Sunday 29 September 2019

స్వామి దయానంద సూక్తి



The more you understand yourself, the world and God, the more you are equipped to accept yourself. You cannot have inner leisure without an understanding of these three.

- Swami Dayananda


స్వామి చిదానంద సూక్తి



The power of divine love cannot be fathomed, it cannot be described. It will follow you wherever you go, whatever you are, whatever you have done. Even if you go to hell, it will reach out for you there and break hell to pieces and redeem you.

— Swami Chidananda



Saturday 28 September 2019

భగవాన్ రమణ మహర్షి సూక్తి



Through the thought of the feet of the Guru who has reigned over devotees, the intense darkness of ignorance [present in the] hearts of devotees will perish and ultimate liberation will be attained here and now.

- Bhagavan Ramana Maharshi


స్వామి శివానంద విరచిత గురుతత్వము - 13 వ భాగము

గురువు ఎలా బోధిస్తారు?

గురువు వ్యక్తిగత ఉదాహరణ ద్వారా బోధిస్తారు. గురు నిత్య జీవితంలో నడిచే నడవడిక సూక్ష్మ గ్రాహ్య శక్తి గల శిష్యులకు ఆదర్శం. గురువు యొక్క జీవితమే నిజాయితీగల శిష్యులకు ఇచ్చే సజీవమైన ఉపదేశము. నిరంతరం సంపర్కం ద్వారా, గురువుతో సంగం ద్వారా, శిష్యుడు గురువు యొక్క సద్గుణాలను అలవరచుకుంటాడు. అతడు క్రమక్రమంగా రూపుదిద్దుకొంటాడు. ఛాందగ్యోపనిషత్తు చదువు. ఇంద్రుడు ప్రజాపతితో నూట ఒక్క సంవత్సరాలు ఉండి, ఆయనను హృదయపూర్వకంగా సేవించాడు అని నీవు తెలుసుకుంటావు.

గురువుకు తన శిష్యుల యొక్క ఆధ్యాత్మిక అవసరాలు తెలుసు. శిష్యుని యొక్క ఎదుగుదల మరియు అవగాహన స్థాయికి అనుగుణంగా ఆయన ఉపదేశిస్తారు. ఈ ఉపదేశాన్ని రహస్యంగా ఉంచాలి. శిష్యుల మధ్య చర్చించడం అనేది గురువును విమర్శ చేయటానికి మరియు సాధనలో అశ్రద్ధకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. గురువు యొక్క ఉపదేశాలను తు.చ. తప్పకుండా పాటించు. అది నీకు మాత్రమే అని గుర్తు పెట్టుకో. వేరే శిష్యులు కూడా గురువు నుంచి ఉపదేశం పొంది ఉంటారు. వాళ్ళను దాన్ని అనుసరించనివ్వు. నీవు పొందిన ఉపదేశాన్ని ఇతరుల మీద రుద్దకు.

శిష్యుడు గురువు గురించి అతనికి ఉన్న విశ్వాసం యొక్క స్థాయిని బట్టి అతను తెలుసుకుంటాడు, గురువు చెప్పిన ఉపదేశాలను తనలో ఇముడ్చుకోగలడు. గురువు సాధకునకు ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సాధకుడు తగిన శ్రద్ధ చూపకపోతే, అతను తనకు ఉన్న దానితో సంతృప్తి చెంది ఉంటే, మరియు అజాగ్రత్తతో ఉంటే, అతను తన హృదయం యొక్క ద్వారాలను గడియ పెట్టుకుని ఉంటే, అతడు లాభ పడడు.


గురువు పరీక్షలు పెడతారు

సద్గురువు ఉపనిషత్తుల యొక్క రహస్య జ్ఞానాన్ని తను నమ్మదిగిన శిష్యులకు, అది కూడా వారు అనేకసార్లు ప్రార్థించడం చేత మరియు తీవ్రమైన పరీక్షల పెట్టిన తర్వాత అందిస్తారు. కొన్నిసార్లు, గురువు తన శిష్యుడిని ప్రలోభ/ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ శిష్యుడు గురువు ఎందుకు దృఢ విశ్వాసంతో దాన్ని అధిగమించాలి.

