ్మిది దక్షిణ అమెరికా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. జీవరాశి మనుగడకు ఇవి విడుదల చేసే ప్రాణవాయువు (ఆక్సిఎజ్ఞ్) ను ద్ర్ష్టిలో ఉంచుకుని వీటిని ప్రపంచానికి ఊపిరితిత్తులుగా చెబుతారు. వీటిలో ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం ఉంటుంది. ఇవి దాదాపు 60 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమెజాన్ అడవుల్లో నిప్పురాజుకుంది, కాదు వాటికి నిప్పు పెట్టారు మానవులు. శాస్త్రవేత్తల అనచాన ప్రకారం దాదాపు 23 లక్షల జంతువులు ఈ అగ్నిలో మరణించాయి. లక్షల ఎకరాల వృక్ష సంపద నాశనం అయింది. కేవలం ఒక్క జూలై 2019 లోనే బ్రెజిల్లో 7200 చదరపు మైళ్ళు తగలబడింది. దీనికి ఆగస్టు నెల మరియు ఇతర దక్షిణ అమెరికా దేశల్లో తగలబడిన అడవి అదనం.

ఇప్పుడు ఆస్ట్రేలియా లో 2019 నవంబర్ లో జరిగినది ఒకసారి చూద్దామా ? ఆస్ట్రేలియాలోని అడవుల్లో కూడా అగ్గి రాజుకుంది, కాదు ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే స్థానికులు అగ్గి రాజేసారని అక్కడి ప్రజలే చెబుతున్నారు. ఇప్పటి వరకు అనగా మార్చి 2020 వరకు 4,60,50,750 ఎకరాల అటవీ సంపద ఈ అగ్నికి దగ్ధమైంది. దాదాపు ఒక బిలియన్ అనగా సుమారు వందకోట్ల జీవరాశి (పక్షులు, జంతువులు, కీటకాలు) అగ్నిలో పడి మరణించాయి.
కేవలం బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇలాంటి విధ్వంసం కొనసాగింది, ఇంకా కొనసాగుతోంది. ఈరోజు మనం ఎలా అయితే బయటకి వెళ్లలేక, ఇంట్లో ఉండలేక, ఆమవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నామో, అడవుల్లో ఉన్న జీవరాశి కూడా అలానే గడిపింది. వాటికి ఎక్కడి నుంచి మృత్యువు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తోందో తెలియదు. తప్పించుకునే మార్గం లేదు... ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని ఇంట్లో ఉండమంటున్నా, కొందరు వినక బయట తిరుగుతూ వాళ్ళు ప్రమాదంలో పడుతూ, మానవాళిని ప్రమాదంలో పడేస్తున్నారు... బహుసా ఆ రోజు కూడా ఆ అడవుల్లోని జీవరాశి అలాగే అనుకుని ఉంటాయి. మనిషేమీ ఉన్నతమైన, ప్రకృతికి అతీతమైన జీవి కాదు కద... ప్రకృతిలో భాగమైన మనిషే ప్రకృతికి నిప్పు పెట్టినప్పుడు, ప్రకృతి కూడా 'వద్దు రా నాయనా! ఇది నీకు కూడా ముప్పు తెస్తుంది, నా మాట విను!' అని మౌనంగా చెప్పే ఉంటుంది. అయిన మనం వినలేదు. అప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మనదీ అలానే ఉంది... ఇది ప్రకృతి పెట్టిన శాపమా? లేక స్వయంకృతాపరాధమా?

కానీ ఎంత ఆశ్చర్యం... ఈ కరోనా మొదలైన తర్వాత ప్రపంచంలో అడవులు నరకడం ఆగిపోయింది...


మరి ఎక్కడో అడవులను తగలబెడితే, మొత్తం ప్రపంచం దానికి మూల్యం అనుభవించాలా అని అడుగుతారేమో... దాని గురించి కూడా చెబుతాను....

స్వామి వివేకానంద సూక్తి



It is a privilege to serve mankind, for this is the worship of God. God is here, in all these human souls. He is the soul of man

- Swami Vivekananda

Monday 30 March 2020

స్వామి సచ్చిదానంద సూక్తి



Love Yourself

“Begin to love yourself. You have to find the peace within you. If you recognize the peace and joy within, then, you’ll be able to give the same to everyone. Actually, you’re not really giving that peace and joy, you’re helping them to find their own peace and joy. First, find it within yourself, because everything begins at home. There is a proverb: ‘Charity begins at home.’ But I would say everything begins at home. If you have joy, you give joy to others by your very presence and example.

- Swami Satchidananda

Sunday 29 March 2020

Saturday 28 March 2020

అరొబిందో సూక్తి



None can reach heaven who has not passed through hell.

- Sri Aurobindo

స్వామి శివానంద సూక్తి



The real Svarupa of mind is Sattva only. Rajas and Tamas join Sattva accidentally in the middle. They can be removed by Sadhana or purificatory practices such as Tapas, selfless service, Dama, Sama, Japa, worship, etc. If you develop the Daivi Sampat or divine qualities, Rajas and Tamas will perish. Then the mind will be pure, subtle, steady and one-pointed. Then it will melt in the subtle invisible homogeneous Brahman (Akhandaikarasa Brahman). It will mix with Brahman now, just as milk mixed with milk, water with water, oil with oil. Nirvikalpa Samadhi will result.

