Showing posts with label ధనుర్మాసం. Show all posts
Showing posts with label ధనుర్మాసం. Show all posts

Thursday, 15 December 2016

ధనుర్మాసం విశిష్టత

16 డిసెంబరు 2016, శుక్రవారం నుంచి  ధనుర్మాసం ప్రారంభం


ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని �బాలభోగం� అని పిలుస్తారు.

భోగితో ముగుస్తుంది:
సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) �మార్గళి వ్రతం� పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

ఎంతో పునీత మాసం:
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. �ధను� అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

బ్రహ్మముహూర్తంలో పారాయణం:
ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచనం. సాక్షాత్‌ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో �తిరు� అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం,త ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ, తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్య ంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

శ్రీకృష్ణుడికి తులసిమాల:
ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది.ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి, ఆశీస్సులు అందుకోవాలి.

శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా
తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపర మాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయు లందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సుల భంగా వశపరచుకోవచ్చనీ, నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి, తిరుప్పావై గాన ,శ్రవణం చేసిన వారికీ ఆయు రారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ, ఆశిద్దాం.

ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?
ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోచనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది.
ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది . ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.

కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:
వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:
రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.

కాత్యాయనీ వ్రతం:
పూజా విధానం:
రోజులానే ముందు పూజ చేసుకోవాలి... ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం,గోదా అష్టోత్తరం చదువుకోవాలి..రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది... ముందుగా ప్రార్ధన చదవాలి...ఆ తరువాత వరుసగా తనయ చదవాలి...తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి...తనయ చదువుతూ తొమ్మిది,పది తనయలు రెండు సార్లు చదవాలి..చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి..ఆ తరువాత ప్రార్ధన చదవాలి..ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి..ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.. పాశురములు చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి..అల మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి...అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను,చివరపాశురంలో ఒక లైను చదవాలి..
చివరగా గోదా హారతి చదవాలి..మంత్ర పుష్పం కూడా చదవాలి..మళ్ళి ఏ రోజు పాశురం ఆ రొజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి...నైవేద్యం సమర్పంచాలి(రోజు పొంగలి,తద్ధోజనం,పరవన్నం ఉండి తీరాలి....కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు...కాని ఒక్క విషయం గుర్థుకు పెట్టుకోవాలి..పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి..

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=6&ContentId=200981 

Wednesday, 13 January 2016

ధనుర్మాస వ్రతం - ఆరోగ్యం - ఆయుర్వేదం

ధనుర్మాసం హేమంత ఋతువులో వస్తుంది. ఈ సమయానికి భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది, పొగమంచు కారణంగా సూర్యుడి కిరణాలు భూమిని అధికంగా చేరలేవు, ఫలితంగా అరుగుదల, ఇతర జీవక్రియలు నెమ్మదిస్తాయి. అదే ఆకులు రాలి ప్రకృతి మొత్తం కళావీహినమైన కారణం చేత మనసుని జడత్వం, బద్దకం ఆక్రమిస్తాయి. హిందూ ధర్మం అంటే విశ్వధర్మం, మనిషి విశ్వానికి అనుగుణంగా బ్రతకడం జీవించడమే, ఆఖరున విశ్వాత్మలో ఐక్యమవడమే ఈ ధర్మం యొక్క లక్ష్యం. ఈ ధనుర్మాస వ్రతం ఆచరించేవారు ఉదయం వేకువజామునే లేచి పూజ ముగించి సూర్యోదయానికి పూర్వమే భగవంతునికి నివేదన చేయడం కూడా పూర్తి చేయాలి. ప్రతి రోజు ఒక్కో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది, పులగం, కట్టెపొంగలి, చక్రపొంగలి, పరమాన్నం, పులిహోర ఇలా అన్నమాట. వాటిలో ఏఏ పదార్ధాలు వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎంత వేయాలో కూడా ముందే నిర్ణయించారు పెద్దలు.

