Thursday 31 October 2019

నీమ్ కరోలి బాబా సూక్తి


Whatever may be guru – he may be a lunatic or a common person. Once you have accepted him, he is the lord of lords.

- Neem karoli Baba

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 21 వ భాగము

అరుణాచలేశ్వరుని పాదాలు 


స్త్రీలకు హెచ్చరిక

ఇటువంటి దొంగ గురువులు మరియు కుహనా ఆచార్యుల వలన స్త్రీలు సులభంగా మోసపోతారు. స్త్రీలు చాలా నిష్కపటమైన మనస్కులు మరియు దేనినైనా సులభంగా నమ్ముతారు. చక్కని సంగీతము మరియు స్వరమాధుర్యానికి వారు అతి సులభంగా ఆకర్షితులవుతారు. మధురమైన శబ్దాలకు ఆకర్షించబడి అతి త్వరగా బాధితులు అవుతారు. ఈ దొంగ గురువులు ఎల్లప్పుడూ మామూలు స్త్రీలను మోసం చేయాలని చూస్తారు. వారు వీరిని సులభంగా ప్రభావితం చేసి ఎటువంటి కష్టంలేకుండా వలలో పడేసి వాడుకుంటారు. వారిని పనిముట్లుగా చేసుకుంటారు. వారిని దోచుకుని వీరి కడుపునింపుకున్టారు మరియు ఖరీదైన పట్టు వస్త్రాలు మరియు గొప్ప చెప్పులు వేసుకుని తిరుగుతారు. స్త్రీలను శిష్యురాలిగా చేసుకోమని శాస్త్రాల్లో గృహస్థులలకు ఎక్కడా కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు. మంచి జీవనం మరియు సంపాదన కోసం ఎవరైతే స్త్రీలను ఉపయోగించుకుంటారో, వారు అశుద్ధంలో జీవించే పురుగులు వంటి వారు. అలాంటి మూర్ఖులకు ప్రాయశ్చిత్తం లేదు. వారిని నిర్దయగా రౌరవము మరియు మహారౌరవంలో పడవేస్తారు.

దేవీ స్వరూపులారా! మీ కళ్ళు తెరవండి. మీరంతా ఇప్పుడు చదువుకున్నారు. మీ బుద్ధిని ఉపయోగించండి. కేవలం ఉపన్యాసాలను లేదా సంగోతాన్ని విని మోసపోకండి. గురువులుగా ప్రదర్శించుకునే వారి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఒక గృహస్థును ఎన్నడు నీ గురువుగా చేసుకోకండి. అతడి నుంచి దీక్ష పొందకండి. ఒకవేళ అలా చేస్తే చివరకు మీరు చెడు పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు ఎంచుకునే వ్యక్తి ఉత్తమమైన, మచ్చలేని వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అతడు పూర్తి నిస్వార్థంగా ఉంటూ కామము మరియు దురాశ నున్చి విముక్తుడై ఉండాలి. అన్ని రకముల భౌతిక ప్రలోభాలు/ కళంకాల నుంచి అతడు విముక్తుడై ఉండాలి. అతనికి వేదము మరియు గ్రంథముల జ్ఞానముండాలి. అతనికి ఆంతరంగికమైన ఆధ్యాత్మిక బలము మరియు మిమ్మల్ని ఉద్ధరించి, ఆధ్యాత్మికపథంలో నడుపుటకు ఆత్మ సాక్షాత్కారము కలిగిన వాడై ఉండాలి.

ఒక గురువు గురించి సరైన పరీక్ష చేయకుండా లేదా అతడిని అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తిని గురువుగా ఎంచుకుంటామని భార్యలు అంటే భర్తలు అనుమతించకూడదు. నిజంగా ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించాలి అని వారు భావిస్తే, ఆ వ్యక్తితో ఎంతో కాలం ఉన్న తర్వాత, అతడిని జాగ్రత్తగా పరిశీలించి, విచారించి అప్పుడు స్వీకరించాలి. భార్య భర్తకు వేరువేరు గురువులు ఉండకూడదు. గొడవలు జరుగుతాయి. వారిరువురికీ ఒకే గురువు ఉండాలి.

వివిధ మత శాఖలు మరియు విధానాల యొక్క ప్రమాదం

చైతన్య మహాప్రభువు, గురు నానక్ మరియు దయానంద స్వామి మొదలైన వారంతా సార్వత్రిక, సర్వజన సమ్మతమైన, ఘనమైన జీవులు. వారి యొక్క భోజనం బోధనలన్నీ ఉన్నతమైనవి మరియు విశ్వజనీనమైనవి. వారు ఏనాడు తమ సంత సొంత శాఖలను గాని మతాలను గాని ఏర్పరచాలని అనుకోలేదు. వారు కనుక ఇప్పుడు జీవించి ఉంటే వారిఅనుచరులు చేస్తున్నవాటి చూసి వారు ఎంతగానో ఏడ్చేవారు. అనుచరులే ఎంతో తీవ్రమైన తప్పులను మరియు దోషాలను చేస్తారు. వారు ఏనాడు విశాలమైన హృదయాన్ని వృద్ధి పరుచుకోలేదు. వారు సంకుచిత మనస్తత్వం గలవారు. పగలు, కలహాలు, వర్గ విభేదాలు మరియు అన్ని రకాల ఇబ్బందులను వారు సృష్టిస్తారు.

అలాగే ఆధ్యాత్మికగురువు కూడా తనదైన సొంత మార్గాన్ని ఏర్పరుచుకోకూడదు. అతడిని ఎంతో దీర్ఘమైన అంతర్ దృష్టి ఉండాలి. ఒక కొత్త శాఖను ఏర్పరచడం అంటే ప్రపంచ శాంతికి విఘాతం కలిగించడానికి ఒక కొత్త కారణాన్ని సృష్టించడం. అతడు దేశానికి చేసే మేలు కంటే హానియే ఎక్కువ. అతడు విశాలమైన సూత్రాలు మరియు బోధనలతో, కూడిన ఇతర మతాల సూత్రాలు మరియు బోధనలతో విభేధించని మరియు విశ్వజనీనంగా అంగీకరించబడి, అనుసరించదగిన వ్యవస్థను ఏర్పరచవచ్చు.

Wednesday 30 October 2019

ఆనందమాయి మా సూక్తి



When by the flood of your tears, the inner and the outer have fused into One, you will find Her whom you sought with such anguish, nearer than the nearest, the very breath of life, the very core of every heart.

- Anandamayi Ma

Tuesday 29 October 2019

సద్గురు శివాయ శుభ్రమునీయ స్వామి సూక్తి



When the devas within your home see you performing sadhana each day, they give you psychic protection.

- Satguru Sivaya Subramunia Swami

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 20 వ భాగము



ఏడవ అధ్యాయము
గురువు అవ్వాలని పిచ్చి - భయంకరమైన రోగము

జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః|
పశ్యన్నపి చన పశ్యతి మూఢో ఉదరనిమిత్తం బహుకృతవేషః||

తాత్పర్యము - ఒకరు పెద్ద జడలు పెంచుకుంటారు. ఇంకొకరు తలను పూర్తిగా గొరిగించుకుంటారు. ఇంకొకరు కాషాయం కడతారు. దర్శించామని చెప్పుకున్న్నా, దాన్ని దర్శించని మూఢులు. కడుపు నింపుకోవడం కోసం ఒక వ్యక్తి ఎలాంటి వేషం ధరిస్తే ఏమి లాభము?

- ఆదిశంకరాచార్యులు

భారత దేశము అద్వైత సిద్ధాంతాన్ని ఇచ్చిన పవిత్ర భూమి. సకల జీవులలో ప్రాణం మరియు మరియు చైతన్యం ఒకటేనని చాటి చెప్పిన శ్రీ శంకరాచార్యులు, దత్తాత్రేయయుడు, వామదేవుడు మరియు జడభరతుడు పుట్టిన ఈ భూమి ఈనాడు అనేక వర్గాలుగా విభజించబడింది. ఎంతటి దయనీయ స్థితి. ఈరోజు నీవు చూస్తున్నది ఎంత శోకనీయమైన స్థితి. ఒక సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువుల లెక్కించవచ్చునేమో కానీ ఈనాడు భారతదేశంలో ఉన్న మాతాల యొక్క సంఖ్యను లెక్కించడం ఎంతో కష్టం. ప్రతిరోజు భారతదేశంలో పుట్టగొడుగుల ఏదో ఒక 'ఇజాలు' పుట్టుకు వచ్చి, ఇంతకుముందు నుంచి ఇక్కడ ఉన్న దాన్ని పెరికి వేయాలాని చూస్తున్నాయి. నిరాశావాదులు ఉన్నదానిని విడిచిపెడుతున్నారు మరియు అంతటా వైరుధ్యం రాజ్యమేలుతోంది. మతశాకల మధ్య యుద్ధం నడుతూనే ఉంది. కలహాలు మరియు చీలికలు, న్యాయస్థానాల్లో దావా/ వ్యాజ్యాలు, వాగ్వాదాలు, కుమ్ములాటలు మరియు కుట్రలు అంతటా కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా సాంతి, సామరస్యం అనేదే లేదు. ఒక గురువు యొక్క శిష్యులు మరొక గురువు యొక్క శిష్యులతో రోడ్ల మీద మరియు వ్యాపారకేంద్రాల్లో గొడవకు దిగుతున్నారు.

దొంగ యోగులు మరియు నటించే గురువులు

హార్మోనియం మీద కొద్దిగా పట్టు మరియు వాగ్ధాటి కల యువకుడు, ఒక స్టేజి ఎక్కి కొన్ని సంవత్సరాల్లో తనను తాను ఒక గురువుగా ప్రదర్శించుకుని, కొన్ని చెత్త కరపత్రాలు మరియు పాటలు రాసి, తనదైన సొంత శాఖను ఏర్పరుచుకుంటాడు. భారతదేశము నిండా ఇంకా ఇటువంటి విస్తారముగా మూర్ఖత్వం ఉంది మరియు ఏ వ్యక్తి అయినా తక్కువ సమయంలో అనుచరులను పొందగలరు.

