Showing posts with label సుభాష్‌చంద్ర్‌బోస్. Show all posts
Showing posts with label సుభాష్‌చంద్ర్‌బోస్. Show all posts

Monday, 23 January 2017

సుభాష్ చంద్రబోస్ కు ప్రేరణ ఇచ్చిన ముగ్గురు మహాపురుషులు



సుభాష్ చంద్రబోస్, యువత స్పూర్తిగా తీసుకునే వ్యక్తి. అలాంటి సుభాష్ చంద్రబోస్ కు ఆదర్శం ముగ్గురు మహాపురుషులు. ఒకరు శ్రీ రామకృష్ణ పరమహంస, ఒకరు స్వామి వివేకానంద, ఇంకొకరు శ్రీ అరోబిందో. బోస్ స్వాతంత్ర్యోద్యమంలో అంత తీవ్రమైన పోరాటం చేయడానికి కారణం వీరేనని, 1937 లో యాన్ ఇండియన్ పిలిగ్రిం అనే తన రచనల్లో రాసుకున్నారు. తనకంటే 20 ఏళ్ళు పెద్దవాడైన అరోబిందో, తన బాల్య జీవితం మీద చెరగని ముద్ర వేశారు.

నేను అండర్ గ్రాడ్యుయేట్ చదివే రోజుల్లో, అరోబిందో ఘోష్ బెంగాల్లో ప్రాచర్యం పొందిన వ్యక్తి. ఆయన తన జీవితాన్ని రాజకీయాల కోసం త్యాగం చేశారు. ఆయన లేఖలు కరపత్రాలుగా మారి వేగంగా వ్యాపించేవి, ముఖ్యంగా రాజకీయాలు- ఆధ్యత్మికత, రెండింటిలో ఆసక్తి ఉన్నవారికి. నా బృందంలో ఎవరో ఒకరు లేఖలు చదవగా, నేను కుతూహలంతో వినేవాడిని....... ప్రభావవంతంగా జాతి సేవ చేయడానికి ఆధ్యాత్మిక శిక్షణ, సాక్షాత్కారం ఎంతో అవసరమని ఆయన వల్లనే గట్టి నమ్మాము. అప్పట్లో అరవిందుల గురించి ఎన్నో గొప్ప విషయాలు కధలు, కధలుగా ప్రచారమయ్యేవి. రాజకీయాలకు, ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాన్ని ఆయన ప్రతిపాదించడం ఎందరో ధార్మికులను దేశం వైపు తిప్పింది ............... నేను లోతైన ఆయన సిద్ధాంతాల పట్ల ప్రభావితమయ్యాను. ఆదిశంకరుల మాయ సిద్ధాంతం నా మాంసంలో గుచ్చుకున్న ముల్లుగా అనిపించేది. దాని అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోలేను, అలా అని వదిలించుకుని, కొత్త సిద్ధాంతాన్ని పట్టుకోలేను. ఏకం, అనేకం మధ్య, భగవంతుడు, సృష్టి మధ్య సయోధ్య గురించి రామకృష్ణులు, స్వామి వివేకానందుడు భోదించినవి నన్ను ప్రభావితం చేసినా దాన్ని నుంచి బయటపడే ప్రయ్తనంలో సఫలుడను కూడా కాలేకపోయాను. దీని నుంచి విముక్తి పొందటంలో అరవిందులు నాకు సాయం చేశారు. భగవద్గీత భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగమని చెప్పింది. అవిగాక హఠయోగం, రాజయోగం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వీటి మీద వివేకానందుడు ప్రసంగించినా, అరోబిందో చక్కని సమన్వయం చూపారు. దానికి యోగ సమన్వయం అని పేరు పెట్టారు ...........' అంటూ సుభాష్ చంద్రబోస్ ఎన్నో విషయాలు రాసుకున్నారు.

ఆంగ్లేయులపై పోరాటం సలపడానికి, దేశాన్ని, సంస్కృతిని పునరుజ్జీవనం చేయడానికి భౌతిక, మానసిక శక్తులే కాదు ఆధ్యాత్మిక/ ఆత్మ శక్తి కూడా అవసరమని భావించిన బోస్, తన జీవితంలో ఆధ్యాత్మిక సాధన కూడా చేశారు.

