Friday, 24 August 2012


ప్రసన్నవదనం? ప్రసన్నమైన ముఖము కలవాడు.నిజానికి ప్రసన్నమైన ముఖం అంటే అందమైన ముఖం అని కాదు.ప్రాచీనులు ఏనాడు మన శరీర అందం గురించి చెప్పలేలెదు.ఎందుకంటె అది తాత్కాలికం.వారు ఎప్పుడు మనొసౌందర్యం గురించి మాత్రమే చెప్పారు.ఎవరు మనస్సు నిత్యం ప్రశాంతంగా,నిర్మలంగా,నిష్కల్మషంగా ఉంటుందొ వారి ముఖం లొ అది ప్రస్పుటమవుతుందని,అలాంటి వారి ముఖం మాత్రమే ఎల్లప్పుడు ప్రసన్నంగా ఉంటుందని అయుర్వేదం చెప్తొంది. ఎవరు ముఖాన్ని చూసినంత మాత్రమే మనొచంచలం అదుపులొనికి వస్తుందొ,భయం తగ్గి దైర్యం కలుగుతుందొ,అలాగే చూస్తు ఉండిపొవాలని అనిపిస్తుందొ అటువంటి ప్రసన్నమైన ముఖం ఆ పరమాత్ముడిని ఈ శ్లొకం లొ వర్ణించారు. లక్ష్మీ స్థానాలుగా ఏనుగు ముఖం,గో మయం,నిరంతరం పసిపిల్లల తిరిగె ప్రదేశం,గోశాల,పరిశుభ్రమైన ఇల్లు,బొట్టున్న మొహం అంటూ చాలనే చెప్పారు.వాటిని చూడగానే మనస్సు అనందపరవశంతొ పొంగిపొతుందని చెప్పారు. వినాయకుడి ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందని ఆయనకు సుముఖుడని పేరు.నిజమే పసిపిల్లలు కూడా ఆయనకు త్వరగా వశం అవ్వడానికి ఆ ఏనుగు ముఖం కూడా ఒక కారణమే.పైగా వినాయకుడి ముఖం ఎప్పుడు ఆనందం గానే ఉంటుంది కదా.అందుకే గణపతిని ధ్యానం చేయడం చేత మనకు త్వరగా సిద్ది,బుద్ది కలిగి త్వరగా జ్ఞానవంతులుగా మారుతారు. ఎవరి ముఖాన్ని ధ్యాననించడం చేత మనం ప్రశాంతతను పొందుతామొ వారిది ప్రసన్నమైన ముఖం.శ్రీ కృష్నుడిని వర్ణీస్తూ మధురాష్ట్టకంలొ వదనం మధురం,హృదయం మధురం.........మధురాధిపతే అఖిలం మధురం అని అంటారు.అంటే జగద్గురు అయిన శ్రీ కృష్న పరమాత్మ ముఖమే కాదు ఆయన రూపమే అందంగా ఉంటుంది.పైగా అఖిలం మధురం అని అనడంలొ ఒక అర్ధం ఉంది.ఆయన అంతటా వ్యాపించి ఉన్నడు కనుక అంతా మధురమే అని,ఆయనను మనస్సునందు ధ్యానించినందున మన మనస్సు కూడా మధురముగా అయ్యి,ముఖం ప్రసన్నంగా అవుతుంది.నిజానికి మన ముఖం ప్రసన్నంగా ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఆధ్యాత్మికత అద్దం లాంటిది.మాములు అద్దం మన బాహ్య సౌందర్యాన్ని ఎల చూపిస్తుందొ అలాగే ఆధ్యాత్మికత మన నిజస్వరూపాన్ని మనకు చూపి మనలొ ఉన్న తప్పులను సరి చేసి,మనలొ ఉన్న పరంధాముడి ని మెల్కొలిపి మనల్ని సదా ప్రసన్నంగా ఉంచి చివరకు ఆ పరంధాముడిలొనే ఐక్యం చేస్తుంది.ఒక్కసారి మన అంతరంగాన్ని అర్ధం చేసుకొగలిగామ మన ప్రసన్నత బయటకు ఉట్టిపడుతుంది అని చెప్తూ నీ లొని పరమాతముడిని మెలుకొలపమని నిగుఢార్ధం.
