Friday 27 December 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వేంకటాచలంలో శ్రీనివాసుడు

అలా అగస్త్యుని ఆశ్రమంలో ఉన్న శ్రీనివాసునికి నారాయణపురం నుంచి ఆకాశరాజుకు ఆరోగ్యం క్షీణించిందని, మరణానికి చేరువలో ఉన్నాడని కబురు వస్తుంది. వెంటనే పద్మావతీదేవితో శ్రీనివాసుడు నారాయణపురం బయలుదేరతాడు. తన తమ్ముడు తొండమానుడిని, కొడుకు వసుదను కాపాడమని కోరిన ఆకాశరాజు, శ్రీన్వాసునికి చివరిసారిగా నమస్కరించి పరమపదానికి చేరుకుంటాడు. ఆయన మరణం తరువాత యధావిధిగా దహనసంస్కారాలు పూర్తి చేశాక, పెట్టిన శ్రాద్ధభోజనానికి భోక్తలుగా వశిష్ఠుడు, అగస్త్యుడు మొదలైన మహర్షులు కూర్చుంటారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత, శ్రీనివాసుడు, పద్మావతీదేవి, వకుళమాత, అగస్త్యుడు తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు.

ఆకాశరాజు మరణంతో రాజ్యం ఎవరికి చెందాలన్న వివాదం వస్తుంది. రాజుకు తమ్ముడిని కనుక తనకే చెందాలని తొండమానుడు అంటే, కాదు కాదు, మా నాన్న శౌర్యపరాక్రమాలతో జయించిన రాజ్యం కొడుకునైన నాకే చెందాలని వసుద వాదిస్తాడు. ఇద్దరి మధ్య వివాదం పెరిగి, యిద్ధానికి సిద్ధపడతారు. యిద్ధంలో గెలిచినవారిదే రాజ్యం అన్న ఒప్పందానికి వచ్చారు. ఇద్దరూ తమతమ సైన్యాలను సిద్ధం చేసుకున్నారు. నారాయణపురానికి దక్షిణంలో యుద్ధం.

ఇద్దరూ శ్రీనివాసుని వద్ద సాయాం కొరడానికి వస్తారు. నేను ఒక్కడినే, ఇద్దరికి ఎలా సహాయపడగలను అనె సందిగ్ధంలో పడి, పద్మావతీదేవిని అడుగుతారు. నేను ఒక్కడినే ఉన్నాను, ఇద్దరూ నాకు కావలసినవారే కదా, ఎవరికి సాయపడమంటావ్? చెప్పు అంటూ పద్మావతీదేవిని అడుగగా, నా తమ్ముడు చిన్నవాడు, ఒంటరివాడు, తండ్రి లేనివాడు, నా పినతండ్రి ఒకరి సహాయపడే శక్తి ఉన్నవాడు, తనని తాను రక్షించుకోగలడు, కనుక వసుదకు సహాయపడడమే ఉచితం అంటుంది. పద్మావతీదేవి చెప్పినదే ఉచితం అని తలచిన స్వామి వసుదకు సాయం చేద్దాం అని నిశ్చయించుకుంటాడు. కానీ భక్తుడిని కాపాడడం భగవంతుని బాధ్యత. అందుకే భక్తుడైన తొండమానుడి రక్షణ కోసం తన శంఖుచక్రాలను తొండమానుడికి ఇచ్చేస్తాడు.

అందరూ యుద్ధభూమికి చేరుకుంటారు. శ్రీనివాసుడు వదిలి బాణాలకు తొండమానుడి రధమూ, గుర్రాలు నాశనమవుతాయి. తన సైన్యం కూడా నశించిపోతుంది. ఇది చూడలేని తొండమానుడు, శ్రీనివాసుడిచ్చిన సుదర్శన చక్రాన్ని వసుదపైకి విసరగా, వసుదను రక్షించడానికి అడ్డం వెళతాడు శ్రీనివాసుదు. చక్రం వచ్చి శ్రీనివాసుడి భుజానికి తగిలి గాయం అవుతుంది. వెంటనే శ్రీనివాసుడు మూర్చిల్లుతాడు (కళ్ళు తిరిగి కిందపడిపోతాడు). ఈ యుద్ధానికి అంతరిక్షం నుంచి చూస్తున్న దేవతలు, భగవంతుడు మూర్చిల్లడం చూసి ఆశ్చర్యపోతాడు.



