Monday 26 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (03)



నిజంగా అతణ్ణి కొలిచిన వానికి, కోరదగిందంటూ ఏదీ ఉండదు. అతని వల్లనే రావణ సంహారం జరగడం, రామరాజ్య స్థాపనం జరిగింది. అతడు అర్జునుని జెండాపై ఉండడం వల్లనే యుద్ధానంతరం ధర్మరాజ్యం స్థాపింపబడింది. కొంతకాలం వెనుక మనధర్మానికి విఘాతం కలుగగా సమర్థ రామదాస స్వామి అవతరించి శివాజీ ద్వారా ధర్మస్థాపన చేయించాడు. రామదాస స్వామి ఆంజనేయుని అవతారమే. ఈనాడు, అట్టి సంకట పరిస్థితులు లేకుండా ఉండాలంటే, ధర్మ, భక్తులు వర్ధిల్లాలంటే ఆంజనేయ అనుగ్రహం కావాలి. శుద్ధమైన మనస్సుతో అతణ్ణి సేవిస్తే అన్నిటినీ ఇస్తాడు. 


సరస్వతి శంకర హనుమ విగ్రహాలు


రామేశ్వరంలోని, అగ్ని తీర్థకరై ప్రాంతంలో శంకరమంటపం ముఖ్య స్తంభం మధ్యలో ఆదిశంకరుల విగ్రహముంది. దాని వెనుక సరస్వతీ మహల్ ఉంది. అందు సరస్వతీ విగ్రహముంది.


శంకరుల వెనుక భాగంలో సరస్వతీ విగ్రహ ముండవచ్చా అని ఎవరైనా సందేహిస్తారు. దీనికి సంబంధించిన కథ ఉంది. మండన మిశ్రులతో వాదంలో శంకరులు జయించారు. బ్రహ్మ యొక్క అవతారమే మండనమిశ్రులు. అతని భార్యను కూడా ఓడించారు శంకరులు. ఆమె పేరు సరసవాణి. ఆమె సరస్వతి అవతారమే. మండనులు వెంటనే సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే ఆశ్రమ నామం స్వీకరించారు. సరసవాణి, సరస్వతిగా మారి బ్రహ్మలోకానికి వెళ్లాలనుకొంది. ఆమెను ఈ లోకంలోనే ఉంచాలని ఆమె దయవల్ల భూలోకవాసులకు విద్యాప్రకాశం కల్గుతుందని శంకరులు భావించారు. వనదుర్గా మంత్రంచే ఆమెను కదలకుండా చేసారు.


అమ్మా! నేను దేశ పర్యాటనను చేద్దామనుకుంటున్నాను, నాతో నీవు కూడా రా అని ఆమెతో అన్నారు. నిన్ను సరియైన స్థలంలో శారదాపీఠంలో స్థాపిస్తాను. తద్వారా ప్రజలను అనుగ్రహింపుమని వేడుకొన్నారు.


No comments:

Post a Comment