Sunday 31 May 2020

హిందూ ధర్మం - 278 (కర్మ సిద్ధాంతం - 18) (స్వతంత్రేచ్ఛ)



స్వతంత్రేచ్ఛ 

అన్నీ కర్మ ప్రకారం జరిగితే ఇక మనకు పాపపుణ్యాల పేరుతో కష్టసుఖాలు ఎందుకు ? అన్ని కర్మను అనుసరించి మనౌ లభిస్తున్నప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఎందుకు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అదీగాక చాలామంది విదేశీయులు కర్మసిద్ధాంతాన్ని 'ఫేటలిజం' అని అనేస్తారు. 'ఫేటలిజం' అనే పదానికి "అన్నిటికి అదృష్టమే ప్రధానమనే మతం" అని అర్థం వస్తుంది. కర్మసిద్ధాంతం దీనికి పూర్తిగా విరుద్ధం.

ఒక పని చేయాలా వద్దా అనే స్వతంత్రత జీవునకు ఉంటుంది. కానీ దాని కర్మఫలం మీద అతనికి అధికారం ఉండదు. శ్రీ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది కూడా ఇదే. 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా' - నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది. అంటే మంచి చేస్తావా లేఖ చేడు చేస్తావా అనేది నీ ఇష్టం. నీకు అందులో పూర్తి స్వేచ్ఛ వుంది. కానీ నీవు చేసిన కర్మకు, నీకు నచ్చిన ఫలం పొందే అధికారం లేదు. అంటే చెడు చేసి, దానికి సత్ఫలితాన్ని పొందే అవకాశం నీకు లేదు. కనుక నీవే నిర్ణయించుకోవాలి. 

ఉదాహరణకు - నా నోటికొచ్చింది నేను మాట్లాడుతాను, తిడతాను, అరిషడ్వర్గాలకు లోనై నిందలు వేస్తాను, అవమానించి క్రిందకు లాగుతాను. ఇదంతా నా కర్మలో ఉంది గనకే నేను చేస్తున్నానని అంటావా ? అలా సమర్ధించుకోలేవు. అలా సమాధాన పరుచుకున్నా శాస్త్రం ఒప్పుకోదు. నేను చేసింది దుష్కర్మ. కనుక దానికి తగ్గ ఫలితం నీకు ఈశ్వరుడిస్తాడు. నువ్వు భక్తుడివనో, కొబ్బరికాయలు కొడతావనో, అర్చనలు చేస్తావానో, ధర్మరక్షణ చేస్తున్నావనో నీకు శిక్ష తగ్గించి వేయడు. నువ్వు చేసినదానికి నువ్వు అనుభవించవలసిందే. ఇక్కడ ఈశ్వరుడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. 

జీవుడు ఒక పని (కర్మ) చేయాలంటే అతడి మీద అతని పూర్వపు ఆలోచనలు, వాసనలు, వృత్తులు, సంస్కారాలు ప్రభావం చూపిస్తాయి (వీటి గురించి మనం ముందే చెప్పుకున్నాము, అవి చదవండి). కానీ కొత్తగా నీకు కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది. నీకు నచ్చింది నువ్వు చేయవచ్చు. దానినే స్వతంత్రేచ్ఛ అంటారు. (ఇచ్ఛ అంటే కోరిక/ will). 

అనగా నీ కర్మ ప్రకారం నీకు ఒకటి లభ్యం కాకపోవచ్చు, కానీ నీ స్వతంత్రేచ్ఛతో, దృఢ సంకల్పంతో నువ్వు ప్రయత్నం చేస్తే, నీకు అది లభ్యం కావచ్చు. నీ ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి నువ్వు దుస్సాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. అది కర్మసిద్ధాంతమే చెబుతుంది.  

ఇంకా ఉంది .....  

Saturday 30 May 2020

భారతీ తీర్థ స్వామి సూక్తి



Sri Adi Shankaracharya does not deem everything to be illusory for everyone. Karma, Bhakti and Upasana are all necessary for Jnana – प्राक्ब्रह्मात्मैकतत्वविज्ञानात् सर्वव्यवहाराणामेव प्रामाण्यसिद्धेः – All these are unnecessary only for a Brahma Jnani
The non-dual philosophy of the Upanishads does not decry the Karma enjoined in the Vedas.
There are numerous statements in the Vedas that instruct man to perform Karmas. So if one decries Karma, would not one be attributing falsehood to these statements in the Vedas. Sri Adi Shankaracharya Himself says that one has to accept the authority of the Vedas in totality and not associate authority with only select statements in the Vedas –
न हि वेदवाक्येषु कस्यचित्प्रामाण्यं कस्यचिदप्रामाण्यं इति सम्भवति प्रमाणत्वाविशेषात्
So it is a misunderstanding if one believes that Sri Adi Shankaracharya has given no role for Karma, Bhakti and Upasana. They are all required until the dawn of Brahma Jnana.
Jagadguru Sri Bharati Tirtha Mahaswamigal

మన వాహనాలు పార్క్ చేసుకోవడానికి చెట్ల నీడ కావాలి, కానీ ఒక్కరం కూడా చెట్టు నాటము.



మన వాహనాలు పార్క్ చేసుకోవడానికి చెట్ల నీడ కావాలి, కానీ ఒక్కరం కూడా చెట్టు నాటము. పోనీ ఎవరన్నా నాటినా వాటికి నీళ్ళు పోయము సరికదా, నరికేస్తాము. 40° ఎండ కాస్తోంది.. బయటకు వెళితే మొహం మాడిపోయేలా ఉంది.... లాక్‌డౌన్ అని ఇంట్లో ఉన్నా వేడి భరించలేకపోతున్నాము. ఇక బయట కూరగాయలు, పళ్ళు అమ్ముకునేవారి సంగతి ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా కాలనీల్లో పెద్ద పెద్ద రోడులు, అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి కానీ ఒక చెట్టు కూడా కనిపించదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సేద తీరే అవకాశం కూడా ఉండదు. కనీసం ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా మనిషికి ఒక మొక్క చొప్పున నాటి, రక్షించాలని తీర్మానం చేసుకుందాము. మనం నాటిన చెట్లు మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ వాటి నీడన ఎవరైనా సేద తీరితే మనకు కలిగే ఆ సంతృప్తే వేరు.