చతుర్భుజం-?2 నాలుగు భుజాలు అని మాత్రమే చెప్పి వదిలివేసారు.ఎందుకు?మన హిందు ధర్మంలొ ప్రతి దేవునికి చేతిలొ ఆయుధాలు తప్పక ఉంటాయి కద మరి ఆయుధాల గురించి ఎందుకు చెప్పలేదు?వారు చెప్పక కాదు,మనకు వదిలేసారు.నిజానికి ఈ శ్లొకం స్మరణకు మాత్రమే చెప్పలేదు,ధ్యానం కొరకు చెప్పారు.కనుక ప్రతి ఒక్కరు ఈ శ్లొక ధ్యానంలొ వారివరి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆయా దేవిదేవతలు చేతపట్టిన ఆయుధములను మానసికంగా చూడమని చెప్పారు.ఒక్కొ ఆయుధముకు ఒక్కొ ప్రత్యేకత ఉంది. 'ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశదారిణం రదంచవరదం హస్తైర్బిబ్రాణం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే వినయకుడి చేతిలొ పాశం రాగద్వేషలను అణుచుటకు,అంకుశం అరిషడ్వర్గములను(కామ క్రోధ లొభ మోహ మద మాత్సర్యాలు)అణుచుటకు,మరొక చేతిలొ విరిగిన తన దంతం మంచి పనులను చేయుటకు అందం చెదిరిపొతుందని వెనుక అడుగువేయ్యొద్దని,అభయం ద్వార అందరికి భయం లేకుండ తానె చూస్తాడని అర్ధం. అదే సరస్వతి దేవిని స్మరిస్తే ఆమె ఒక చేతిలొ వీణ పట్టుకుని,మరొక చేతితొ వాయీస్తు ఉంటుంది.నిజానికి అది కళలకు సంకేతం.ఒక చేతిలొ వేదలను ఉంచుకొని మరొక చేతిలొ జప మాలతొ ఉంతుంది.అంటే నిరంతర జపం అనగా ప్రాక్టిస్ ద్వార ఎంతటి ఆపారమైన జ్ఞానమైన తప్పక కలుగుతుందని అర్ధం.ఇది విద్యార్థులకు ఎంతొ ముఖ్యమైన సూచికగా ఆమె వాటిని ధరించిందని,కాలిగా తిరిగితే ఏమి ఒరగదని ఆమె ఆయుధములు ఇచ్చే అపూర్వసందేశం. అందుకే మన మహర్షులు చతుర్భుజమని చెప్పి మాత్రమే ఉరుకున్నారు. భగవద్గీతలొ కృష్నుడు తనను చేరుటకు నాలుగు యొగ మార్గలను చెప్పాడు.అవి కర్మ,భక్తి,రజ,జ్ఞాన యొగాలు.అవినాలుగు యొగపురుషుడు అయిన పరమాత్మకు నాలుగు చేతులుగా వర్ణిస్తూ వాటిలొ ఏ చేయి పట్టుకున్న తనను చేరవచ్చని,తనలొ ఐక్యం కావచ్చని భావం. అదే విధంగా ధర్మ,అర్ధ,కమ,మొక్షాలనే నాలుగు పురుషార్ధలు వదలకూడదని,అవి మన ధర్మాచరణకు భుజములని గుర్తుచెయ్యదం. బ్రహ్మచర్య,గృహస్తు,వానప్రస్త,సన్యాస ఆశ్రమమనే నాలుగు ఆశ్రమధర్మాలు మన హిందూ సమాజానికి నాలుగు చేతులు అని,అవి గట్టిగ ఉంటేనె ధర్మరక్షణ జరుగుతుందని అర్ధం.
