Thursday 2 April 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (3వ భాగం)



ఇప్పుడు ప్రపంచమైనా ఎదురుకొంటున్న అతి పెద్ద సమస్య నీటి ఎద్దడి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకీ సమస్య తీవ్రత అర్ధమవుతుంది. నగరాల్లో ఉన్నవారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నగరాలకు నీటి సర్ఫరాలో ఆటంకం రాకుండా ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ గ్రామాల్లో ఉన్నవారికి తెలుసు ఆ కష్టం. కొన్ని గ్రామాల ప్రజలైతే ఎన్నో కిలోమీటర్లు నడిచి మరీ నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు నీటి ఎద్దడికి ఎలా కారణమవుతున్నాయో చూద్దాము.


యూ.ఎస్.జి.ఎస్. వారి లెక్కల ప్రకారం 1 పౌండ్ (453 గ్రాములు) గొడ్డు మాంసం (భీఫ్) ఉత్పత్తి చేయడానికి కనీసం 9000 లీటర్ల నీరు ఖర్చవుతాయి. అంటే నాలుగున్నర కిలోల గొడ్డు మాంసం ఉత్పత్తికి ఒక స్విమ్మింగ్ పూల్ నింపడానికి సరిపడా నీటిని ఉపయోగిస్తారు. ఇవన్నీ కాకిలెక్కలు, గాలిమాటలు కాదు. సశాస్త్రీయంగా శాస్త్రవేత్తలు లెక్కగట్టి నివేదికలు ఇచ్చినవి. మెక్ డోనాల్డ్స్ సంస్థ రోజుకు 86,183 కిలోల గొడ్డు మాంసం విక్రయిస్తుందని అంచనా. అంటే ఎంతమంది ఎన్ని నెలల పాటు త్రాగేనీటిని వారు కేవలం కొంతమంది కడుపు నింపడానికి వినియోగిస్తున్నారో చూడండి. దానికి అయ్యే నీటి ఖర్చు 1,26,18,03,928 లీటర్లు, అవును అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది లీటర్లు. ఇంత నీటితో ఎంత పంట పండిచవచ్చు, ఎంతమంది దాహర్తిని తీర్చవచ్చో మీకు అర్ధమవుతోందా ... పైగా ఇది భూమికి పెద్ద భారం. ఎన్నో వేలమంది కొన్ని సంవత్సరాల పాటు సుఖంగా జీవించడానికి తోడ్పడే అద్భుతమైన నీరు అనే వనరును కేవలం జిహ్వచాపల్యం కోసం కొందరు ఒక రోజులో వాడేస్తున్నారు.

ఇప్పుడు మిగితా వాటి సంగతి చూద్దామా? 1 కిలోగ్రాము కోడిమాంసం ఉత్పత్తికి 4,325 లీటర్లు, 1 కిలో మేకమాంసం ఉత్పత్తికి 5,520 లీటర్లు అవసరం. అదే ఒక కిలో వరి ఉత్పత్తికి 3,600 లీటర్ల నీరు మాత్రమే అవసరము. గోధుమలకు 1,375 లీటర్లు, చిరుధాన్యాల ఉత్పత్తికి 300 లీటర్లు అవసరము. ఇవన్నీ కనీసం లెక్కలు. కొన్ని సందర్భాల్లో ఈ వినియోగం ఇంకా పెరగచ్చు.


ఒక వ్యక్తి మాంసాహారన్ని వదిలి శాఖాహారం వైపు అడుగులేస్తే, ఆ వ్యక్తి ఒక ఏడాదిలో సుమారు 5,67,812 లీటర్ల నీటిని ఆదా చేసినవాడవుతాడు. మరి పునరాలోచన చేస్తారా ?

To be continued.....

Source: https://www.zmescience.com/science/domestic-science/eat-vegetarian-save-water/   

No comments:

Post a Comment