ఒక యువకుడు ఆసనాలు, బంధాలు మరియు ప్రాణాయామం మీద కొద్దిపాటి శిక్షణ పొంది, ఒక భూగృహం లోని గదికి రహస్యంగా 40 రోజులకు సరిపడా కొన్ని ఆహార పదార్థాలను ముందే తీసుకెళ్లి, తలుపు మూసేసుకుని, కూర్చుటాడు. ఆకలి మరియు దాహార్తిని నశింపచేసే కొన్ని వ్రేళ్ళను కొన్ని రోజులపాటు తింటాడు. అతను ఆ గృహములో ఏమి చేస్తున్నాడో భగవంతునికే తెలుసు. అతడు ఆ గదిలో నిద్రిస్తాడు. ఇన్నాళ్లు సమాధిలో ఉన్నట్టుగా నటించి బయటకు వస్తారు. ఇది కొద్దిపాటి తితిక్షను ఆచరిస్తేనే ఒనగూరుతుంది. అతని వాసనలను మరియు సంస్కారాలు ఏ మాత్రం నశించలేదు. అతడు ఈనాటికీ అదే భౌతిక ప్రపంచపు మనిషి. అతడు డబ్బు సంపాదించుటకు మరియు శిష్యులను తయారు చేసుకొనుటకు, అనేక చోట్ల సంచరిస్తాడు. అతడు యోగి అయిన గురువుగా నటిస్తాడు. అజ్ఞానులైన భౌతికమానవులు సులభంగా మోసపోతారు. ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే ఇలా బాధ్యతారాహిత్యంగా మూర్ఖత్వపు పనులు చేసే ఇటువంటి యువకుల వలన, నిజమైన సమాధిలోకి వెళ్ళే నిజమైన యోగుల మిద జనులు విశ్వాసం కోల్పోతారు.

ఈ యువకులు యోగము మరియు ఆధ్యాత్మిక జీవనం యొక్క సారాన్ని ఏమాత్రము గ్రహించలేదు. సమాధి అనేది బహిరంగంగా రోడ్ల మీద ప్రదర్శించేది కాదు. సమాధి అనేది ఒక దివ్యమైన చర్య. సమాధి అనేది ఒక ఇంద్రజాలము లేదా మాయ కాదు. ఇటువంటి చేష్టలు అన్ని చోట్లా వ్యాపిస్తున్నాయి. ఎందరో యువకులు ఇటువంటి వాటిని ప్రదర్శిస్తున్నారు.

ఇటువంటి దొంగ యోగులు, నకిలీ గురువులు మరియు మోసకారులు సమాజానికి భారమైన వారు మరియు చీడ పురుగుల. వారు దేశానికి ప్రమాదకారులు మరియు అజ్ఞానులు, సులభంగా నమ్మేవారి సంపద పట్ల రాబందుల వంటి వారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండండి.

కొందరు వారు ముసలివారు అయిన తర్వాత సేవ పొందుట కొరకు శిష్యులను ఏర్పరుచుకుంటారు. వారు తమ శిష్యులకు యొక్క ఉన్నతి గురించి పట్టించుకోరు.

Monday 28 October 2019

స్వామి శివానంద సూక్తి



Fewer the thoughts, greater the peace. Remember this always. A wealthy man who is engaged in speculation in a big city and who has a large number of thoughts has a restless mind in spite of his comforts, whereas a Sadhu who lives in the cave of the Himalayas and who is practicing thought-control is very happy in spite of his poverty.

- Swami Sivananda 

Sunday 27 October 2019

స్వామి చిదానంద సూక్తి



We have the conception of Mahalakshmi in Her eightfold forms and the Hindus refer to Her as the Ashta-Lakshmi.In Her eightfold aspects as Dhaanya-Lakshmi, Dhana-Lakshmi, Dhairya-Lakshmi, Vidya-Lakshmi, Jaya-Lakshmi, Veerya-Lakshmi, Gaja-Lakshmi and Saubhagya-Lakshmi, Mother is worshipped in the form of life-giving corn, of wealth, of Apara-Vidya (knowledge of arts and sciences which is very essential if one must live a civilised and happy life—all knowledge pertaining to this material universe is Mother in the form of Vidya), of Dhairya (to utilise wealth and knowledge one must have enterprise), of Veerya (vitality or virility), of Gaja (royal power or the power of royalty), of Jaya (the power of victory over adverse circumstances, obstacles that stand in the way of a happy, prosperous and successful life) and of Saubhagya (prosperity in general). In these eight aspects, the power of the nourisher and sustainer Lakshmi is manifest in the world of human beings.

- Swami Chidananda

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 19 వ భాగము




ఒకసారి దత్తాత్రేయుడు అడవిలో ఆనందంగా సంచరిస్తున్న సమయంలో, యదు అనే పేరు గల రాజును కలిశారు. ఆయన దత్తాత్రేయుడు ఎంతో ఆనందంగా ఉండడం చూసి, ఆయన యొక్క ఆనందానికి కారణం అయిన రహస్యాలు మరియు ఆయన గురువు గారి పేరు అడిగారు. దత్తాత్రేయుడు తనకు ఆత్మ మాత్రమే గురువు అని, అయినప్పటికీ 24 వ్యక్తులు జీవుల నుంచి జ్ఞానం పొందాలనని, అందువల్ల వారు తన గురువులని చెప్పారు.

దత్తాత్రేయుడు 24 మంది గురువుల పేర్లు మరియు వారి నుంచి తాను ఏమి నేర్చుకున్నారనేది చెప్పారు.

దత్తుడు ఇలా చెబుతున్నారు: "నా 24 మంది గురువులు - 1.భూమి 2.నీరు 3.గాలి 4.అగ్ని 5.ఆకాశము 6.చంద్రుడు 7.సూర్యుడు 8.పావురము 9.కొండచిలువ 10.సముద్రము 11. మిణిగురు పురుగు 12.తేనెటీగ 13. బాటసారి లేదా తేన పట్టువాడు 14.ఏనుగు 15.జింక 16.చేప 17. పింగళ అనే నాట్యకారిణి 18.కాకి 19.పసిపిల్లవాడు 20.యుక్త వయసులో ఉన్న కన్య 21.సర్పము 22.బాణాములు తయారు చేయువాడు 23. సాలీడు 24.భ్రమరము/ తుమ్మెద

1. సహనం కలిగి ఉండటం మరియు పరులకు మేలు చేయటం అనేది నేను భూమి నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మనిషి తనకు ఎంత అపకారం చేసినా, ఎంత హాని చేసినా భూమి భరిస్తుంది మరియు అతనికి చక్కని పంట, మొక్కల ఇస్తూ అతనికి మేలు చేస్తుంది.
2. నీటి నుంచి నేను పవిత్రంగా ఉండటం నేర్చుకున్నాను. మీరు ఎలాగైతే ఇతరులను శుద్ధి చేస్తుందో, అలాగే యోగి లేదా ఋషి, పవిత్రుడు మరియు స్వార్థము, లౌల్యము, అహంకారము, కోపము, దురాశ మొదలైన వాటి నుంచి విముక్తుడైన వాడు, తన వద్దకు వచ్చిన వారందరినీ పవిత్రులను చేస్తాడు.
3. గాలి అన్ని వస్తువుల మీద నుంచి వీచినప్పటికి, అది దేనికి అంటుకోదు. అలా నేను అనేక మంది ప్రజల మధ్య ప్రపంచంలో సంచరించరిస్తున్నప్పటికీ, వాయువు నుంచి బంధరహితంగా ఉండడం నేర్చుకున్నాను.
4. అగ్ని దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. అలాగే యోగి లేదా ఋషి, తన యొక్క జ్ఞానము మరియు తపస్సు ద్వారా దివ్యంగా ప్రకాశించాలి.
5. నక్షత్రాలు, గాలి మరియు మేఘాలు మొదలైనవి ఆకాశంలో ఉన్నప్పటికీ, ఆకాశము వాటితో ఏ విధంగానూ బంధం కలిగి ఉండదు. ఆత్మ ఆకాశంవలే సర్వవ్యాప్తమై ఉన్నప్పటికీ, అది దేనితోనూ సంపర్కం కలిగి ఉండదని ఆకాశము ద్వారా నేర్చుకున్నాను.
6. చంద్రుడు ఎల్లప్పుడు పూర్ణంగానే ఉన్నప్పటికీ భూమి యొక్క నీడ చంద్రుని మీద పడిన కారణం చేత అతనిలో క్షీణత లేదా వృద్ధి ఉంటుంది. అలాగే ఆత్మ ఎల్లప్పుడు పూర్ణంగా మరియు ఏం మార్పుకులోను కాకుండా ఉన్నప్పటికీ, ఉపాధులు లేదా వివిధ జన్మలు యొక్క నీడ కారణం చేత అది తాను పరిమితం అనుకుంటుందని నేను తెలుసుకున్నాము.
7. ఎలాగైతే సూర్యుడు తన కింద ఉంచిన అనేక నీటి పాత్రలు వేరువేరు బింబాలుగా కనిపిస్తాదో, అలాగే న్రహ్మము ఒకటే అయినా, మనస్సు యొక్క పరావర్తనం చేత వివిధ ఉపాధులలో ఉన్న కారణంగా, వేరువేరుగా కనిపిస్తుంది. ఇది నేను సూర్యుని నుంచి నేర్చుకున్నాను.
8. ఒకసారి నేను రెండు గువ్వ పిట్టలు తమ పిల్లలతో ఉండడం చూశాను. ఒక వేటగాడు వల వేసి వాటి పిల్లలను పట్టుకున్నాడు. తన పిల్లల పట్ల ఆ తల్లికి ఉన్న ప్రేమ కారణంగా ఆమె తన జీవితాన్ని సైతం లెక్క చేయక వలలోకి దూకి, అతడికి పట్టుబడింది. మగ పావురం ఆడ పట్ల ఎంతో ఇష్టం పెంచుకుంది. అందువల్ల అది కూడా వలలో పడి పట్టుబడింది. దీనివల్ల రాగమే బంధానికి కారణం అని నేను తెలుసుకున్నాను.
9. కొండచిలువ తన ఆహారం కోసం ఎక్కడికి కదలదు. అది ఒక చోటే ఉంటూ తనకు దక్కిన దానితోనే సంతృప్తి చెందుతుంది. అలాగే నేను ద్వారా అజగ్రవృత్తి ద్వారా దొరికిన ఆహారాన్నే తింటూ, ఆహారం పట్ల మనసు పెట్టక, సంతృప్తిగా ఉండాలని నేర్చుకున్నాను.
10. వందల నదులు సముద్రంలో కలిస్తున్నప్పటికీ, సముద్రం చలించకుండా ఉంటుంది. అలాగే జ్ఞాని కూడా అన్ని రకాల ప్రలోభాలు, నష్టాలు మరియు బాధలలకు చలించకుండా ఉండాలని నేను సముద్రం నుంచి తెలుసుకున్నాను.
11. ఎలాగైతే మిణిగురు/ దీపపు పురుగు అగ్ని యొక్క దివ్యమైన కాంతి చూసి, ఆకర్షితమై, అందులోకి దూకి ఆహుతి అవుతుందో, అలాగే కామోద్రేకం కలిగిన వ్యక్తి అందమైన యువతితో ప్రేమలో పడి, చివరకు శోకిస్తాడు. నయేంద్రియం (కన్ను) ను నిగ్రహించాలని, దృష్టిని ఆత్మపై నిలపాలని నేను దీపపు/ మిణుగురు పురుగు ద్వారా నేర్చుకున్నాను.
12. ఎలాగైతే తేనేటీగ రకరకాల పుష్పాల నుంచి తేనెను సేకరిస్తుందో, ఒకే పువ్వుకు పరిమితం కాదో, అలాగే నేను కూడా ఒక్కో ఇంటి నుంచి కొద్దిగా మాత్రమే స్వీకరించి, వేరు ఇంటికి వెళుతూ, నా ఆకలిని తీరుచుకోవాలని, అలా నా మధుకరి వృత్తిని కొనసాగిస్తూ, ఏ గృహస్థుకు భారం కాకూడదని తెలుసుకున్నాను.
13. తేనెటీగలు ఎంతో శ్రమపడి తేనెను సేకరిస్తాయి, కానీ బాటసారి వచ్చి సులువుగా దాన్ని తీసుకెళ్తాడు. అలాగే ఎంతో కష్టపడి సంపదలు మరియు ఇతర వస్తువులను సంపాదిస్తారు మానవులు కానీ మరణం రాగానే ఇవన్నీ, ఒక్కసారిగా వదిలేసి యముడి వెంట వెళ్ళిపోతారు. అలా వాటి నుంచి నేను అనవసరమైన వస్తువులను పోగు చేయకూడదని తెలుసుకున్నాను.