పురాతన కాలంలో, పరీక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఒకసారి గోరఖ్‌నాథుడు, తన శిష్యులలో కొంత మందిని ఒక పొడవైన చెట్టు ఎక్కి, తలక్రిందులుగా ఒక త్రిశూలం మీదకు దూకమని చెప్పారు. విశ్వాస రహితులైన ఎందరో శిష్యులు మౌనంగా ఉన్నారు. కానీ విశ్వాసం గల ఒక శిష్యుడు చెట్టు ఎక్కి మెరుపు వేగంతో తనను తాను క్రిందకు తోసుకున్నాడు. గోరఖ్‌నాథుని అదృశ్యహస్తం ద్వారా అతడు రక్షణ పొందాడు. అతనికి వెంటనే ఆత్మసాక్షాత్కారం కలిగింది.

ఒకసారి గురు గోవింద సింగ్ తన శిష్యులను పరీక్షించ దలచాడు. "నా ప్రియ శిష్యులురా! మీకు నా పట్ల నిజమైన భక్తి ఉంటే, నా ముందుకు వచ్చి మీ తలలు నాకు అర్పించండి. అప్పుడు మనము ఈ ప్రయత్నంలో విజయం పొందవచ్చు" అని ఆయన అన్నారు. విశ్వాసం గల ఇద్దరు శిష్యులు తమ శిరస్సులను అర్పించేందుకు ముందుకు వచ్చారు.

గురు గోవింద సింగ్ వాటిని లోనికి తీసుకెళ్లి, వాటికి బదులు రెండు మేక శిరస్సులు ఖండించారు. గురువు తన శిష్యుని అనేక విధాలుగా పరీక్షిస్తారు. కొందరు శిష్యులు గురువు అపార్ధం చేసుకొని ఆయన యందు విశ్వాసం కోల్పోతారు. అందుకే వారు లాభపడరు.

Friday 27 September 2019

శారదా మాత సూక్తి


The whole world is a dream; even this (the waking state) is a dream ... What you dreamt last night does not exist now.

- Sarada Mata


Wednesday 25 September 2019

స్వామి కృష్ణానంద సూక్తి



Do not keep anything which you will be afraid of showing to others.
Do not do anything which you would not like others to know.
In spiritual life secrecy has no place except in regard to one’s Sadhana.

- Swami Krishnananda

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 12 వ భాగము

భవిష్యత్తు గురించి ఏమాత్రం భయం చెందని శిష్యులు

ఆధ్యాత్మిక మార్గం అనేది మాస్టర్ ఆర్ట్స్ లో డిగ్రీ కోసం రాసే ఒక పరిశోధనవ్యాసం వంటిది కాదు. అది పూర్తిగా భిన్నమైన మార్గము. ఇక్కడ గురువు యొక్క అవసరం ప్రతి క్షణము ఉంటుంది. ఈ రోజుల్లో యువ సాధకులు నిమ్నమైన, దురహంకారంతో, ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడాలనే ఆలోచనతో ఉన్నారు. వారు గురువు యొక్క ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడరు. వాళ్లకి గురువు ఉండాలని కూడా ఇష్టపడరు. ప్రారంభం నుంచి స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆధ్యాత్మికత లేదా సత్యం గురించి వారికి అ ఆ ఇ ఈ లు తెలియక ముందే వారు తూరియ అవస్థలో ఉన్నారని భావిస్తారు. కొంటెతనాన్ని, విచ్చలవిడితనాన్ని లేదా స్వేచ్ఛా విహారాన్ని, లేదా తమకు నచ్చినట్లుగా, తమ మనసు చెప్పినట్టుగా ఉండడాన్ని స్వేచ్ఛ అని భావిస్తారు. ఇది తీవ్రమైన, శోచనీయమైన అపరాధము. ఆ కారణం చేతనే వారు ఎదగరు. వారు సాధన యొక్క సామర్ధ్యం మీద, భగవంతుని మీద విశ్వాసం కోల్పోతారు. వారు ఎటువంటి లస్యము లేకుండా కాశ్మీరు నుంచి గంగోత్రికు, గంగోత్రి నుంచి రామేశ్వరానికి తమ భవిష్యత్తు గురించి ఏమీ పట్టకుండా, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, విచారసాగరం నుంచి కొంత, పంచదశీ నుంచి కొంత మాట్లాడుతూ జీవన్ముక్తులుగా కనిపించే ప్రయత్నం చేస్తారు.



