Showing posts with label స్వామి దయానంద సరస్వతీ. Show all posts
Showing posts with label స్వామి దయానంద సరస్వతీ. Show all posts

Saturday, 6 June 2020

స్వామి దయానంద సూక్తి



Tether not the soul with the chords of the past and future and then say, ‘I am not free.’ Snap them there in which you have your soul.

- Swami Dayananda

Wednesday, 27 May 2020

స్వామి దయానంద సూక్తి



Life is for the living. Death is for the dead. Living I die if I miss the here and now. Dead I will live if I have my being in the past and future, and here and yonder. Is it living?

- Swami Dayananda

Thursday, 13 February 2020

స్వామి దయానంద సూక్తి



The vision of Vedanta is not so much in presenting a cause-effect relationship between Brahman and the world (jagat) as it is in unfolding the jagat as non-separate from Brahman. This sarvatma -bhava, a recognition of oneself as the whole, is the vision, tatparya of vedanta.

- Swami Dayananda

Thursday, 30 January 2020

దయానంద సరస్వతి సూక్తి



What exactly is the aim of life? It can only be living. I am born not for anything except to live, which is what we find in every organism. A plant wants to live, a bug wants to live, an insect wants to live. Any organism that is born, wants to live. So living is the aim of life, nothing more.

- Swami Dayananda

Tuesday, 31 December 2019

స్వామి దయానంద సరస్వతీ సూక్తి



Find you will yourself; The self hitherto unknown but sought after, The self that is strangely missed and searched for, The self that you love to be, That you are.

- Swami Dayananda

Thursday, 21 November 2019

స్వామి దయానంద సూక్తి




The more you see Isvara’s order, the less you are away from the Lord. To recognize this order is to surrender to this order. In surrender you let the order rule your life.

- Swami Dayananda

Sunday, 29 September 2019

స్వామి దయానంద సూక్తి



The more you understand yourself, the world and God, the more you are equipped to accept yourself. You cannot have inner leisure without an understanding of these three.

- Swami Dayananda


Thursday, 7 September 2017

స్వామి దయానంద సూక్తి



In the Vedic vision, all that is here is the manifestation of Ìsvara. The order that we see in the world of sound, like any other order, is Ìsvara. When one is exposed to music, one is in harmony with Ì¿vara. There is joy; there is love. The contentious ego resolves into the experience of Ìsvara whether one recognizes it as such or not.

- Swami Dayananda

Tuesday, 25 July 2017

స్వామి దయానంద సూక్తి



Submit-not out of mere faith, but out of wisdom-to the Cosmic Will, infinitely mightier than yours. In this submission, you will shed your load and make yourself an instrument for the expression of the inscrutable ways of the Cosmic Will. And your life shall be lighter than what the word ‘light’ conveys.

- Swami Dayananda

Thursday, 13 April 2017

స్వామి దయానంద సూక్తి



While traveling to a particular destination, people may enjoy a few things along the way, but they do not lose sight of their destination. Self-knowledge need not be any different.

- Swami Dayananda 

Monday, 13 March 2017

స్వామి దయానంద సరస్వతి సూక్తి



Any form of prayer is as efficacious as any other. This fact must be understood well, not as tolerance for or accommodation of forms of worship other than one’s own, but in terms of understanding that the universal order alone is being implied. There is no pagan’s prayer; there is only prayer.

- Swami Dayananda Sarasvati

Wednesday, 22 February 2017

మహాపురుషుడు - స్వామి దయానంద సరస్వతి

భారతదేశంలో ఆధునిక కాలంలో పుట్టిన ముగ్గురు మహాపురుషులు స్వామి దయానంద సరస్వతీ, స్వామి వివేకానంద, శ్రీ అరొబిందో.
నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి.