14. మగ ఏనుగుకు ఆడఏనుగు స్పర్శ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఏనుగును పట్టుకోవాలనుకున్న మావటి వాడు, ఒక పెద్ద గొయ్యి తీసి, దాని మీద గడ్డి పరచి, ఆ పైన గడ్డితో చేసిన ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతాడు. అది చూసిన మగ ఏనుగు, ఆ బొమ్మను ఆడఏనుగు అని భావించి, కామంతో కళ్ళు మూసుకుపోయి, ఆ గుంతలో పడిపోతుంది. ఆ విధంగా అది పట్టుబడి, బంధిన్చబడి, మావటి వాడిచేత హింసించబడుతుంది. అలాగే కామోద్రేకం కలిగిన వ్యక్తి స్త్రీ యొక్క స్పర్శ వలలో పడి దఃఖం పొందుతాడు. కనుక వ్యక్తి కామాన్ని నశింప చేసుకోవాలి. ఇది నేను ఏనుగు నుంచి నేర్చుకున్నాను.

15. జింకకు సంగీతం అంటే ఇష్టం. అది వేటగాని యొక్క సంగీతానికి ఆకర్షించబడి అతడికి బలవుతుంది. అలాగే వ్యక్తి జారత్వం కలిగిన స్త్రీ యొక్క సంగీతానికి ఆకర్షితుడై తన వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు. కనుక వ్యక్తి ఎన్నడూ కామోద్రేకాన్ని కలిగించే సంగీతాన్ని వినకూడదు. ఇది నేను జింక నుంచి నేర్చుకున్నాను.

16. ఒక చేప ఏవిధంగానైతే అత్యాశకు పోయి ఆహారం కోసం జాలరి బారిన పడుతుందో అలాగే మానవుడు ఆహారం పట్ల అత్యాశకు పోయి, అతని రసేంద్రియము అతనిమీద ఆధిపత్యం చలాయించే స్థాయికి తెచ్చుకుని, తన స్వతంత్రాన్ని కోల్పోయి, సులభంగా నశిస్తాడు. అందువలన రుచిగల ఆహారం కోసం తపించడం వదిలి పెట్టాలి. ఇది చేప నుంచి నేర్చుకున్నాను.

17. ఒకప్పుడు విదేహ రాజ్యంలో పింగళ అనే పేరుగల నాట్యకారిణి ఉండేది. ఒక రాత్రి ఆమె విటుల కోసం ఎదురు చూసి అలసిపోయింది. చివరకు నిరాశ చెందింది. అప్పుడు ఆమె తనకున్న దానితో సంతృప్తి చెంది హాయిగా నిద్రపోయింది. పతనం చెందిన ఆ స్త్రీ నుంచి ఆశను లేదా కోరికలను వదులుకోవడం చేతనే సంతృప్తి కలుగుతుందని నేను నేర్చుకున్నాను.

18. ఒక కాకి తనకు దొరికిన ఒక మాంసపు ముద్ద తీసుకున్నది. అది చూసిన మిగితా పక్షులు కాకిని వెంబడించి, పొడిచాయి. అది అంతిమంగా మాంసపు ముద్దను వదిలిపెట్టి, శాంతి మరియు విశ్రాంతి పొందింది. ఈ ప్రపంచంలో ఉన్న మనిషి విషయసుఖాల వెంట పడినంత కాలమూ అన్ని రకాల కష్టనష్టాలకు పొందుతాడని, మరియు పక్షి వదిలేసినట్టుగా ఇందిర్యసుఖాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టినప్పుడు ఆనందపడతాడని దీని నుంచి నేను నేర్చుకున్నాను.

19. తల్లి పాలు త్రాగే పసిపిల్లవానికి ఏ బాధలు, ఆవేశాలు, ఆందోళనలు ఉండవు, మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఈ విధంగా సంతోషంగా ఉండడం అనే గుణాన్ని నేను పసిపిల్లవాడి నుంచి నేర్చుకున్నాను.

20. యుక్తవయసుకు వచ్చిన ఒక అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చక్కని వరుని వెతకడం కోసం వెళ్లారు. ఆ అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో పెళ్లి చూపుల నిమిత్తమై కొందరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. స్వయంగా ఆమె వారిని లోనికి ఆహ్వానించింది. వారిని కూర్చోబెట్టి ఆమె వరి పొట్టు తీయడం కోసం వరి దంచడానికి వెళ్ళింది. ఆమె దంచుతున్న సమయంలో చేతి గాజుల రాపిడి వలన తీవ్రమైన శబ్దం వచ్చింది. తెలివి గల అమ్మాయి గాజుల యొక్క శబ్దం చేత స్వయంగా తనే దంచుతున్నానని మరియు వేరొకరిని ఈ పని కోసం పెట్టుకునే స్థోమత తన కుటుంబానికి లేదని, వచ్చిన వారు భావిస్తారని పసిగట్టి రెండు చేతులకు రెండు గాజులు చొప్పున ఉంచుకొని మిగతావి పగులగొట్టాలని నిర్ణయించుకుంది. అలాగే ఆమె తన రెండు చేతులకు రెండు గాజులు చొప్పున మిగుల్చుకుని మిగతావి విరగొట్టింది. రెండు గాజులు కూడా శబ్దం చేశాయి. అప్పుడామె ఒక్కొక్క గాజు చొప్పున విరగొట్టింది. దాంతో ఇక శబ్దం రాలేదు మరియు ఆమె తన నిశ్చింతగా తన పనిలో మునిగిపోయింది. ఈ ప్రపంచంలో అనేక మంది మధ్య బ్రతకడం విభేదాలకు, కలతలకు, గొడవలకు మరియు జగడాలకు కారణమవుతుంది. కనీసం ఇద్దరు ఉన్నా కూడా అనవసరమైన మాటలు పొడచూపుతాయి. కనుక సన్యాసి ఎల్లప్పుడూ ఒంటరి గా ఉండాలని ఈ అమ్మాయి యొక్క అనుభవం ద్వారా నేను నేర్చుకున్నాను.

21. సర్పము తనకు తానుగా పుట్ట నిర్మించుకోదు. ఇతరులు పెట్టిన పుట్టలు మీద అది ఆధారపడుతుంది. అలాగే ఒక సాధువు లేదా సన్యాసి తనకోసం తాను గృహము నిర్మించుకోకూడదు. ఇతరులు నిర్మించిన గుహలు లేదా ఆలయాల్లో జీవించాలి. ఇది నేను పాము నుంచి నేర్చుకున్నాను.

22. బాణాలు చేసే వ్యక్తి యొక్క మనసు పూర్తిగా ఆ బాణాన్ని సరిగ్గా, పదునుగా చేయడంలోనే నిమగ్నమైంది. అతను అలా పనిలో మునిగి ఉన్నప్పుడు, ఒక రాజు అతని ఇంటి ముందు నుంచి తన పూర్తి సైన్యం మరియు పరివారంతో వెళ్లారు. కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, రాజు మీ ఇంటి ముందు నుంచి వెళ్ళాడా అని అడిగారు. ఆ కమ్మరి వ్యక్తి తను గుర్తించలేదని సమాధానం ఇచ్చారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ కమ్మరి వ్యక్తి యొక్క మనసు పూర్తిగా పని యందే నిమగ్నమై, అతను పట్టించుకోలేదు. మనస్సు యొక్క ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉండాలనే గుణాన్ని నేను ఆ కమ్మరి వ్యక్తి నుంచి నేర్చుకున్నాను.