Note: నేను ఊరకే నీతులు చెప్పడంలేదు, నేను గత 6 ఏళ్ళ నుంచి ఏడాదికి కనీసం ఒక మొక్కైనా నాటి వాటి సంరక్షిస్తున్నాను. ఆ తర్వాతే మీకు చెబుతున్నాను. (బాగా ఎదిగి ఫలాలు లభించే సమయానికి వాటిని కొందరు అజ్ఞానులు కొట్టేసారు, అది వేరే విషయం). అయినా నేను మొక్కలు నాటడం ఆపను.

Friday 29 May 2020

శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి సూక్తి



It is true that in the world of practical life you cannot do without wealth. But do not attach more importance to money than it deserves. Never forget that money is only a means of happiness and not happiness itself.

Sri Chandrasekhara Bharati Mahaswamiji

ఒక వేప చెట్టు పది ఏసీలకు సమానం - వేపమొక్కలు నాటుదామా ?



2007 లో వార్తపత్రికలో చదివినట్లు గుర్తు. అప్పట్లో మన దేశానికి చైనా అధ్యక్షుడు పర్యటనకు వచ్చినప్పుడు వేప చెట్ల గురించి తెలుసుకుని ఓ పది లక్షల వేప చెట్లు తమ దేశానికి ఎగుమతి చేయమన్నాడట. అవన్నీ చైనాలో నాటుకోవడంతో పాటు ఒక విప్లవంగా 2.2 కోట్ల వేప మొక్కలు నాటించారు. చైనాలో వ్యవసాయం మరియు మొక్కల పెంపకంలో వచ్చే చీడపీడల నివారణకు వీటిని ఉపయోగిస్తారట. వేప చెట్టు పుట్టిల్లు భారతదేశం, అనాదిగా మన దేశంలో ఆయుర్వేదంలో వేపను ఉపయోగిస్తున్నాము. కానీ 1995 లో అమెరికా వేప మీద పేటెంట్ హక్కులు తీసుకోగా, భారత్ పోరాడి రద్దు చేసింది. మరలా చైనా కూడా పేటెంట్ పేరుతో జీవయుద్ధం (బయోవార్) చేయడానికి పూనుకుంది.

ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొంచ్చిందంటారా ? బయట ఎండలు మండిపోతున్నాయి. అసలు ఎప్పుడూ ఇలాంటి ఎండలు చూసి ఉండలేదు మనము. డబ్బున్న వారు ఏసీలు వాడుతున్నారు, కొందరు కూలర్లు ఉపయోగిస్తున్నారు.ఏమీ లేనివారు ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి. మన బాధ చెప్పుకోవచ్చు కానీ జంతువులు, పక్షులు మొదలైన జీవుల సంగతి ఏంటి ? ఒక వేప చెట్టు పది ఏసీలకు సమానమని అప్పట్లో తేలింది. చైనా దీని మీద ఆశ కనబరచడానికి ఇది కూడా ఒక కారణం. కనీసం ఊరికో రావి చెట్టు, వీధికో వేప చెట్టు ఉండాలని నానుడి. అప్పుడే ఆరోగ్యం. కానీ ఇవాళ చాలా వీధుల్లో అసలు చెట్లే కానరావు. మొత్తం సిమెంట్ చేసిన వాకిళ్ళే. మట్టి కనిపిస్తే కదా. మనము సైతం వేప మొదలైన ఓషధీ వృక్షాలా ప్రముఖతను* గుర్తించి ఉంటే, ఇంత వేడి భరించే స్థితి రాకపోవును. ఓషధీ యుక్తమైన గాలి పీలిస్తే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు కూడా రావు. (*సంస్కృత వ్యాకరణ పండితులు చెప్పే విషయం - ప్రముఖత సరైన పదప్రయోగం - ప్రాముఖ్యత తప్పుడు ప్రయోగం).

ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ ఏడు వర్షాకాలం రాగానే కనీసం మనిషికి ఒక మొక్క నాటుదాము. కుటుంబానికి ఒక వేప మొక్క నాటి సంరక్షిద్దాము. వేప అంటే లక్ష్మీదేవి. వేప మొక్కను నాటి, నీరు పోసి సంరక్షిస్తే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏమంటారు ?

నేను ఊరికే నీతులు చెప్పడంలేదు. 2014 నుండి ప్రతి ఏడు మొక్కలు నాటుతున్నా.

Thursday 28 May 2020

జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామి సూక్తి



Tendencies develop, regardless of the characteristics of the action performed. Hence, he who wishes to lead a proper life will do well to avoid evil deeds and repeatedly perform virtuous deeds.

- Jagadguru Sri Abhinava Vidyatirtha Mahaswami

Wednesday 27 May 2020

స్వామి దయానంద సూక్తి



Life is for the living. Death is for the dead. Living I die if I miss the here and now. Dead I will live if I have my being in the past and future, and here and yonder. Is it living?

- Swami Dayananda

Tuesday 26 May 2020

కంచి పరమాచార్య సూక్తి



Your Home – Your Family
Your home is the family of which the father and mother are the heads. In the same manner, this whole world is a big family of which Iswara and Ambika are the father and mother. You should have bhakthi for your parents and Iswara and Ambal who are the parents of the large world family. Between your family and the world family, there is another family which is the school. Those who are your mates in the school are like your brothers. The head of this family is the teacher. You should treat him also like the father and the mother and show respect to him.

- Kanchi Paramacharya

Monday 25 May 2020

స్వామి శివానంద సూక్తి



The best medicine or panacea for all diseases and for keeping good health is Kirtan, Japa and regular meditation. The Divine waves electrify, rejuvenate, vivify, energise the cells, tissues, nerves. Japa is the best of all spiritual practices in the modern age. It is the easiest too. Divine Names alone will give you all success and bestow the highest spiritual attainment.

- Swami Sivananda

Sunday 24 May 2020

శ్రీ ఆనందమయి మా సూక్తి



When the mind is full of worldly desires, it is their very nature to confuse the mind. Withdraw the mind from outer things and turn it inwards.
- Sri Anandamayi Ma

Saturday 23 May 2020

స్వామి బ్రహ్మానంద సూక్తి



The only difference between a rich man and a poor man, is that the poor man suffers uncomfortably, while the rich man suffers comfortably.
Swami Brahmananda

Friday 22 May 2020

Thursday 21 May 2020

స్వామి సచ్చిదానంద సూక్తి


Enjoy the Life

“There’s always a bright side to everything. Life is always up and down. Accept this and you won’t be bothered by it. If you keep the mind free from fear, it gives you a special strength. Nobody knows how long he or she will be here on this earth. Anytime, we may say goodbye. Within that time, enjoy the life.

