Wednesday 6 October 2021

శ్రీ హనుమద్భాగవతము (45)



వాలి సోదరుడైన సుగ్రీవుని పదిహేను దినముల వఱకు బిల ద్వారము దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కాని సుగ్రీవుడు ఒక మాసము వఱకు అచట చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ద్వారము నుండి అతనికి రాక్షసుల కోలాహలము వినబడసాగినది. కాని వాలిశబ్ద మేదీ వినబడలేదు. అతడు తన అన్నను గూర్చి ఆలోచింపసాగాడు. ఇంతలో అతని ఎదుట గుహ నుండి నురుగుతో కూడిన రక్తము ప్రవహింపసాగింది. భ్రాతృస్నేహమువలన సుగ్రీవుడు వ్యాకులుడయ్యెను. అన్న విషయమై అతనికి సందేహ ముత్పన్నమయ్యింది.


ఎంత ప్రయత్నించినా అతని వాలి జాడ తెలియలేదు. ‘ఈ విశాలబిలంలో అసురులందఱూ క్లసి నా సోదరుని చంపి ఉండవచ్చు, వారు బయటకు వచ్చి నన్ను కూడా చంపవచ్చు' అని సుగ్రీవుడు తలచాడు.


మిక్కిలి దుఃఖితుడై అతడు తన రక్షణకై ఒక పెద్ద బండరాతిని బిలద్వారానికి అడ్డముగా ఉంచి, విచారవదనుడై వాలికి జలాంజలి వదలి కిష్కింధకు వెల్లాడు.


సుగ్రీవుడు తన అన్న మరణమును గుప్తముగా ఉంచాలని తలచాడు, కాని చతురులైన మంత్రులు యువ రాజైన అంగదుడు చిన్న వాడుగా ఉండుటవలన సుగ్రీవునే రాజుగా చేశారు. అప్పటినుండి అతడు నీతిపూర్వకముగా రాజ్యాధికారమును నిర్వహింపసాగాడు.


అచట వీరవరుడైన వాలి రాక్షసుల నందఱనీ సంహరించి రాజధానికి మరలాడు. సుగ్రీవుడు తనకు బదులుగా రాజ సింహాసనమును అధిష్ఠించియుండటం చూసి వాలి మిక్కిలి క్రుద్ధుడయ్యాడు.


No comments:

Post a Comment