శరణాగతి మరియు అనుగ్రహము
నువ్వు ఒక కుళాయి నుంచి నీళ్ళు త్రాగాలన్టే, నీకు నువ్వుగా వంగాలి. అలాగే గురువు యొక్క పవిత్రమైన పెదవుల నుంచి ప్రవహించే సచ్చిదానందం అనే ఆధ్యాత్మిక అమృతాన్ని పానం చేయాలంటే, దానికి నీవు వినయము మరియు నమ్రతకు ప్రతిరూపంగా మారాలి.

మనస్సు యొక్క అల్పమైన ప్రకృతి ఎప్పటికప్పుడు పునరుద్ధరించబడుతూ ఉంటుంది. సాధకుడు తన గురువుతో ఇలా చెబుతాడు: "నాకు యోగాభ్యాసము చేయాలని ఉంది. నాకు నిర్వికల్ప సమాధి స్థితి చేరుకోవాలని ఉంది. నేను మీ పాదాల వద్ద కూర్చోవాలనుకున్టున్నాను. నన్ను నేను మీకు అర్పించుకున్నాను ,శరణాగతి పొందాను." కానీ అతను తన యొక్క అల్పమైన ప్రకృతిని, అలవాట్లను, పూర్వపు శీలాన్ని, గుణాన్ని మార్చుకొనుటకు ఇష్టపడడు.

వ్యక్తి యొక్క అహంకారం, ముందే ఏర్పరుచుకున్న భావాలు, తాను వృద్ధి చేసుకున్న ఆలోచనలు, స్వార్థపు ఆశలు వదిలిపెట్టాలి. ఇవన్నీ గురువు యొక్క ఉపదేశాలను మరియు సూచనలు పాటించే మార్గంలో అడ్డుగా ఉంటాయి.

నీ హృదయంలో దాగి ఉన్న రహస్యాలను గురువు ముందు స్పష్టంగా చెప్పు. నీవు ఆ చేసిన కొద్దీ, నీ పట్ల అంత అధికంగా దయ ఉంటుంది, అంటే దాని అర్థం పాపము మరియు దురాకర్షణల మీద నీవు చేసే పోరాటంలో నీకు మరింత శక్తి వస్తుంది.

ఒక సాధకుడు, తాను గురువు యొక్క అనుగ్రహం కోరుకునే ముందు, దానికి తగిన వాడై ఉండాలి. సాధకునికి నిజమైన తృష్ణ ఉన్నప్పుడే, అతడు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే గురువు యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది.

వినయము, విశ్వాసంతో ఉన్న సాధకుని మీదనే వారి మీదనే గురువు యొక్క అనుగ్రహం వర్షితుంది. ఆయనపై నమ్మకం మరియు ప్రత్యయమే గురువుపై విశ్వాసము. ఏదైతే గురువు, తన అనుభవం ద్వారా లేదా శాస్త్ర ప్రమాణం ద్వారా లేదా ఏ ఇతర ఆధారం లేకుండా చెప్పినప్పటికీ, అది సత్యము అనే భావన లేదా గట్టి నమ్మకం కలిగి ఉండడమే విశ్వాసము. గురువు యందు విశ్వాసం వున్న శిష్యుడు వాదన, చేయడు ఆలోచించడు, కారణాలు వెతకడు, వాటినే తలపోసుకుంటూ కూర్చోడు. అతడు గురువు చెప్పినది చెప్పినట్లు పాటిస్తాడు.