- Swami Sivananda

Friday 27 March 2020

ఇప్పుడు లోకక్షేమార్థమై అందరూ చేయదగ్గ మంత్రం



ఎక్కడో పుట్టిన ఒక విషక్రిమి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చూస్తుంటే మానవాళిని మహామృత్యువు తరుముకొస్తోందా అన్నట్లు ఉందీ సమస్య. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇప్పుడు అందరూ జపించవలసిన ఏకైక మంత్రం 'ఓం నమో నారాయణాయ' అని పెద్దలు, గురువుల ద్వారా తెలిసింది. మొన్న మా గురువు గారిని అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు. 

చెట్టుకొకరు పుట్టకొకరు జపిస్తే కలిగే ఫలానికంటే అధికసంఖ్యలో జనులు భక్తితో దైవాన్ని వేడుకుంటే మేలు కలుగుతుంది. అంటే ఈ మంత్రం చేస్తూ మనం బయట తిరగవచ్చా అని అడగకండి. బయటకు అడుగు పెడితే మహామృత్యువు మ్రింగేందుకు సిద్ధంగా ఉంది. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇంట్లో ఉంటూనే మనమంతా ఎంత ఎక్కువగా జపిస్తే, నష్టాన్ని అంతగా నివారించవచ్చు. అది ఒక్కటే మార్గము. శేషశయనుడు, గరుడ వాహనుడైన శ్రీ మన్నారాయణుడే ఈ సమయంలో ఈ విషక్రిమి బాధను నివారించగలడు, కష్టం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించగలడు.   
  
మనలో చాలామంది శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. అందులో సాక్షాత్తు భగవానుడే ఒక మాట చెప్పాడు. 

ఆర్థావిషణ్ణా శ్శిధిలాశ్చ భీతా: ఘోరేషుచ వ్యాధిషు వర్త మానా:
సంకీర్త్య నారాయణ శబ్ధమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు

ఆందోళనతో ఉన్నా, దుఃఖితుడైనా, పూర్తిగా పతనమైనా, భయపడుతున్నా, ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నా, చెడు సమయం నడుస్తున్నా, 'నారాయణ', 'నారాయణ%' అనే సంకీర్తన చేతనే అతడు దుఃఖం నుంచి విముక్తుడై సుఖం పొందుతాడు. ఇది సాక్షాత్తు పరమాత్మ చెప్పిన మాట. నారాయణుడు స్థితి కర్త. లోకరక్షణ ఆయన బాధ్యత. ఇప్పుడు పరిస్థితులను అనుసరించి 'నారాయణ' మంత్ర జపం నష్టాన్ని నివారిస్తుంది. ఈ సమయంలో ఏ మంత్రాలు ఉపదేశం లేనివాళ్ళంతా 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రం ఎంత వీలైతే ఎంత జపినవచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్ మరియు ఇతర మాధ్యమాల్లో అనేక మంత్రాలు ప్రచారం అవుతున్నాయి. అందులో బీజమంత్రాలు సైతం ఉంటున్నాయి. వాటిలో అక్షరదోషాలు చాలా ఉంటున్నాయి. తెలిసీతెలియక, ఉపదేశం లేకుండా అలాంటి మంత్రాలను చదవటం ఎంతమాత్రము శ్రేయస్కరం కాదు. తర్వాత చాలా ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుంది. 

అన్నిటికంటే భగవానుడే స్వయంగా చెప్పిన 'ఓం నమో నారాయణాయ' అనే మంత్ర జపం సర్వోత్తమం. స్త్రీపురుషనపుంసక బేధాలు లేవు, ప్రత్యేక కాలం లేదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, కనీసం రోజుకు 2000 సంఖ్యకు తగ్గకుండా చేయండి. మీరు ఏ పని చేస్తున్నా మనస్సులో జపిస్తూనే చేస్తూనే ఉండండి. పరిస్థితులు చక్కబడాలి, అందరూ రక్షించబడాలి, అకాలమృత్యువు తొలగాలని సంకల్పించండి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దీనికి ఉపదేశం కూడా అవసరంలేదు. కావల్సింది భక్తి, దాంతో పాటు లోకానికి మేలు జరగాలనే తలంపు. లోకంలో మనం కూడా ఒక భాగం. కేవలం మనం బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి, అప్పుడే మనమూ బాగుంటాము.

ప్రహ్లాదుడు చెబుతాడు - 
పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత 
శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా!!

- త్రాగుతూ, తింటూ, మాట్లాడుతూ, పరిహస్తూ, నిద్రిస్తున్నా లేదా నిద్రకు ఉపక్రమిస్తూ, తిరుగుతూ, ఎల్లప్పుడూ ఆ శ్రీ మన్నారాయణుని పాదాల మీదనే మనస్సు నిలిపి, ఆయన స్మరణ చేయవచ్చని చెప్పారు. కనుక సమయం సరిపోదని చెప్పకండి, మౌనంగా ఈ మంత్రజపం చేయండి. ఇప్పుడీ ప్రపంచానికి స్థితికారుడైన ఆ ఆదినారాయణుడే దిక్కు. దయచేసి ఈ విషయం అందరికి పంచుకోండి, అందరితోనూ చేయించండి.