చతుర్భుజం-?2 నాలుగు భుజాలు అని మాత్రమే చెప్పి వదిలివేసారు.ఎందుకు?మన హిందు ధర్మంలొ ప్రతి దేవునికి చేతిలొ ఆయుధాలు తప్పక ఉంటాయి కద మరి ఆయుధాల గురించి ఎందుకు చెప్పలేదు?వారు చెప్పక కాదు,మనకు వదిలేసారు.నిజానికి ఈ శ్లొకం స్మరణకు మాత్రమే చెప్పలేదు,ధ్యానం కొరకు చెప్పారు.కనుక ప్రతి ఒక్కరు ఈ శ్లొక ధ్యానంలొ వారివరి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆయా దేవిదేవతలు చేతపట్టిన ఆయుధములను మానసికంగా చూడమని చెప్పారు.ఒక్కొ ఆయుధముకు ఒక్కొ ప్రత్యేకత ఉంది. 'ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశదారిణం రదంచవరదం హస్తైర్బిబ్రాణం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే వినయకుడి చేతిలొ పాశం రాగద్వేషలను అణుచుటకు,అంకుశం అరిషడ్వర్గములను(కామ క్రోధ లొభ మోహ మద మాత్సర్యాలు)అణుచుటకు,మరొక చేతిలొ విరిగిన తన దంతం మంచి పనులను చేయుటకు అందం చెదిరిపొతుందని వెనుక అడుగువేయ్యొద్దని,అభయం ద్వార అందరికి భయం లేకుండ తానె చూస్తాడని అర్ధం. అదే సరస్వతి దేవిని స్మరిస్తే ఆమె ఒక చేతిలొ వీణ పట్టుకుని,మరొక చేతితొ వాయీస్తు ఉంటుంది.నిజానికి అది కళలకు సంకేతం.ఒక చేతిలొ వేదలను ఉంచుకొని మరొక చేతిలొ జప మాలతొ ఉంతుంది.అంటే నిరంతర జపం అనగా ప్రాక్టిస్ ద్వార ఎంతటి ఆపారమైన జ్ఞానమైన తప్పక కలుగుతుందని అర్ధం.ఇది విద్యార్థులకు ఎంతొ ముఖ్యమైన సూచికగా ఆమె వాటిని ధరించిందని,కాలిగా తిరిగితే ఏమి ఒరగదని ఆమె ఆయుధములు ఇచ్చే అపూర్వసందేశం. అందుకే మన మహర్షులు చతుర్భుజమని చెప్పి మాత్రమే ఉరుకున్నారు. భగవద్గీతలొ కృష్నుడు తనను చేరుటకు నాలుగు యొగ మార్గలను చెప్పాడు.అవి కర్మ,భక్తి,రజ,జ్ఞాన యొగాలు.అవినాలుగు యొగపురుషుడు అయిన పరమాత్మకు నాలుగు చేతులుగా వర్ణిస్తూ వాటిలొ ఏ చేయి పట్టుకున్న తనను చేరవచ్చని,తనలొ ఐక్యం కావచ్చని భావం. అదే విధంగా ధర్మ,అర్ధ,కమ,మొక్షాలనే నాలుగు పురుషార్ధలు వదలకూడదని,అవి మన ధర్మాచరణకు భుజములని గుర్తుచెయ్యదం. బ్రహ్మచర్య,గృహస్తు,వానప్రస్త,సన్యాస ఆశ్రమమనే నాలుగు ఆశ్రమధర్మాలు మన హిందూ సమాజానికి నాలుగు చేతులు అని,అవి గట్టిగ ఉంటేనె ధర్మరక్షణ జరుగుతుందని అర్ధం.