శిష్యుడిగా గురువుకు శరణాగతి మరియు గురువు యొక్క అనుగ్రహము పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. శరణాగతి పొందడం అనేది గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఉపయోగపడితే, గురువు యొక్క అనుగ్రహం శరణాగతిని సంపూర్ణం చేస్తుంది. గురువు యొక్క అనుగ్రహం రూపంలో సాధన రూపంలో సాధకునిలో పనిచేస్తుంది. ఒక సాధకుడు తన మార్గానికి కట్టుబడి ఉంటే ఇది గురువు యొక్క అనుగ్రహం. తన మీద దాడి చేసే దురాకర్షణలను అతడు నిలువరించగలిగితే, ఇది గురువనుగ్రహము. ప్రజలు అతడిని ప్రేమ మరియు గౌరవంతో స్వీకరించగలిగితే, ఇది గురువు యొక్క అనుగ్రహము. అతడు తన శరీర/భౌతిక సుఖాలన్నీ పొందగలిగితే, ఇది గురు అనుగ్రహము. సాధకుడు నిరాశనిస్పృహల్లో ఉన్నప్పుడు, అతనికి ప్రోత్సాహము మరియు మనోబలము కలిగితే, ఇది గురువు అనుగ్రహం. అతడు తన శరీరస్పృహకు అతీతుడై, తన ఆనంద స్వరూపంలో ఉండగలిగితే, అది గురువు అనుగ్రహము. ప్రతి అడుగు ఆయన అనుగ్రహాన్ని అనుభవించండి, గురువు పట్ల నిజాయితీగా మరియు సత్యంగా ఉండండి.

Tuesday 24 September 2019

సనాతన ధర్మం గురించి ఆర్నాల్డ్ టొన్బీ



It is already becoming clear that a chapter which had a Western beginning will have to have an Indian ending if it is not to end in self-destruction of the human race. At this supremely dangerous moment in human history , the only way of salvation is the ancient Hindu way. Here we have the attitude and spirit that can make it possible for the human race to grow together in to a single family.

- Dr. Arnold Joseph Toynbee (1889-1975)
the great British historian

Monday 23 September 2019

సనాతన ధర్మం గురించి ఆండ్రె మార్లక్స్



The problem of this century is the religious problem and the discovery of Hindu thought will have a great deal to do with the solving of that particular problem.

- Andre Malraux (1901-1976)

Sunday 22 September 2019

డేవిడ్ ఫ్రాలే సూక్తి



Democracy in religion means accepting many paths and encouraging people to find their own way to the ultimate truth. Dictatorship in religion means the effort to impose one belief as true upon everyone. Sadly many political democracies are still defending dictatorial religions.

- David Frawley

Saturday 21 September 2019

స్వామి శివానంద సూక్తి



Thoughts are dormant seeds of action. The mind’s acts, and not the bodily acts, are alone true acts. It is the actions of the mind that are truly termed Karmas.

- Swami Sivananda 

Friday 20 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 11 వ భాగము



గురు సేవ
ప్రారంభంలో సాధకులు తమ యొక్క మొత్తం దృష్టిని నిరంతరం గురుసేవ మీదేనే కేంద్రీకరించాలి. నీ గురువుని దివ్యమైన భావముతో సేవించు. ఇతరుల నుంచి తాను వేరు అనుకునే భయానకమైన రోగం తొలగిపోతుంది.

ఓడ ఒక్క నావికుడు ఎల్లప్పుడు జాగురూకతతో ఉంటాడు. చేపలు పట్టే వాడు ఎల్లవేళలా జాగురూకతతో ఉంటాడు. ఆపరేషన్ థియేటర్ లో చికిస్తా సమయంలో ఎల్లవేళలా జాగురూకతతో ఉంటాడు. అలాగే ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన శిష్యుడు తన గురువు యొక్క సేవలు ఎల్లప్పుడు జాగరూకతతో ఉండాలి.