ఓం నమో నారాయణాయ 

Thursday 26 March 2020

అలవాట్లు మార్చుకునేందుకు ఇదే సదవకాశం



దయచేసి వినండి...

ఈ వ్యాధి వలన ప్రత్యక్ష సమస్యలే కాక, పరోక్ష ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ 21 రోజులు తర్వాత జీవన విధానం కూడా మారిపోతుంది.

మానసిక నిపుణులు ఏం చెప్తారంటే కొత్తగా ఏదైనా అలవాటు చేసుకోవాలనుకుంటే 21 రోజుల పాటు నిరంతరం దాన్ని పాటిస్తే సరిపోతుంది. అదే వదులుకోవాలనుకుంటే, ఏకాధాటిగా 21 రోజుల పాటు దాన్ని ఆచరించకుండా ఉంటే సరిపోతుంది. కనుక మనల్ని మనం మంచిగా, చక్కని పౌరులుగా, ఆరోగ్యవంతులుగా, ధార్మికులుగా మలుచుకునేందుకు ఈ 21 రోజులు కీలకం. ఈ కరోనా సెలవుల కాలంలో వీలైతే ధ్యానం, యోగాసనాలు నేర్చుకోండి, లేదంటే రోజూ ఉదయమే నిద్రలేచి దైవప్రార్ధన చేయడం, జపం చేయడం నేర్చుకోండి. బ్రహ్మచర్యం పాటించండి. చక్కని ఆహారం తీసుకోండి. మద్యమాంసాలను విడిచిపెట్టండి. రోజూ ఒక గది చొప్పున ఇంటిని శుభ్రం చేసుకోండి. పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. రాత్రి త్వరగా అంటే 9 నుంచి 10 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించి, ఉదయం 5 నుంచి 6 మధ్య లేవడం నేర్చుకోండి. దేశానికి, ధర్మానికి ఉపయోగపడేలా ఈ 21 రోజుల్లో మిమ్మల్ని మీరు మలుచుకోండి. చూస్తుంటే, ఏప్రిల్ నెల మొత్తం ఇలానే ఉంటుందేమో. కనుక ఈ సమయంలో కుటుంబంతో గడపండి, ప్రేమాప్యాయతలు పెరుగుతాయి. నిర్లిప్తత, నిరాశ కు లోనవకుండా ఎవరికి వారు మనసునీ, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి.    

ఇవేమీ చేయకుండా తిని కూర్చుకుంటే, 21 రోజుల అజ్ఞాతవాసం వలన,  అందరికీ ఖచ్చితంగా బద్ధకం పట్టుకుంటుంది. మూడు వారాల సెలవులు కాబట్టి ఓ వారం తరువాత చేయడానికి చేతినిండి పని ఉండదు. టీవీ చూస్తూ, ఫోన్, ఫేస్‌బుక్ చూస్తూ గడిపేస్తాం. ఇది పెద్ద ప్రమాదన్ని తెచ్చి పెడుతుంది. సామాజిక దూరమే కాదు, సామాజిక మాధ్యమాలకు, టి.వి.కి కూడా సాధ్యమైనంత దూరం పాటించండి. లేదంటే అవి additions గా మారతాయి. సిగిరెట్, మద్యం వంటి వ్యసనాలు (addictions) శరీరానికి ఎంత చెడు చేస్తాయో, ఈ సామాజిక మాధ్యమాలకు, ఫోన్ కు బానిస అవ్వడమనేది అంతే కీడు కలిగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 

వింటున్నారా?  Maintain Social Distance and distance from Social Media too....

Wednesday 25 March 2020

వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ?



వేప పువ్వు దొరక్క ఉగాది పచ్చడి తినకపోతే ఏమవుతుంది ? 