వైదిక ధర్మం నుంచే పుట్టి, వేరు పడిన 70 పైగా అవైదిక మతాలను ఖండించి, సనాతన ధర్మాన్ని ఆది శంకరులు పునఃస్థాపితం చేశారని మనం ఎలా చెప్పుకుంటున్నామో, అచ్చం అలానే దయానందుల గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆదిశంకరులు సనాతనధర్మాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళీ ఈ ధర్మంలో ఎన్నో అవైదిక వాదనలు ఉద్భవించాయి. సమాజమంలో వచ్చిన రుగ్మతలకు ఆది శంకరుల వలె, భగవద్రామానుజులు, మధ్వాచార్యులు తమదైన శైలిలో పరిష్కారం చూపి, ధర్మాన్ని రక్షించారు. సనాతనధర్మంలో ప్రతి ఆచార్యుడు గొప్పవాడే. ఎవరికి వారే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఎందరో సంస్కర్తలు వచ్చినా, కాలక్రమంలో ధర్మంలో అనేక అనాచారాలు, దురాచారాలు ప్రబలాయి. వ్యక్తి గుణకర్మలను బట్టి నిర్ణయించే వర్ణం, జన్మతః నిర్ణయించడం మొదలుపెట్టారు. అంటరానితనం అనే దురాచారం వచ్చింది. బాల్య వివాహాలు, సతిసహగమనం కూడా సమాజాన్ని పట్టి పీడించాయి. అనవసరమైన, కుతర్కమైన మూఢనమ్మకలాతో భారాతావని ఎన్నో బాధలు అనుభవించింది. ప్రజల్లో చైతన్యాన్ని, క్రియాశీలత్వాన్ని నింపాల్సిన ధర్మప్రభోధం, అకర్మను, తమస్సును నింపింది. అటువంటి సమయంలో మాఘబహుళ దశమి రోజు, 12 ఫిభ్రవరి 1824 లో, గుజరాత్ రాష్ట్రంలోని టంకర అనే గ్రామంలో జన్మించారు స్వామి దయనంద సరస్వతీ. వీరి పూర్వాశ్రమ నామం మూలశంకర. చిన్నవయసులోనే సత్యాన్వేషణతో ఇల్లు వదిలిన మూలశంకరుడు, అనేక ప్రాంతాలను తిరిగి ఆఖరికి మథురలో స్వామి విరాజానంద అనే సన్యాసి వద్ద శిష్యరికం చేశారు. విరజానందుడు అంధుడే అయినా, జ్ఞాన దృష్టి కలవాడు. సమాజంలో చెప్పబడుతున్న వేదప్రోక్తమైన సనాతన ధర్మం కాదని, అసలు ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, ఆ పనిని దయానందునికి అప్పగించారు విరజానందుడు.