- Swami Satchidananda

Wednesday 20 May 2020

Tuesday 19 May 2020

నారాయణానంద స్వామి సూక్తి



Thought of tomorrow is the cause of much worry and anxiety. Commentary:—The thought of tomorrow such as "Where shall I go? What shall I eat?" etc., brings about planning. This planning and such thoughts rob a man of his peace of mind and make him restless and uneasy. The best thing to do is to depend fully upon God and to avoid planning, i.e., not to live either in the things of the past or of the future and to be indifferent to the things of the present. Contentment alone can give a man peace of mind and happiness.

- Swami Narayanananda

Monday 18 May 2020

ద్వేషం అనేది అభివృద్ధికి అడ్డంకి



ధ్యానం, జపం వంటివి ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నామని చెప్పుకుంటాము గదా. ముందుకు మనకు ఉండకూడదిని ద్వేషం. శ్రీ కృష్ణుడు కూడా భగవద్గీతలో అద్వేష్టః సర్వభూతానం అంటాడు. ఏ జీవి యందు ద్వేష భావం ఉండకూడదు. ద్వేషం అనేది పెద్ద శతృవు. ఎదుటి వారి సంగతి వదిలెయ్యండి. అది ఉన్నవారిని ముందు నాశనం చేస్తుంది. ఒక వ్యక్తిని ద్వేషించడం మొదలుపెడితే, వారు మంచి చేసినా అంగీకరించలేము, హర్షించలేము. అది మంచి అని ఒప్పుకోలేము సరికదా ఏదో ఒక దోషం వెతికి విమర్శ చేస్తాము. ప్రతి వ్యక్తిలో మంచి చెడులు రెండూ ఉంటాయి. మంచిని నేర్చుకోవాలి, చెడుని గమనించి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. అంతేగానీ ద్వేషిస్తూ పోతే, ఇక ఇష్టపడుటకు ఎవరూ మిగలరు. అంతేగాక మన ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడుతుంది. ధ్యానం అంటే సునీశితంగా గమనించండం. ఎవరినో కాదు, తన్ను తాను గమనించుకోవడం. కనుక మనలో ద్వేషం ఉంటే దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు గొప్ప గొప్ప మాటలు మాట్లకపోవడమే మంచిది.

Sunday 17 May 2020

శారదా మాత సూక్తి



Such is life, here today, gone tomorrow! Nothing goes with one, except one's merit and demerit; good and evil deeds follow one even after death.

- Sarada Mata

Saturday 16 May 2020

పరమహంస యోగానంద సూక్తి



The secret of health for both mind and body is not to mourn for the past, worry about the future, or anticipate troubles, but to live in the present moment wisely and earnestly. . . Live each moment completely and the future will take care of itself. Fully enjoy the wonder and beauty of each moment.
Paramahansa Yogananda

Friday 15 May 2020

రామకృష్ణ పరమహంస సూక్తి



It's enough to have faith in one aspect of God. You have faith in God without form. That is very good. But never get into your head that your faith alone is true and every other is false. Know for certain that God without form is real and that God with form is also real. Then hold fast to whichever faith appeals to you.

- Sri Ramakrishna Paramahamsa

Thursday 14 May 2020

స్వామి కృష్ణానంద సూక్తి



Just as, when we touch a live wire, the electric force infuses itself into our body, when we deeply meditate on God the power of the whole universe seeks entry into our personality.

- Swami Krishnananda

Wednesday 13 May 2020

స్వామి వివేకానంద సూక్తి



Freedom can never be reached by the weak. Throw away all weakness. Tell your body that it is strong, tell your mind that it is strong, and have unbounded faith and hope in yourself.

- Swami Vivekananda

Tuesday 12 May 2020

మామిడి చెట్లు నరికితే బ్రహ్మహత్య దోషం - రావణసంహిత

ఈ వేసవిలో మనం ఎన్నో పళ్ళు తింటున్నాము. ఈ ఋతువులు మనకు మామిడి, సపోటా వంటి చాలా ఫలాలు లభిస్తున్నాయి. అవే గాక నిత్యం మనమెన్నో కాయగూరలు, పండులు తింటాము, కుంకుడుకాయలు వాడతాము. వాటి విత్తనాలను మనం జాగ్రత్తగా సేకరించవచ్చు. దీనికి శ్రమ కూడా అవసరంలేదు. వేసవి ముగుసి ఋతువుపవనాలు రాగానే ఆ విత్తనాలను ఖాళీ ప్రదేశాల్లో చల్లేస్తే, అవి మొలకెత్తుతాయి. చిన్నపాటి వనాన్ని పెంచే స్థలం లేకపోయినా, కనీసం ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటవచ్చును కదా. ఆలోచించండి...


Monday 11 May 2020

స్వామి చిదానంద సూక్తి



One cannot be impure and hope to have happiness. One cannot cling to objects in blind delusion and attachment and yet hope to have happiness. You cannot, out of your selfishness and hardness, cause pain and sorrow to others and at the same time hope to have happiness for yourself.

- Swami Chidananda

Sunday 10 May 2020

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం - శ్లోకం యొక్క అర్ధం



అగజానన పద్మార్కం గజాననమహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ||

ఈ శ్లోకంలో అనేకదంతం ఏంటి? మరలా ఏకదంతం ఏంటి? అని అనుమానం వస్తుంది కదా. మరి పిల్లలకు ఈ శ్లోకం నేర్పాలంటే దాని అర్ధం తెలుసుకోండి.

అ =లేనిది,
గ=చలనము ( అంటే చలనము లేలిది=పర్వతము=హిమాలయము=దానికిరాజైన హిమవంతుని )
జ= కుమార్తె (అనగా పార్వతీదేవి)
ఆనన= ముఖమను
పద్మ= పద్మమునకు
అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసించును. అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ.)
గజ +అనననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను)
అహస్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా
అనేకదం= ఎంచ వీలు లేనంత
తం =తమరి, మీయొక్క
భక్తానాం = భక్తులలో
ఏకదం= ఒకడు
తం= తమరిని
ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు

ఈ శ్లోకములో అనేకదంతం అని, ఏకదంతమని చదువరాదు. అనేకదం తంభక్తానాం అని ఎకదం తంఉపాస్మహే అని చదువవలెను.