పొద్దున ఒకతను ఫోన్ చేశారు...
అతను : నమస్తే సర్! ఉగాది శుభాకాంక్షలు
నేను : ఉగాది శుభాకాంక్షలండి....
అతను: ఎలా ఉన్నారు?
నేను: బాగున్నా, మీరెలా ఉన్నారు?
అతను: బాగున్నాం సార్, కానీ ఈ సారి ఉగాదికి వేపపువ్వు దొరకలేదండి,  ఉగాది పచ్చడి చేసుకోకుండానే పండుగ జరుపుకోవలసి వస్తోంది..
నేను: పర్లేదండీ, వచ్చే ఏడాది తినచ్చు... ఈ ఏడాదికి ఇంట్లోనే ఉండండి...
అతను: తినకపోతే ఏమీ కాదా సార్ ? అది తప్పు కాదా ?
నేను : ఏమీ కాదండి... తప్పేమీ లేదు...
అతను: మరి శాస్త్రంలో చెప్పారు కదా సార్ తప్పకుండా తినాలని...
నేను: అవునండి... కానీ శాస్త్రం అంతవరకే చెప్పి ఊరుకోలేదు. మనకు ఆయుర్వేదమనే వైద్యశాస్త్రం ఉంది. అది ఉపవేదం కూడా. అది కృతజ్ఞత అని సూత్రం మీద పని చేస్తుంది. అనగా మనం ప్రకృతికి మేలు చేసే విధంగా బ్రతికినప్పుడు, ప్రకృతి మనకు మేలు చేస్తుంది... మన వంతుగా మనం ప్రకృతికి ఏ మేలూ చేయనప్పుడు, మనం ఆరోగ్యం కోసం ఎలాంటి ఔషధం పుచ్చుకున్నా పని చేయదని చెబుతుంది ఆయుర్వేదం.
అతను: అర్ధం కాలేదు సార్...
నేను : మన ఆయుర్వేద శాస్త్రాన్ని ముందు బ్రహ్మదేవుడు ప్రజాపతికి చెప్పారు. ఆయన ఆశ్వినీ దేవతలకు, వారు ఇంద్రునకు, ఆయన అత్రిపుత్రుడైన ఆత్రేయ పునర్వసు మరియు ఇతర మునులకు, వారు అగ్నివేశునకు మరియు  ఇతర ఋషులకు చెప్పారు. అలా ఆయుర్వేదం వచ్చింది. ఈ ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరీ నారాయణ స్వామి. 
ఆయుర్వేదం ఏం చెబుతుందంటే ఏదైనా ఒక మూలికను చెట్టు నుంచి గ్రహించాలంటే, దానికి ఒక ముహూర్తం చెబుతుంది. ఎప్పుడుబడితే అప్పుడు మూలికలు కోస్తే అవి పని చేయవంటుంది.... చెట్టు నుంచి ఆకులు సేకరించినా, బెరడు, వేరు లేదా ఇంకేదైనా సేకరించినా, ముందుగా ఆ చెట్టుకు నమస్కరించి, దానిని పూజించి, నాకు వచ్చిన రోగం నయమవడానికి ఈ మూలిక కోస్తున్నాను, దయచేసి నా విజ్ఞప్తిని మన్నించి, నా రోగం ఉపశింపజేయండి అని మనస్సులో ఆ చెట్టుకు చెప్పుకోవాలి. ఆ తర్వాత దానికి నీళ్ళు పోసి, అప్పుడు కృతజ్ఞతా భావనతో, ప్రసాదంగా ఆ ఆకును కోయాలి. అప్పుడే అది ఔషధంగా పని చేస్తుంది. లేదంటే పని చేయదు. పని చేసినా అది తాత్కాలిక ఫలితమే ఇస్తుంది, ధీర్ఘకాలం కాదు. 

బెరడు చెట్టు కాండాన్ని చీడపీడల నుంచి కాపాడుతుంది. ఒక చెట్టు బెరడును సేకరించాల్సి వస్తే, ఆ చెట్టు బెరుడును తీసిన చోట, కొద్దిగా పసుపు, తర్వాతా ఆవుపేడ ఆ ప్రాంతంలో పూయాలి. ఎందుకంటే మనం సేకరించిన తర్వాత ఆ చెట్టుకు ఏ చీడ పట్టకూడదని... అదీగాక మనం ప్రకృతిహితకరమైన జీవనం గడుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం సేకరించే ప్రతి మూలిక ప్రకృతిలో భాగం. ఒక ప్రక్క ప్రకృతిని హింసిస్తూ, కలుషితం చేస్తూ, ఇంకో ప్రక్క ఆయుర్వేదం వాడితే ఏమీ ఉపయోగం లేదు....
ఇప్పుడు మనం ఇవేమీ చేయకుండా చెట్టు నుంచి ఆకులు, పూలు కోస్తే, దాన్ని శాస్త్రం చౌర్యం అంటుంది, దొంగతనం చేసిన పాపం పడుతుంది. మీకో చిన్న విషయం చెబుతా. మార్నింగ్ వాక్ చేసే చాలామంది ఒక చేతిలో కవరు, ఇంకో చేతిలో పాలకోసం బుట్ట పట్టుకుని దండయాత్రకు బయలుదేరతారు. వాళ్ళు పోయే దారిలో ఏ పూల చెట్టు కనిపించినా, ఒక్క పువ్వు కూడా వదలకుండా మొత్తం దులిపేస్తారు. ఆ చెట్టు ఎవరు నాటారు అనేది వీళ్ళకి అనవసరం. కనీసం వీళ్ళు ఏనాడు ఒక మొక్కకు నీళ్ళు కూడా పోసి ఉండరు... ఇప్పుడు ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళి పూజ చేస్తారు. మరి వీళ్ళకు పుణ్యం వస్తుందనుకుంటున్నారా? వీళ్ళందరికి చౌర్యం (దొంగతనం) చేసిన పాపం వస్తుంది. తర్వాత మేక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అదన్నమాట సంగతి. 

