Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Monday, 23 September 2019
Sunday, 22 September 2019
Saturday, 21 September 2019
Friday, 20 September 2019
స్వామి శివానంద విరచిత గురుతత్వము - 11 వ భాగము
గురు సేవ
ప్రారంభంలో సాధకులు తమ యొక్క మొత్తం దృష్టిని నిరంతరం గురుసేవ మీదేనే కేంద్రీకరించాలి. నీ గురువుని దివ్యమైన భావముతో సేవించు. ఇతరుల నుంచి తాను వేరు అనుకునే భయానకమైన రోగం తొలగిపోతుంది.
ఓడ ఒక్క నావికుడు ఎల్లప్పుడు జాగురూకతతో ఉంటాడు. చేపలు పట్టే వాడు ఎల్లవేళలా జాగురూకతతో ఉంటాడు. ఆపరేషన్ థియేటర్ లో చికిస్తా సమయంలో ఎల్లవేళలా జాగురూకతతో ఉంటాడు. అలాగే ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన శిష్యుడు తన గురువు యొక్క సేవలు ఎల్లప్పుడు జాగరూకతతో ఉండాలి.
గురు సేవ కోసమే జీవించు. అవకాశాల కోసం ఎదురుచూడు. పిలిచి సేవకు అవకాశం ఇవ్వాలని గురువు చెప్పేదాకా ఎదురుచూడకు. గురుసేవ కోసం నీకు నువ్వే ముందుకు వెళ్ళు.
నీ గురువును వినయంతో, ఇష్టంతో, ప్రశ్నలకు తావు లేకుండా, అహంకార రహితంగా, లోభత్వం లేకుండా, సంపూర్ణముగా, అలసట లేదా విసుగు చెందకుండా, ప్రేమతో సేవించు. గురువును సేవించడంలో నీవు ఎంత ఎక్కువ శక్తిని వినియోగిస్తే, అంత ఎక్కువ దివ్య శక్తి నీలోకి ప్రవహిస్తుంది.
గురువు సేవించేవాడు సమస్త ప్రపంచాన్ని సేవిస్తాడు. స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా గురువుకు సేవ చెయ్యి. గురువుకు సేవ చేస్తున్న సమయంలో నీలో ఉండే గుణాలను లేదా ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించు. పేరు, కీర్తి, సంపద, అధికారం మొదలైన విషయములను ఆశించకుండా గురువుకు సేవ చేయాలి.
గురువు పట్ల విధేయత
గురువు పట్ల గౌరవం చూపడం కంటే విధేయతతో ఉండటం మేలు. విధేయత అనేది ఒక గొప్ప సద్గుణము. ఎందుకంటే నీవు విధేయతను అలవరుచుకునే ప్రయత్నం చేస్తే, ఆత్మజ్ఞానానికి లేదా ఆత్మసాక్షాత్కారానికి బద్ధశత్రువైన అహంకారం మెల్లి మెల్లిగా వ్రేళ్ళతో సహా నశించిపోతుంది.
గురువు చెప్పిన దానిని పాటించే శిష్యుడు మాత్రమే, తన లో ఉన్న అల్పమైన గుణముల మీద ఆధిపత్యం కలిగి ఉంటాడు. విధేయత అనేది చాలా ఆచరణాత్మకంగా, సంపూర్ణ హృదయంతో, నిరంతరం పట్టు వదలని విధంగా ఉండాలి. గురువు పట్ల నిజమైన విధేయత అంటే మొండికేయడం, వాయిదా వేయడం, అలసత్వం ప్రదర్శించడం లేదా ప్రశ్నించడం వంటివి కూడదు. ఒక కపట శిష్యుడు భయంతో గురువు పట్ల విధేయత చూపుతాడు. నిజమైన శిష్యుడు తన గురువు యొక్క ఆజ్ఞను శుద్ధమైన ప్రేమతో ప్రేమ కొరకే పాటిస్తాడు.
గురువు ఆజ్ఞను ఎలా పాటించాలో తెలుసుకో! గురువుకు విధేయంగా ఉండటం నేర్చుకో. అప్పుడు మాత్రమే నీవు ఆధిపత్యం చలాయించగలవు. శిష్యునిగా ఎలా ఉండాలో నేర్చుకో. అప్పుడు మాత్రమే నీవు గురువు కాగలవు.