హిమవంతుని పుత్రికైన పార్వతీ దేవి ముఖ పద్మాన్ని అహర్నిశలు వికసింపజేసే సూర్యుడు గజాననుడు. అట్టి స్వామి యొక్క అనేకమంది భక్తుల్లో ఒకడినైన నేను ఆ స్వామిని ఉపాసిస్తున్నాను. 

విఘ్నేశ్వరుడు తన అమృత హస్తములతో మనలనందరినీ దీవించు గాక . నిరాటంకమైన విజ్ఞానమును మనకుకలుగజేయుగాక . 

సేకరణ : చెఱుకు రామ్మోహన రావు గారు (2011 లో చేసిన రచన)  

Saturday 9 May 2020

తీర్థ యాత్రలకు వెళ్తున్నావా ? అయితే నువ్వు గుర్తుంచుకోవలసిన విషయాలు ...



కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శనను నిషేధించారు. ఈపాటికి జనులంతా ఛార్ ధామ్ యాత్రకు సిద్ధమయ్యేవారు. నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమల ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. తిరువణ్ణామలైలో పూర్ణిమ నాడు లక్షలమంది గిరి ప్రదక్షిణం చేస్తారు, కానీ మొన్న పూర్ణిమకు అసలు ఒక్క వ్యక్తిని కూడా అనుమతించలేదు. ఇలాంటిది తామెప్పుడు చూడలేదని అక్కడి జనులు చెబుతున్నారు.

✍️ ఇలాంటి సమయంలో నిజంగా మనం అసలు తీర్థయాత్రలు సక్రమంగా చేస్తున్నామా? అసలు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి మనకు అర్హత ఉన్నదా అని ప్రశించుకోవాలి.

👉 ముందుగా మనం వెళ్ళేది విహారయాత్ర (Tourism) కు కాదని, తీర్థయాత్రకని (Pilgrimage) గుర్తుపెట్టుకోవాలి. పుణ్యక్షేత్రాలు, నదీ తీరాలు విహారస్థలాలు, పిక్నిక్ స్పాట్‌లు కావు. మీరు విహార యాత్రకు వెళ్ళాలంటే ఊటి, కొడైకెనాల్, హార్స్లీహిల్ల్స్ వెళ్ళండి. తిరుమల, అహోబిలం, అరుణాచలం, శ్రీశైలం, ఛార్ ధామ్, అమర్‌నాథ్, కైలాస మనససరోవరాలు మొదలైనవి విహరాస్థలాలు కావు. 

👉 పుణ్యక్షేత్రాలు అడవి మధ్యలో ఉండవచ్చు, అంతమాత్రాన ప్రకృతిని ఆస్వాదించడానికి అక్కడకు వెళ్ళకండి. ప్రకృతిని చూసి ఆనందించండంలో తప్పులేదు గానీ మనం ఆ పేరుతో అక్కడ చేసేదంతా కాలుష్యమే. తిరుమలకు కాలినడకన వెళ్తున్నప్పుడు పక్కన చూస్తే అంతా ప్లాస్టిక్ కవర్లు, నీటి బాటిళ్ళు, స్ట్రాలు కనిపిస్తాయి. అరుణాచలం, అహోబిలంలో కూడా అంతే. తిరుమలలో ప్రతి రాయి వేదమే, ప్రతి చెట్టు ఒక ఋషి, దేవత, సిద్ధపురుషుడే అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అసలు ఆ కొండకే శేషాచలం అని పేరు. ఆ కొండ ఎవరో కాదు ఆదిశేషుడు. అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడు. అహోబిలం అంటే గరుత్మంతుడు. అయినా అలాంటి ప్రదేశాల్ని కూడా మనం కలుషితం చేస్తున్నాము. నిజానికి మనం కలుషితం చేయట్లేదు, దైవదూషణ చేస్తున్నాము, అక్కడి దైవాన్ని అవమానిస్తున్నాము. ఇక ఆ యాత్ర చేసి ఉపయోగం ఏమిటి ? పనిగట్టుకుని వెళ్ళి పాపం మూటగట్టుకోవడం ... 

👉 దేవుడు గుడి లోపలే ఉంటాడు అనుకోవడం మన సంస్కృతి కాదు. అంతటా దైవం వ్యాపించి ఉన్నా, అది మనం తెలుసుకోలేకున్నాము గనక, మనకు ఆ అనుభూతి పొందడానికి తీర్థయాత్ర చేస్తాము. తిరుమల అంటేనే వేంకటేశ్వరుడు, అహోబిలం అంటే నరసింహుడు, అరుణాచలం అంటేనే శివుడు. అక్కడ గుడిలో ఉన్నది ఒక స్థూల రూపమైతే, ఆ క్షేత్రమంతటా ఆ దైవం అధికశక్తితో వ్యాపించి ఉంది. ఛార్ ధామ్ విషయంలోనూ అంతే. మరి మనకు అలాంటి భావన లేనప్పుడు వెళ్ళడమెందుకు ? అక్కడి పరిసరాలను పవిత్రంగా ఉంచలేనప్పుడు ఇంట్లో ఉండి ప్రార్ధించడం ఉత్తమం కాదా ?

👉 అక్కడ మనం చేసే భౌతిక కాలుష్యం ఒక్క దోషమైతే, మానసిక కాలుష్యం ఇంకా పెద్ద దోషం. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు రాగద్వేషాలు, కోపతాపాలు పక్కన పెట్టి దైవస్మరణతో యాత్ర చేయాలి. కానీ మనం ఆ ప్రదేశాలకు వెళ్ళినా, అక్కడ కూడా కుళ్ళు, కుతంత్రాలు, కోపము, అహంకారం, దర్పము, అధికారము  ప్రదర్శిస్తాము. అది అక్కడి మానసిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.