దీంతో ఇరుపక్షాలు యుద్ధం ఆపేసి శ్రీనివాసుడికి పరిచర్యలు చేయడంలో కాసేపు మునిగిపోతారు. ఈ విషయం చారుల ద్వారా తెలుసుకున్న పద్మావతీదేవి పరుగుపరుగున అగస్త్యమునితో కలిసి యుద్ధభూమికి వస్తుంది. శ్రీనివాసుని ముఖంపై నీరు చల్లి స్పృహ వచ్చేలా చేస్తుంది. స్ఫృహ వచ్చిన శ్రినివాసుడు 'నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీకీ యుద్ధభూమిలో పనేంటీ?' అని పద్మావతీదేవ్ని కోపగించుకుంటాడు. అహస్త్యుడు కలుగజేసుకుని ఇరు వర్గాలకు సంధి చేయడానికి పద్మావతీదేవి వచ్చిందని చెప్పి సమాధానమిస్తాడు. 'స్వామి మీ భక్తులను మీరే కాపాడండి. ఈ యుద్ధం వల్ల ఒరిగేదేంటి? తొండమానుడు, వసుద, ఇద్దరూ రాజ్యం ఏలడానికి వచ్చారు. ఇద్దరికి రాజ్యం పంచిపెడితే సరిపోతుంది కదా స్వామి' అని పలుకుతుంది. దానికి శ్రీనివాసుడు ఒప్పుకోడు. 'యుద్ధం చేయడం క్షాత్రధర్మం. యుద్ధంలో తొండమానుడిని, అతడి కొడుకును చంపి రాజ్యం వసుదకు వచ్చేట్లు చేస్తాను. లేకుంటే నేను ప్రాణం విడువటానికి సిద్ధపడతాను' అంటాడు పట్టుదలతో. పద్మావతీదేవి ఖిన్నురాలై అగస్త్యుని 'మీరే సర్ధిచెప్పండి నా శ్రీనివాసునికి' అని చెప్తుంది. అగస్త్యుడి ప్రార్ధనతో శాంతపడిన శ్రీనివాసుడు ఇద్దరిని పిలిచి వారి అభిప్రాయం అడుగుతారు. ఇద్దరూ భగవత్భక్తులు కనుక శ్రీనివాసుడు ఎలా చెప్తే అలా చేస్తామంటారు.

తరువాత శ్రీనివాసుడు ధనాగారాన్నీ, సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి తొండనమాడు రాజధానిగా తొండమానుడిని, నారాయణపురం రాజధానిగా వసుదానునికి పట్టాభిషేకం చేస్తాడు. వారి వద్ద కొన్ని రోజులు గడిపి తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు. వసుదానుడు తన అక్కకు అరణంగా తన రాజ్యంలో 16వ వంతు ఇచ్చాడని, అలా పద్మావతీదేవికి 32 గ్రామాలు వచ్చాయని పురాణం చెప్తున్నది.

మరో పురాణం ప్రకారం శ్రీనివాసుడే ఇద్దరితో "నేను మీ కోసం నా ప్రాణాలను సైతం లెక్కచేయక యుద్ధం చేశాను. సంధి కూడా కురిచాను. కనుక మీరిద్దరు నా మీ రాజ్యంలో భాగాలు ఇవ్వాలి" అని అనగా, ఇద్దరూ 16 గ్రామాల చొప్పున 32 గ్రామాలు ఇచ్చారని కనిపిస్తుంది.