గురు సేవ కోసమే జీవించు. అవకాశాల కోసం ఎదురుచూడు. పిలిచి సేవకు అవకాశం ఇవ్వాలని గురువు చెప్పేదాకా ఎదురుచూడకు. గురుసేవ కోసం నీకు నువ్వే ముందుకు వెళ్ళు.

నీ గురువును వినయంతో, ఇష్టంతో, ప్రశ్నలకు తావు లేకుండా, అహంకార రహితంగా, లోభత్వం లేకుండా, సంపూర్ణముగా, అలసట లేదా విసుగు చెందకుండా, ప్రేమతో సేవించు. గురువును సేవించడంలో నీవు ఎంత ఎక్కువ శక్తిని వినియోగిస్తే, అంత ఎక్కువ దివ్య శక్తి నీలోకి ప్రవహిస్తుంది.

గురువు సేవించేవాడు సమస్త ప్రపంచాన్ని సేవిస్తాడు. స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా గురువుకు సేవ చెయ్యి. గురువుకు సేవ చేస్తున్న సమయంలో నీలో ఉండే గుణాలను లేదా ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించు. పేరు, కీర్తి, సంపద, అధికారం మొదలైన విషయములను ఆశించకుండా గురువుకు సేవ చేయాలి.

గురువు పట్ల విధేయత

గురువు పట్ల గౌరవం చూపడం కంటే విధేయతతో ఉండటం మేలు. విధేయత అనేది ఒక గొప్ప సద్గుణము. ఎందుకంటే నీవు విధేయతను అలవరుచుకునే ప్రయత్నం చేస్తే, ఆత్మజ్ఞానానికి లేదా ఆత్మసాక్షాత్కారానికి బద్ధశత్రువైన అహంకారం మెల్లి మెల్లిగా వ్రేళ్ళతో సహా నశించిపోతుంది.

గురువు చెప్పిన దానిని పాటించే శిష్యుడు మాత్రమే, తన లో ఉన్న అల్పమైన గుణముల మీద ఆధిపత్యం కలిగి ఉంటాడు. విధేయత అనేది చాలా ఆచరణాత్మకంగా, సంపూర్ణ హృదయంతో, నిరంతరం పట్టు వదలని విధంగా ఉండాలి. గురువు పట్ల నిజమైన విధేయత అంటే మొండికేయడం, వాయిదా వేయడం, అలసత్వం ప్రదర్శించడం లేదా ప్రశ్నించడం వంటివి కూడదు. ఒక కపట శిష్యుడు భయంతో గురువు పట్ల విధేయత చూపుతాడు. నిజమైన శిష్యుడు తన గురువు యొక్క ఆజ్ఞను శుద్ధమైన ప్రేమతో ప్రేమ కొరకే పాటిస్తాడు.

గురువు ఆజ్ఞను ఎలా పాటించాలో తెలుసుకో! గురువుకు విధేయంగా ఉండటం నేర్చుకో. అప్పుడు మాత్రమే నీవు ఆధిపత్యం చలాయించగలవు. శిష్యునిగా ఎలా ఉండాలో నేర్చుకో. అప్పుడు మాత్రమే నీవు గురువు కాగలవు.