👉 తీర్థయాత్రల పేరుతో వ్యాపారం తగదు. మన ధౌర్భాగ్యం ఏమిటంటే మనం పవిత్ర ప్రదేశాలను వ్యాపారీకరణ (commercialize) చేస్తున్నాము. అది ఎక్కువైతే ఆ క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బ తింటుంది, అక్కడ జరిగే ప్రార్ధనలు ఇంతకముందు వలె శీఘ్రఫలితాలను ఇవ్వలేవు. అక్కడున్న స్థానికులకు ఆ ఆలయాలు జీవనభృతిని కల్పిస్తూ ఉండవచ్చు గానీ ఇప్పుడు వందల కొద్దీ టూరిస్ట్ ట్రావేల్స్ తిర్థయాత్రల పేరుతో చేసేది వ్యాపారమే.. 

👉 గుర్తుంచుకోండి ! ఎక్కడైతే వ్యాపారం మొదలవుతుందో అక్కడ పవిత్రత తగ్గిపోతుంది.

👉 ఛార్ ధామ్, కైలాస మనస సరోవరం, అమర్‌నాథ్ మొదలైన క్షేత్రాలు హిమాలయాల్లో ఉన్నాయి. అవి తపోభూములు. మన పూర్వీకులైన ఋషులు అక్కడ తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. స్వార్ధము, కామక్రోదాదులు వదిలిపెట్టినవారు దర్శించాల్సిన పుణ్యభూములు అవి. భౌతికమైన కోరికలు అడగడం కోసం పనిగట్టుకుని అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలేదు. మనం కోరికలు అడగటానికి వెళ్ళాలనుకుంటే మనకు దగ్గర్లో అనేక క్షేత్రాలున్నాయి. అక్కడే అడగవచ్చు.

👉 తన యాత్రకు వచ్చే భక్తుడు అనేక కష్టనష్టాలను తట్టుకుని రావాలని, తద్వారా అతనికి మరణభయం తొలగుతుందని అమరనాథుడు చెప్పాడు. కానీ మనకు అసలు కష్టపడటం ఇష్టంలేదు. అందుకే అమర్‌నాథ్ యాత్రకు కాలినడక ఎందుకని హెలికాఫ్టర్‌లో వెళ్తున్నాము. దాని ఫలితంగా అక్కడి వాతావరణంలో వేడి పేరిగి ఆ లింగం ఇంతకముందు వలె ఎక్కువ సమయం దర్శనం ఇవ్వడంలేదు. త్వరగా కరిగిపోతోంది. అయినా మీరు ఎలా రావాలో ఆ క్షేత్ర దైవమే చెప్పినప్పుడు, నీకు నచ్చినట్లు నువ్వు వెళ్ళడమెందుకు ? దైవం ముందు అది బల ప్రదర్శన కాదా? కేదార్‌నాథ్ విషయంలోనూ అంతే. వీలుంటే నడుచుకుంటూ వెళ్ళు, లేదా అక్కడ గుఱ్ఱం ఎక్కు. నువ్వు హెలికాఫ్టర్ లో వచ్చి దణ్ణం పెట్టుకో అని నీకు కేధారనాథుడు చెప్పలేదు. శరీరం సహకరించనప్పుడు అసలు అలాంటి క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి ? అక్కడి ప్రకృతిని ఎందుకు కలిషితం చేయాలి ? 

👉 ఫలాన క్షేత్రం అడవిలో ఉందండీ, దానికి మంచి రోడ్డు లేదు, అక్కడ సెల్ టవర్ లేదు; బిర్యానీలు, కట్‌లెట్‌లు దొరకవు అంటూ నిట్టూర్పులు ఎందుకు ? సుఖం కావాలనుకుంటే ఇంట్లోనే ఉండి, టి.వి.లో చూడు. గుడికి వెళ్ళేది దైవంతో మాట్లాడటానికా? లేక అక్కడి నుంచి నీ పిల్లలతో ముచ్చట్లు పెట్టుకోవడానికా ? అన్ని సౌకర్యాలు కావాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఉండచ్చు కదా ? 
 
👉 తిరుమల కొండ మీద కూడా ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించి చేసే ఆహారలు అమ్ముతున్నారు. మనకు సాత్త్వికాహరం అని ఒకటుంది. తీర్థయాత్రల్లో తామసిక, రాజసిక ఆహారాలు తినకూడదు. కానీ మనకు తిరుమలలో కట్‌లెట్, ఫ్రైడ్‌రైస్ కావాలి. కేధారనాథ్‌లో అన్నం కావాలి. అంటే మనం ఎక్కడకు వెళ్ళినా, మనకు సకల సౌకర్యాలు ఉండాలి, ఆహారవిహారాల్లో నిగ్రహం పాటించము. అక్కడ దొరికిందేదో సర్దుకుని తినాలని ఉండదు. కానీ మన పూజలు ఫలితమివ్వాలి, యాత్రలు సఫలీకృతం కావాలి. ఎలా సాధ్యం ? 

👉 నదిలో స్నానం చేయాలంటే సబ్బు వాడి నదిని కలుషితం చేస్తావా ? పూజించి దీపాలు వదిలి, అదే నదిలో ఆ పూజ అయిపోగానే ప్లాస్టిక్ కవర్లు విసిరేస్తావా ? కానీ పూజకు ఫలితం వచ్చేయ్యాలా ? మరి చేసిన పాపానికి ?  

👉 ఇప్పుడు హిందూ క్షేత్రాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. పదువులు దక్కని వారందరికీ ఆలయాల్లో పదువులు ఇస్తున్నారు. అక్కడ కూడా రాజకీయాలు. అది మన ఖర్మ.

👉 ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతను ప్రభుత్వాలు రక్షించాలి అను నినదించకు. నువ్వు హైందవుడివే కదా ... నీ కర్తవ్యమేంటో అది నువ్వు నిర్వర్తించు. నీ తరఫున పుణ్యక్షేత్రాలు, తీర్థస్థలాల పవిత్రతను కాపాడు. గుర్తుంచుకో ! పవిత్ర ప్రదేశాల్లో మనం చేసే ఏ పనైనా అనేక రెట్ల ఫలితం ఇస్తుంది. అది పాపం అయినా, పుణ్యం అయినా ... 

బహుసా మన పద్ధతి బాగోలేకనే కోవిడ్-19 పేరున భగవంతుడు మనకు తన దర్శనం ఇవ్వడం మానుకున్నాడేమో ?! ఆలోచించండి....

Friday 8 May 2020

స్వామి చిన్మయానంద సూక్తి



Everything will straighten itself in time. Only we want patience, faith, and sincere self-surrender. Lord is Great; He knows best the purity of every thought, action and their motives... The future progress shall prove our inner worth.