ఇప్పుడు వేప పువ్వు, మామిడాకుల విషయంలో కూడా అంతే. మన ఇంటి ముందు మనం కనీసం ఒక వేప చెట్టు, మామిడి చెట్టు నాటలేమా ? పోనీ ఇంటిముందు చోటు లేకపోతే మనముండే వీధిలో ? ఏదైనా చెట్టుకు నీరు పెట్టక, అది ఎండిపోయే స్థితికి వస్తే, ఎప్పుడైనా నీళ్ళు పోసే మొహమా మనది ? కనీసం దేవతార్చనకు పూల మొక్కలు కూడా పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా? అయినా మనకు పట్టదు. ప్రకృతికి ఏమైతే మనకేంటీ అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు కరోనా లాంటి విషవ్యాధులు ప్రబలి, ప్రకృతి మనకు సహకరించడంలేదు.

మనం ఎవరి నుంచైనా మేలు పొందితే, వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం మన ధర్మం మనకు నేర్పింది. అది మనం మర్చిపోతున్నాం. ఇంటికో వేప చెట్టు, వీధికో రావి చెట్టు ఉంటే ఏ రోగాలు మన జోలికి రావు. పండుగ రాగానే ప్రకృతి మీద పడి దండయాత్ర చేసి, చెట్లన్నీ దులిపే బదులు, మన ఇంటి ముందే ఒక మొక్క నాటి పెంచుకోవచ్చు కదా... దానికి రోజూ నీళ్ళు పొస్తే, యజ్ఞం చేసిన ఫలం మనకు వస్తుంది. దాన్ని భూతయజ్ఞం అంటుంది శాస్త్రం. ఇప్పుడు పచ్చడి తిన్నా, మన జీవన విధానం మార్చుకోకపోతే, మనకు తప్పకుండా వ్యాధులు వస్తాయి. మనం చేసిన తప్పులను తెలుసుకుని ప్రకృతి మాతను క్షమాపణ వేడుకున్నప్పుడే, ప్రకృతిహితంగా జీవించినప్పుడు మనం ఆచరించేవి మనకు ఫలాన్నిస్తాయి. ఉగాది పచ్చడి గురించి చెప్పినప్పుడు కూడా వేపచెట్టును పూజించే పువ్వు సేకరించమన్నారు.కాబట్టి ఎత్తుకొచ్చి వేపపువ్వు తినేకంటే మనమే ఓ మొక్క నాటుకుంటే సరిపోదా? 

అతను: అర్ధమైంది సార్... ఈ ఏడాది నేను కూడా మా ఇంటి ముందు వేప, మామిడి వంటి కొన్ని ఔషధ మొక్కలు నాటి, జాగ్రత్తగా పెంచుతాను.... 

Tuesday 24 March 2020

వసంత నవరాత్రులు చేద్దామా ?

25 మార్చి 2020, బుధవారం నుంచి 03 ఆప్రిల్ 2020, శుక్రవారం వరకు చైత్ర నవరాత్రుల సందర్భంగా...


దయచేసి ఈ సమచారాన్ని మీరు చదివి అందరితో పంచుకోండి. అందరితోనూ ఆచరింపజేయండి...

వసంత నవరాత్రులు చేద్దామా ?

ఉగాది నుంచి శ్రీ రామనవమి వరకు 9 రోజులు అమ్మవారిని, శ్రీ రామచంద్రమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. మన సంప్రదాయంలో ఒక ఏడాదిలో మనకు 4 రకాల నవరాత్రులు ఉంటాయి. ఇప్పుడు చేసే వసంత నవరాత్రులను శారదా నవరాత్రులు అంటారు. ఇప్పుడు కూడా దుర్గా మాతను 9 రోజుల పాటు నవదుర్గల రూపంలో పూజిస్తారు. ఇప్పుడు చేసే పూజ జ్ఞానాన్ని ఇవ్వడమే గాక, ఈ కాలంలో ప్రబలే విషరోగాల నుంచి రక్షణ ఇస్తుందని శాస్త్రవాక్కు.