గురువుకు శరణాగతి చేయటం, ఆయన ఆజ్ఞను పాటించడం, విధేయుడై ఉండటం మరియు ఆయన చెప్పిన సూచనలను ఆచరించడం బానిస మనస్తత్వానికి సంకేతము అనే కపటమైన ఆలొచన లేదా భృఅంతిని వదిలిపెట్టు. వేరొక వ్యక్తి యొక్క ఆజ్ఞ పాటించడం లేదా అతనికి శరణాగతి చేయడం తన మర్యాదకు లోపమని, స్వేచ్ఛకు విరుద్ధమని అజ్ఞాని భావిస్తాడు. చాలా పెద్ద పొరపాటు. నీవు జాగ్రత్తగా ఆలోచిస్తే, వాస్తవంలో నీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, నీ అహంకారానికి మరియు డాంబికానికి పరిపూర్ణంగా బానిసగా మారింది. ఇదంతా విషయాశక్తి గల మనస్సు యొక్క చిత్త చాపల్యము మాత్రమే. ఎవడైతే తన మనస్సు మరియు అహంకారం మీద విజయం సాధిస్తాడో, అతడే నిజమైన స్వేచ్ఛ గల మనుష్యుడు. అతడే వీరుడు. అటువంటి విజయాన్ని సాధించడానికి మానవుడు ఒక గొప్ప ఆధ్యాత్మికతకు ప్రతిరూపమైన గురువుకు శరణాగతి చేస్తాడు. ఈ శరణాగతితో అతను తనలో ఉన్న అల్పమైన అహంకారాన్ని తొలగించుకొని అనంతమైన సచ్చిదానందాన్ని అనుభూతి చెందుతాడు.
Thursday, 19 September 2019
స్వామి శివానంద విరచిత గురుతత్వము - 10 వ భాగము
రెండవ అధ్యాయము
యస్యదేవే పరాభక్తిర్- యథా దేవే తథా గురౌతస్యైతే కథితా హ్యర్థాత్ ప్రకాశాంతే మహాత్మనః
భగవంతుని పట్ల ఎవరి భక్తి గొప్పగా ఉంటుందో, ఎవరు తన గురువుని భగవంతునిగా భావించి పూజిస్తారు/ భగవంతునికి సమానంగా చూస్తారు/ అటువంటి గొప్ప జీవులకు/మహాత్ములకు పవిత్ర గ్రంథాలలో ఉన్న వాక్యాలు వాటికవే తెలియబడతాయి. (శ్వేతాశ్వతరోపనిషత్తు)
గురువు యొక్క ఆదేశాలను/సూచనలు తు.చ. తప్పకుండా పాటించేవాడు, మార్గంలో అల్పస్థాయిలో ఉన్న జీవులకు గురువు యొక్క ఉపదేశాలను ప్రబోధం చేస్తూ, జీవితాంతం గడిపేవాడే శిష్యుడు.
నిజమైన శిష్యుడు గురువు యొక్క దివ్యమైన స్వరూపం గురించే పట్టించుకుంటాడు. గురువు యొక్క మానవ చేష్టితములు శిష్యునకు పట్టవు. అతను వాటిని పూర్తిగా మరిచిపోతాడు/ విస్మరిస్తాడు. అతనికి తన గురువు సంప్రదాయం విరుద్ధంగా నడిచినప్పటికీ, ఆయనే గురువని విశ్వాసంతో ఉంటాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, తపస్సంపన్నుడైన మహా పురుషుని యొక్క స్వభావము చాలా గంభీరమైనది. అతనిలో దోషములు ఎంచకండి, తీర్పులు చెప్పకండి. మీ యొక్క అజ్ఞానం అనే కొలబద్దతో అతని దివ్య స్వభావమును కొలిచే ప్రయత్నం చేయకండి. విశ్వ దృష్టితో గురు చేసే చేష్టలను విమర్శించవద్దు.