గురువుకు శరణాగతి చేయటం, ఆయన ఆజ్ఞను పాటించడం, విధేయుడై ఉండటం మరియు ఆయన చెప్పిన సూచనలను ఆచరించడం బానిస మనస్తత్వానికి సంకేతము అనే కపటమైన ఆలొచన లేదా భృఅంతిని వదిలిపెట్టు. వేరొక వ్యక్తి యొక్క ఆజ్ఞ పాటించడం లేదా అతనికి శరణాగతి చేయడం తన మర్యాదకు లోపమని, స్వేచ్ఛకు విరుద్ధమని అజ్ఞాని భావిస్తాడు. చాలా పెద్ద పొరపాటు. నీవు జాగ్రత్తగా ఆలోచిస్తే, వాస్తవంలో నీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, నీ అహంకారానికి మరియు డాంబికానికి పరిపూర్ణంగా బానిసగా మారింది. ఇదంతా విషయాశక్తి గల మనస్సు యొక్క చిత్త చాపల్యము మాత్రమే. ఎవడైతే తన మనస్సు మరియు అహంకారం మీద విజయం సాధిస్తాడో, అతడే నిజమైన స్వేచ్ఛ గల మనుష్యుడు. అతడే వీరుడు. అటువంటి విజయాన్ని సాధించడానికి మానవుడు ఒక గొప్ప ఆధ్యాత్మికతకు ప్రతిరూపమైన గురువుకు శరణాగతి చేస్తాడు. ఈ శరణాగతితో అతను తనలో ఉన్న అల్పమైన అహంకారాన్ని తొలగించుకొని అనంతమైన సచ్చిదానందాన్ని అనుభూతి చెందుతాడు.

Thursday 19 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 10 వ భాగము



రెండవ అధ్యాయము

యస్యదేవే పరాభక్తిర్- యథా దేవే తథా గురౌతస్యైతే కథితా హ్యర్థాత్ ప్రకాశాంతే మహాత్మనః

భగవంతుని పట్ల ఎవరి భక్తి గొప్పగా ఉంటుందో, ఎవరు తన గురువుని భగవంతునిగా భావించి పూజిస్తారు/ భగవంతునికి సమానంగా చూస్తారు/ అటువంటి గొప్ప జీవులకు/మహాత్ములకు పవిత్ర గ్రంథాలలో ఉన్న వాక్యాలు వాటికవే తెలియబడతాయి. (శ్వేతాశ్వతరోపనిషత్తు)

గురువు యొక్క ఆదేశాలను/సూచనలు తు.చ. తప్పకుండా పాటించేవాడు, మార్గంలో అల్పస్థాయిలో ఉన్న జీవులకు గురువు యొక్క ఉపదేశాలను ప్రబోధం చేస్తూ, జీవితాంతం గడిపేవాడే శిష్యుడు.

నిజమైన శిష్యుడు గురువు యొక్క దివ్యమైన స్వరూపం గురించే పట్టించుకుంటాడు. గురువు యొక్క మానవ చేష్టితములు శిష్యునకు పట్టవు. అతను వాటిని పూర్తిగా మరిచిపోతాడు/ విస్మరిస్తాడు. అతనికి తన గురువు సంప్రదాయం విరుద్ధంగా నడిచినప్పటికీ, ఆయనే గురువని విశ్వాసంతో ఉంటాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, తపస్సంపన్నుడైన మహా పురుషుని యొక్క స్వభావము చాలా గంభీరమైనది. అతనిలో దోషములు ఎంచకండి, తీర్పులు చెప్పకండి. మీ యొక్క అజ్ఞానం అనే కొలబద్దతో అతని దివ్య స్వభావమును కొలిచే ప్రయత్నం చేయకండి. విశ్వ దృష్టితో గురు చేసే చేష్టలను విమర్శించవద్దు.

నిజమైన శిష్యత్వం కళ్ళు తెరిపిస్తుంది. ఆధ్యాత్మికమైన జ్వాలను రగిలిస్తుంది. శక్తులను మేల్కొలుపుతుంది. వ్యక్తి యొక్క జీవితంలో ఆధ్యాత్మికపథంలో అది అత్యంత అవసరమైనది మరియు. గురు శిష్యుడు ఒక్కటే అవుతారు. గురువు దీవించి, మార్గదర్శనం చేసి, శిష్యుడుని ప్రేరేపిస్తారు. ఆయన శక్తిని ప్రసాదించి, పరివర్తన కలిగించి, ఆధ్యాత్మకీకరణం చేస్తారు.

