Sunday, 19 January 2014

।। संकट-नाशन-गणेश-स्तोत्रं ।।

।। संकट-नाशन-गणेश-स्तोत्रं ।।

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं ।

भक्तावासं स्मरेन्नित्यं आयुष कामार्थ सिद्धये । । १ । ।

प्रथमं वक्र-तुंडं च एकदंतं द्वितीयकं ।

तृतीयं कृष्ण-पिंगाक्षं गजवक्त्रं चतुर्थकं । । २ । ।

लम्बोदरं पंचमं च षष्टम विकटमेव च ।

सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं । । ३। ।

नवमं भालचंद्रं च दशमं तू विनायकं ।

एकादशं गणपतिं द्वादशं तू गजाननं । । ४ । ।

द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः ।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो । । ५। ।

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं ।

पुत्रार्थी लभते पुत्रान्मोक्षार्थी लभते गतिं । । ६ । ।

जपेत् गणपति-स्तोत्रं षट्भिः मासैः फलं लभेत ।

संवत्सरेण सिद्धिं च लभेत् नात्र संशयः । । ७ । ।

अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् ।

तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः । । ८। ।

। । इति श्रीनारदपुराणे संकट-नाशन-गणेश स्तोत्रं । ।

SANKATA HARA GANESHA STOTRAM

SANKATA HARA GANESHA STOTRAM – Sankashtnashana sthothra

Narada Uvacha:

Om Pranamya Sirasa devam Gauri Puthram Vinayakam
Bhaktavasam Smarennithyam Ayuh Kamartha Siddaye ! (1) 

Prathamam Vakrathundam cha Ekadantham Dvithiyakam
Thrithiyam Krishna Pingaaksham Gajavakthram Chathurthakam (2)

Lambodaram Panchamam cha Shashtam Vikatameva cha
Saptamam Vighna Rajam cha Dhoomravarnam thathashtakam (3)

Navamam Phala Chandram cha Dasamam thu Vinayakam
Ekadasam Ganapathim Dwadasam thu Gajananam !! (4)

Dwadasaithani Namaani Thri Sandhyam Yah Pathennarah
Na cha Vighna Bhayam thasya Sarva Siddhi karim Prabho! (5)

Vidyarthi Labhate Vidyam Dhanarthi Labhate Dhanam
Puthrarthi Labhate Putraam Mokshaarthi Labhate Gatim (6)

Japeth Ganapthi Stotram Shadbhirmaasai Phalam Labheth,
Samvatsarena Siddhim cha Labhate Naathra Samsayaha ! (7)

Ashtabhyo Brahmanebhyash cha Likhitwa yah Samarpayeth
Thasya Vidya bhavetsarva Ganeshasya Prasadathaha !! (8)

Ithi Sri Narada Purane Sankashta Nashana Ganapathi Sthothram Sampoornam.

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తోలగిపోతాయి. 

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |

ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |

విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం |
పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః  ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |

|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||

ఓం శాంతిః శాంతిః శాంతిః 

Wednesday, 15 January 2014

దేశీ ఆవు ప్రాముఖ్యత

దేశీ ఆవు ప్రాముఖ్యత మరియు భారతీయ వ్యవసాయానికి దాని ఆవశ్యకత :-

With special thanks to Sri Gopi Krishna (https://www.facebook.com/rama.chandra.79677) for posting this valuable information.

"పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం" ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు: సుభాష్ పాలేకర్

ప్రకృతి వ్యవసాయం లో కలుపు సమస్యే కాదని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే అంశంపై రెడ్‌హిల్స్‌లో సోమవారం రైతులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు.
సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయన్నారు. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరమన్నారు. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే.. భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదని, దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయని పాలేకర్ వివరించారు. శిబిరంలో వ్యవసాయ శాఖ కమిషనర్ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి పాలేకర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఆయనతో చర్చించారు. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు తన విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మంది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని పాలేకర్ తెలిపారు.

