Tuesday 29 November 2022

భేతాళ కథలు - 1



భేతాళ కథలకు పూర్వరంగం 


విక్రమార్కుడు ప్రజలు సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తున్నాడు.


ఒకనాడు - ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసినెంతో గౌరవించాడు.


అతని వినయవిధేయతలకీ, భక్తి ప్రపత్తులకీ ఆ సన్యాసి ఎంతో సంతోషించి, ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. ఐతే.. ఆ పండునేంచేయాలో మాత్రం చెప్పలేదు.


ప్రతిరోజూ ఆ సన్యాసిరావడం... ఒక పండునిచ్చి వెళ్లిపోడం... విక్రమార్కుడా పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికివ్వడమూ ఇలా జరుగుతూ వస్తూంది..


ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి - విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వేపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికందించాడు. కోతి ఆ పండుని తినాలని దానిని కరవగా - పండులోంచి కొన్ని రత్నాలు జలజలమంటూ రాలాయి.


అదిచూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి.. అంతవరకూ దాచి ఉంచమన్న పండ్లన్నిటినీ తెప్పించి పగలకొట్టించి చూడగా - వాటన్నిటియందును కూడా అతి విలువయిన రత్నాలున్నాయి. అప్పుడు రాజు ఆ సన్యాసి వేపు తిరిగి చేతులు జోడించి -


"మహాత్మా! మీరిలాంటి ఫలాలను నాకెన్నో దినములనుండి యిచ్చుచున్నారు. ఒక్కొక్క ఫలములోని రత్నాలవిలువా అపారము. నా నుండి మీరేమి ఆశించుచున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమి?" అని వినయంగా ప్రశ్నించాడు.


అప్పుడా సన్యాసి - "రాజా! నేను తపస్సుకి సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీవంటి సాహసమూ, ఔదార్యమూ, విక్రమమూ కలవాని అవసరమెంతో యున్నది. నీ నుండి ఆ సహాయమును కోరుకొనుటకే యిలా చేశాను..." అన్నాడు.


"నేను చేయవలసిన పని ఏమిటి?" అడిగాడు విక్రమాదిత్యుడు. "రాబోవు - బహుళ పక్షమునాటి - అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటుకి ఆయుధములు మాత్రమే కలిగియుండి ఒంటరిగా రావాలి....

No comments:

Post a Comment