 తొండమానుడు మహాభక్తుడు. మొదట శ్రీనివాసుడు తన చుట్టమనీ, మానవమాత్రుడనీ తలచినా, తరువాత జరిగిన సంఘటనలు ఆయనలో శ్రీనివాసుడే మహావిష్ణువు అన్న ఆలోచనలు కలిగించాయి. శ్రీనివాసుని పెళ్ళికి బ్రహ్మ, రుద్రుడు మొదలైన వాళ్ళు రావడం, లక్ష్మీదేవియే వివాహం జరిపించడం, విశ్వకర్మ భవనం నిర్మించడం, శుకుడు, అగస్త్యుడు, వశిస్ఠుడు లాంటి మహామునులు రావడం, శ్రీనివాసుడు తనకు శంఖుచక్రాలు ఇవ్వడం, సుదరశనచక్రానికి అడ్డుపడి వసుదను కాపాడడం, ఇవన్నీ తన బుర్రల్లో గిర్రున తిరిగాయి. అంతే స్వామి మానవుడు కాదు, మానవరూపంలో భూమికి దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నాడు. వెంటనే అగస్త్యుని ఆశ్రమం వద్దకు వెళ్ళి ప్రార్ధన చేస్తాడు. 'మహాప్రభో! దేవదేవ! శ్రీనివాసా! నిన్ను ఇనాళ్ళు మానవమాత్రుడు అనుకున్నాను. సృష్టి, స్థితి, లయలను నడిపే పరబ్రహ్మవని గుర్తించలేకపోయాను. ఈ జీవితం నీటిపై బుడగలాంటిది. అటువంటి ఈ జీవితంలో నిన్ను సేవించడమే పరమలక్ష్యం. దేవతాసార్వభౌముడవైన నిన్ను మోక్షం అడగడం మరచి, యుద్ధంలో సాయం కోరాను. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఇలా నువ్వే విష్ణువనీ గుర్తించగలిగాను. నన్ను అనుగ్రహించు స్వామి' అని వేడుకున్నాడు.

తన పాదాలపై పడిన తొండమానుడిని పైకి ఎత్తిన శ్రీనివాసుడు, 'నీ భక్తికి మెచ్చాను, నాకు సేవ చేసుకునే భాగ్యం నీకు కలిగిస్తాను. నీ అన్న పద్మావతీదేవితో వివాహం చేసి, నన్ను గృహస్థుడిని చేశాడు. 6 నెలలు కొండ ఎక్కకూడదన్న నా వ్రతం పూర్తి కావస్తోంది. వేంకటాచలం మీద నాకు ఒక ఇల్లు లేదు. కనుక నాకు ఒక ఆలయం కట్టించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈ ఘనకార్యం చేసి చరితార్ధుడవి అవ్వు' అని పలికాడు.

రాజా! నాకు తూర్పు దిక్కు ముఖద్వారముతో, రెండు గోపురములతో, మూడు ప్రాకారములతో, ఏడు ద్వారములతో ఉండేట్లుగా ఆలయం నిర్మించు. అందులో ఆస్థాన మండపం, స్వపన మండపం, యాగమండపం, వస్త్రాలగది, బలిపీఠం, ధ్వజస్థంభమూ, సకల సదుపాయాలతో నిర్మించు అని ఆలయ నిర్మాణ పధకం మొత్తం తొండమానుడికి చెప్తాడు వేంకటేశ్వరుడు. నిర్మాణం చేసే సమయంలో ఆలయం ప్రదేశంలో ఉన్న రెండు చింతచెట్లను కాపాడు అంటూ రెండు చింతచెట్లను చూపిస్తాడు. ఎందుకంటే ఈ చింతచెట్లు నాకు రక్షణ కలిగించాయి. కనుక వాటిని ముట్టుకోవద్దు. అలాగే లక్ష్మీదేవికి సంపెగ చెట్టు అంటే ఇష్టం. కనుక దానిని కూడా ముట్టుకోవద్దు. మందిరం నిర్మాణంలో వీటికి హాని కలుగకుండా చూడు. ఆగ్నేయదిశలో పాకశాల నిర్ముంచు.

అట్లాగే దానికి ఎదురుగా భూతీర్ధం ఉన్నది. అది శిధిలావస్థలో పాడబడి ఉన్నది. దానిని కూడా బాగు చేయించి, మంచి రాతికట్టడంతో నిర్మించు. ఈ భూతీర్ధం పూర్వజన్మలో నీవు నిర్మించినదే అని చెప్తాడు.  'నేను నిర్మించినదా? స్వామీ నా పూర్వజన్మ వృతాంతమేమిటి?' అని అడుగుతాడు తొండమానుడు. 'ఈ బావిని నేనెందుకు తవ్వించాను? ఎవరి కోసం చేశాను?' అని అడుగగా, స్వామి ఈ విధంగా చెప్తున్నాడు.