గురువులు దగ్గరకు వెళ్లడానికి ఎవరు అర్హులు?

ఒక గురువు దగ్గరకు వెళ్లాలంటే, నీకు తగిన అధికారం ఉండాలి. సరైన అవగాహన శక్తి, వస్తువుల పట్ల బంధరాహిత్యము, ప్రశాంతమైన మనస్సు, ఇంద్రియనిగ్రహము, అల్పమైన/భౌతిక కోరికలు లేనితనం, గురువు యందు విశ్వాసం మరియు దైవమందు భక్తి అనేవి గురువును సమీపించే వారికి ఉండాల్సిన అవసరమైన సాధనములు.


మోక్షతృష్ణ ఉన్నవానికి, శాస్త్ర వాక్యాల పట్ల గౌరవం ఉన్నవానికి; కోరికలను, ఇంద్రియాలను నిగ్రహించుకున్నవానికి; స్థిరమైన, ప్రశాంతమైన మనసు ఉన్నవానికి; దయ, దివ్యప్రేమ, వినయము, తితిక్ష, క్షమా మొదలైన సద్గుణాలు కలిగిన వారికి మాత్రమే గురువు ఆధ్యాత్మిక బోధ/ ఉపదేశాలను చేస్తాడు. ఎప్పుడైతే శిష్యుని యొక్క మనస్సు కామరహిత/ కోరికలు లేని స్థితికి చేరుతుందో, అప్పుడే పరబ్రహ్మము గురించి నీగూఢమైన మర్మాల యొక్క ఉపదేశము ఫలించి జ్ఞానము కలుగుతుంది.

Monday 16 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 9వ భాగము



నుగ్రహము మరియు మానవ-ప్రయత్నము

గురువు ఏదో మాయ చేయడం వలన నీకు ఆత్మసాక్షాత్కారం అనేది కలగదు. బుద్ధుడు, రామ తీర్థ మొదలైన వారందరూ సాధన చేశారు. అర్జునుని వైరాగ్యము మరియు అభ్యాసం వృద్ధి పరుచుకోమన్నాడు కృష్ణుడు. "నేను నీకు ముక్తిని ఇస్తాను" అని ఆయన అనలేదు. కాబట్టి గురువు నీకు సమాధి స్థితిని మరియు ముక్తిని ఇస్తాడనే తప్పుడు ఆలోచన విడిచిపెట్టు. ప్రయత్నించు, పవిత్రత పొందు, ధ్యానం చేయి, సాక్షాత్కారం పొందు.

గురుకృప, గురువు అనుగ్రహం అనేది చాలా ముఖ్యము. దాని యొక్క అర్ధం, శిష్యుడు ఖాళీగా కూర్చోవాలని కాదు. అతడు ఎంతో పురుషార్థము, ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. మొత్తం కర్మ అంతా శిష్యుడే చేయాలి. ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే, సన్యాసి కమండలంలో ఒక్క చుక్క నీరు త్రాగాలి మరియు దాంతో వెంటనే సమాధి స్థితిలోకి చేరిపోవాలని కోరిక కలిగి ఉన్నారు. పవిత్రతను పొంది, ఆత్మసాక్షాత్కారం కోసం సాధన చేయడానికి వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా లేరు. సమాధి స్థితిని ఇచ్చే ఒక మాయాగుళిక వారికి అవసరం. నీకు అటువంటి బ్రాంతి లేదా భ్రమ ఉంటే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టు.

గురువు మరియు శాస్త్రాలు నీకు మార్గాన్ని చూపెట్టి నీ సందేహాలను నివృత్తి చేయగలరు. అపరోక్ష జ్ఞానం యొక్క అనుభూతి నీ సొంత అనుభవానికి వదిలేశారు. ఆకలితో ఉన్న వాడు తన కోసం తానే తినాలి. బాగా దురదు పెడుతుంటే, తన శరీరాన్ని తానే గోక్కోవాలి.