ఇందులో ఆయుర్వేద శాస్త్రం ఇమిడి ఉంది. మిరియాలు, శొంఠి, ధనియాలు, ఇంగువ మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి ఔషధగుణం కలిగినవి. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను అరికట్టే శక్తి వీటికి ఉంది. ఇవే కాక దద్దోజనం కూడా వండుతారు. అసలు సూర్యోదయానికి ముందే నివేదన పూర్తి చేయాలన్న నియమం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఇది చలికాలం, పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. సూర్యాస్తమాయం తర్వాత 1-2 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనైన రాత్రి భోజనం ముగించాలి, అప్పుడే ఆహారం అరిగి, ఆరోగ్యంగా ఉండగలం. హేమంత ఋతువులు సూర్యాస్తమయం సాయంత్రం 5:30లో అవుతుంది. అంటే 7:30 లోపు రాత్రి భోజనం ముగించాలి. ఆ తర్వాత ఏమి తిన్నా అరగడం కష్టం. రాత్రి సమయం ఎక్కువ కావడం చేత ఉదయం సూర్యోదయం 6:30 కు అటుఇటుగా అవుతుంది. ఉదయం 8:30 కు ఉదయం భోజనం చేస్తామనుకున్నా, మధ్యలో 13-14 గంటల సమయం జీర్ణవ్యవస్థ ఖాళిగా ఉంటుంది. ఇంతసేపు ఖాళీగా ఉంటే, కడుపులో గ్యాస్ ఏర్పడి కొత్త రోగాలు వస్తాయి. కనుక ఇది ఆలోచించిన ఋషులు ఉదయమే అందరూ స్నానాలు ముగించి సూర్యోదయానికల్లా పూజ ముగించమన్నారు. సూర్యోదయం అవ్వగానే ఆహారం స్వీకరించవచ్చు కనుక ఈ ప్రసాదంగా చేసిన ఔషధవంటకాలను భుజిస్తారు. దద్దోజనం వంటివి గ్యాస్ ఏర్పడకుండా హరిస్తాయి. ఉదయం పరగడుపున ఏది స్వీకరిస్తమో, దాన్ని శరీరం పూర్తిగా స్వీకరిస్తుంది. ఔషధ తత్వాల ఆహారం స్వీకరిస్తే, రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

భోగి విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_10.html

గొబ్బెమ్మల విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_8.html

రంగవల్లులు - ఆరోగ్యం విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post.html

భోగి పండ్లెందుకు పోస్తారు కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_12.html

ఆండాళ్ అమ్మవారి కధ కోసం ఈ లింక్ చూడండి.
http://ecoganesha.blogspot.in/2016/01/blog-post_13.html

ధనుర్మాసం - ఆండాళ్ అమ్మవారు

అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. అందులో సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూయుడు ఒక్కో రాశిలో నెలరోజులు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. అలా సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో మొదలవుతుంది ధనుర్మాసం. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం ఇది. అన్ని పండుగులు చంద్రమానం ప్రకారం చేసుకున్నా, ధనుర్మాసాన్ని సౌరమానం ప్రకారం పాటిస్తాం. ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేది తిరుప్పావై, ఆండాళ్ అమ్మవారు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.

ఆండాళ్ అమ్మవారు ఈ మాసంలో శ్రీ కృష్ణుడి గురించి వ్రతం చేసి ఆయన్ను చేరుకున్నారు. కలియుగంలో 93వ సంవత్సరంలో శ్రీ ఆండాళ్ తమిళనాట శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనంలో విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) లభించారు ఆండాళ్ అమ్మవారు. తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం, తండ్రి ఆమెను కోదా అని పిలిచేవాడు, క్రమేపి ఆపేరే గోదాగా మారింది. తండ్రిపెంపకంలో ఆమెకు కృష్ణ పరమాత్మ పట్ల గొప్ప భక్తి అలవడింది. కాలక్రమంలో ఆమె కృష్ణుడినే తన పతిగా భావించింది. తన తండ్రి కృష్ణుడికి తులసి మాలలు సమర్పించేవారు, గోదాదేవి విష్ణుచిత్తులవారికి తెలియకుండా ఆ మాలలు తాను ధరించి, తను భగవంతుని వివహామాడటానికి సరిపోదునా అని చూసుకుని, మురిసిపోయి, తన తండ్రికి తెలియకుండా ఆ మాలలను యధావిధిగా బుట్టలో ఉంచేది. ఒకనాడు తండ్రికి మాలాలో వెంట్రుక కనిపిచగా, అది గోదా ధరించిందని గ్రహించి, ఒకరు ధరించిన మాలను స్వామికి సమర్పించడం తప్పని సమర్పించలేదు. ఆ రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి, తనకు గోదా ధరించిన మాల అంటే ఇష్టం అని, అది ఎందుకు సమర్పించలేదని ప్రశ్నిస్తాడు. ఆ సంఘటనతో గోదాదేవి కారణజన్మురాలని అర్ధం చేసుకుని, మమ్మల్ని కాపాడుటకు వచ్చావని, ఆమెను ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టారు విష్నుచిత్తుడు. అప్పటినుంచే రోజు ఆండాళ్ సమర్పించిన మాలనే స్వామికి సమర్పించేవారు. గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరుని వెదకటానికి సిద్ధమవ్వగా, ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్తుంది. కాని తండ్రి కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని, అది చాలదూరము, కాలము కూడా వేరని, ఇప్పుడు కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్తారు. విష్ణుచిత్తులవారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల వైభవాన్ని కీర్తించగా, గోదాదేవి శ్రీరంగంలో ఉన్న రంగనాయకులని తనకు వరునిగా తలచింది. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను "తిరుప్పావై" మరియు "నాచియార్ తిరుమొఱ్ఱి" అనే దివ్యప్రభందాలను పాడారు. ఆ తర్వాతా ఆమె శ్రీ రంగనాధుని వివాహమాడి, ఆయనలో ఐక్యమైంది.