- Swami Chinmayananda

Thursday 7 May 2020

పుస్తకపఠనం గురించి భగవాన్ రమణ మహర్షి



Reading of Sastras and becoming pandits may give fame to a person but they destroy the peace of mind which is necessary for the seeker of truth and deliverance. A Mumukshu (a seeker of deliverance) should understand the essence of the Sastras but should give up the reading of Sastras as that is inimical to dhyana (meditation). It is like accepting the grain and discarding the chaff. There will be many big almirahs with many books. How many of them can be read? There are so many books and religions that one life is not enough to read all the books relating to even one religion. Where then is the time for practice? The more you read, the more you feel like reading further. The result of all that is to go on discussing with other people who have books and spend time thus, but
that will not lead to deliverance.

- Bhagavan Ramana Maharshi

Wednesday 6 May 2020

స్వామి శివానంద సూక్తి



When all kinds of useless thoughts and emotions trouble you much, be indifferent (Udasina). Say to yourself: “Who am I?” Feel: “I am not the mind. I am the Atman, the allpervading Spirit, Suddha Satchidananda. How can emotions affect me? I am Nirlipta, unattached; I am Sakshi, witness of these emotions. Nothing can disturb me.” When you repeat these suggestions of Vichara or Vedantic reflection, the thoughts and emotions will die by themselves.

- Swami Sivananda

Monday 4 May 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (13) - తోలు వస్తువులు

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (13)

ఇప్పుడు మనమంతా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో తోలు (లెధర్) వాడకాన్ని తగ్గించాము, లేదా ఆపివేశాము. అసలు ముందు లెధర్ ఎలా తయారవుతుందో తెలుసుకుని, అప్పుడు మన సంస్కృతిలో దాని స్థానం ఏంటో చూద్దాము.

లెధర్ పరిశ్రమలో తోలు కోసం పంది, పాము, మేక, గేదె, మొసలి, ఆవు, కంగారు మొదలైన అనేక జంతువులు వధించబడతాయి. కానీ తోలు కోసం అత్యధికంగా వధించబడేది ఆవు. ఇది అందరూ అంగీకరించే సత్యము. ఒక్క అమెరికాలోనే ఏటా తోలు కోసం 13.9 కోట్ల అవులు, దూడలు, మేకలు, గొఱ్ఱెలు వధించబడతాయి.

గోవు నుంచి తోలు తీసే ప్రక్రియ మీకు తెలుసా?

గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. బయట 40 డిగ్రీలు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాము. మరి దానికి 5 రెట్లు వేడి. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈ విధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వొలచటానికి సులభమౌతుంది. కానీ, ఈ సమయంలో అవి (గోవులు) ఎంతో భయంతో బిక్కచచ్చిపోయి ఉండే హృదయ విదారకమైనస్థితి. గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు, ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం... భూమి మీద జాలి, దయ, కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం...రాక్షసత్వానికి పరాకాష్ట.

ఆ తర్వాత గొలుసులతో ఉన్న కొక్కాలకు ఒక్కొక్క గోవును తలక్రిందులుగా ఒక్కొక్క కాలుని ఆ కొక్కాలకు తగిలించి వేలాడదీస్తారు. రక్తం ఏకధాటిగా ఏరులై పారుతున్నా గోవు పూర్తిగా చనిపోదు. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టిపడుతుంది. అటువంటి చర్మము మార్కెట్టులో తక్కువ ధర పలుకుతుంది. కాని ప్రాణమున్నప్పుడే వొలిచిన గోవుల చర్మము చాలా పలుచనగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్టులో అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. ఒకప్రక్క గోవుల మెడలు సగం తెగి రక్తం కారుతుంటే, మరొకప్రక్క గోవుల కడుపులో రంధ్రం చేసి, అందులోకి అతివేగంగా గాలిని జొప్పిస్తారు. అప్పటికి గాని గోవు లోపలి భాగాలు ఉబ్బి, చర్మం వొలవటం అనే పక్రియ సులభతరం కాదు. చర్మం పూర్తిగా వొలిచిన తర్వాత బ్రతికి ఉన్న ఆ గోవులను నాలుగు భాగాలుగా (తల, కాళ్లు, మధ్యభాగము, తోక) ముక్కలు చేస్తారు. అప్పుడు వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తారు.

పాములను చంపి తోలు తీసే ప్రక్రియ - బ్రతికి ఉన్న పామును చెట్టుకు మేకుతో కొట్టి, శరీరం మీద చర్మాన్ని నిలువునా వొలిచేస్తారు.

గర్భం ధరించిన ఆవులు, ఆడగొఱ్ఱెల కడుపులో ఉండే దూడల చర్మం 'విలాసం' (luxury leather item) గా చెప్పబడుతోంది. అందుకే అనేక ఆవులు మరియు గొఱ్ఱెలకు కృతిమ గర్భధారణ చేయించి, కావాలని గర్భవిచ్ఛితి (అబార్షన్) చేస్తారు.

తోలు కోసం ప్రత్యేకమైన ప్రదేశాల్లో మొసళ్ళను పెంచుతారు. వాటి జీవితకాలం ఎక్కువే అయినా, 2-4 ఏళ్ళు రాగానే వాటిని వధశాలకు పంపిస్తారు. అవి బ్రతికి ఉండగానే వాటిని సుత్తి, గొడ్డలి వంటి వాటితో కొట్టి కొట్టి చంపుతారు. చాలా సందర్భాల్లో సజీవంగానే వాటి తోలు ఒలుస్తారు. ఆ తర్వాత అవి చాలా సమయం వేదన అనుభవించి మరణిస్తాయి.

