Friday 3 December 2021

శ్రీ హనుమద్భాగవతము (91)



హనుమంతుడు సీతాదేవికడకు చేరుట


బ్రాహ్మీముహూర్తమున అసురులు ఎక్కడివారక్కడ గాఢనిద్రామగ్నులై ఉన్నారు. శ్రీరామపరాయణుడుడైన పవనపుత్రుడు అశోకవనమును జేరుటకెట్టి విఘ్నములు సంభచపలేదు. ఆ సుందరవాటిక, నిర్మలసరోవరము, అద్భుతమైన దేవాలయము మొదలగు వానియొక్క శోభను ఎలా ఆంజనేయుడు తిలకించగలడు? ఆయన సీతాదేవి దర్శనముకొఱకై అధీరుడగుచున్నాడు, నేరుగా అశోకవృక్షమును చేరి దట్టమైన కొమ్మలపై దాగి కూర్చుండి క్రిందకు చూసాడు.


మూర్తీభవించిన కరుణాస్వరూపిణీ, పతివ్రతా, తేజోమూర్తీ అయిన సీతా దేవి తన చరణములవైపు దృష్టిని సారిస్తూ మౌనముగా కూర్చొని ఉంది. అప్పుడప్పుడు ఆమె నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించుచుండెను. శ్రీ జానకిని దర్శించి శ్రీరామభక్తుడైన అంజనీనందనుడు అత్యంత ప్రసన్నుడయ్యాడు. ఆయన ఆనందమునకు హద్దులు లేవు. తన అదృష్టమును పొగడుకొనుచు తనలో తానిట్లనుకొన్నాడు. 


శ్లో|| కృతార్ధోఽహం కృతార్ధోహం దృష్ట్వా జనక నందనీమ్ | 

మయైవ సాధితం కార్యం రామస్య పరమాత్మనః |


(ఆధ్యాత్మిక రామాయణం 5-2-11-12) 


నేడు జనకమహారాజుపుత్రికయైన జానకిని గాంచి కృతార్థుడనైయ్యాను. ఆహా! పరమాత్ముడైన శ్రీరాముని కార్యము సిద్ధించుటకు నేను కారణుడనైతినిగదా !


No comments:

Post a Comment