ఆంజనేయుని ఆజ్ఞననుసరించి సముద్రం అణగియుంది. మనమేమో సంసార సాగరంలో చిక్కుకొన్నాం. సముద్రంలోని అలలు మాదిరిగా మనభావాలు అల్లకల్లోలంగా ఉంటాయి. కాని ఆంజనేయుడు మనోనిగ్రహం. కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు.
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
అట్టి అభయాంజనేయ మూర్తిని దర్శిస్తే, ధ్యానిస్తే మన భయాలను తరుమడమే కాకుండా శాంతి సౌభాగ్యాలను అందిస్తాడు. సంసార సాగరాన్ని అల్లకల్లోలం లేకుండా చేయగలడు.
బలప్రదాత
బలహీనులకు బలాన్నిచ్చేవాడు, రామచంద్రమూర్తి, నిర్బల్ కే బల్ రామ్ అని హిందీలోని మాట. ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు రక్షించేవాడు రాముని కంటే మరెవ్వరు? ఆపదామ్ అపహర్తారం అని కీర్తిస్తాం. మనకు ముందు, వెనుక, ప్రక్కల, అన్ని వైపుల రక్షించేవాడు రాముడని కీర్తిస్తాం.
అగ్రతఃపురతశ్చైవ పార్శ్వ ఏవ మహాబలౌ.
మనలను రక్షించడానికి ధనుర్బాణాలతో రాముడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడూ రాముని విడువని లక్ష్మణుడున్నాడు.





