Friday, 1 October 2021

శ్రీ హనుమద్భాగవతము (42)



వాలి తన సోదరుడైన సుగ్రీవుని పై కత్తి గట్టి యున్నాడు. భయాక్రాంతుడైన సుగ్రీవుడు ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నాడు. అందువలన నీవు ఋష్యమూక పర్వతము మీదకు వేళ్ళి సుగ్రీవునితో సఖ్యము చేసుకో. నేను ఆ ప్రక్కన నివసించే మారీచుని, సుబాహుని, తాటకిని ఉద్ధరించి కొద్ది దినములలోనే దండకారణ్యములో ఖరదూషణులు, త్రిశిరుడు, శూర్పణఖవంటి కంటక ప్రాయులను తొలగించుచు ఋష్యమూకము వైపునకు వస్తాను. అచట నీవు నాతో సుగ్రీవుని కలుపు, వానర సైన్యముల ద్వారా నా అవతార కార్యమున సహాయపడు.”


హనుమంతుడు తన ప్రభువును వీడుటకు ఇష్టపడుట లేదు, అయినను ప్రభువాజ్ఞను పాలించుటయే ముఖ్యకర్తవ్యము. ఆయన శ్రీరాముని చరణములకు ప్రణమిల్లి, కళ్యాణమయములైన ఆయన మధుర నామములను జపించుచు ఋష్యమూక పర్వతమునకు బయలు దేరాడు.


సుగ్రీవ సచివుడు


ఋక్షరాజగు వానరునకు వాలి సుగ్రీవులను ఇరువురు పుత్రులున్నారు.* 


* వానరేంద్రం మహేన్రాభమింద్రో వాలినమాత్మజమ్ 

సుగ్రీవం జనయామాస తపన స్తపతాం వరః 


దేవతలకు రాజైన ఇంద్రుడు వానర రాజైన వాలిని పుత్రరూపమున కన్నాడు, అతడు మహేంద్రపర్వతమువలె విశాలకాయుడు, బలిష్ఠుడు. తపించువారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని కన్నాడు (వా.రా.1-17-10) 



తండ్రి తనకుమారులిరువురిని ఒకేవిధముగా ప్రేమింస్తుండేవాడు. బాలులు ఇద్దరు గొప్ప వీరులు, ధీరులు, బలవంతులు, బుద్ధిమంతులు, సుందరులు. వారి అన్యోన్యము ప్రేమ కలిగియుంన్నారు. వాలి సుగ్రీవుని ప్రాణములతో సమానముగా ప్రేమిస్తాడు. సుగ్రీవుడు వాలిపై తండ్రివలె శ్రద్ధాభక్తులు చూపేవాడు. సోదరులిద్దరూ భోజనశయనక్రీడాదులను ఒకే విధంగా నిర్వహించుచుండేవారు. వారెప్పుడూ కలిసియే ఉండేవారు.  


Thursday, 30 September 2021

శ్రీ హనుమద్భాగవతము (41)



చివరకు భగవానుడైన శ్రీరాముడు ప్రసన్నుడై నాకు ఈ వానరము కావాలని మారాము చేసాడు. చక్రవర్తియైన దశరథమహారాజునకు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని కోరిక నెఱవేరకుండా ఎలా ఉంటుంది. భిక్షకుడు ఎంతటి మూల్యం తీసుకున్నా వానరము మాత్రము శ్రీ రాముని దగ్గర ఉన్డవలసినదే. భిక్షుకునకు కూడా ఇదియే ఇష్టము. తన ప్రభువు చరణాలకు సమర్పితము కావాలనే ఉద్దేశ్యముతోనే అతడు రాజద్వారము దగ్గర వచ్చాడు. నూతనజలధర (మేఘ) చ్ఛాయ వంటి తనువు గల శ్రీరాముడు తన కరకమలములతో వానరమును తీసుకున్నాడు. యుగయుగములనుండి ఉన్న ఆ వానరము యొక్క కోరిక నేటికి నెఱవేరినది. అది వివిధరీతుల నాట్యము చేసినది. ఇంతవఱకును పరమశివుడు వానర రూపమున తన్ను తాను నాట్యము చేయుంచుకొనుచుండెను. ప్రస్తుతం ఆయనే నాట్యము చేయుచున్నాడు. ఆయనను నాట్యము చేయించువాడు మునిమనో మానసమరాళమగు దశరథ కుమారుడే. ఆ వానరముయొక్క సుఖమునకు, సౌభాగ్యమునకు, ఆనందమునకు హద్దుయే లేకుండెను. అది వివిధరీతుల మనోమోహకములైన హావభావాలను ప్రదర్సితూ తన ప్రభువు ఎదుట నృత్యము చేయుటలో తన్మయత్వము చెంది యుంన్నాడు. భిక్షకుడు అదృశ్యమయ్యాడు. ఆయన కైలాసశిఖరమునకు వెడలినాడా లేక తన ప్రభువులీలను దర్శించుటకు మఱియొక రూపమును ధరింనాడా అనే విషయము తెలియలేదు.