చతుర్భుజం-?2 నాలుగు భుజాలు అని మాత్రమే చెప్పి వదిలివేసారు.ఎందుకు?మన హిందు ధర్మంలొ ప్రతి దేవునికి చేతిలొ ఆయుధాలు తప్పక ఉంటాయి కద మరి ఆయుధాల గురించి ఎందుకు చెప్పలేదు?వారు చెప్పక కాదు,మనకు వదిలేసారు.నిజానికి ఈ శ్లొకం స్మరణకు మాత్రమే చెప్పలేదు,ధ్యానం కొరకు చెప్పారు.కనుక ప్రతి ఒక్కరు ఈ శ్లొక ధ్యానంలొ వారివరి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆయా దేవిదేవతలు చేతపట్టిన ఆయుధములను మానసికంగా చూడమని చెప్పారు.ఒక్కొ ఆయుధముకు ఒక్కొ ప్రత్యేకత ఉంది. 'ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశదారిణం రదంచవరదం హస్తైర్బిబ్రాణం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే వినయకుడి చేతిలొ పాశం రాగద్వేషలను అణుచుటకు,అంకుశం అరిషడ్వర్గములను(కామ క్రోధ లొభ మోహ మద మాత్సర్యాలు)అణుచుటకు,మరొక చేతిలొ విరిగిన తన దంతం మంచి పనులను చేయుటకు అందం చెదిరిపొతుందని వెనుక అడుగువేయ్యొద్దని,అభయం ద్వార అందరికి భయం లేకుండ తానె చూస్తాడని అర్ధం. అదే సరస్వతి దేవిని స్మరిస్తే ఆమె ఒక చేతిలొ వీణ పట్టుకుని,మరొక చేతితొ వాయీస్తు ఉంటుంది.నిజానికి అది కళలకు సంకేతం.ఒక చేతిలొ వేదలను ఉంచుకొని మరొక చేతిలొ జప మాలతొ ఉంతుంది.అంటే నిరంతర జపం అనగా ప్రాక్టిస్ ద్వార ఎంతటి ఆపారమైన జ్ఞానమైన తప్పక కలుగుతుందని అర్ధం.ఇది విద్యార్థులకు ఎంతొ ముఖ్యమైన సూచికగా ఆమె వాటిని ధరించిందని,కాలిగా తిరిగితే ఏమి ఒరగదని ఆమె ఆయుధములు ఇచ్చే అపూర్వసందేశం. అందుకే మన మహర్షులు చతుర్భుజమని చెప్పి మాత్రమే ఉరుకున్నారు. భగవద్గీతలొ కృష్నుడు తనను చేరుటకు నాలుగు యొగ మార్గలను చెప్పాడు.అవి కర్మ,భక్తి,రజ,జ్ఞాన యొగాలు.అవినాలుగు యొగపురుషుడు అయిన పరమాత్మకు నాలుగు చేతులుగా వర్ణిస్తూ వాటిలొ ఏ చేయి పట్టుకున్న తనను చేరవచ్చని,తనలొ ఐక్యం కావచ్చని భావం. అదే విధంగా ధర్మ,అర్ధ,కమ,మొక్షాలనే నాలుగు పురుషార్ధలు వదలకూడదని,అవి మన ధర్మాచరణకు భుజములని గుర్తుచెయ్యదం. బ్రహ్మచర్య,గృహస్తు,వానప్రస్త,సన్యాస ఆశ్రమమనే నాలుగు ఆశ్రమధర్మాలు మన హిందూ సమాజానికి నాలుగు చేతులు అని,అవి గట్టిగ ఉంటేనె ధర్మరక్షణ జరుగుతుందని అర్ధం.
చతుర్భుజం-1? నాలుగు చేతులు కలిగిన వాడు అని మాత్రమే గాక దానిలోని తత్వాన్ని ఆవిష్కరించబోతున్నం. ముందుగా సృష్టి రహస్యాన్ని చక్కగా చెప్పారు.ఈ పుడమిపై నాలుగు విధాలుగా జీవరాసి జన్మిస్తుంది. 1)ఉద్బీజములు-విత్తనము నుండి ఉద్భవించినవి-చెట్లు మొ|| 2)అండజములు-గుడ్డు నుండి ఉద్భవించినవి- 3)స్వేదజములు-చెమట గుడ్డు నుండి ఉద్భవించినవి-క్రిములు మొ|| 4)పిండజములు-గర్భావాసం ద్వారా ఉద్భవించినవి- ఇవి నాలుగు చేతులుగా,భుజములుగా కలిగినవాడు లేక కలిగినది.ఆమెయే ప్రకృతి. 'ప్రకృతేఃపురుషాత్పరం' అని గణేశ అథర్వశీర్షొపనిషద్ వాక్యం.అంటే గణపతి ప్రకృతి పురుషలను మించిన వాడు.