ఈ వసంత నవరాత్రులు ఎలా చేయాలి ?
• చండీ, బాలా, పంచదశీ మొదలైన మంత్రాలు ఉపదేశం ఉన్నవారు తమ తమ గురువులు చెప్పిన రీతిలో నవరాత్రులను తప్పక చేస్తారు.
• మరి మనలాంటి సామాన్య హిందువుల సంగతి?
• ఉగాది వస్తోంది గనక ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకుంటాము, ఇంట్లో ఉన్న చెత్త వస్తువులు తీసివేస్తాము, బూజు దులిపేస్తాము, ఇల్లంతా కడిగి, ఆవుపేడతో అలికి, ముగ్గులు వేస్తాము.
• ఇంటిని నీటితో కడిగి, అలికి, ముగ్గులు వేసే వెసులుబాటు నగరాల్లో లేకపోయినా, కనీసం తుడుచుకోవాలి.
• ఉగాది నాటి ఉదయమే నిద్రలేచి, అభ్యంగన స్నానం (తలకి నువ్వుల నూనె పట్టించుకుని స్నానం) చేసి, కొత్తబట్టలు ధరించి, దేవుని ముందు కూర్చుని, లోకక్షేమం కోసం, ఆయురారోగ్యాల కోసం అమ్మవారి నవరాత్రులు చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం సంస్కృతంలోనే చెప్పుకోనక్కర్లేదు, మనకు వచ్చిన భాషలో మనస్సులో గట్టిగా సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది.
• ఆ తర్వాత దుర్గా అష్టోత్తరం చదివి, 'శ్రీ రామ' అనే నామాన్ని 108 సార్లు జపం చేసి (1008 సార్లు జపం చేయడానికి మీకు పట్టేది 13 నిమిషాలు, 108 1-2 నిమిషాల్లోనే అయిపోతుంది), మనకు తోచిన నివేదన చేయాలి. మొదటి రోజు ఆ అన్నం వండాలి, రెండవ రోజు ఈ అన్నం వండాలని లేదు.
• మనం రోజూ వండుకునే అన్నమే సరిపోతుంది. కాకపోతే స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకుని, బియ్యం కడిగిన తర్వాత, అందులోనే కొంచం పెసరపప్పు, పసుపు వేసి, వండితే చాలు.
• అది కూడా కుదరదు అంటే, వండిన అన్నం మీద చిన్న బెల్లం ముక్క (చిటికెడు పెట్టినా చాలు) వేసి నివేదన చేసినా, అదే మహానివేదన.
• మరి అన్నం కూడా వండుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటీ అంటారా ? తాడేపల్లీ రాఘవనారాయణ శాస్త్రిగారికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కేవలం మంచినీటినే మహనివేదన చేశారు. కనుక ఆందోళన అవసరంలేదు.
• ఉండగలిగిన వాళ్ళు నక్తం చేస్తారు. అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం పూజ తర్వాత భోజనం చేస్తారు.
• లేదనుకుంటే, నివేదన చేసినది ప్రసాదమే అవుతుంది కనుక ఏ దోషం ఉండదు, హాయిగా తిని, సాయంకాలం స్నానం చేసి, మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే కాలం బాలేదు. ఒంట్లో శక్తిలేనివాళ్ళు నక్తాలు చేసి బలహీనపడేకంటే తిని చేయడమే మంచిది.
• సాయంకాలం చేసే పూజ ప్రధానం. అది కూడా సంధ్యాకాలంలో అంటే సూర్యాస్తమయ కాలంలో చేస్తే ఇంకా విశేషం. అంటే సాయంకాలం 6 నుంచి 7 మధ్యలో.
• మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు : ఈ తొమ్మిది రోజులు మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటూ, బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత దుర్గా మరియు శ్రీ రామ నామస్మరణ చేయాలి. రోజూ శ్రీ రామరక్ష స్తోత్రం పారాయణ చేయాలి. అనవసర సంభాషణ పనికిరాదు. శుచిగా ఉండాలి. శుచిగా, స్నానం చేసి వండిన పదార్ధమే తినాలి. ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. అంతే, అంతకుమించి ఇంకేమీ లేవు.
• అలా తొమ్మిది రోజులు చేసి, పదవ రోజు ఉదయం పూజ చేసి, అమ్మవారిని, ఆ శ్రీరామచంద్ర మూర్తిని పూజించి, వ్రతం ముగించవచ్చు. ఇది కష్టం కూడా కాదు. మీకున్న దాంట్లో మీకు తోచిన విధంగా చేసుకునేది. మీకు ఇంకా ఆసక్తి ఉంటే చైత్రపూర్ణిమ వరకు పక్షం మొత్తం అనగా 15 రోజుల పాటు చేయవచ్చు.
• రోజూ ఆలయానికి వెళ్ళాలనే నియమం లేనేలేదు. ఇంట్లో ఉంటూనే చేసుకునే అద్భుతమైన వ్రతం ఇది. దీని వలన మానసిక శాంతి, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారలాభము, సంతానము, కుటుమసభ్యుల మధ్య సఖ్యత, సౌభాగ్యము కలుగుతాయి.
అయితే ఈ ఏడాది తప్పకుండా ఎందుకు చేయాలి?
• ఇప్పుడు రాహువు ఆరుద్రలో ఉన్నాడు. అందుకే విషక్రిమి ప్రభావంతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. రాహువు మృగశిరలోకి రాగానే అంతా చక్కబడుతుంది.
• రాహువుకు అదిష్ఠాన దైవం దుర్గాదేవి. కనుక దుర్గాదేవి పూజతో రాహువు శాంతిస్తాడు. మన జోలికి రాడు.
• ఏ గృహంలో పూజ చేస్తారో ఆ గృహం వైపు చూడడు. గ్రామంలో ఎక్కువమంది చేస్తే ఆ గ్రామం వైపు చూడడు. దేశమంతా వసంత నవరాత్రులు చేసే ఆచారం ఉంది కనుక దేశం ఈ కష్టం నుంచి బయటపడుతుంది.
• మనం హిందువులము, లోకక్షేమం కోరతాము, సమస్తలోకాలు సుఖంగా ఉండాలని తలుస్తాము. అందువలన లోకసుకృతి కోసం చేస్తున్నామని సంకల్పం చెప్పుకుని చేస్తే, సమస్త లోకానికి మేలు జరుగుతుంది.
• ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వాలు మనల్ని ఇల్లు కదలవద్దు అంటున్నాయి.
• అమ్మవారి పూజలో శుచి ఉండాలి. ఇప్పుడు మనం అందరితోనూ సామాజిక దూరం పాటిస్తున్నాము, ఎవరి ఇంటికి వెళ్ళడంలేదు, అసలు బయట తిరిగే పరిస్థితులు కూడా లేవు. కనుక మన శుచికి ఆటంకం కలగదు.
• పూజ పేరుతో రోజూ ఇల్లు శుభ్రం చేసి, ఉతికిన బట్టలే కట్టుకుంటాము గనక కొత్త రోగాలు దరిచేరవు. అదేగాక మనకు వసంత నవరాత్రులకు ఎప్పూడూ సెలవులు వచ్చింది లేదు.
• ఇప్పుడు అందరికీ ప్రభుత్వమే పేయిడ్ లీవ్ ఇస్తోంది. ఇంట్లో కూర్చున్న రోజులకు సైతం జీతం ఇస్తున్నారు.
• ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని మనమెందుకు వదులుకోవాలి ?
• ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రమ్మంటే రాదు.
• మీరు నామజపం ఎంత ఎక్కువ చేస్తే అంత గొప్ప అనుభూతులను పొందుతారు.
• శ్రీ రామ నామంలో శివకేశవులు, లక్ష్మీదేవి ఉన్నారు. శ్రీకారం సంపదను ఇస్తే, ర కారం అగ్నితత్త్వం కనుక పాపాన్ని దహిస్తుంది, మకారం అమృతతత్త్వాన్ని ఇచ్చి, రోగరహితం చేస్తుంది.
• మీకు గనక సంకల్ప బలం ఉంటే ఈ తొమ్మిది రోజుల్లోనే శ్రీ రామనామాన్ని అక్షర లక్షలు అనగా 3 లక్షలు జపం చేయగలరు.
• అప్పుడు మీకు కలిగే ఆ దివ్యానుభూతి కొన్ని కోట్లు పోసినా కొనలేనిది.
• మళ్ళీ సంవత్సరంలో ఇవన్నీ చేయడానికి సమయం ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు !?
• ఈ కర్ఫ్యూ ఖచ్చితంగా ఇంకో 15 రోజులైనా ఉంటుంది.
• ఇంట్లో ఊరికే ఉండి, తిని కూర్చునే కంటే, ఈ సమయాన్ని దైవికంగా వినియోగించుకుని, మనకు, ప్రపంచానికి మేలు చేస్తే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి.
జయ దుర్గే ! జయ వనదుర్గే ! శ్రీ సీతా రామచంద్రమూర్తికి జై ! జై శ్రీ రామ !
లోకాసమస్తా సుఖినోభవంతు!