ఈ వ్యవసాయంలో మన దేశీయ గోవులది ప్రధాన పాత్ర. దేశీ ఆవుల మూత్రంలో , పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి , కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు . జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజులు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పాల విషయంలో కూడా జెర్సీకి , దేశీ అవుకు చాలా తేడాలున్నాయి. జెర్సీ ఆవు పాలలో " A 1 బీటా కేసిన్ " అనే కాన్సర్ కారక ప్రోటిను ఉంటుంది , దేశీ ఆవు పాలలో " A 2 బీటా కేసిన్ " అనే ఔశద ప్రోటిను ఉంటుందని పరిశోదనలు తెలుపుతున్నాయి. విదేశీయులు మనకు జెర్శీ ఆవులను అంటగట్టి వారు మత్రం మన దేశీ ఆవుల ద్వారా లభించే A 2 పాలను సేవిస్తున్నారు . జెర్సీ ఆవు ( శాస్త్రీయ నామం :- బాస్ టారస్ ) జన్యు క్రమములో , దేశీ ఆవు ( శాస్త్రీయ నామం :- బాస్ ఇండికస్ ) జన్యు క్రమంలో తేడాలున్న కారణంగానే అది దేశీ ఆవుతో సమానం కాదు . కావున దేశీ ఆవులను కాపాడవలసిన ఆవశ్యకతను ప్రజలకు తెలయజెప్పి , వాటిని పరిరక్షించి దేశాన్ని , రైతులను కాపాడాలనే దృడ సంకల్పంతో శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఈ ఆందోళనను ముందుకు నడిపిస్తున్నారు. )

బ్రెజిల్ దేశంలో మన దేశీ ఆవుల ద్వారా లభించిన " బ్రాహ్మిణ్ " జాతి ఆవుల ద్వారా రోజుకు 40 లీటర్ల ఆరోగ్యకరమైన A2 పాలను పొందుతున్నారు . మన దేశీ ఆవులు ఎటువంటి కరువు పరిస్థితులనైనా తట్టుకొని జీవిస్తాయి. పాలను పొందడానికి "ఆక్సిటోసిన్" లాంటి హానికారక హార్మోనులను ఎక్కించవలసిన పనిలేదు. రోగ క్రిమి నాశక మందులను ప్రతి నెలా ఇవ్వనవసరం లేదు. శీతలీకరణ పరికరాలను అమర్చవలసిన పనిలేదు . మన దేశి ఆవులను పెంచడం చాల సులభం. దేశీ ఆవులలోని కొన్ని జాతులను సంకరపరిచి ఎక్కువ పాలిచ్చే జాతిని పెంపొందించవచ్చు. ఇలా చేయడం వల్ల మన రైతులు మన దేశీ ఆవుల పెంపకంపై ఆసక్తి చూపి , వాటిని పెంచి లాభం పొందుతారు.

గోమాతను పూజించండి మానవత్వాన్ని కాపాడండి.హిందిలో ఉన్నా ఈ యుట్యూబ్ విడియో చూడండి.
http://www.youtube.com/watch?v=ZzgxspB788s

Thursday, 9 January 2014

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ఇది చలికాలం. దక్షిణాయనం. సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరిగిపొవడం, చలిమంచు వలన భూమి వచ్చే సూర్యకిరణాల ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల దేశంలో రోగాలు త్వరగా వ్యాపిస్తాయి. మన శరీరంలో 7 చక్రాలుంటాయి. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల్లో 7 రకాలరంగులు మన శరీరంలోని 7 చక్రాల (నాడీ కేంద్రాలు) మీద ప్రభావం చూపిస్తాయి.