ఆ ప్రకృతి పురుషలు శివపార్వతులు.అంటే ప్రకృతి పార్వతి మాత. 'ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం'అని లక్ష్మీ అష్తొతరంలొ లక్ష్మీ దేవి ప్రకృతిగా చెప్పబడింది. దత్తచరిత్రలో శ్రీ దత్తత్రేయులవారు తనకు ప్రకృతి గురువు అని చెప్పారు.అంటే ఆమె సరస్వతి. ఒక్క పదం స్మరించినంత మాత్రంగానే మహా దేవి త్రయాన్ని స్మరించిన పుణ్యం కలుగుతుంది. మనకు నాలుగు యుగాలు. 1)కృతయుగం-1728000 సంవత్సరాలు. 2)త్రేతయుగం-1296000 సంవత్సరాలు. 3)ద్వాపరయుగం-864000 సంవత్సరాలు. 4)కలియుగం-4,32,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలు మొత్తం 43,20,000 సంవత్సరాల కాలం ఒక మహా యుగం.ఈ నాలుగు యుగాలను తన భుజములుగా కలిగిన కాల పురుషుడే ఇందు వివరింపబడ్డాడు."కాలాయ తస్మై నమః" ఋగ్,యజుర్,సామ,అథర్వణ వేదాలను నాలుగు చేతులుగా కలిగిన వేద పురుషుడు. పంచాయతన పూజ అంటే ఇదు దేవతల ఆరాధన.శివ,శక్తి,సూర్య,గణపతి,విష్నులను పూజించడం.మధ్యలో పై వారిలొ ఒకరిని ఉంచి మిగితా నలుగురిని నాలుగు దిక్కుల ఉంచి పూజించడం జరుగుతుంది.మధ్యలో ఉన్నవాడికి నాలుగు దిక్కుల నలుగురు దేవతలు నాలుగు చేతులవలె,శక్తులవలె,భుజముల వలె కలిగి ఉన్నట్టు భావన చేస్తే ఆ మధ్యలొ ఉన్నవాడికి నాలుగు భుజములని చెప్తూ చతుర్భుజం అని అన్నారు. ఇవి కేవలం కల్పితములు కావు.శాస్త్రం యందలి పరమాత్మ తత్వాన్నే మీకు వివరించడం జరుగుతొంది.
శశివర్ణం అనే పదం వెనుక దాగిన తత్వాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం శశి అంటే చంద్రుడు. చంద్రుడు వంటి వర్ణం కలిగిన వాడు ఒక అర్ధం.నిజానికి చంద్రునికి ఒక వర్ణం అంటూ ఉన్న అది సుర్యూని ద్వార వచ్చిందే,అంటే అది తనది కాదు మరి అలా పొల్చడంలొ గల ఆంతర్యం ఎమిటి????????????????????????????? సూర్య రశ్మిని గ్రహించి చంద్రుడు వెలుగు ప్రసరిస్తున్నాడు.పరమాత్ముడు చంద్రుడు అయితే భక్తి అనేది సూర్యుడు.మనకు వాడి ఎడల ఎంత భక్తి ఉంటే వాడు అంతగా ప్రకాసిస్తాడు అని శశివర్ణం లో దాగి ఉన్న అర్ధం. నిజానికి చంద్రుని వెలుగు శాశ్వతం కాదు కదా మరి ఆయనకు ఇది ఎలా ఆపాదించారు?మనకున్న భక్తి,నమ్మకం,విశ్వాసం అచంచలంగా ఉన్నప్పుడు ఓంకారుడు పున్నమి నాటి బింబం.అవి సడలినప్పుడు అసలు అతను కనిపించడు కదా. అంటే మనం అర్దం చేసుకొనలసినది ఒక్కటే.మన భక్తే,మన విశ్వాసమే వాడి యొక్క సాకార రూపాన్ని చూపే మహ మంత్రం. చంద్రుని వర్ణం కలిగినది లక్ష్మీ దేవి,ఎందుకంటే ఆమె చంద్రసహొదరి కనుక.ఈ శ్లోక పఠనంతో ఆమెను కూడా స్మరించిన పుణ్యం కలుగుతుంది. చంద్ర బింబం మొత్తం ప్రపంచానికి చల్లదనాన్ని ఇస్తుంది.ఆ పరబ్రహ్మ్మం కూదా ఈ విశ్వాన్ని చల్లగ చుసేవాడని భావం. చంద్రుడు ఓషధులకు అధిపతి.తన వెలుగులొనే మొక్కలు ఓషధి తత్వాన్ని తయారుచేసుకుంటాయి.అందరికి ఆయురారోగ్యాన్ని ఇస్తాయి.