గురువు యొక్క ఆశీర్వాదాలు ఏదైనా చేయగలవు. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆయన ఆశీర్వాదాలు ఎలా పొందాలి? గురువును సంతృప్తి పరచడం ద్వారా. గురువు చెప్పిన ఆధ్యాత్మిక సూచనలను శిష్యుడు సంపూర్ణంగా పాటిస్తే గురువు సంతృప్తి చెందుతాడు. జాగ్రత్తగా అనుసరించు, నీ గురువు యొక్క సూచనలను పాటించు. ఆయన చెప్పిన విధంగా నడుచుకో. అప్పుడు మాత్రమే నీకు ఆయన దీవెనలు పొందగలిగే అర్హత కలుగుతుంది, మరియు అప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వాదాలు/దీవెనలు ఏదైనా చేయగలవు.

ఇక్కడితో ప్రథమాధ్యాయము సమాప్తము   

Sunday 15 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 8వ భాగము



శక్తి సంచారము

నీవు ఒక మనిషికి కమలాపండు ఇచ్చిన విధంగానే, అలాగే ఆధ్యాత్మిక శక్తిని కూడా ఒకరి నుంచి మరొకరికి ఇవ్వవచ్చు. ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తులను బదిలీ చేయడాన్ని లేదా ప్రసరించడాన్ని శక్తి సంచారము అంటారు. శక్తి సంచారంలో, సద్గురువు యొక్క ఒకానొక ఆధ్యాత్మిక తరంగం శిష్యుని యొక్క మనస్సులోకి బదిలీ అవుతుంది.

శక్తి సంచారానికి ఏ శిష్యుడు తగినవాడని గురువు భావిస్తారో, ఆ శిష్యునకు ఆధ్యాత్మిక శక్తి ప్రచురించబడుతుంది. గురువుకేవలం తన చూపు, ఆలోచన, మాట, సంకల్పం లేదా స్పర్శ ద్వారా ఒక శిష్యుడిని మార్చగలరు.

శక్తి సంచారము అనేది పరంపర ద్వారా వస్తుంది. అది నిగూఢమైన, మార్మిక శాస్త్రము. అది గురువు నుంచి శిష్యులకు అందుతుంది. 

స్వామి సమర్థ రామదాసు గారి శిష్యుడు, తన మీద మోహం పెంచుకున్న ఒక నాట్యగెత్తె కూతురుకు తన శక్తిని ప్రసరించారు. ఆ శిష్యుడు ఆమె వైపు చూసారు మరియు ఆమెకు సమాధిస్థితిని ఇచ్చారు. ఆమె యొక్క కామము తుడిచిపెట్టుకొని పోయింది. ఆమె ఎంతో ధార్మికంగా మరియు ఆధ్యాత్మికంగా మారిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు సూర్‌దాస్ యొక్క గుడ్డి కళ్ళను ముట్టుకున్నాడు. సూర్‌దాస్ యొక్క అంతఃనేత్రాలు తెరుచుకున్నాయి. అతనికి భావసమాధి కలిగింది. గౌరంగుడు తన స్పర్శ ద్వారా అనేకమంది వ్యక్తులలో ఆధ్యాత్మిక మత్తు కలిగించి, వారిని తన వైపునకు మార్చుకోగలిగాడు. ఆయన స్పర్శతో నాస్తికులు సైతం వీధులలో ఆనందంతో నాట్యమాడి, హరి యొక్క గానం చేశారు.

గురువు నుంచి శక్తులను పొందడంతోనే శిష్యుడు సంతృప్తి చెందకూడదు. పూర్ణత్వాన్ని మరియు ఇంకా ఎన్నో సాధించడానికి అతను తీవ్రంగా కష్టపడాలి. శ్రీరామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుని స్పృసించారు. స్వామి వివేకానందకు దివ్యానుభూతి కలిగింది. కాని ఆ తర్వాత కూడా ఆయన పూర్ణత్వం పొందడానికి మరో ఏడేళ్ళు శ్రమించారు.