రంగులు మానవ మనసుపై ప్రభావం చూపిస్తాయని, వివిధ రకాలా మానసిక, శారీరిక రోగాలున్నవారిని కొన్ని రంగులకు ప్రభావితం చేయడం వలన, వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చని ఆధునిక వైద్యశాస్త్రం గుర్తిస్తోంది. ఈదే అంశాన్ని మనవాళ్ళూ ఎన్నో యుగాలకు ముందే తెలుసుకుని, ఆచరణలో పెట్టారు. రంగులును ముగ్గులలో వేయడం వలన వాటి మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది మనిషి శరీరం మీద పడతాయి. ఆ కిరణాలను శరీరం గ్రహించడం ద్వారా రోగనిరోధకశక్తి కోల్పోకుండా ఉంటారు. అందుకే ధనుర్మాసంలో నెల రోజులు తప్పకుండా రంగవల్లులు వేస్తారు.

 ఆట్లాగే చలికారణంగా జనంలో బద్ధకం పెరుగుతుంది. జనంలో ప్రకృతి మార్పులవల్ల కలిగే ఈ బద్దకాన్ని తొలగించడానికి మనం ప్రాచీనులు కనిపెట్టిన కలర్ థెరపీ ఈ రంగవల్లులు. మన సంప్రదాయాలేమీ ఊరికినే రాలేదు. వాటి వెనుక బోలెడు ఆరోగ్య సూత్రాలు, శాస్త్రీయకారణాలు ఉన్నాయి.

ధనుర్మాసంలోనే రంగవల్లులు నెలంతా ఎందుకు వేస్తారనే విషయానికి వస్తే చెట్లు ఆకులు రాలి, లోకమంతా చాలా అందవీహినంగా కనిపించే కాలం ఈ ఋతువు ఇది మనసుపై దుష్ప్రభావాన్ని చూపి, డిప్రెషన్‌కు దారితీస్తుందని ఆధునిక మానసిక వైద్యులు చెప్తారు. అందుకే విదేశాల్లో హేమంతఋతువులో కలైడోస్కోప్ (అనేక చిత్రదర్శినీ) చూస్తూ సమయం గడపని అక్కడి వైద్యులు గట్టిగా చెప్తారు.

కానీ మనకు ఆ బాధలేదు, ఋషులు గొప్పవారు. వారిది దూరదృష్టి, కొన్ని వేళ ఏళ్ళ క్రితమే అనేక విషయాలను దర్శించారు. ఒక వ్యక్తికి కాదు, సమస్త లోకానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తారు కనుక అందరిని ఈ కాలంలో రంగవల్లులు వేయమన్నారు ఋషులు. ఆ చిన్న కలైడోస్కోప్ గోట్టంలో కనిపించే రంగులు, భారతదేశంలో ప్రతి చోట నెలంతా కనిపిస్తాయి. అన్ని రంగులను ఒకేసారి చూడటం చేత మనసులో ఒక విధమైన ఉల్లాసం, ఉత్తేజం కలిగుతుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇది ఒక రకమైన Colour Theraphy.ఇలా చెప్పుకుంటూ పోతే, ధనుర్మాసం గురించి అనేకానేక విషయాలు, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవచ్చు.            

Sunday, 5 January 2014

రోజు ఇంట్లో దీపారాధనకు పాటించవలసిన నియమాలు ఏంటి?

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.

అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)

దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.

ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాకా.    

Wednesday, 1 January 2014

Celebration of Bhagavan’s Birthday

'Verses on the Celebration of Bhagavan’s Birthday'

[Bhagavan was born on December 30, 1879. His birthday, however, is observed according to the Tamil calendar in dhanurmasa when the moon is with the star Punarvasu. According to the Western calendar this day falls in the months of December-January. When it was first proposed in 1912, Bhagavan expressed his objection in the form of the following two verses. Even so, his disciples were not deterred and the Jayanti day festival continues to be one of the great annual events at the Ashram]

1. You who wish to celebrate a birthday, inquire first who was born. One’s true birthday is when one enters into the Eternal Being which shines forever without birth or death.

2. Of all days on one’s birthday one should mourn one’s fall (into samsara). To celebrate it as a festival is like adorning and glorifying a corpse. To seek one’s Self and merge in it is wisdom.

Courtesy: Evan Keith