పూర్వం చోళదేశంలో హరిద్రానదీ తీరంలో కృష్ణక్షేత్రంలో వైఖానసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గోపాలకృష్ణుని భక్తుడు. భగవంతుని ఎప్పుడు ఏ కోరిక కోరకుండా, కేవలం భగవంతుంది ప్రీతి కొరకు మాత్రమే కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతడు తనకు మోక్షం కావాలని మాత్రమే వేడుకునేవాడు. ఎంతో తపస్సు చేసి గోపాలకృష్ణుడిని మెప్పించగా, స్వామీ ప్రత్యక్షమై 'వేంకటాద్రి మీద స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీనివాసుడే నీకు మోక్షం ప్రసాదించగల దైవం. ఆయన స్వయంగా నారాయణుడు. కలియుగంలో ఈ విధంగా వెలిశాడు. అతడిని సేవించి మోక్షం పొందు' అంటాడు గోపాలకృష్ణుడు.

ఆ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం పుష్కరిణికి దక్షిణ దిక్కున చింతచెట్టు కింద మోకాలు లోతున పుట్టలో కప్పబడి ఉంది. కృతయుగాంతంలో శంఖరాజుకు ఈ పుష్కరిణి దగ్గరే శ్రీనివాసుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, తాను ఎలా కనిపించాడో, అచ్చం అలానే తన విగరహం చెక్కించి, ఆలయం నిర్మించమంటాడు శ్రీనివాసుడు. ఆ శంఖరాజు స్వామీ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా కృతయుగంలో కాలక్రమంలో శిధిలమైంది. శ్రీనివాసుని విగ్రగం పుట్టలోకి చేరింది. నువ్వు వేంకాటచలం వెళ్ళి, ఆ విగ్రహాన్ని పుట్టలోంచి తీసి, ప్రతిష్టించి, పూజించి, తరించి మోక్షాన్ని పొందు అని చెప్తాడు గోపాలకృష్ణుడు.

నీవ్వు వేంకాటాచలం వెళ్తున్న సమయంలో, దారిలో నోకి రంగదాసు అనే శూద్రబాలుడు పాండ్యదేశం నుంచి వస్తూ తారసపడతాడు. అతడు కూడా నాకు మహాభక్తుడు. మీరు ఇరువురు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించాలి. అది మీ వల్లనే కరగాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పటి నుంచి నీవు గోపినాధుడనే పేరుతో ప్రసిద్ధుడవు అవుతావు అని చెప్పి గోపాలకృష్ణమూర్తి అదృశ్యమవుతాడు.

కృష్ణుడు చెప్పిన విధంగానే గోపినాధుడు వేంకటాచలానికి పయనమవుతాడు. దారి మధ్యలో సువర్ణముఖినదీ తీరంలో రంగదాసు తారసపడతాడు. ఇద్దరూ సువర్ణముఖి నదీతీరంలో స్నానం చేసి, శుకపురం (తిరుచానూరు) చేరుకుని, బలరామకృష్ణులను ఆలయాన్ని దర్శించి, వారిని సేవించుకుని, తిరుమల కొండకు చేరుతారు.

పూర్వం చోళదేశంలో హరిద్రానదీ తీరంలో కృష్ణక్షేత్రంలో వైఖానసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గోపాలకృష్ణుని భక్తుడు. భగవంతుని ఎప్పుడు ఏ కోరిక కోరకుండా, కేవలం భగవంతుంది ప్రీతి కొరకు మాత్రమే కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతడు తనకు మోక్షం కావాలని మాత్రమే వేడుకునేవాడు. ఎంతో తపస్సు చేసి గోపాలకృష్ణుడిని మెప్పించగా, స్వామీ ప్రత్యక్షమై 'వేంకటాద్రి మీద స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీనివాసుడే నీకు మోక్షం ప్రసాదించగల దైవం. ఆయన స్వయంగా నారాయణుడు. కలియుగంలో ఈ విధంగా వెలిశాడు. అతడిని సేవించి మోక్షం పొందు' అంటాడు గోపాలకృష్ణుడు.