23. సాలీడు తన నోటి ద్వారా పొడవైన దారాలను వదిలి, వాటిని అల్లుతూ గూడు నిర్మించుకుంటుంది. అది తన నిర్మించుకున్న గూడునే అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే మానవుడు తన సొంత భావాలను ఏర్పరుచుకుని, వాటిలోని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కనుక జ్ఞ్ఞాని ప్రాపంచిక ఆలోచనలు వదిలి పెట్టి, బ్రహ్మ, గురించే ధ్యానించాలి. ఇది నేను సాలీడు నుంచి నేర్చుకున్నాను.

24. తుమ్మెద లేదా భ్రమరం ఒక చిన్న పురుగును తీసుకువచ్చి తన గూట్లో పెట్టి దాన్ని ఒకసారి కుడుతుంది. పాపం ఆ పురుగు తుమ్మెద వస్తుందేమో, మళ్ళీ కొడుతుందేమోనని భయపడి తుమ్మెద గురించి తీవ్రంగా నిరంతరంగా ఆలోచించి తుమ్మెదగా మారుతుంది. అట్లాగే మనిషి నిరంతరం ఏ రూపం గురించి ధ్యానం చేస్తాడో, కాలక్రమంలో అతడు అదే రూపాన్ని పొందుతాడు. మానవుడు తాను ఏది ఆలోచిస్తే అదే అవుతాడు. ఆత్మ మీద ధ్యానం ద్వారా నన్ను నేను తెలుసుకుని, ఆత్మసాక్షాత్కారం పొంది, శరీర బంధాల నుంచి బయటపడి, మోక్షాన్ని పొందాలని తుమ్మెద మరియు పురుగు నుంచి నేర్చుకున్నాను.

దత్తాత్రేయుని బోధనలతో రాజు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. దత్తాత్రేయుడు సకల విధములైన అసహనములు లేదా పక్షపాతాలు మంచి పూర్తి విముక్తుడు. తనకు ఎదురుగా వచ్చిన ప్రతి దాని నుంచి ఆయన జ్ఞానం పొందారు. జ్ఞానాన్ని ఆశించే సాధకులందరూ దత్తాత్రేయుని ఒక ఉదాహరణగా తీసుకుని అనుసరించాలి.

ఆరవ అధ్యాయము సమాప్తము 

Saturday 26 October 2019

స్వామి కృష్ణానంద సూక్తి



The worship of Mahalakshmi is the worship of the beauty present in all things and the prosperity that is at the core of all things, which gradually rises to the perfection of God-realisation. God bless you!

- Swami Krishnananda 

Friday 25 October 2019

కంచి పరమాచార్య సూక్తి



Briefly put, this is the concept of Bhagavatpada: ultimately everything(the phenomenal world) will be seen to be Maya. The One Object, the One and Only Reality, is the Brahman. We must be one with It, non-dualistically, without our having to do anything in the same way as the Brahman. I who bear the name of Sri Sankara, keep speaking about many rites, about puja, japa, service to fellow men, etc. It is because inour present predicament we have to make a start with rites. In this way, step-by-step, we will proceed to the liberation that is non-dualistic. It is this method of final release that is taught us by Sri Krsna Paramatman and by our Bhagavatpada. At first karma, works, then upasana or devotion and, finally, the enlightenment called jnana.

- Kanchi Paramacharya

Thursday 24 October 2019

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామి సూక్తి



It is pitiful that when many of us are asked, "Who are you ?", That first thought that arises is "I am a Panjabi", etc. The thought that should immediately stem is "I am an Indian", If people first feel that they are Indians and only then think of divitions, the nation will have great prosperity and the divisive forces willo they are today.
-  Jagadguru Sri Abhinava Vidyatirtha Mahaswami.

Wednesday 23 October 2019

జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరభారతీ మహాస్వామి సూక్తి



PROPER WAY TO REFORM
Our country suffers at present not for want of religious institutions but for want of people who are prepared to conform to its rules. Waste not your time in trying to create more spiritual institutions. Instead of trying to change the world, change yourself. If each individual reforms himself, society will automatically get reformed.
- Jagadguru Sri Chandrashekhara Bharati Mahaswamigal

Tuesday 22 October 2019

కబీర్ సూక్తి



I laugh when I hear that the fish in the water is thirsty. I laugh when I hear that people go on pilgrimage to find God.
- Kabir

Monday 21 October 2019

స్వామి శివానంద సూక్తి



Fewer the desires, lesser the thoughts. Become absolutely desireless. The wheel of mind will stop entirely. If you reduce your wants, if you do not try to fulfil your desires, if you try to eradicate your desires one by one, your thoughts will diminish in frequency and length. The number of thoughts also per minute will diminish.

- Swami Sivananda 

Sunday 20 October 2019

స్వామి రామ్ దాస్ సూక్తి



When a man is free from the clutches of the ego and its desires, in whatever field of activity he may be engaged, karma cannot bind him.

- Swami Ramdas

Friday 18 October 2019

శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి సూక్తి



Suffering begins right from the process of birth- during the confinement to the womb and exit therefrom. A wise person reflects on this and attempts to stop this birth – death cycle with the Guru’s guidance and grace as support.

- Jagadguru Shankaracharya Sri Sri Sri Bharati Tirtha Mahasannidhanam

Thursday 17 October 2019

సత్య సాయి బాబా సూక్తి



Most important, do not ever think that you and God are separate. Think always, "God is with me; He is inside me; He is around me. All there is is God. I myself am God. I am the Infinite, the Eternal. I am not two; I am one, only one. There is no one else besides me. I and God are one and the same." To realize this Unity, the first step is to develop Self-confidence. It comes when you realize that God is not outside of you.

- Sathya Sai Baba

Wednesday 16 October 2019

రాధానాథ స్వామి సూక్తి



In this world, people learn to hate even before they learn to reason. Instead, people should learn the basic human values of honouring life and respecting the environment. 

- Radhanath Swami 

Tuesday 15 October 2019

స్వామి రామా సూక్తి



If you really want to examine your strength, see how many times a day you are disturbed.
- Swami Rama 


స్వామి శివానంద విరచిత గురుతత్వము - 18 వ భాగము



ఆరవ అధ్యాయము
శ్రీ గురు దత్తాత్రేయుడు మరియు ఆయన 24 గురువులు

ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణుర్ అంతే దేవాః సదాశివః |
మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||

ఆది లో బ్రహ్మ గాను, మధ్యలో విష్ణువు గాను, అంతంలో శివుని గాను, త్రిమూర్తుల స్వరూపంగా ఉన్న దత్తాత్రేయ నమస్కారములు.

బ్రహ్మజ్ఞానమయీ ముద్ర వస్త్రేచాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధయ దత్తాత్రేయ నమోస్తుతే ||

గిర్నార్ పర్వతశ్రేణులకు ప్రభువైనవాడు, బ్రహ్మ జ్ఞానమే ముద్రగా వాడు ధరించినవాడు; భూమి, ఆకాశాన్ని తన వస్త్రములుగా కట్టుకున్నవాడు, ఘనమైన జ్ఞాన స్వరూపుడు, అయిన దత్తాత్రేయునకు మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు. (శ్రీ ఆది శంకరాచార్యులు)

అనసూయ మాతను పాతివ్రత్యానికి ఉదాహరణగా చెబుతారు మరియు ఆవిడ సప్తఋషులలో ఒకరైన, గొప్ప ఋషి అయిన అత్రి మహర్షి యొక్క ధర్మపత్ని. ఆవిడ పతివ్రత ధర్మంలో ఎంతో గొప్పగా నిలబడింది. ఆమె తన భర్తను గొప్ప భక్తితో సేవించింది. బ్రహ్మ విష్ణు మరియు శివులకు సమానమైన పుత్రులను పొందుట కొరకు ఆవిడ ఎంతో కాలం తీవ్రమైన తపస్సు చేసింది.

ఒకసారి నారదుడు ఒక చిన్న ఇనుప - గుళిక (గోళము) తీసుకొని సరస్వతీదేవి వద్దకు వెళ్లి, ఆమెతో ఇలా అన్నారు; "సరస్వతి దేవి! దయ చెసి ఈ ఇనుపగుళికను వేయించండి. ఈ ఇనుపగుళికను నేను నా ప్రయాణం లో ఆరగిస్తాను." సరస్వతీదేవి నవ్వి "నారదమహర్షి ఈ ఇనుపగుళికను ఎలా వేఁపగలరు? దీన్ని ఎలా తినగలరు?" అని అలా అన్నది. అటు తర్వాత నారదుడు మహాలక్ష్మి మరియు పార్వతి దేవి వద్దకు వెళ్లి ఆ ఇనుప గుళికను వేఁపమని అర్ధించాడు. వాళ్లు కూడా నారదుడిని చూసి నవ్వారు. అప్పుడు నారదుడు ఇలా అన్నారు; "దేవిలారా! చూడండి, నేను ఈ భూ ప్రపంచంలోనే అతి గొప్ప పతివ్రత, అత్రి మహర్షి భార్య అయిన అనసూయ మాత వద్దకు వెళ్ళి, దీన్ని వేయించి, తీసుకువస్తాను" అన్నారు.

అప్పుడు నారదుడు అనసూయమాత వద్దకు వచ్చి ఆ ఇనుపగుళికను వేయించమని అర్ధించాడు. అనసూయ మాత ఆ ఇనుప గుళికను పెన్నంలో పెట్టి, ఆమె భర్త యొక్క రూపం మీద ధ్యానం చేసి, తన భర్త పాదాలను కడుగగా ఉన్న నీటిలో కొన్ని చుక్కలను, ఆ గుళిక మీద చల్లింది. ఒక్కసారిగా ఆ ఇనుపగుళిక వేఁపబడింది. నారదుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి మరియు పార్వతి దేవులకు వద్దకు వెళ్లి, వేయించిన ఆ గుళికను వారి ముందే తిన్నారు. మరియు వారికి కూడా కొంచెం కొంచెం ఇచ్చారు. అతడు ఆమెను మరియు ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ఎంతగానో పొగిడారు. అప్పుడు నారదుడు ఆమెకు బ్రహ్మ విష్ణు శివులకు కు సమానమైన పుత్రుడు కలగాలన్న కోరిక నెరవేర్చాలని సంకల్పించారు.