అప్పటి నుంచి దయానందుడు భారతదేశ నిర్మాణానికి, సనాతన ధర్మ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు. ఎందరొతోనో వాదించారు. సనాతనధర్మంలో వివక్ష లేదని, అంటరానితనం వేదాల్లో లేదని, ఉంటే ఎక్కడ ఉందో చూపమని సవాల్ విసిరారు. అంటరానివారికి యజ్ఞోపవీతాలు చేసి, ఉపనయనం చేసి, వేదాధ్యనానికి బాటలు వేశారు. స్త్రీలు కూడా వేదం చదవచ్చని, వితంతువులు పునర్వివాహం చేసుకోవడం శాస్త్రబద్దమని వేదప్రమాణంగా నిరూపించారు. స్త్రీల కోసం వేదపాఠశాలలను స్థాపించారు. దైవం పేరుతో సనాతనధర్మంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను ఖండించారు. గోవధ మీద ఆంగ్లేయ ప్రభుత్వంతో మాట్లాడి, గోవధను నిషేదించాలని చెప్పిన వారిలో అగ్రగణ్యుడు దయానందుడు. అనేకమంది రాజులను కలిసి, వారిలో ధర్మానురక్తిని నింపారు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర పోషించడంతో పాటు, భారతదేశానికి సంపూర్ణం స్వరాజ్యం రావాలని ఎలుగెత్తి అరిచారు. భారతదేశ స్వరాజ్యం గురించి భారతీయుడు ఇచ్చిన తొలి పిలుపు అదే. ఆ తర్వాత దాన్నే లోకమాన్య బాలగంగాధర తిలక్ కొనసాగించారు. తాను బ్రతికింది 59 ఏళ్ళే అయినా, అందులో ఋగ్వేదానికి సంపూర్ణంగానూ, యజుర్వేదానికి సగం వరకు భాష్యం రాశారు. వారు రాసిన వేదభాష్యం అప్పటి వరకు వేదంపై ఉన్న అభిప్రయాలను మరింత పెంచింది. ఆ కాలంలోనే ఋగ్వేద భాష్యం రాస్తూ, రేడియో, విమానాల గురించి ప్రస్తావించారు. కాశీవెళ్ళి కాశీ బ్రాహ్మణులతో శాస్త్రవాదం చేసి, వారిని ఓడించారు. సర్వమత సభను ఏర్పాటు చేసి, అన్ని మతాల పెద్దలను దానికి పిలిచి, ఈ లోకానికి వేదమే ప్రమాణమని, అందరూ వేదాన్నే అనుసరించాలని,  అని పిలుపిచ్చారు. వారు ఎవరూ ఒప్పుకోకపోవడంతో తన ఆశయసాధనకు ఆర్యసమాజ్ అనే సంస్థను స్థాపించారు. మేడం కామ, పండిత లేఖా రాం, స్వామి శ్రద్ధానంద, సావర్కర్, రాం ప్రసాద్ బిస్మల్, లాలా లజపతి రాయ్ మొదలైన వారిపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంది. అంతెందుకు అరబిందో, సర్వేపల్లి రాథాకృష్ణన్ మొదలైనవారు వీరిని, ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించారు.

వీరి ప్రభావం ఎంతగా ఉండేదంటే ఆంగ్లేయులకు వీరంటే హడల్. గుండెలు జారిపోయేవి. వీరిని హిందూ మిలిటెంట్ గా అభివర్ణించారు. ఈ కాలంలో మనం చూసిన రాజీవ్ దీక్షిత్, ప్రస్తుత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదలైనవారికి దయానందులే స్ఫూర్తి ప్రదాత. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పై వీరి ప్రభావం ఎంతగానో ఉంది. వీరి కారణంగానే వారు అంత వీరోచితంగా పోరాడారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో యోధులకు స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అరబిందులే స్ఫూర్తి. దాదాపుగా దయానందుల ప్రభావం లేనివారు ఆ కాలంలో లేరని చెప్పవచ్చు. సనాతనధర్మంలో వచ్చిన ప్రతి సంస్కరణోద్యమంలో దయానందుల ప్రభావం ఎంతో ఉంది.

విగ్రహారాధన, అవతారవాదన మొదలైన వాటిని  దయానందులు ఖండించినా, అది ఆ కాలానికి అవసరమైనది కనుక అలా చేశారని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధర్మంలో ఉన్న ప్రతి ఆచార్యుడు, సమాజం extreme లో ఉన్నప్పుడు, తాను ఇంకోextreme కి వెళ్ళి, బలంగా వాదించి balance చేస్తారు. అదే దయానందులు కూడా చేశారు. బుద్ధుడు, శంకరాచార్యులు, రామానుజుల జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్దమవుతుంది. ధర్మ పునరుద్ధరణ ఒక లక్ష్యం అయితే, సమాజాన్ని balance చేయడం ఒక లక్ష్యం.

దయానందులు లేకపోతే, ఈనాడు హిందూ జాతి మిగిలి ఉండేది కాదు. మూఢనమ్మకాలతో, అంటారానితనం, బాల్యవివాహాలతో, మతమార్పిడులతో అంతరించిపోయి ఉండేదేమో. లేదా బానిస మనస్తత్త్వంతో ఉండేది. Colonise అయిన భారతీయ సమాజాన్ని Decolonise చేసే పని ప్రారంభించిన వ్యక్తులలో ప్రథముడిగా స్వామి దయానందులను చెప్పవచ్చు. అటువంటి దయానందులు సనాతన ధర్మంలో ప్రాతఃస్మరణీయులు.