ఆ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం పుష్కరిణికి దక్షిణ దిక్కున చింతచెట్టు కింద మోకాలు లోతున పుట్టలో కప్పబడి ఉంది. కృతయుగాంతంలో శంఖరాజుకు ఈ పుష్కరిణి దగ్గరే శ్రీనివాసుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, తాను ఎలా కనిపించాడో, అచ్చం అలానే తన విగరహం చెక్కించి, ఆలయం నిర్మించమంటాడు శ్రీనివాసుడు. ఆ శంఖరాజు స్వామీ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా కృతయుగంలో కాలక్రమంలో శిధిలమైంది. శ్రీనివాసుని విగ్రగం పుట్టలోకి చేరింది. నువ్వు వేంకాటచలం వెళ్ళి, ఆ విగ్రహాన్ని పుట్టలోంచి తీసి, ప్రతిష్టించి, పూజించి, తరించి మోక్షాన్ని పొందు అని చెప్తాడు గోపాలకృష్ణుడు.

నీవ్వు వేంకాటాచలం వెళ్తున్న సమయంలో, దారిలో నోకి రంగదాసు అనే శూద్రబాలుడు పాండ్యదేశం నుంచి వస్తూ తారసపడతాడు. అతడు కూడా నాకు మహాభక్తుడు. మీరు ఇరువురు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించాలి. అది మీ వల్లనే కరగాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పటి నుంచి నీవు గోపినాధుడనే పేరుతో ప్రసిద్ధుడవు అవుతావు అని చెప్పి గోపాలకృష్ణమూర్తి అదృశ్యమవుతాడు.

కృష్ణుడు చెప్పిన విధంగానే గోపినాధుడు వేంకటాచలానికి పయనమవుతాడు. దారి మధ్యలో సువర్ణముఖినదీ తీరంలో రంగదాసు తారసపడతాడు. ఇద్దరూ సువర్ణముఖి నదీతీరంలో స్నానం చేసి, శుకపురం (తిరుచానూరు) చేరుకుని, బలరామకృష్ణులను ఆలయాన్ని దర్శించి, వారిని సేవించుకుని, తిరుమల కొండకు చేరుతారు.

 నీ మనసు కామంతో కలత చెందింది. అది నా మాయ వల్లనే జరిగింది. నిలకడలేని మనసుతో సాధన పురోగతి చెందదు. నీ ఈ చేష్టవలన నీ దేహం కూడా కలుషితమైంది. నా పుష్కరిణి దగ్గరే నీ దేహం విడిచిపెట్టు. ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో మరణించడం చేత, నీ పుణ్య కర్మ చేత, గొప్ప రాజ వంశంలో జన్మిస్తావు. అనేకమంది భార్యలతో, చాలా డబ్బుతో భోగం అనుభవిస్తావు. చిన్న వయసు నుంచే నాకు భక్తుడవు అవుతావు. నాకు ఆలయం నిర్మించి చరితార్ధుడవు అవుతావు. నీ శరీరాన్ని ఆత్మహత్యతో వదిలిపెట్టకు. మరణ సమయంలో మాత్రమే, స్వామి పుష్కరిణికి చేరుకుని, తుదిశ్వాస విడువు. అంతరవరకు యధావిధిగా, ఇంతకు పూర్వంలాగే నా సేవలో తరించు అని ఆకాశవాణి పలుకుతుంది.

రంగదాసు సుమారు 100 సంవత్సరములు స్వామి కైంకర్యంలో గడిపి, కాలధర్మం ప్రకారం మరణిస్తాడు, తరువాత చంద్ర వంశంలో సుధర్మునికీ, నాగకన్యకూ జన్మిస్తాడు. అతడే తొండమానుడు. ఆకాశరాజు తమ్ముడు. పూర్వ జన్మల వాసనల వల్ల 5 ఏళ్ళ వయసుకే మంచి విష్ణు భక్తుడై, గొప్ప సాధకుడయ్యాడు.