ప్రపంచంలో ఈరోజు అధిక హింసను ప్రేరేపించే పరిశ్రమల్లో డైరి ఒకటి. ఎప్పుడైతే ఆవు వట్టిపోతుందో (పాలు ఇవ్వడం ఆపివేస్తుందో) అప్పుడు దాన్ని వధశాలకు తరలిస్తారు. చాలా సందర్భాల్లో డైరీ పరిశ్రమలో ఆవుకు ఆడదూడ పుడితే దాన్ని రక్షిస్తారు. అదే కోడె దూడ పుడితే, దాన్ని మరుక్షణమే వధశాలకు పంపుతారు. అప్పుడే పుట్టిన లేగదూడల మాంసానికి, వాటి తోలుకు ఉన్న డిమాండే దీనికి కారణం. కొన్ని సందర్భాల్లో వీటి మాంసాన్ని చాక్లెట్స్‌లో కలుపుతారట.  మనం ఇప్పుడు వ్యవసాయంలో ఎద్దుకు బదులు కాలుష్యం విడుదల చేసే ట్రాక్టర్ వాడుతున్నాము. కనుక ఎడ్ల అవసరం తగ్గింది, ఇక ఎడ్లను ఎవరు పెంచుతారు? ఎడ్ల వధకు ఇది కూడా ఒక కారణం.

ఇలా మనకు తోలు ఉత్పత్తులు రావాలంటే దాని వెనుక ఎంతో హింస ఉంటుంది. అలాంటి హింసతో కూడిన వస్తువులను ఆలయంలోకి తీసుకెళ్ళవచ్చా? అది మృతదేహం కాదా ? మన గోవును పూజిస్తాము, నాగదేవతను పూజిస్తాము, కాలభైరవుడిని పూజిస్తాము. మీరు వాడే తోలు వస్తువుల్లో గోవు, పాము, కుక్క తోలు ఉండదని మీకు ఖచ్ఛితంగా చెప్పగలరా ? లేదు కదా ! తోలు వస్తువులను వాడటమంటే జంతువధను సమర్ధించడం కాదా ? గోహత్యా పాతకం సంగతేంటి? 

ఒకప్పుడు మనవాళ్ళు తోలు చెప్పులను వాడేవారు వేరే ప్రత్యామ్నాయం లేక. అప్పటికీ శుభాశుభకార్యాల్లో ఎక్కడా చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకుని వెళ్ళవద్దనే చెప్పారు. కానీ ఈరోజు మనం వాడే సెల్ఫ్‌ఫోన్ కవర్, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్ మొదలుకుని ఇంట్లో ఉపయోగించే సోఫాల వరకు విలాసం, పరపతి పేరుతో తోలు వస్తువులు వాడుతున్నాము. దేవతలు ఆవాహన చేసిన ఆలయాలు, యజ్ఞయాగాదుల వంటివి జరిగే పవిత్ర ప్రదేశాలకు అలాంటివి ధరించి, తీసుకుని వెళ్ళడం ఎంతవరకు సమంజసం? తోలు ఉత్పత్తులను ప్రోత్సహించడమంటే హింసను సమర్ధించడమే. ఇప్పుడు తోలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలు వచ్చాయి. వాటిని వాడవచ్చు కదా. ఆలోచించండి.

For more information :
https://www.peta.org/issues/animals-used-for-clothing/animals-used-clothing-factsheets/leather-animals-abused-killed-skins/
http://thegreenvegans.com/why-leather-is-one-of-the-most-polluting-and-cruel-products/
https://www.bornfreeusa.org/2002/09/15/slaughtered_and_skinned/

Sunday 3 May 2020

ఆయుర్వేదం - ఆహారం స్వీకరించే పద్ధతి



మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (12) 

ఆయుర్వేదం  - ఆహారం స్వీకరించే పద్ధతి 

మన ఆచారవ్యవహారాలను తులనాడటం చాలా సులభం. నోటికి ఏది వస్తే అది అది అనచ్చు. కానీ వాటి వెనుకనున్న శాస్త్రీయతను అర్ధం చేసుకుంటే వాటిని నెత్తిన పెట్టుకుంటాము. అవి ఆచరణలోకి రావడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో, కాలక్రమంలో వాటి మీద ఎంత పరిశోధన జరిగి ఉంటుందో ఆలోచిస్తే మతిపోతుంది.

ముందు మజ్జిగన్నం లేదా పెరుగున్నం తిని, ఆ తర్వాత సాంబారు, చివరలో కూర, పచ్చడి కలుపుకుని తినకూడదా? ఈ సందేహం మీకు ఎప్పుడూ రాలేదా? ఏ ఆహారం ఎలా, ఎప్పుడు స్వీకరించాలి అనేది ఆయుర్వేదం చెబుతుంది. ఆకలి కలిగినప్పుడు కడుపులో ఉదజహరికామ్లము (హైడ్రోక్లోరిక్‌ యాసిడ్) ఉత్పన్నమై, ఆహారన్ని పచనం చేయడానికి సిద్ధమవుతుంది. ముందుగా గట్టిగా ఉన్న పదార్ధాలను కలుపుకోవాలి, అంటే కూర, పొడి వంటివి. ఎందుకంటే ఈ ఉదజహరికామ్లము మనం తినే ఆహారాన్ని పచనం (అరిగిస్తూ) పలుచన (dilute) అవుతుంది. కనుక మొదట కూరను కలుపుకుంటాము, పొడి ఎండు పదార్ధము కనుక దానిలో తేమశాతం తక్కువ గనక మొదటి ప్రాధాన్యం దానికి ఇచ్చారు. ఆ తర్వాత కూర, పప్పు. కూర కంటే పప్పు కొంచం పలుచగా ఉంటుంది (ఇక్కడ గోదావరి జిల్లాల వారైతే ముందు పప్పు, ఆ తర్వాత కూరా కలుపుకుంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారు ముందు కూర, ఆ తర్వాత పప్పు కలుపుకుంటారు. ఈ నాలుగుజిల్లాల వంట పద్ధతిలో స్వల్ప తేడాలు కూడా ఉంటాయి).  వీటి తర్వాత వచ్చేది సాంబారు లేదా పప్పుచారు. ఆ తర్వాత రసము, పాయసము, చివరలో మజ్జిగ. మజ్జిగ అనేది చాలా పలుచని పదార్ధము. అంటే నీ ఉదరంలో జీర్ణం చేసే ఆమ్లాలు పలుచున అవుతున్న కొద్దీ, నువ్వు స్వీకరించే ఆహారం పలుచున అవుతూ వస్తుంది.