నిజమైన శిష్యత్వం కళ్ళు తెరిపిస్తుంది. ఆధ్యాత్మికమైన జ్వాలను రగిలిస్తుంది. శక్తులను మేల్కొలుపుతుంది. వ్యక్తి యొక్క జీవితంలో ఆధ్యాత్మికపథంలో అది అత్యంత అవసరమైనది మరియు. గురు శిష్యుడు ఒక్కటే అవుతారు. గురువు దీవించి, మార్గదర్శనం చేసి, శిష్యుడుని ప్రేరేపిస్తారు. ఆయన శక్తిని ప్రసాదించి, పరివర్తన కలిగించి, ఆధ్యాత్మకీకరణం చేస్తారు.
గురువులు దగ్గరకు వెళ్లడానికి ఎవరు అర్హులు?
ఒక గురువు దగ్గరకు వెళ్లాలంటే, నీకు తగిన అధికారం ఉండాలి. సరైన అవగాహన శక్తి, వస్తువుల పట్ల బంధరాహిత్యము, ప్రశాంతమైన మనస్సు, ఇంద్రియనిగ్రహము, అల్పమైన/భౌతిక కోరికలు లేనితనం, గురువు యందు విశ్వాసం మరియు దైవమందు భక్తి అనేవి గురువును సమీపించే వారికి ఉండాల్సిన అవసరమైన సాధనములు.
మోక్షతృష్ణ ఉన్నవానికి, శాస్త్ర వాక్యాల పట్ల గౌరవం ఉన్నవానికి; కోరికలను, ఇంద్రియాలను నిగ్రహించుకున్నవానికి; స్థిరమైన, ప్రశాంతమైన మనసు ఉన్నవానికి; దయ, దివ్యప్రేమ, వినయము, తితిక్ష, క్షమా మొదలైన సద్గుణాలు కలిగిన వారికి మాత్రమే గురువు ఆధ్యాత్మిక బోధ/ ఉపదేశాలను చేస్తాడు. ఎప్పుడైతే శిష్యుని యొక్క మనస్సు కామరహిత/ కోరికలు లేని స్థితికి చేరుతుందో, అప్పుడే పరబ్రహ్మము గురించి నీగూఢమైన మర్మాల యొక్క ఉపదేశము ఫలించి జ్ఞానము కలుగుతుంది.
Monday, 16 September 2019
స్వామి శివానంద విరచిత గురుతత్వము - 9వ భాగము
అనుగ్రహము మరియు మానవ-ప్రయత్నము
గురువు ఏదో మాయ చేయడం వలన నీకు ఆత్మసాక్షాత్కారం అనేది కలగదు. బుద్ధుడు, రామ తీర్థ మొదలైన వారందరూ సాధన చేశారు. అర్జునుని వైరాగ్యము మరియు అభ్యాసం వృద్ధి పరుచుకోమన్నాడు కృష్ణుడు. "నేను నీకు ముక్తిని ఇస్తాను" అని ఆయన అనలేదు. కాబట్టి గురువు నీకు సమాధి స్థితిని మరియు ముక్తిని ఇస్తాడనే తప్పుడు ఆలోచన విడిచిపెట్టు. ప్రయత్నించు, పవిత్రత పొందు, ధ్యానం చేయి, సాక్షాత్కారం పొందు.
గురుకృప, గురువు అనుగ్రహం అనేది చాలా ముఖ్యము. దాని యొక్క అర్ధం, శిష్యుడు ఖాళీగా కూర్చోవాలని కాదు. అతడు ఎంతో పురుషార్థము, ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. మొత్తం కర్మ అంతా శిష్యుడే చేయాలి. ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే, సన్యాసి కమండలంలో ఒక్క చుక్క నీరు త్రాగాలి మరియు దాంతో వెంటనే సమాధి స్థితిలోకి చేరిపోవాలని కోరిక కలిగి ఉన్నారు. పవిత్రతను పొంది, ఆత్మసాక్షాత్కారం కోసం సాధన చేయడానికి వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా లేరు. సమాధి స్థితిని ఇచ్చే ఒక మాయాగుళిక వారికి అవసరం. నీకు అటువంటి బ్రాంతి లేదా భ్రమ ఉంటే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టు.
గురువు మరియు శాస్త్రాలు నీకు మార్గాన్ని చూపెట్టి నీ సందేహాలను నివృత్తి చేయగలరు. అపరోక్ష జ్ఞానం యొక్క అనుభూతి నీ సొంత అనుభవానికి వదిలేశారు. ఆకలితో ఉన్న వాడు తన కోసం తానే తినాలి. బాగా దురదు పెడుతుంటే, తన శరీరాన్ని తానే గోక్కోవాలి.