ఆయన సరస్వతీ, లక్ష్మీ, పార్వతులతో : "మీ గనక మీ యొక్క పతులకు విశ్వాసంతో, నిజాయతీతో మరియు భక్తితో సేవ చేసి ఉంటే మీరు కూడా ఇనుపగుళికను వేయించి ఉండేవారు. అనసూయ యొక్క పతివ్రతా ధర్మాన్ని పరీక్షించమని మీ యొక్క భర్తలను అర్ధిన్చండి."

అప్పుడు సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు తమ పతులను అత్రి మహర్షి యొక్క పత్ని అయిన అనసూయమాత యొక్క పాతివ్రత్య ధర్మాన్ని పరీక్షించమని, వారికి నిర్వాణ భిక్ష అనగా వస్త్రము లేకుండా వివస్త్రగా బిక్ష ఇమ్మని అడగమన్నారు.


త్రిమూర్తులు నారదుని యొక్క చర్యలు, అలాగే అనసూయ మాత యొక్క తపస్సు మరియు కొరికను తమ జ్ఞాన దృష్టి ద్వారా తెలుసుకున్నారు. వారు అంగీకరించారు. అప్పుడు త్రిమూర్తులు సన్యాసి రూపం ధరించి, అనసూయ మాత ముందు ప్రత్యక్షమై, ఆమెను నిర్వాణ భిక్ష ఇమ్మన్నారు. అనసూయమ్మ గొప్ప సంధిగ్దానికి గురైంది. భిక్షుకులకు ఆమె కాదు అని చెప్పలేదు. అలాగే ఆమె యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నిలుపుకోవాలి. కాబట్టి ఆమె తన భర్త రూపాన్ని ధ్యానించి, ఆయన పాదముల యందు సరణాగతి చేసి, తన భర్త పాదాలను కడుగగా ఉన్న నీటి నుంచి కొన్ని చుక్కలను ఆ సన్యాసుల మీద చిలకరించింది/ చల్లింది. త్రిమూర్తులు ఆ చరణామృత మహిమ చేత ముగ్గురు పిల్లలుగా మారిపోయారు. అదే సమయంలో యొక్క స్తన్యములలో పాల ఉత్పత్తి జరిగింది. ఆమె ముగ్గురు పిల్లలను తన కన్నబిడ్డలుగా భావించి, నగ్నస్థితిలోనే వారికి పాలు పట్టి, ఊయలలో వేసింది ఊపింది. అంతకముందే స్నానానికి వెళ్లిన భర్త రాక కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూడసాగింది.

అత్రి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి రాగానే, ఆయన లేని సమయంలో జరిగినవన్నీ అనసూయ మాత పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ పిల్లలను ఆయన పాదాల వద్ద ఉంచి, ఆయనను పూజించింది. కానీ అత్రిమహర్షికి తన దివ్యదృష్టి ద్వారా జరిగినదంతా ముందే తెలుసు. ఆ ముగ్గురు పిల్లలను ఆయన దగ్గరకు తీసుకున్నారు. ముగ్గురు పిల్లలు రెండు కాళ్లతో, ఒక మొండెంతో, మూడు శిరస్సులతో మరియు ఆరు చేతులతో ఒకే పిల్లవానిగా మారారు. అత్రి మహర్షి తన భార్యను ఆశీర్వదించి, త్రిమూర్తులు పసిపిల్లలుగా రూపంలో తన వద్దకు వచ్చి అనుగ్రహించారని ఆమెకు తెలియపరిచారు.


నారదుడు బ్రహ్మలోకానికి, వైకుంఠానికి మరియు కైలాసానికి వెళ్ళి సరస్వతి, లక్ష్మీ మరియు పార్వతులకు తమ భర్తలు అనసూయ మాత వద్ద నిర్వాణ బిక్షకు వెళ్ళి ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం యొక్క శక్తి చేత చిన్న పిల్లలుగా మారిపోయారని, ముగ్గులు అమ్మవార్లు అక్కడకు వెళ్లి అత్రిని భర్తబిక్ష అడగని యెడల, వారు తిరిగి తమ రూపం తీసుకోలేరని చెప్పారు. సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు సామాన్య స్త్రీ రూపం ధరించి, అత్రి మహర్షి వద్దకు వెళ్లి పతిబిక్ష పెట్టమని అడిగారు. "ఓ మహర్షి మా భర్తలను తిరిగి మాకు ఇవ్వండి" అన్నారు. అత్రి మహర్షి ఆ ముగ్గురు స్త్రీలను విధిగా గౌరవించి, చేతులు జోడించి ప్రార్థన చేసి, తన కోరిక మరియు తన భార్య అయిన అనసూయ కోరిక నెరవేర్చమని వేడుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు అత్రి ముందు తన నిజరూపం స్వీకరించి ఇలా అన్నారు- "ఈ పిల్లవాడు నీ మాట ప్రకారం గొప్పఋషి అవుతాడు మరియు అనసూయ మాత యొక్క కోరిక మేరకు మాకు సమానుడౌతాడు. ఈ పిల్లవాడు దత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి పొందుతాడు". అలా చెప్పి వారు అదృశ్యమయ్యారు.

దత్తాత్రేయుడు యుక్తవయసుకు వచ్చాడు. ఆయనలో త్రిమూర్తుల అంశతో ఉన్నందున మరియు ఆయన గొప్ప జ్ఞాని అయినందువలన ఋషులు మరియు సాధువులందరూ పూజించారు. ఆయన సౌమ్యముగా, శాంతముగా మరియు మరియు స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆయనను నిత్యము ఎంతోమంది జనులు అనుసరిస్తూ ఉండేవారు. దత్తాత్రేయుడు వారందరినీ వదిలించుకోవాలని అనుకున్నప్పటికీ, ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకసారి ఆయనను ఎంతో మంది వ్యక్తులు చుట్టుముట్టి ఉన్నప్పుడు, ఆయన స్నానం కోసం అనే నదిలోకి ప్రవేశించి, మూడు రోజుల వరకు బయటకు రాలేదు. ఆయన నీటిలోనే సమాధి స్థితిలో ఉన్నారు. ఆయన మూడవ రోజు బయటకు వచ్చినప్పుడు, ఆయన యొక్క రాకకోసం జనులు ఆ నది ఒడ్డున కూర్చుని ఉండడం చూసారు.

ఈ పద్ధతిలో వదిలించుకోవడం ఆయనకు సాధ్యం కాలేదు. ఆయన వేరొక ప్రణాళికను అనుసరించారు. ఆయన తన యోగశక్తితో ఒక అందమైన అమ్మాయి మరియు ఒక మందు/ సారాయి సీసాలను సృష్టించారు. ఆయన నీటిలో నుంచి ఒక చేత్తో అమ్మాయిని మరియు ఇంకొక చేతితో సారాయి సీసాను పట్టుకుని బయటకు వచ్చారు. జనులందరూ ఆయన తన యోగం నుంచి భ్రష్టుడయ్యాడని తలచి, ఆయనను వదిలి వెళ్ళిపోయారు.

దత్తాత్రేయుడు ఆయన వద్ద ఉన్న అన్ని రకాల వస్తువులను, అలాగే తన దుస్తులను సైతం కూడా అవతలపడేసి, అవధూతగా మారారు. వేదాంతం యొక్క సత్యాలను ప్రవచించి బోధించడానికి దేశాటనకు వెళ్లారు. దత్తాత్రేయుడు సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయునకు అవధూత గీత పేరుతో తన గీతను బోధించారు. వేదాంతం మరియు ఆత్మసాక్షాత్కారం యొక్క అపరోక్షానుభూతి లేదా ప్రత్యక్ష అనుభవం గురించిన ఎన్నో సత్యాలు మరియు రహస్యాలు కలిగిన అత్యంత విలువైన పుస్తకము ఈ అవధూత గీత.

Monday 14 October 2019

స్వామి శివానంద సూక్తి



Words are nothing but the outward expressions of thoughts which are imperceptible. Actions are caused by feelings of desire and aversion (likes and dislikes). These feelings are caused by the fact that you attribute a pleasurable or painful nature to objects. Thought is finite. It is inadequate to express even temporal processes, not to speak of the absolute which is inexpressible. The body with its organs is no other than the mind.

- Swami Sivananda 

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 17 వ భాగము



అయిదవ అధ్యాయము
శ్రీ దక్షిణామూర్తి
నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాంగురవే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమః

సర్వ విద్యలకు నిధి అయిన వాడు, భవరోగమును అనగా సంసారమనే రోగానికి వైద్యుడైన వాడు, సర్వలోకాలకు గురువు అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారములు. (గురు గీత)

కైలాస పర్వతం మీద అందంగా అనేక మణులతో అలంకరించిన ఒక పెద్ద సభామండపంలో పార్వతీదేవి తన పక్కన కూర్చోపెట్టుకొని. శివుడు ఆశీనుడై ఉన్నాడు. ఆ సమయంలో అమ్మవారు స్వామిని పూజించి, తను దక్షుని కుమార్తె కనుక దాక్షాయణిగా పేరొచ్చిందని, ఆ పేరు మార్చమని విజ్ఞప్తి చేసింది. ఈ దక్షుడు శివుని అవమానించినందుకు మరియు తన అహంకారం చూపినందుకు శివుని చేత వధించబడ్డాడు. ఈ విజ్ఞప్తి విన్న శివుడు పార్వతీదేవిని సంతానం కోసం తీవ్రమైన తపస్సు చేస్తున్న పర్వతరాజు కుమార్తెగా జన్మించమని ఆదేశిస్తాడు. అలాగే ఆయన పార్వతీ దేవి వద్దకు వచ్చి వివాహం చేసుకుంటానని చెబుతాడు. శివుడు ఆదేశించిన విధంగా పార్వతీదేవి పర్వతరాజు కుమార్తెగా పుట్టింది, మరియు శివుడిని వరునిగా పొందుట కొరకు తన అయిదవ సంవత్సరం నుంచే తీవ్రమైన తపస్సు చేసింది.