ఇప్పటికీ వేదాల్లో ఏసు, మహమ్మదు అంటూ చేస్తున్న విషప్రచారాలను ఖండించగలిన, ఖండిస్తూ, జాకీర్ నయిక్ ను సైతం హడలుగొట్టిన సత్తా కలిగిన ఏకైక సంస్థ ఆర్య సమాజమే, దయానందుల భాష్యమే. అంత గొప్పవారు దయానందులు. మనం స్వామి వివేకానందను స్మరిస్తాం కానీ వారు చెప్పింది విస్మరిస్తాం. అరబిందులను, దయానందులను స్మరించడం కాదు, పూర్తిగా విస్మరించాం.

Tuesday, 24 January 2017

స్వామి దయానంద సరస్వతి సూక్తి



Because all people seek fullness, happiness, they are on the Lord’s track alone, although they may not know it. A person who does not know exactly what he or she is seeking keeps on seeking.

- Swami Dayananda Saraswati

Wednesday, 16 November 2016

స్వామి దయానంద సరస్వతి సూక్తి



Life is nothing but a series of decisions. You have to make decisions in life all the time. And those decisions have to come from a clear mind, not from a confused mind. Therefore, you have to be prayerful so that clear decisions will come to you.

- Swami Dayananda saraswati

Wednesday, 19 October 2016

స్వామి దయానంద సూక్తి



The worst part of mechanical thinking is that it automatically gets into an undesirable thinking pattern. Thus, even when you don’t want to get sad, you become sad.

- Swami Dayanada

Friday, 23 September 2016

స్వామి దయానంద సరస్వతి సూక్తి



Removal of desires is neither possible nor necessary. That I desire is not a problem. The desire becomes a problem when I come under its spell.

- Swami Dayananda Saraswati

Wednesday, 17 August 2016

స్వామి దయానంద సరస్వతి సూక్తి



The Lord is one, effulgent, all-knowledge, without a spot of ignorance. And that Lord is the one upon whom we meditate or whom we pray to, dh¢mahi. We pray with our heart and mind to that Lord who is effulgent, all-knowing and all-consciousness and who is most worshipful.

- Swami Dayananda Saraswati

Monday, 1 August 2016

స్వామి దయానంద సరస్వతి సూక్తి



I may have all the six ingredients (effort, initiative, courage, intelligence, resourcefulness and perseverance) for success but still there may be something that makes the difference between success and failure. By my prayer, I invoke daivam, the seventh factor, to take care of the unknown element.

- Swami Dayanand saraswati

Sunday, 8 May 2016

హిందూ ధర్మం - 208 (యజ్ఞంలో బలి ఖండన - 2)

వక్రీకరణ - నరమేధంలో మనిషిని బలి ఇస్తారు.
వాస్తవం - మానవదేహానికి వేదం చెప్పిన విధంగా అంత్యేష్టి సంస్కారం (దహనసంస్కారం మొదలైనవి) చేయడమే నరమేధం - సత్యార్ధప్రకాశంలో స్వామి దయానంద సరస్వతీ.