ఇట్లు హనుమంతునకు తన స్వామియైనశ్రీ రాముని దగ్గర నుండు అవసరము కలిగినది. శ్రీరాముడు హనుమంతుని ఎక్కువగా ప్రేమించుచున్నాడు. ఆయన హనుమంతునిసమీపంలో కూర్చిన్నాడు, వానితో ఆడేవాడు. బంగారు వంటి అతని శరీరాన్ని తన కరకమలముతో నిమిరేవాడు. ఒకప్పుడు నృత్యము చేయుటకు వానికి అనుమతియిచ్చేవాడు, మఱియొకప్పుడు పరుగెత్తించి వస్తువు ఒకదానిని అతనిచే తెప్పించేవాడు. హనుమంతుడు తన ప్రభువిచ్చు ఏ ఆజ్ఞనైనా ఎంతో ఆదరము తోనూ, ఉత్సాహముతోనూ, సంతోషముతోనూ నెఱవేఱర్చును. అతడు అనేక విధాలుగా శ్రీ రాముని సంతోష పెట్టేవాడు.


ఇట్లా ఎన్నో సంవత్సరాలు అర్థ క్షణము వలె గడచి పోయాయి. విశ్వామిత్రమహర్షి అయోధ్యకు విచ్చెసాడు. ఆయనతో వెడలవలసిన అవసరము గలిగినపుడు శ్రీరాముడు హనుమంతుని ఒన్టరిగా పిలచి ఇలా పలికాడు. మిత్రుడవగు హనుమా! నేనీ భూమిపై అవతరించుటకు గల ప్రధానకార్యమిప్పుడు ఆరంభం కాబోతున్నది. లంకాధిపతియైన రావణుని దుశ్చేష్టలచే పృథివి వికలమైనది. ఇప్పుడు నేను వానిని వధించి పుడమిపై ధర్మమును నిలబెడతాను. ఈ కార్యమున నీవు నాకు సహాయపడాలి. దశాననుడు మహాబలియైన వాలితో స్నేహం చేసుకొన్నాడు.

Wednesday, 29 September 2021

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?



- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.

- క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

- భార్య మరణించిన వాడు ‘అవిధవ నవమి’నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ పెట్టి సత్కరించి పంపాలి.

- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.

- ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే...


1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.

2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.

3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ‘తెలుగు వన్’


- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి. - ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి. మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే... 1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త. 2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త. 3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 5.ఇది సర్వ కారుణ్యస్థానo.


5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ‘తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.


-Source and thanks.......యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

Tuesday, 28 September 2021

మహాలయ పక్షాల ప్రాధాన్యత



భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.


పితృదేవతలకు ... ఆకలా?


అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


అన్నాద్భవంతి భూతాని - పర్జన్యాదన్న సంభవః

యఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః


అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....

అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి.

మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి.

దేవతలు కరుణించాలంటే...వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద ‘జీవాత్మ’గా అవతరించడానికి... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.


తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?


అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.


Source: తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.

-thanks.......యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

Monday, 27 September 2021

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది?



స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్|

జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్|| - గరుడ పురాణం


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.


"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."

ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


వ్యక్తి మరణానంతరం చేయవలసిన ప్రతి కార్యం గురించి గరుడ పురాణం చెబుతోంది. అవి శ్రద్ధగా చేయాలి. కేవలం దహన సంస్కారమే కాదు, ఆ తర్వాత పదుకొండు రోజుల వరకు ప్రతి రోజూ కర్మ నిర్దేశించబడింది. అవిగాక మాసికాలు, సంవత్సరీకాలు మొదలైనవి చెప్పబడ్డాయి. వాటిని ఖచ్చితంగా శ్రద్ధతో చేయాలి. ఆత్మహత్య, అకాలమరణం, ప్రమాదవశాత్తు మరణించవారికి మరికొన్ని ప్రత్యేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. అప్పుడే మరణించినవారు ప్రేతరూపాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళగలుగుతారు. లేదంటే ఆ కుటుంబాలను పితరులే నాశనం చేస్తారు. 

Sunday, 26 September 2021

కాకి నేర్పే అద్వైతం - కంచి పరమాచార్య



కాకి నేర్పే అద్వైతం


“మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?”  అని భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని అడిగాడు.


స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.


క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!


విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.


అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది.


అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?


అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణం కలిగినది.


మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆ రోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.


ఇది ఎంతమంది పాటిస్తున్నారు?


కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు. 

మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.


కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.


నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు.


ఇది వినగానే ఆ భక్తుడు, అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి, అందరూ ఒక్కసారిగా “జయ జయ శంకర, హర హర శంకర” అని పెద్దగా పలికారు. 

పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశీస్సులను పొండుదాము. 


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। 


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం 

Saturday, 25 September 2021

పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం



పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం. కర్మ చేయించే బ్రాహ్మణుడు అపరకర్మలు చేయడంలో నిష్ణాతుడై ఉండాలి. అతడు చదివే మంత్రాల వల్లనే తర్పణాదులను పితృదేవతలు స్వీకరిస్తారు. పితృకర్మలను అపరకర్మలు అంటారు. వీటిని చేసే బ్రహ్మణులకు కూడా ప్రాయశ్చిత్తం విధించబడింది. వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది ఆరోపిస్తుంటారు. కానీ మనం అర్ధం చేసుకోవలసింది ఒకటుంది. పితృకర్మ చేయడానికి వచ్చే బ్రాహ్మణుని ఒంటి మీదకు పితృదేవతలు వస్తారు. అందుకే భోక్తలు చాలా ఎక్కువగా తింటారు. అలా తింటారని వారికి కూడా తెలీదు. పితృకర్మ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా అతడు సహస్రగాయత్రి చేయాలి. ప్రాయశ్చిత్తం చేయని పక్షంలో ఆ బ్రాహ్మణుడు అనేక సమస్యలను ఎదురుకొంటాడు. విమర్శ చేసేవాళ్ళకి తెలిసింది కొంచమే, కానీ అపరకర్మలు చేసే బ్రాహ్మణుల జీవితంలోకి తొంగి చూస్తే అప్పుడు తెలుస్తుంది, అది ఎంత శక్తివంతమైన విషయం అనేది. రెండవది, పితృకర్మ చేసిన బ్రాహ్మణునకు సంతృప్తిగా భోజనం పెడితే, ఆ ఇంటి పితరులు సంతోషిస్తారు, ప్రేతశాంతి కలుగుతుంది. 


అయితే కేవలం బ్రాహ్మణుడు నిష్ణాతుడై ఉంటే సరిపోదు. కర్మ చేయించుకునేవారు కూడా శుచీశుభ్రత, పితృకర్మల యందు భక్తి, విశ్వాసాలు కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు సక్రమంగా మంత్రం చదివినా, చేయించుకునేవారికి శ్రద్ధ లేకపోతే పితరులు ఆ పిండాలను, తర్పణాలను స్వీకరించరు. ఆ కుటుంబాలను శపిస్తారు. 


కొందరికి వీలుపడదని వేరొకరితో పిండప్రధానాలు చేయిస్తారు. ఇది కూడా శాస్త్రం అంగీకరించదు. కర్మ చేసే అధికారం కర్తకు మాత్రమే ఉంటుంది. కర్త అనగా ఎవ్వరు శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకు కర్మ చేసే అధికారం గలవాడు. అది వెరొకరి ఇవ్వలేరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప అన్ని వేళలా శాస్త్రం దాన్ని అంగీకరించదు. కనుక డబ్బులిస్తామూ కర్మ చేయండి అని అనకండి, వీలు కల్పించుకుని మరీ పితృపూజ చేయండి.