దేవి లేని సమయంలో శివుడు ఒంటరిగా ఉన్నప్పుడు, బ్రహ్మ దేవుని కుమారులైన - సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు- శివుని యొక్క దర్శనం కోసం వచ్చి ఆయనకు నమస్కరించారు. వారు స్వామిని తమ అవిద్యను తొలగించుకుని మోక్షం పొందే మార్గం చూపమని అడిగారు. ఎంతో దీర్ఘంగా లోతుగా గ్రంధాలను అధ్యయనం చేసిన తర్వాత కూడా వారికి మనశ్శాంతి దొరకలేదు మరియు మోక్షం పొందటానికి అవసరమైన రహస్యాలను వారు తెలుసుకోవాలని కోరుకుని, ఈ ప్రశ్న అడిగారు.

ఋషుల విన్నపాన్ని విన్న పరమశివుడు దక్షిణామూర్తి రూపాన్ని స్వీకరించి, ఆది గురువుగా మౌనంలో ఉంటూ, తన చేతితో చిన్ముద్ర చూపుతూ, వారికి అనేకమైన రహస్యాలను బోధించారు. ఆ ఋషులు ఆ వాక్యాల మీద ధ్యానం చేసి, అంతులేని ఆనందాన్ని, బ్రహ్మానంద స్థితి పొందారు.

అలా శివుడు దక్షిణామూర్తిగా లోకానికి తెలియబడ్డాడు. దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండుగాక! ఆయన యొక్క అనుగ్రహంతో మనందరం అంతులేని శాంతి మరియు ఆనందాన్ని అనుభూతి చెందటానికి ఆత్మజ్ఞానమనే లోతుల్లోకి వెల్లేదము గాక! ఓం శాంతిః శాంతిః శాంతిః

Sunday 13 October 2019

మీరా బాయి సూక్తి



DO NOT LEAVE ME ALONE

Do not leave me alone, a helpless woman.
My strength, my crown,
I am empty of virtues,
You, the ocean of them.
My heart’s music, you help me
In my world-crossing.
You protected the king of the elephants.
You dissolve the fear of the terrified.


Where can I go? Save my honour
For I have dedicated myself to you
And now there is no one else for me.

- Meera Bai

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 16 వ భాగము



నాలుగవ అధ్యాయము
వ్యాస మహర్షి మరియు సనాతన హిందూ ధర్మ గ్రంధావళికి ఆయన యొక్క తోడ్పాటు

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే
పుల్లారవిందాయత పద్మ నేత్ర
యేన త్వయా భారత తైల పూర్ణః
ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః

విశాలమైన బుద్ధి కలవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, ఎవరి చేత అయితే జ్ఞానమనే దీపము, మహాభారతమనే తైలముతో నింపబడి, గీతా అనే అగ్నితో వెలిగించబడిందో, అటువంటి వ్యాసమునకు నా నమస్కారములు.

పురాతన కాలంలో, మన పితరులు, ఆర్యావర్తము యొక్క ఋషులు, వ్యాస పూర్ణిమ తర్వాత వచ్చే నాలుగు నెలలు తపస్సు కొరకు అడవికి వెళ్లేవారు. ఈ వ్యాస పూర్ణిమ హిందూ పంచాంగంలో ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన రోజు. గుర్తుంచుకోవలసిన ఈ రోజున సాక్షాత్తు భగవంతుని అవతారమైన వ్యాసుడు, బ్రహ్మసూత్రాలను రాయటం మొదలు పెట్టారు. మన పురాతన రుషులు ఈ తపస్సును గుహలు మరియు అడవులలో చేశారు. కానీ ఇప్పుడు కాలం మారింది మరియు అటువంటి సదుపాయాలు ఈనాడు లేవు. ఎవరైతే ఈ కాలంలో కూడా ముందుకు వచ్చి అలాంటి తపస్సులు చేయాలనుకుంటారో, వారికి తగిన సహాయం మరియు సదుపాయాలు కల్పించడానికి, తగిన చోటు ఇవ్వడానికి గృహస్థులు మరియు రాజులు ముందుకు రావట్లేదు. వారికి అసలు ఇటువంటి కోరిక కూడా లేదు. అందుకే అడవులు మరియు గుహలు తమ ప్రదేశాలను గురుద్వారాలు మరియు మఠాలకు మార్చుకున్నాయి. ప్రతి వ్యక్తి దేశకాలాలకు అనుగుణంగా తన అవసరానికి అనుగుణంగా ఉండాలి; మరియు ఈ దేశకాలాల యొక్క మార్పు మానసిక వైఖరిలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా చూసుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం వ్యాసపూర్ణిమ రోజున చాతుర్మాస్యము మొదలవుతుంది, మరియు అప్పటి నుంచి మనం ఆ రోజున వ్యాస మహర్షి మరియు బ్రహ్మవిద్యా గురువులను పూజించి, బ్రహ్మ సూత్రాలు మరియు జ్ఞానం ఇచ్చే ఇతర పురాతన గ్రంథాలు చదవాలి.

కృష్ణద్వైపాయన జన్మము జన్మ వృత్తాంతము

మన పురాణాలు ఎందరో వ్యాసాల గురించి మాట్లాడుతాయి. మరియు ద్వాపరయుగాంతంలో పుట్టిన కృష్ణద్వైపాయనుడు అయిన ఈ వ్యాసమున కంటే ముందు 28 మంది ఉన్నారని చెప్పబడింది. ఆయన మత్స్య కన్య - సత్యవతి దేవికి పరాశర మహర్షి ద్వారా జన్మించారు. అది కూడా కొన్ని ప్రత్యేకమైన, అద్భుతమైన పరిస్థితులలో నడుమ. పరాశరుడు ఒక గొప్ప జ్ఞాని మరియు జ్యోతిషంలో అత్యున్నతమైన పండితులు. ఆయన రాసిన పరాశర హోరా ఈనాటికి జ్యోతిషంలో ఒక ముఖ్యమైన గ్రంథము. ఆయన పరాశర స్మృతి అనే స్మృతిని అందించారు. అది ఎంతో ఉన్నతంగా గౌరవించబడటమే కాదు, ఈనాటికి కూడా నైతికి మరియు సామాజిక అంశాలకు చెందిన రచనలు చేసే రచయితలు కూడా దానిని ఎన్నో చోట్ల పేర్కొంటారు. ఒకానొక ప్రత్యేక ఘడియలో పుట్టిన పిల్లవాడు, ఆ యుగంలో గొప్పవాడవుతాడని, సాక్షాత్తు విష్ణు అంశ గలవాడని ఆయనకు తెలుస్తుంది. ఆ రోజున పరాశరుడు ఒక చిన్న పడవలో ప్రయాణిస్తూ ఆ పడవవానితో ఆ శుభముహూర్తం దగ్గర పడేటప్పుడు మాట్లాడుతారు. ఆ పడవవానికి వివాహ సమయమున వచ్చి, వివాహంమునకు ఎదురుచూస్తున్న ఒక కూతురు ఉంది. అతడు పరాశరుని యొక్క తపస్సును, గొప్పతనాన్ని మెచ్చుకుని, తన కూతురుని ఆయనకు ఇచ్చి వివాహం చేస్తారు. వీరిద్దరికి పుట్టినవాడే మన వ్యాసుడు; మరియు ఆయన యొక్క జన్మకు కారణంగా సాక్షాత్తూ పరమశివుని అనుగ్రహింమని, అతి తక్కువ కులానికి చెందిన వాడైనా, అత్యంత ఉన్నతమైన జ్ఞానిగా ప్రసిద్ధికెక్కుతాడని శివుడు ఆశీర్వదిస్తారు.

సనాతన ఆర్ష వాఙ్మయానికి వ్యాసుని యొక్క అద్భుతమైన సహాయము

చాలా చిన్న వయసులో వ్యాసమహర్షి తాను తపస్సు చేస్తానని, తన జన్మరహస్యం తల్లిదండ్రులకు చెప్పారు. ఆయన తల్లి మొదట ఆంగీకరించలేదు కానీ తర్వాత ఒక ముఖ్యమైన నిబంధన పెట్టి అనుమతించింది. అదేమిటంటే ఆమె ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఆయన కళ్ళముందు ప్రత్యక్షవ్వాలి. ఇదొక్కటే ఆ తల్లిదండ్రులు మరియు ఆ కుమారుని దూరదృష్టిని తెలియపరుస్తుంది. పురాణాల ప్రకారము వ్యాసుడు తన ఇరవై ఒకటవ గురువైన వాసుదేవుడనే ఋషి ద్వారా ఉపదేశం పొందారు. ఆయన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు మైర్యు ఇతర ఋషుల వద్ద శాస్త్రాభ్యాసం చేశారు. మానవుల యొక్క మేలు కొరకు వేదాలను విభాగం చేశారు, మరియు శృతులను సులభంగా వేగంగా అర్థం చేసుకొనుట కొరకు బ్రహ్మసూత్రాలు రాశారు. స్త్రీలు, శూద్రులు మరియు తక్కువ మేధస్సు కలవారు ఉన్నతమైన జ్ఞానాన్ని చాలా సులభ రీతిలో అర్థం చేసుకునేందుకు ఆయన మహాభారతం కూడా రాశారు. ఆయన పద్దెనిమిది పురాణాలను రచించి, వాటి ద్వారా ఉపాఖ్యానాలు లేదా ప్రవచనాల వ్యవస్థను బోధించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆయన కర్మ, ఉపాసన మరియు జ్ఞానం అనే మూడు మార్గాలను నిర్మించారు. ఆయనే తన తల్లి యొక్క వంశక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు మరియు ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు విధురుడు ఆయన ద్వారానే భూమి మీదకు వచ్చారు. భాగవతము ఆయన చేసిన చివరి రచన. అది రాయకపోతే ఆయన జీవిత లక్ష్యం నెరవెరదని, అది కూడా దేవర్షి అయిన నారదుడు ఆయన వద్దకు వచ్చి ప్రేరణ అందించడంతో అప్పుడు వ్యాసుడు రచించాడు.