ఆండాళ్ అమ్మవారు చేసిన ఆ గానాన్ని ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవదేవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు. శైవాలయాల్లో ఇదె సమయంలో తిరువెంబావైని గానం చేస్తారు. భోగి పండుగనాడు గోదారంగనాయకుల కళ్యాణం చేస్తారు.
----------------------------------------
భోగి విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_10.html

గొబ్బెమ్మల విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_8.html

రంగవల్లులు - ఆరోగ్యం విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post.html

భోగి పండ్లెందుకు పోస్తారు కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/01/blog-post_12.html

ధనుర్మాస నివేదనలు - ఆయుర్వేదం - ఆరోగ్యం కొరకు ఈ లింక్ చూడండి.
http://ecoganesha.blogspot.in/2016/01/blog-post_49.html 

Thursday, 9 January 2014

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ఇది చలికాలం. దక్షిణాయనం. సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరిగిపొవడం, చలిమంచు వలన భూమి వచ్చే సూర్యకిరణాల ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల దేశంలో రోగాలు త్వరగా వ్యాపిస్తాయి. మన శరీరంలో 7 చక్రాలుంటాయి. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల్లో 7 రకాలరంగులు మన శరీరంలోని 7 చక్రాల (నాడీ కేంద్రాలు) మీద ప్రభావం చూపిస్తాయి.

రంగులు మానవ మనసుపై ప్రభావం చూపిస్తాయని, వివిధ రకాలా మానసిక, శారీరిక రోగాలున్నవారిని కొన్ని రంగులకు ప్రభావితం చేయడం వలన, వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చని ఆధునిక వైద్యశాస్త్రం గుర్తిస్తోంది. ఈదే అంశాన్ని మనవాళ్ళూ ఎన్నో యుగాలకు ముందే తెలుసుకుని, ఆచరణలో పెట్టారు. రంగులును ముగ్గులలో వేయడం వలన వాటి మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది మనిషి శరీరం మీద పడతాయి. ఆ కిరణాలను శరీరం గ్రహించడం ద్వారా రోగనిరోధకశక్తి కోల్పోకుండా ఉంటారు. అందుకే ధనుర్మాసంలో నెల రోజులు తప్పకుండా రంగవల్లులు వేస్తారు.

 ఆట్లాగే చలికారణంగా జనంలో బద్ధకం పెరుగుతుంది. జనంలో ప్రకృతి మార్పులవల్ల కలిగే ఈ బద్దకాన్ని తొలగించడానికి మనం ప్రాచీనులు కనిపెట్టిన కలర్ థెరపీ ఈ రంగవల్లులు. మన సంప్రదాయాలేమీ ఊరికినే రాలేదు. వాటి వెనుక బోలెడు ఆరోగ్య సూత్రాలు, శాస్త్రీయకారణాలు ఉన్నాయి.

ధనుర్మాసంలోనే రంగవల్లులు నెలంతా ఎందుకు వేస్తారనే విషయానికి వస్తే చెట్లు ఆకులు రాలి, లోకమంతా చాలా అందవీహినంగా కనిపించే కాలం ఈ ఋతువు ఇది మనసుపై దుష్ప్రభావాన్ని చూపి, డిప్రెషన్‌కు దారితీస్తుందని ఆధునిక మానసిక వైద్యులు చెప్తారు. అందుకే విదేశాల్లో హేమంతఋతువులో కలైడోస్కోప్ (అనేక చిత్రదర్శినీ) చూస్తూ సమయం గడపని అక్కడి వైద్యులు గట్టిగా చెప్తారు.

కానీ మనకు ఆ బాధలేదు, ఋషులు గొప్పవారు. వారిది దూరదృష్టి, కొన్ని వేళ ఏళ్ళ క్రితమే అనేక విషయాలను దర్శించారు. ఒక వ్యక్తికి కాదు, సమస్త లోకానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తారు కనుక అందరిని ఈ కాలంలో రంగవల్లులు వేయమన్నారు ఋషులు. ఆ చిన్న కలైడోస్కోప్ గోట్టంలో కనిపించే రంగులు, భారతదేశంలో ప్రతి చోట నెలంతా కనిపిస్తాయి. అన్ని రంగులను ఒకేసారి చూడటం చేత మనసులో ఒక విధమైన ఉల్లాసం, ఉత్తేజం కలిగుతుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇది ఒక రకమైన Colour Theraphy.ఇలా చెప్పుకుంటూ పోతే, ధనుర్మాసం గురించి అనేకానేక విషయాలు, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవచ్చు.