Tuesday 11 November 2014

అక్బర్ - బీర్బల్ - 4 ప్రశ్నలు

ఒకప్పుడు అక్బర్ బాదుషా తన మంత్రి ఐన బీర్బల్ను 4 ప్రశ్నలు అడిగెను.......

1.....దేవుడు యెచట నివసించును?

2...అతని పని యేమి?

3....అతడేమి భుజించును?

4...కేవల సంకల్ప మాత్రంచే సమస్తము చేయగలిగి ఉండగా అతడు మానవ రూపము యేల ధరించవలె?..

అప్పుడు బీర్బల్ ఈ క్రింది విధంగా సమాధానాలు ఇచ్చెను..

1....దేవుడు సర్వవ్యాపకుడు,,అతడు పవిత్రులైన తన భక్తుల హృదయంలో కానబడును..నీవు కూడా అతనిని నీ హృదయము నందు గాంచ వచ్చును...

2..అతడు ఉన్నత స్థితియందున్న వారిని పతనమొనర్చి ,,పతితులను ఉన్నత స్థితికి గొంపోవును...

3...అతడు జీవుల యొక్క అహంకారమును భుజించును..

అటు పిమ్మట 4వ ప్రశ్నకు అలోచించి తగిన సమాధానము నొసంగుటకై బీర్బల్ కొంత గడువును కోరెను..
తదంతరము బీర్బల్ అక్బరు యొక్క బిడ్డను రక్షించుచున్న దాది వద్దకువచ్చి ఆమెతో ఇట్లనెను..`ఈ దినము నాకు నీవు ఒక విషయమై సహకరించవలెను..నేను అక్బరుకు ఒక నిశ్చితమైన వేదాంత ప్రశ్నకు సమాధానము చెప్పవలసి ఉన్నది..అక్బరు ఈ చెరువు వద్దకు తన శిశువుతో ఆడుటకై వచ్చినపుడూ ఆ శిసువును యెచటనైన దాచి ఉంచి, శిశువు యొక్క ఈ బొమ్మను నీ వద్ద ఉంచుకొనుము.. ఆ శిశువు పడిపోవుచున్నట్లు చేసి, ఆ బొమ్మను చెరువులో పారవేయుము.. అప్పుడు జరగనున్న తమాషాను గమనించుము.. దీనినంతటిని నైపుణ్యముతో చేయుము.. నీవు నైపుణ్యత కలదానివని నాకు తెలియును..: అని చెప్పీతడామెకు పదిరూపాయిలు పారితోషికముగా ఇచ్చెను.. ఆమె మిక్కిలి సంతుష్టియై అతను చెప్పినట్లు చేయుటకు అంగీకరించెను..
అక్బరు తన సాయంకాలపు షికారు నుండి తిరిగి వచ్చి చెరువు పక్కనున్న బల్లపై కూర్చుండెను.. అప్పుడు బిడ్డను తీసుకొని రమ్మని దాదిని అడిగెను.. అప్పుడా దాది చెరువు ప్రక్కకు వెళ్ళి బొమ్మబిడ్డను తెస్తూ అది పడిపోవుచున్నట్లుగా నటిస్తూఆ బొమ్మ శిశువును చెరువులో పడవేచెను..
అక్బరు ఆ బిడ్డను రక్షించుటకై చెరువులో దూకుటకు పరుగెత్తెను.. అప్పుడు బీర్బల్ అడ్డము వచ్చి `నీ బిడ్డ ఇచ్చటనే ఉన్నాడు.. దొందర పడకుడు..: అని పలికెను..

బీర్బల్ యొక్క అమర్యాదతో కూడిన ప్రవర్తనకు అక్బరు మిక్కిలి కోపోద్రిక్తుడై అతనిని మంత్రి పదవి నుండి తొలగించి శిక్షించుటకై ఆజ్ఞాపించెను..

నేనిప్పుడు మీ 4వ ప్రశ్నకు అనుభవ పూర్వకమైన సమాధానమొసంగితినని: పలికెను.. మీరు నాపై యెందుకు కోపగించుకొన్నారు.? మీ బిడ్డను రక్షించుటకై అనేకమంది సేవకులుండగా మీ బిడ్డయందున్న వాత్స్చల్యము బట్టి మీరే నీటియందు దూకుటకు సిద్ధపడ్డారు.. అదే విధంగా భగవంతుడు కేవలము తన సంకల్పమాత్రము చేతనే సమస్త కార్యములను చేయు సామర్ధ్యము కలిగి ఉండియూ అతడికి తనభక్తులయందు ప్రేమచే వారికి దర్శనం ఇచ్చుటకై అతడు ఈ భువిపై అవతరించును..ఈ విషయము మీకు అర్ధమైనదా?
ఈ విషయమంతయూ విని అక్బరు మిక్కిలి సంతసించి బీర్బల్కి విలువైన బహుమతులను,వజ్రఖచిత ఉంగరమును ,శాలువాను అర్పించెను..

ఇట్లు భగవంతుడు మానవజాతిని ఉద్ధరించుటకై అవతరించు చుండును....
సేకరణ: Jnana Valli 

No comments:

Post a Comment