వ్యాసుడిని హిందువులంతా చిరంజీవిగా భావిస్తారు. ఆయన ఈ నాటికి తన భక్తుల మేలు కొరకు జీవించి ఉంటూ, ప్రపంచమంతా తిరుగుతూ, సత్యవంతుడు మరియు విశ్వాసం గలవారికి కనిపిస్తారని నమ్ముతారు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి మండనమిశ్రుని ఇంట్లో వ్యాసుని దర్శనం అయ్యింది. అలాగే ఆయన ఇంకా ఎంతో మందికి దర్శనం ఇచ్చారు. కనుక కుల్ప్తంగా చెప్పాలంటే, ఆయన జగత్తు యొక్క హితం కొరకు జీవిస్తున్నారు. ఆయన ఆశీర్వాదాలు మన అందరి మీద, సమస్త ప్రపంచం ఇలా ఉండాలని ప్రార్ధిద్దాము.

బ్రహ్మ సూత్రాలు మరియు వాటికి విభిన్నమైన వ్యాఖ్యానాలు

మన పూర్వీకులు ఆరు విధములైన ఆలోచనా విధానాలను అభివృద్ధి పరిచారని మన అందరికీ తెలుసు. వాటికి షడ్దర్శనాలు అని పేరు. అవి సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస మరియు ఉత్తరమీమాంస లేదా వేదాంతము. ప్రతి యొక్క వ్యవస్థ/దర్శనానికి విభిన్నమైన అభిప్రాయం/ ఆలొచనా సరళి ఉంది. క్రమక్రమంగా ఈ ఆలోచనలు భావాలు అనేకమైన, వాటిని నియంత్రించడానికి సూత్రాలు వచ్చాయి. వీటికి సంబంధించిన ప్రమాణమైన వాక్యాలు సంస్కృతంలో చిన్న సూత్రాల రూపంలో వచ్చాయి. అవి మన జ్ఞాపకములో ఎంతోకాలం ఉండుటకు మరియు ప్రతి అంశం మీద పెద్ద చర్చ చేయడానికి అవి తోడ్పడాలి అనేది దాని ఉద్దేశము. పద్మ పురాణంలో సూత్రాలు యొక్క వ్యాఖ్య లేదా వివరణము ఇవ్వబడింది. అది ఏమంటుందంటే సూత్రాలు చాలా సంక్షిప్తంగా మరియు స్పష్టంగా ఉంటాయి. కానీ వాటి యొక్క సంక్షిప్తత సూత్రాలను అర్థం చేసుకోలేని స్థాయికి చేరింది. మరీ ముఖ్యంగా బ్రహ్మసూత్రాల విషయంలో ఇది కనిపిస్తుంది. ఈరోజు మనం కనక చూస్తే ఒక సూత్రాన్ని 12 రకాలుగా వ్యాఖ్యానిస్తారు. సూత్రాలు వేదవ్యాసుడు లేదా బాదరాయణుడు రచించారు- ఆయనకు ఉన్న ఇంకొక పేరు కారణంగా ఆయన రాసిన ఈ సూత్రాఅను వేదాంత సూత్రాలు అని అంటారు. ఎందుకంటే అది కేవలం వేదాంతం గురించే మాట్లాడతాయి. అవి నాలుగు అధ్యాయాలు విభజించబడ్డాయి మరియు ప్రతి అధ్యాయము 4 భాగాలుగా విభజించబడింది. ఇక్కడ ఆసక్తికరంగా కనిపించే విషయం ఏమిటంటే ప్రతి సూత్రము ప్రారంభమయ్యి, అంతమయ్యే సమయంలో ఇలా కనిపిస్తుంది- 'బ్రహ్మము యొక్క తత్వం గురించి విచారణ చేసిన వాడు మరల వెనక్కి రాడు' అనగా 'ఈ మార్గంలో వెళ్ళినవాడు అమరత్వాన్ని చేరుకుంటాడు మరియు అతడు మరల ఈ ప్రపంచంలోకి తిరిగిరాడు'.

ఈ సూత్రాలను ఎవరు లిఖించారు అన్న విషయానికి వస్తే సంప్రదాయం దానిని వేదవ్యాసునకు కట్టబెడుతుంది. శంకరాచార్యులు ఆయన భాష్యంలో వ్యాసుల వారిని మహాభారతానికి మరియు భగవద్గీతకు రచయితగా మరియు బాదరాయణుని బ్రహ్మ సూత్రాలకు కర్తగా చెప్తారు. ఆయన అనుయాయులు - వాచస్పతి, ఆనందగిరి మరియు ఇతరులు - ఇద్దరిని ఒకే వ్యక్తిగా గుర్తిస్తారు. రామానుజులు మరియు ఇతరులు వాటిని వేదవ్యాసులవారే రచించారని చెబుతారు. బ్రహ్మసూత్రాలపై ఉన్న పురాతనమైన వ్యాఖ్యానం ఆదిశంకరాచార్యుల వారిది. వారి తర్వాత రామానుజులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, మాధవుడు మరియు ఇతరులు వారి వారి సొంత మతాలను స్థాపించారు. వీటిలో పైన చెప్పిన వారిలో ప్రామాణికమైన ఐదుగురూ రెండు విషయాలను ముఖ్యంగా అంగీకరించారు. అది (1) బ్రహ్మము ఈ ప్రపంచానికి కారణము (2) మరియు బ్రహ్మజ్ఞానమే ముక్తికి మార్గము. కానీ వారు బ్రహ్మము యొక్క తత్వం/ప్రకృతి గురించి, పరమాత్మకు జీవాత్మకు మధ్య ఉన్న సంబంధం గురించి, మోక్ష స్థితిలో జీవుల యొక్క స్థితి గురించి ఒకరికి ఒకరు భిన్నాభిప్రాయాలను వ్య్కతం చేసారు. కొందరి వాదన ప్రకారం, మోక్షం పొందడానికి జ్ఞానం కంటే భక్తియే ఉన్నతమైనది శంకరులు వ్యాఖ్యానించారని చెబుతారు.

జీవితమంతా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుటానికే పుట్టిన వ్యాసుని జీవితం ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఆయన యొక్క రచనలు ఈ నాటికి మనకకూ, సమస్త ప్రపంచానికి ప్రేరణ అందిస్తున్నాయి. మనమంతా ఆయన యొక్క రచనల స్ఫూర్తితో జీవిద్దాము.

నాల్గవ అధ్యాయము సమాప్తము 


Saturday 12 October 2019

స్వామి సచ్చిదానంద సూక్తి




The Monkey Mind

“The mind wants to control you; it is always moving, changing. It’s like a wild monkey running here and there. Imagine the condition of the mind. How on earth are you going to quiet the mind? It’s impossible. The mind says, ‘I am the boss.’ You say, ‘No, I want to be the boss.’ So the mind will put all the obstacles in front of your spiritual practices—all kinds of excuses and reasons for you not to practice. This is all the mind’s trick. So, leave it alone and watch the show. Don’t give up, keep up a steady practice and certainly one day you will achieve the goal. And when you achieve the goal, you will be very happy and also, very proud of your mind.


“God bless you. Om Shanti, Shanti, Shanti.”

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 15 వ భాగము



గురుపూర్ణిమ యొక్క ప్రాముఖ్యత

ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను బాగా గుర్తు పెట్టుకో. ఆషాఢ పూర్ణిమ చాతుర్మాస్య ఆరంభానికి, ఎంతగానో ఎదురు చూస్తున్న వర్షముల రాకకు సూచిక. భూమి నుంచి ఎండాకాలంలో తీసుకోబడిన నీళ్లు, ఇప్పుడు అంతటా నూతన జీవం సృష్టించేందుకు వీలుగా సువృష్టి (చక్కని వర్షం) రూపంలో కిందకు వస్తాయి. అలాగే నీవు కూడా ఇంతకుముందు నేర్చుకున్న వేదాంత తత్వాన్ని, నీలో దాచుకున్న తత్వశాస్త్రాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టాలి. ఈరోజు నుంచే నీ యొక్క ఆధ్యాత్మిక సాధన ఆచరణాత్మకంగా మొదలుపెట్టు. ఆధ్యాత్మికత యొక్క నూతన తరంగాలను సృష్టించు. నీవు చదివినది, విన్నది, చూసినది, నేర్చుకున్నది, సాధన ద్వారా నిరంతరం ప్రపంచానికి అందించే ప్రేమగా, మరియు సర్వజీవులలో ఉన్న భగవంతునకు నిరంతరం చేసే ప్రేమపూర్వక సేవ, నిరంతర ప్రార్థన మరియు పూజగా మారాలని కోరుకో.

ఈ రోజున పాలు మరియు పండ్లు మాత్రమే తీసుకుంటూ తీవ్రమైన జపము, ధ్యానము చేయి. బ్రహ్మ సూత్రాలను చదువు మరియు నీ గురు మంత్రాన్ని లేదా ఇష్ట మంత్రాన్ని ఈ చాతుర్మాసంలో కొన్ని లక్షల జపము అనగా అనుష్టానము లేదా పునశ్చరణ చేయి. నీవు ఎంతగానో పడతావు లాభపడతావు.

సమస్త విశ్వాన్ని గురువుగా భావించు

నీ దృష్టికోణంలో నూతన విధానాన్ని ఎంచుకో. మొత్తం విశ్వాన్నే గురు స్వరూపంగా భావించు. ఈ విశ్వంలోని ప్రతి వస్తువులో, మార్గదర్శనం చూపే నీ గురువు చేయిని, నిన్ను మేలుకొలిపే స్వరాన్ని, జ్ఞానం అందించే గురువు యొక్క స్పర్శను దర్శించు. మారిన నీ దృష్టి కోణంలో ఇప్పుడు సమస్త ప్రపంచం మారిపోతుంది. విరాట్ గురువు మన జీవితం యొక్క అమూల్యమైన రహస్యాలను నీకు వెల్లడించి జ్ఞానం ఇస్తారు. పరమాత్ముడైన సద్గురు గోచరమైన ప్రకృతి రూపంలో జీవితం యొక్క అత్యంత విలువైన పాఠాలను నీకు బోధిస్తారు. ప్రతిరోజు గురువులకు గురువైన, అవధూత అయిన దత్తాత్రేయుడు సైతం గురువైన ఈ గురువును పూజించు. సమస్తము కలిగి ఉన్నా, నిరంతరం ఓర్పుతో ఉండే భూమి, అందరికీ నీడను, పండ్లను ఇస్తూ ఎల్లవేళలా ఆత్మత్యాగానికి సిద్ధంగా ఉన్న చెట్టు, చిన్న విత్తనం లో ఎంతో ఓపికగా ఒదిగి ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు, నెమ్మది నెమ్మదిగా నిరంతరం పడే నీటి చుక్కలు పెద్ద బండరాళ్ళను తొలచడం, గ్రహాలు మరియు క్రమంగా సమయానికి వచ్చే ఋతువులను ఎవరైతే చూస్తారో, వింటారో మరియు స్వీకరిస్తారో వారికి ఇవన్నీ దివ్యమైన గురువులు.