దయచేసి ఈ సమచారాన్ని మీరు చదివి అందరితో పంచుకోండి. అందరితోనూ ఆచరింపజేయండి.

Monday 16 March 2020

కంచి పరమాచార్య సూక్తి



We know many faults we commit, even if others do not know them. Sometimes we realise we are doing so many evil things and repent bitterly and feel why we should be born . Our duty is to pray to God -"I have committed so many faults. Will you not, 0 God, give me the will power not do like that in future and will you not purify my mind?" We must note down in a diary every night before we go to bed the faults committed by us and pray to God to give us courage and intelligence not to do so. This must be propagated widely.

- Kanchi Paramacharya

Sunday 15 March 2020

ఓషో సూక్తి



Discover yourself, otherwise you have to depend on other people's opinions who don't know themselves.

- Osho

Friday 13 March 2020

పరమహంస యోగానంద సూక్తి



If you want to be sad, no one in the world can make you happy. But if you make up your mind to be happy, no one and nothing on earth can take that happiness from you.

- Paramahansa Yogananda

స్వామి బ్రహ్మానంద సూక్తి



The world is so constructed, that if you wish to enjoy its pleasures, you also must endure its pains.
Swami Brahmananda

శివభక్తి గురించి సద్గురు శివాయ శుభ్రమునీయ స్వామి సూక్తి



"If difficult things are happening to you and your mind is disturbed because of them and you have mental arguments within you because you can't accept your own karma, go to the feet of Lord Siva in your mind."

-- Satguru Sivaya Subramuniyaswami

Thursday 12 March 2020

స్వామి బ్రహ్మానంద సూక్తి



The world is so constructed, that if you wish to enjoy its pleasures, you also must endure its pains.