అదే విధంగా పరమాత్ముడు తన భక్తుల ద్వారా సమస్త విశ్వానికి సుఖశాంతులను ప్రసాదిస్తాడు. 'చంద్రమా మనసో జాతః' అని ఋగ్ వేద వచనం.దాని అర్ధం చంద్రుడు మనస్సును ప్రభావితం చేస్తాడని అని ఒక అర్ధం అయితే తాను ఈ భూమికి ఉపగ్రహం కనుక మన మనస్సులో భావలను, అలోచనలను నియంత్రించినట్లే ఋతువులను,సముద్రాలను నియంత్రిస్తాడని మరొ అర్ధం.మరిన్ని అర్ధాలు ఉన్న అవి ఇప్పుడు అసందర్భం కనుక ప్రస్తావించట్లేదు.ఈ శ్లొకంలో అయితే తనను సదా ధ్యానించడం చేత తన భక్తుల మనస్సును సదా తన ఆధినంలొనే ఉంచుకుంటాడని రహస్యార్ధం. నిజానికి హృదయం,మూత్రపిండాలు,కాలేయం కనిపిస్తాయి.కాని మనస్సు కనిపిస్తుందా? కాదు కదా.కాని అన్ని చెప్తుంది,చేయిస్తుంది.అలాగే దేవుడు కూడా కనిపించనప్పటికి అంతకు తానె కర్తగా ఉండి నడిపిస్తున్నడ లేదా? ఇప్పుడు మీకో అనుమానం రావచ్హు.వాళ్ళు శశి అనలేదే,శశివర్ణం అన్నారు మరి చంద్రుని గురించి ఎందుకు వివరించామని అనుకొవచ్హు.వర్ణం అంటె కేవలం రంగు అని మాత్రమే కాదు పని అని కూడ అర్ధం వస్తుంది.అందుకె గీతకారుడు 'చాతుర్వర్ణం మయా స్ర్పుష్టం గుణకర్మ విభాగసః' అని పలికాడు.చెప్పాల్సింది ఇంకా చాలా మిగిలే ఉన్న ఇంతటితొ ఈ 'శశివర్ణాం' అనే పదం యొక్క రహస్యార్ధన్ని ముగిస్తూ...............................

శుక్లాంబరధరం విష్ణుం - 1

శుక్లాంబరధరం అంటే?

శుక్లాం అంటే తెలుపు. అంబరం అంటే వస్త్రం. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించేవాడు అని అర్దం.అదేంటి పరమాత్మ తెల్లని వస్త్రాలు మాత్రమే ధరిస్తాడా? కాదు. తెలుపు అని రంగులకు మూలం. ఒక తెల్లని సుర్య కిరణం ఒక ప్రిజం ద్వారా ప్రసరించినప్పుడు అది ఏడు రంగులుగా ప్రతిబింబిస్తుంది. ఆ సప్త వర్ణాలు నుంచే మిగిలిన రంగులు అని ఏర్పడుతాయి. అందుకే ఆయన అన్నిటికి ఏది మూలమో దాన్నె ధరిస్తాడు అని చెప్పడానికి అలా అన్నారు.     

గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు ............ అంటే అర్ధం తానే అన్నిటికి మూలము,ఆధారము అని చెప్పకనే చెప్తున్నారు .తానే అన్నిటికి మూలం, తాను అన్నిటిని సదా ధరించి ఉంటాడు. రంగుల్లో మూలం తెలుపు కనుక దాన్ని ధరించాడు అంటే ఇక మిగితావి అన్ని ధరించినట్టే కదా.     

తెలుపు శాంతికి సంకేతం. ఎల్లప్పుడు శాంతిని ధరించేవాడు/ కలిగించేవాడని అర్ధం. కలర్ థెరపిలో తెలుపు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతుంది. తనను పూజించినవారికి ఆయా గుణాలు ఇచ్చేవాడని అర్ధం.      

విష్ణుం? విష్ణుం అంటే విష్ణుమూర్తి అని మాత్రమే కాదు, వ్యాపించి ఉన్నవాడు అని అర్దం. ఎక్కడ వ్యాపించి ఉన్నాడు? విశ్వమంతా వ్యాపించిన ఉన్నవాడు. ప్రాణ శక్తిగా సర్వ భూతములయందున్న ఉన్నవాడు. విష్ణువు అంటే నారాయణుడు. నీటి యందు ఉన్నవాడు కాబట్టి నారాయణుడు. మరో అర్ధంలో నీటిని ధరించినవాడు, కనుక ఆయనే శివుడు కూడా.     

To be continued.............