పవిత్రత మరియు పురోగతి

గ్రహణ శీలత అనే గుణానికి ప్రతిరూపంగా మారు. నీలో ఉన్న అహంకారం ఖాళీ చేసుకో. ప్రకృతి యొక్క హృదయం లో ఉన్న సమస్త సంపదలు నీవి అవుతాయి. తక్కువ సమయంలోనే పురోగతి మరియు పరిపూర్ణత వస్తాయి. మలయమారుతం వలే శుద్ధము మరియు బంధరహితంగా మారు. నది నిరంతరం నిలకడగా, మార్గం తప్పకుండా, ఎడతెగకుండా తన లక్ష్యమైన సముద్రం వైపు ప్రవహించినట్లుగా, నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఉన్నతమైన, దివ్యమైన సచ్చిదానంద స్థితి వైపునకు మళ్ళించు. నీ ఆలోచనలు (మనస్సు), నీవు వాక్కు (మాట్లాడే మాటలు), నీవు చేసే పనులను (కాయము) కేవలం ఈ లక్ష్యం వైపుగా మళ్ళించు.

చంద్రుడు దివ్యమైన, ప్రకాశవంతమైన సూర్యుని యొక్క వెలుగును పరావర్తనం చేస్తాడు. పూర్ణిమ రోజు కనిపించే పూర్ణ చంద్రుడు దివ్యమైన సూర్యుని యొక్క వెలుగును పూర్తిగా పరావర్తనం చేస్తాడు. అది సూర్యుని వైభవాన్ని ప్రకటిస్తుంది. అలాగే చంద్రునివలె, సాధన మరియు సేవ అనే అగ్ని ద్వారా నిన్ను నీవు పవిత్రుని చేసుకో, ఆత్మ యొక్క దివ్యమైన వెలుగును ప్రసరించు. వెలుగులకే వెలుగు అయిన బ్రహ్మవర్చస్సు అనే వెలుగును పూర్తిగా ప్రసరించే వానిగా రూపాంతరం చెందు. అనంత కోటి సూర్యులకు సమానమైన ఆ దివ్యత్వానికి సజీవంగా సాక్షీభూతంగా జీవించడమే నీ జీవితం యొక్క లక్ష్యంగా పెట్టుకో.

తత్వమసి
బ్రహ్మము లేదా పరమాత్మయే సత్యము. ఆయన అందరి యొక్క ఆత్మ. ఆయనే ఈ ప్రపంచం యొక్క సారము. ఇంత విభిన్నమైన, విరుద్ధమైన ప్రకృతి యందు ఎటువంటి ద్వైతానికి తావు ఇవ్వని, ఏకత్వము ఆయన. ఆయన అమరుడు, సర్వవ్యాపి, నిత్యానందస్వరూపి అయిన బ్రహ్మము. తత్వమసి - అదే నువ్వు. ఇది తెలుసుకొని ముక్తుడవు అవ్వు.

బ్రహ్మ సూత్రాలు ముఖ్యమైన నాలుగు వాక్యాలు గుర్తుపెట్టుకో. (1) అథాతో బ్రహ్మజిజ్ఞాస - కనుక ఇప్పుడు, బ్రహ్మం యొక్క విచారణ చేపట్టు. (2) జన్మాద్యస్య యతః - దేని నుంచి ఈ సృష్టి ఉద్భవిస్తుందో, ఆ మూలము (3) శాస్త్రయోనిత్వత్ -అయితే సరైన జ్ఞానానికి మూలం గ్రాంధాలు (4) తత్ తు సమన్వయత్ - ఎందుకంటే అదే ముఖ్యమైన ఆధారము.

ఇప్పుడు ఇలా కీర్తించు :
జయ గురు శివ గురు హరి గురు రామ
జగద్గురు పరమ గురువు సద్గురు శ్యామ

వ్యాస మహర్షి మరియు బ్రహ్మవిద్యా గురువులను గుర్తుపెట్టుకుని గౌరవించు. వారి యొక్క ఆశీర్వాదాలు నీపై ఉండుదువుగాక! జీవన్ముక్తుల ఆశీస్సులతో అవిద్య అనే ఒక చిక్కుముడిని తెంచుకొని జీవన్ముక్తుడవై అన్ని చోట్ల శాంతిని, ఆనందాన్ని, వెలుగును ప్రసరించెదవు గాక.

మూడవ అధ్యాయము సమాప్తము 

Friday 11 October 2019

Saturday 5 October 2019

మధర్ సూక్తి



It is the Divine Presence that gives value to life. This Presence is the source of all peace, all joy, all security. Find this Presence in yourself and all your difficulties will disappear.

- The Mother


స్వామి శివానంద విరచిత గురుతత్వము - 14 వ భాగము



నాలుగు రకాల శిష్యులు

ఉత్తమ శిష్యుడు వాయువేగంతో ఉంటాడు. ఎంతో దూరంలో ఉన్నప్పటికీ గురువు ఒక్క ఉపదేశానికి అతడు వెంటనే చురకగా స్పందిస్తాడు.

రెండవ రకం శిష్యుడు కర్పూరం వంటి వాడు. గురువు యొక్క స్పర్శ అతని అంంతరాత్మను జాగృత పరిచి, అతనిలో ఆధ్యాత్మికత అనే అగ్ని రగిలిస్తుంది.

మూడవ రకం శిష్యుడు బొగ్గు వంటివాడు. అతడిలో ఉన్న చైతన్యాన్ని జాగృతం చేయడానికి గురువు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

నాలుగవ రకం శిష్యుడు మోడు వంటివాడు. ఏ ప్రయత్నం చేసినా అతని మీద ఏ ప్రభావం ఉండదు. గురువు ఏమి చేసినా, అతడు పట్టనట్లుగా, స్తబ్ధంగా ఉంటాడు.

అందంగా చెక్కబడిన ఒక శిల్పానికి రెండు విషయాలు అవసరము. ఒకటి సంపూర్ణత, దోషరహితం, చక్కని శిల. రెండవది గొప్ప శిల్పి. గొప్ప శిల కూడా గొప్ప శిల్పంగా మారడానికి, ఉలి దెబ్బలు తినడానికి ఒక శిల్పి చేతుల్లో బేషరతుగా ఉండాలి. అలాగే శిష్యుడు తనని తాను బాగు పరచుకోవాలి, పవిత్రుడిని చేసుకోవాలి మరియు ఏ దోషం లేని శిల వలె గురువు యొక్క మార్గదర్శనంలో ఉండాలి, గురువు తనను భగవంతుని యొక్క రూపంగా చెక్కేందుకు అనుమతి ఇవ్వాలి.

రెండవ అధ్యాయము సమాప్తము 

----------------------------------------------- 

మూడవ అధ్యాయము

గురుపూర్ణిమ యొక్క ప్రాముఖ్యత

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః

శివునకు, విష్ణువుకు, వేదవ్యాసుల వారికి మరియు శంకరాచార్యులకు నమస్కారాలు. వేదాంత సూత్రాలను రచించిన వేదవ్యాస మహర్షికి మరియు వాటికి భాష్యం అందిచిన ఆదిశంకరాచార్యుల వారికి మరల మరల నమస్కారములు.

ఆషాడ మాసంలో వచ్చే పూర్ణిమ అత్యంత పవిత్రమైనది, అది గురు పూర్ణిమ. గురుపూర్ణిమ రోజున, భగవాన్ వేదవ్యాస మహర్షి లేదా కృష్ణద్వైపాయనుని స్మరణలో సన్యాసులంతా ఏదో ఒక చోట కూర్చుని వేదాంత విచారం చేస్తారు మరియు వ్యాస మహర్షి మూడు సార్లు దీవించి అందించిన బ్రహ్మసూత్రాల మీద ప్రవచనం చేస్తారు. నాలుగు వేదాలను విభాగం చేసి, 18 పురాణాలు రచించి, మహాభారతం, భాగవతం అందించి మానవాళికి సర్వకాల సర్వావస్థలలో మర్చిపోలేనంత సేవ చేశారు శ్రీ వేద వ్యాస మహర్షి. ఆయన యొక్క రచనలు నిరంతరం చదివి, ఆయన బోధనలను ఆచరించి, ఈ కలియుగంలో మనము తిరిగి భగవంతుని దిశగా చేరే విధంగా మలుచుకుని, మనలో ఆయన పట్ల ఎంతో గాఢంగా ఉన్న కృతజ్ఞతను, మరియు కొంత ఋణాన్ని తిరిగి చెల్లించే ప్రయత్నం చేయగలము. దివ్యమైన ఈ మహాపురుషుని గౌరవార్థం, సాధకులు మరియు భక్తులు ఈనాడు వ్యాస పూజ చేస్తారు. శిష్యులు తమ గురువులను పూజిస్తారు. మహాత్ములు మరియు సాధువులను గృహస్థులు పిలిచి, వారికి దానం మొదలైనవి ఎంతో అత్యధిక విశ్వాసం మరియు నిజాయితీతో నిర్వర్తిస్తారు. సన్యాసులకు ఈ రోజు నుంచే చాతుర్మాస్యం మొదలవుతుంది. వర్షఋతువుకు చెందిన ఈ నాలుగు నెలల్లో, సన్యాసులు ఒకే ప్రదేశంలో ఉంటూ బ్రహ్మసూత్రాలను చదువుతూ ధ్యానం చేస్తారు.

Thursday 3 October 2019

మహాత్మ గాంధీ సూక్తి



"The tendency of Indian civilization is to elevate the moral being, that of the western civilization is to propagate immorality. The latter is godless, the former is based on a belief in God."

- Mahatma Gandhi

(source: Popular Hinduism: The Religion of the Masses - By L S S O'Malley p. 46).