అని చెప్పిన శ్రీనివాసుడు, గత జన్మలో నీవు తవ్వించిన బావే ఈ భూతీర్ధం అని చెప్తాడు. శ్రీనివాసుని ఆదేశం ప్రకారం బావిని శుభ్రం చేయించి, మంచి కట్టడం కట్టించి, తూర్పు ముఖంగా ఆలయం కట్టించి, మంచి శిల్పకళానైపుణ్యం ఉట్టిపడేలా శిల్పాలతో, విమాన వేంకటేశ్వరునితో, బంగారు కలశములతో, విమానంతో ఆలయం కట్టించి, సలక్షణ రీతిలో ఆలయ నిర్మాణం చేయించాడు తొండమానుడు.

శ్రీనివాసుడు ఒక శుభముహూర్తాన, పద్మావతీదేవితో మంగళస్నానం చేసి, ఈ ఆలయంలోకి గృహప్రవేశం చేశాడు. వసుదానుని కుటుంబ సమక్షంలో, ఇతర భక్తులు, మహర్షుల సమక్షంలో, బృహస్పతి, వశిష్టాదుల ఆధ్వర్యంలో ఈ శుభకార్యం జరిగింది. అందరికి ఆనందాన్ని పంచే ఈ గోపురానికి, ఆనందనిలయం అని పేరు వచ్చింది.

వచ్చే యాత్రికుల కోసం ఒక యోజన దూరంలో మెట్లు కట్టించి, కొండ ఎక్కడ సులభం చేశాడు. ఎక్కడిక్కడ విశ్రాంత మండపాలు, చలివేంద్రాలు బావులు నిర్మించాడని పురాణం చెప్తుంది.  

మొదట శ్రీనివాసుడు అందరికి కనిపించే రూపంతో తిరుమల ఆలయంలో ఉండేవారు. అయితే ఒకసారి తొండమానుడి మీద కోపం వస్తుంది. అప్పుడు స్వామీ 'నేను మీకు సులభంగా కనిపించి, దర్శనమిస్తున్నానని, అన్ని చూసుకుంటాననీ ధీమాగా ఉన్నావు. వ్యక్తుడిగా ఉన్న నేను, ఇప్పటి నుంచి అవ్యక్త రూపంతో ఉంటాను' అని సంకల్పించి, విగ్రహరూపంగా మారిపోయారు. తానూ అన్ని గమనిస్తూ ఉంటాననీ, భక్తుల కోరికలు తీరుస్తాననీ, తన దర్శన మాత్రం చేతనే భక్తుల పాపం పరిహారం చేస్తాననీ, కానీ గతంలోలాగా తాను అందరికి కనిపించననీ, శిలా రూపంగా అవతరిస్తాడు. అంటే స్వామి ఇచ్ఛారూపం అది. ఒకరు చెక్కినది కాదు, దేవతలు చేసినది కాదు. ఈ ఆనందనిలయంలో బ్రహ్మదేవుడు రెండు అఖండ జ్యోతులను వెలిగించాడు. అవి కలియుగాంతం వరకు వెలుగుతూనే ఉంటాయి. కలియుగాంతంలో కొండెక్కుతాయి. అప్పుడు కలియుగ దైవం వేంకటేశ్వరుడు తిరుమల నుంచి వైకుంఠానికి తరలిపోతాడు. ఆనందనిలయం అనే విమానం అప్పుడు కూలిపోతుందని, ఆ తర్వాత కృతయుగం ప్రారంభవుతుందని బ్రహ్మదేవుడి సంకల్పం.

ఏడుకొండలవాడా! వేంకటరమణా! గోవిందా గోవిందా!!  

గత కొద్ది రోజులుగా ప్రచురిస్తున్న ఈ కధను విశ్రాంత ఐ.ఏ.ఏస్., పి.వి.ఆర్.కే. ప్రసాదుగారు రాసిన తిరుమల లీలామృతం అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకాన్ని ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ఇంకా అనేక విషయాలు ప్రస్తావించారు. ఇన్నాళ్ళు మీ దగ్గరి నుండి ఈ కధ విషయంలో అందుకున్న ప్రశంసలన్నీ వారికే అంకితం.

ఓం నమో వేంకటేశాయ 

No comments:

Post a Comment