Source- https://auromere.wordpress.com/2012/05/12/subhas-chandra-bose-on-sri-aurobindo/

Friday, 23 January 2015

సుభాష్‌చంద్ర్‌బోస్ గురించి ముఖ్యమైన విషయాలు

ఈ రోజు సుభాష్‌చంద్ర్‌బోస్ జయంతి సందర్భంగా వారి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

సుభాష్‌చంద్ర్‌బోస్, భారతమాత దాస్య శృంఖలాలను తెంచిన యోధుడు. 23 జనవరి 1897 లో ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించారు సుభాష్ చంద్ర బోస్. వారు కారణజన్ములు, సిద్ధుల సంకల్పంతో జన్మించిన మహాపురుషులు. స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో గడిపిన మహానుభావులు. నిజం మాట్లాడితే సుభాష్‌చంద్ర బోస్ గాంధీజీ కంటే గొప్పవారు. దానికి సంబంధించిన చిన్న సంఘటన చెప్తాను.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక స్వాతంత్రదినోత్సవ వేడుకలలో జెండావందన కార్యక్రమానికి బ్రిటిష్ ఇండియా వైశ్రాయి మౌంట్‌బెట్టెన్ హాజరయ్యాడు. అప్పుడు అతన్ని ఒకరు 'ఏవండి! మేము 1945 కి ముందు వరకు చాలా తీవ్రమైన పోరాటాలు చేశాము, ఎన్నో ఉద్యమాలు నడిపాము, అయినా అప్పుడు మీరు మా దేశాన్ని విడిచిపోలేదు. కానీ ఏ ఉద్యమం లేకపోయిన 1947 లో హఠాత్తుగా భారతదేశానికి ఎందుకు స్వాతంత్ర్యం ప్రకటించారు' అని అడిగారు. దానికి ఆయన సమాధానంగా మీరు అహింస పేరుతో కడుపులు మాడ్చుకుని పోరాటం చేయడం వలన మేము భారత్‌ను విడిచిపోలేదు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఉధృతికి భయపడి మాత్రమే మేము మీ దేశం విడిచి పారిపోయామని సమాధానం చెప్తారు. మరి మీ మీద మా అహింసాపోరాటం ప్రభావం చూపలేదా అంటే, మా మీద మీ అహింసాపోరాటం చూపిన ప్రభావం అత్యల్పం. బోస్ ప్రభావమే అధికం అన్నారు. అది ఆయన గొప్పతనం, వారు లేకపోతే మనకు స్వరాజ్యం వచ్చేది కాదు.

కానీ అప్పట్లో కూడా రాజకీయాలు నడిచాయి. గాంధీ సిద్ధంతాలకు అడ్డువస్తున్నాడని, గొప్ప ప్రభావం చూపిస్తున్నాడని, అది నచ్చక, బోస్‌ను అర్చాకవాది, అతివాది, హింసావాది అని ముద్రవేసి కాంగ్రెస్ నుంచి వెలివేశారు. అయితే చాలా మంది బోస్ మరణించారని చెప్తారు కానీ అందులో నిజం లేదు. నేతాజీ ఇప్పటికి బ్రతికే ఉన్నారు. హిమాలయాల్లో యోగసాధన చేస్తున్నారు. గత కొనేళ్ళ నుంచి 3 వేర్వేరు శరీరాలతో భారతదేశమంతటా పర్యటిస్తున్నారు. మహాదేవుడైన సదాశివుని ఆశీర్వాదం, సిద్ధపురుషుల ఆశీర్వద ఫలంగా బోస్ ఇప్పటికి సజీవంగా ఉన్నారు. త్వరలో ప్రజల ముందు వచ్చి, దేశాన్ని నడిపించనున్నారని 200 ఏళ్ళకు పై వయసు కలిగి ఇప్పటికి జీవిస్తున్న శ్రీ బర్ఫాని బాబావారు సందేశమిచ్చారు.

హరహర మహాదేవ
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
జై హింద్