దీని గురించి కంచి పరమాచార్య స్వామి వారు ఇలా అన్నారు - "విదేశాల్లో ఆహారం అనేది చివరలో ఫలాహారముతో ముగుస్తుంది, దాన్ని వాళ్ళు డెజెర్ట్స్ (desserts) అంటారు. దక్షిణభారత దేశంలోని ఆహారపద్ధతిలో, రసం కలుపుకుని తిన్న తర్వాత మొదటలో విస్తరిలో వడ్డించిన తీపి పదార్ధాలు తింటారు. ఆ తర్వాత చివరగా మజ్జిగను కలుపుకుంటారు. తీపి పదార్ధాలు మన పళ్ళకు (దంతములకు) హాని కలిగిస్తాయి. మజ్జిగ యొక్క రుచి పులుపు. చివరలో పులుపు మరియు ఉప్పు కలిగిన మజ్జిగను స్వీకరించడంవలన దంతాలకు బలం చేకూరుతుంది. ఈ పద్ధతిని అమెరికెన్ ఆహార శాస్త్రజ్ఞుడు సైతం కొనియాడారు. పంటినొప్పి వచ్చినప్పుడు వేడినీటితో పుక్కిలిస్తాము. విదేశీయులకు చిన్న వయస్సులోనే పంటి సమస్యలురాగా, మనకు మాత్రం జీవితాంతం వరకు బలమైన దంతాలు ఉండటంలో రహస్యం ఇదే."

అదేగాక ఆయుర్వేదంలో మజ్జిగ గుణాలను బాగా కొనియాడారు. మజ్జిగ అనేది ఆయుర్వేదంలో విషహారిణి. మనం తిన్న అన్నంలో ఏదైనా విషాలు కలిస్తే, వాటిని మజ్జిగ హరిస్తుంది. పైగా జీర్ణశక్తిని పెంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది. అందుకే మనము మజ్జిగతో ఆహారం ముగిస్తాము.

కేవలం ఒకే రకమైన ఆహారం - ఉదాహరణకు కేవలం పచ్చడి అన్న, కూర అన్నం, మజ్జిగ అన్నం - స్వీకరించమని ఆయుర్వేదం చెప్పదు గతి లేకపోతే తప్పించి. ఆహారంలో ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆయుర్వేదం చెబుతుంది. కనుక ఎప్పుడైనా పిల్లలు అడిగితే, వారికి మన పూర్వీకులు అందించిన ఈ పద్ధతిని వివరించి, దాని వెనుకనున్న శాస్త్రీయతను చెప్పండి.

రాజీవ్ మల్హోత్రా గారి స్వల్పకాలిక course ద్వారా లాక్‌డౌన్ని సద్వినియోగపరుచుకోండి.


మన మీద యుద్ధం, కానీ శత్రువు కనిపించడు. ఆయుధం మన చేతికే ఇచ్చాడు. వాడు ఇచ్చిన ఆయుధాలతో మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాము. తెలిసీతెలియక ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతున్నామనుకునే వాళ్ళు సైతం, విచ్ఛినం చేసే ప్రయత్నాల్లో భాగవమవుతున్నారు. అవును మీరు చదివింది నిజమే.... ఇప్పుడు చాలామంది పరిస్థితి అలానే ఉంది.

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు. ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది. ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా (Rajiv Malhotra) గారు 15 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

మరి మనకు కావల్సింది బౌద్ధిక క్షత్రియులు (intellectual kshatiryas). అందుకోసం ఈ లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రాజీవ్ మల్హోత్రా గారి ఆలోచన. అందుకే బౌద్ధిక క్షత్రియ (intellectual kshatiryas) అనే స్వల్పకాలిక పాఠ్యక్రమాన్ని (short term course) ని రూపొందించారు. ₹ 500/- రూపాయల నామమాత్రపు ధరతో దీన్ని అందిస్తున్నారు. చివరలో సర్టిఫికెట్ కూడా అందిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి.

క్రింది పేర్కొన్న లింక్‌లో నమోదు చేసుకోవచ్చు.

Know what is happening in your own backyard by signing up for it today.



Friday 1 May 2020

పని సంస్కృతి నేర్పిన భగవాన్ రమణ మహర్షి

భగవాన్ ప్రతీ రోజు తెల్లవారుఝామున 3 గంటలకు లేచి తమ కాల కృత్యాలు తీర్చుకున్నాక వంటగది లోకి వెళ్లి చట్నీ రుబ్బడం చేసేవారు ఉదయము అల్పాహారం కొరకు.

ఇలా రోజూ చేస్తుండడము వల్ల భగవాన్ చేతికి బొబ్బలు వచ్చినవి. ఇది గమనించిన విశ్వనాథ స్వామి అనే భక్తుడు ఎన్నో సార్లు భగవాన్ కి నచ్చ చెప్పేవారు చేతికి బొబ్బలు పెట్టుకుని ఇలా రుబ్బడము వంటి పనులు చేయవద్దు అని. కానీ భగవాన్ ఆ మాటలు లెక్క చేయకుండా రోజు వంట గదిలో ఈ చట్నీ రుబ్బడము చేసేవారు.

ఇంక ఇది చూడలేని విశ్వనాథ స్వామి ఒక రొజు భగవాన్ కంటే ముందే లేచి చట్నీ రుబ్బడము, మరియు భగవాన్ ఏయే పనులు చేసేవారో అవి అన్నీ పూర్తి చేసారు. వంట గది నుండి బయటికి రాగానే భగవాన్ ఎదురు పడి తన పనిని ఎందుకు చేసావు అని నిలదీశారు. దానికి విశ్వనాథ స్వామి కంట నీరు పెట్టుకుని "భగవాన్ మీరు బొబ్బలు ఎక్కిన చేతితో రుబ్బడము నేను చూడలేక పోతున్నాను" అన్నాడు .

అప్పుడు భగవాన్ అన్నారు "ఇంతకు ముందు నేను బిక్షకు వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆశ్రమము వారు నాకు ఉచితముగా భోజనము పెడుతున్నారు. అందుకే నేను వంట గదిలో ఏదో ఒక పని చేస్తుంటాను. ఈ రోజున నువ్వు నా వంతు పనిని చేసావు కావున కనీసము నీ ధోతీని ఇవ్వు ఉతికి పెడతాను" అన్నారు. ఇది విన్న విశ్వనాథ స్వామి కన్నీళ్లు పెట్టుకుని భోరున ఏడ్చేసాడు.

-----

ఏ పని చేయకుండా జీతం తీసుకోవడం, తిని కూర్చోవడం తప్పని లోకానికి చాటి, పని సంస్కృతి నేర్పారు భగవాన్ రమణ మహర్షి.