- Swami Brahmananda

భద్రతతో కూడిన లావాదేవీల కోసం BHIM App వాడండి



మనలో చాలామంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఏం వంటి UPI Apps వాడుతున్నారు. అవి కాక SBI yOnO వంటి UPI ఆధారిత బ్యాంక్ యాప్స్ కూడా ఉపయోగిస్తూ ఉండవచ్చు. అయితే చాలా సార్లు అవి సరిగ్గా పని చేయడంలేదని ఫిర్యాదు చేస్తుంటారు. కొన్నిసార్లు మనం పంపిన డబ్బులు అవతలివారికి చేరక, మన ఖాతా నుంచి Debit అయ్యి మనల్ని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలేవీ లేకుండా పని చేసే ఏకైక UPI యాప్ BHIM (భీం). దీన్ని 30 డిసెంబరు 2016 న మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు. మిగితా యాప్స్ ప్రైవేటు సంస్థలవైతే, ఈ భీం మాత్రం పూర్తిగా ప్రభుత్వానిది. మనం ఏ ఇతర పేమెంట్ యాప్ ఉపయోగిస్తున్నా, ఆయా లావాదేవీలన్ని భీం సర్వర్ ద్వారా మాత్రమే జరుగుతాయి. నేను భీం యాప్ ను 2018 నుంచి ఉపయోగిస్తున్నాను. ఇప్పటి వరకు దాంతో ఏనాడు సర్వర్ సమస్య అని గాని, లేదా ఖాతా నుంచి డబ్బు debit అయ్యి, అవతలి వారికి చేరకుండా మధ్యలో సమస్య ఉత్పన్నం కావడం కానీ జరగలేదు. ఇప్పుడు భీం మరింత మెరుగుపడింది. మొన్న జనవరిలో BHIM 2.0 కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా చాలా ఆఫర్లున్నాయి.

అన్నిటికంటే ముఖ్యమైనది... ఇది పూర్తిగా స్వదేశీ యాప్. దీనిలో విదేశీ వాట ఇసుమంతా కూడా లేదు. ప్రభుత్వ యాప్ అయినా, ప్రవేటు యాప్స్ కంటే చాలా బాగుంటుంది. మన లావాదేవీలన్నీ భద్రంగా ఉంటాయి. కనుక ఇతర పేమెంట్ యాప్స్ వాడటకంటే, త్వరగా దీనికి మారిపోండి. గూగుల్ ప్లే స్టోర్ లో BHIM app అని కొట్టి వెతకండి. ఇది ఎంత బాగుందనేది ఆ తర్వాత మీరే చెబుతారు. 

మరిన్ని వివరాలకు https://www.bhimupi.org.in/ సందర్శించండి.

శివపురాణం నుంచి సూక్తి



“Brahma emerged from the right side of Mahesa, Vishnu from the left and Nilarudra from his heart. In the beginning, intoning AUM, Sadasiva created the universe. Siva is Pranava and Pranava is Siva.”

― Ramesh Menon, SIVA PURANA

Wednesday 11 March 2020

శారదా మాత సూక్తి



The world is the Lord's. He created it for His own play. We are mere pawns in His game. Wherever He keeps us and in whatever way He does so, we have to abide by it contentedly.

- Sarada Mata

శివ తాండవం - స్వామి శివానంద సూక్తి



The dance of Lord Siva is for the welfare of the world. The object of His dance is to free the souls from the fetters of Maya, from the three bonds of Anava, Karma and Maya. He is not the destroyer but He is the regenerator. He is the Mangala Data and Ananda Data, bestower of auspiciousness and bliss. He is more easily pleased than Lord Hari, He grants boons quickly, for a little Tapas or a little recitation of His five letters.

- Swami Sivananda

Tuesday 10 March 2020

స్వామి బ్రహ్మానంద సూక్తి



God is the wish-granting tree.Whatever a man asks of Him,He grants…you are sitting under this wish-granting tree.Ask Him to make you divine and you will become divine.Ask Him to make you a brute and brute you will become.

— Swami Brahmananda

Monday 9 March 2020

స్వామి చిదానంద సూక్తి



Divinity, love, compassion, wisdom, spiritual aspiration, sincere sadhana. You can do all these things and more to enrich yourself.

— Swami Chidananda

Sunday 8 March 2020

పరమహంస యోగానంద సూక్తి



You waste precious time each day. Every little moment you spend with God will be spent to your best advantage; and whatever you achieve with the desire to please God in your heart will stand unto eternity.

— Paramahansa Yogananda

Saturday 7 March 2020

కంచి పరమాచార్య సూక్తి



What is the best means of Practising Atmic meditation? We must be imbued with the tranquillity that is Parasakti incarnate and remember every day Daksinamurti in his quiescence. Let alone the idea of forsaking all work and becoming plunged in meditation. Let us leave aside, for the time being, karma, which, itself is transformed into the high state of meditation. These are conditions to which we must arise at a later stage in our inward journey. But right now-at the beginning-let us train ourselves in the midst of our work to remain at peace and learn to meditate a little.

- Kanchi Paramacharya

Thursday 5 March 2020

మధర్ సూక్తి



One can progress through meditation, but through work provided it is done in the right spirit one can progress ten times more.

- The Mother

Wednesday 4 March 2020

అరొబిందో సూక్తి



“Hate not the oppressor, for, if he is strong, your hate increases his force of resistance; if he is weak, your hate was needless.”

- Sri Aurobindo

Sunday 1 March 2020

కంచి పరమాచార్య స్వామి సూక్తి



To start with, let karma, devotion and meditation be practised together. These are not supposed to one another but are complementary. In the end all will drop off one by one and the samadhi of dhyana alone will remain. When we start our inward journey we must keep this goal of samadhi before us. So every day, having aside all other work, we must practise meditation for some time. But all the same we must not dismiss rituals as meaningless or as a part of superstition. We must keep performing them. It is only when our impurities are washed away thus that we will realise the self-luminous Reality in us.

- Kanchi Paramacharya