గురువు యొక్క ఆశీర్వాదాలు ఏదైనా చేయగలవు. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆయన ఆశీర్వాదాలు ఎలా పొందాలి? గురువును సంతృప్తి పరచడం ద్వారా. గురువు చెప్పిన ఆధ్యాత్మిక సూచనలను శిష్యుడు సంపూర్ణంగా పాటిస్తే గురువు సంతృప్తి చెందుతాడు. జాగ్రత్తగా అనుసరించు, నీ గురువు యొక్క సూచనలను పాటించు. ఆయన చెప్పిన విధంగా నడుచుకో. అప్పుడు మాత్రమే నీకు ఆయన దీవెనలు పొందగలిగే అర్హత కలుగుతుంది, మరియు అప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వాదాలు/దీవెనలు ఏదైనా చేయగలవు.
ఇక్కడితో ప్రథమాధ్యాయము సమాప్తము
Sunday, 15 September 2019
స్వామి శివానంద విరచిత గురుతత్వము - 8వ భాగము
శక్తి సంచారము
నీవు ఒక మనిషికి కమలాపండు ఇచ్చిన విధంగానే, అలాగే ఆధ్యాత్మిక శక్తిని కూడా ఒకరి నుంచి మరొకరికి ఇవ్వవచ్చు. ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తులను బదిలీ చేయడాన్ని లేదా ప్రసరించడాన్ని శక్తి సంచారము అంటారు. శక్తి సంచారంలో, సద్గురువు యొక్క ఒకానొక ఆధ్యాత్మిక తరంగం శిష్యుని యొక్క మనస్సులోకి బదిలీ అవుతుంది.
శక్తి సంచారానికి ఏ శిష్యుడు తగినవాడని గురువు భావిస్తారో, ఆ శిష్యునకు ఆధ్యాత్మిక శక్తి ప్రచురించబడుతుంది. గురువుకేవలం తన చూపు, ఆలోచన, మాట, సంకల్పం లేదా స్పర్శ ద్వారా ఒక శిష్యుడిని మార్చగలరు.
శక్తి సంచారము అనేది పరంపర ద్వారా వస్తుంది. అది నిగూఢమైన, మార్మిక శాస్త్రము. అది గురువు నుంచి శిష్యులకు అందుతుంది.
స్వామి సమర్థ రామదాసు గారి శిష్యుడు, తన మీద మోహం పెంచుకున్న ఒక నాట్యగెత్తె కూతురుకు తన శక్తిని ప్రసరించారు. ఆ శిష్యుడు ఆమె వైపు చూసారు మరియు ఆమెకు సమాధిస్థితిని ఇచ్చారు. ఆమె యొక్క కామము తుడిచిపెట్టుకొని పోయింది. ఆమె ఎంతో ధార్మికంగా మరియు ఆధ్యాత్మికంగా మారిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు సూర్దాస్ యొక్క గుడ్డి కళ్ళను ముట్టుకున్నాడు. సూర్దాస్ యొక్క అంతఃనేత్రాలు తెరుచుకున్నాయి. అతనికి భావసమాధి కలిగింది. గౌరంగుడు తన స్పర్శ ద్వారా అనేకమంది వ్యక్తులలో ఆధ్యాత్మిక మత్తు కలిగించి, వారిని తన వైపునకు మార్చుకోగలిగాడు. ఆయన స్పర్శతో నాస్తికులు సైతం వీధులలో ఆనందంతో నాట్యమాడి, హరి యొక్క గానం చేశారు.
గురువు నుంచి శక్తులను పొందడంతోనే శిష్యుడు సంతృప్తి చెందకూడదు. పూర్ణత్వాన్ని మరియు ఇంకా ఎన్నో సాధించడానికి అతను తీవ్రంగా కష్టపడాలి. శ్రీరామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుని స్పృసించారు. స్వామి వివేకానందకు దివ్యానుభూతి కలిగింది. కాని ఆ తర్వాత కూడా ఆయన పూర్ణత్వం పొందడానికి మరో ఏడేళ్ళు శ్రమించారు.
Subscribe to:
Posts (Atom)