వివరణ - భారతీయ సమాజం ఆటవికమని, తమ మతమే శ్రేష్టమని నిరూపించడానికి ఏ విధంగా అవకాశాం లేదని గ్రహించిన వక్రీకరణకారులు, యజ్ఞయాగాది క్రతువుల్లో మనుష్యులను బలిస్తారని వక్రీకరించారు. అదేకాక సంస్కృతిని నాశనం చేయడంలో పత్రికలు ముందుంటాయి. ఎవరైనా జనాలను మోసం చేస్తే, అవినీతి అధికారి జనాలకు శఠగోపం పెట్టాడని ప్రచురిస్తారు. భాషను తామేదో కాపాడుతున్నామని చెప్పుకునే ఈ పత్రికల వాళ్ళకు భాషలో పదాల అర్దం కూడా కనీసం తెలియదు. శఠగోపం మీద స్వామి పాదాలుంటాయి. ఆలయంలో శఠగోపం పెట్టించుకోవడం స్వామి పాదాలను నెత్తిన పెట్టించుకుని, ఆశీర్వాదం పొందడం. స్వామి పాదాలు పట్టుకున్నవాడు ఉద్ధరించబడతాడే కానీ నశించడు. మరి ఈ పద ప్రయోగాన్ని పత్రికలు నీచంగా ఎందుకు చేస్తాయో వారికే తెలియాలి. ఇలాంటిదే నరమేధం కూడా. ఎక్కడైన ఉగ్రవాద దాడి జరిగి, అనేకులు మరణిస్తే, భారి నరమేధం అంటూ ఆ పదానికి లేని అర్ధాన్ని ఆపాదించి, సమాజాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారు.

శతపధబ్రాహ్మణం 13 వ అధ్యాయంలో నరమేధం గురించి చెప్పబడింది. 7 1/2 అడుగుల పొడవు, 5 1/2 అడుగుల వెడల్పు, 4 1/2 అడుగుల లోతుతో గొయ్యి త్రవ్వాలి. పైన ఉన్న వెడల్పులో సగం మాత్రమే క్రింద ఉండాలి. అందులో కనీసం 49 పౌండ్ల గంధపుచెక్క, పలాశ (మోదుగ) చెట్టు చెక్క వేయాలి. శవానికి సమాన బరువుతో ఆవునెయ్యి తీసుకుని, కస్తూరి కలిపి, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కర్పూరం మొదలైనవి వేయాలి. దాని మీద శవాన్ని ఉంచాలి. శవం మొత్తం ఆవునెయ్యిని చల్లి, నిప్పు అంటించాలి. ఈ విధంగా చేయడం వలన శవం కాల్చిన వాసన రాదు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దహన సంస్కారానికి యాగానికి సమానమైన స్థానం కల్పించారు. అసలు శవ దహనం అనకుండా దహన సంస్కారమని, అంత్యేష్టి అని అనడంలోనే ఎంతో అర్దం దాగుంది. సంస్కారం అనగా సంస్కరించునది. దేహన్ని, సూక్ష్మ శరీరాన్ని సంస్కరించి, ఆత్మ ఉద్ధతికి సహాయపడే కర్మలకు సంస్కారం అని పేరు. దానికి మరే ఇతర భాషలోను సమానమైన అర్దంలేదు. తాను దేహం కాదు, ఆత్మ అని స్థిరమైన భావన ఉన్నవారు, దేనీ మీద వ్యామోహం లేనివారికి మినహాయించి మరణం సంభవించగానే అందరి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదు. అది అక్కడే, ఆ దేహం మీద మమకారంతో రోదిస్తూ ఉంటుంది. ఆ రోదన ఎవరికి (సామాన్య మనవులకు) కనపడదు, వినపడదు. జీవుల కర్మ తీరడానికి కొత్త దేహం ధరించాలి. కానీ దేహమే తానన్న మమకారం వలన అది కొత్త ప్రదేశానికి దేహాన్ని విడిచి వెళ్ళెందుకు ఇష్టపడదు. ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తే, అది కుళ్ళిపోతుంది. తన దేహం కుళ్ళిపోవడం దీనికి ఇంకా బాధను కలిగిస్తుంది. అలా కాక ఆత్మను ఉద్ధరించడం కోసం వచ్చిందే ఈ దహన సంస్కారం. అప్పుడు చదివే మంత్రాలు, ఆత్మకు ఈ దేహం తనది కాదని, ఇక తాను అక్కడి నుంచి విడిచి వెళ్ళాలని, తనకంటూ వేరే దేహం, జన్మ నిర్దేశించబడ్డాయని తెలియజేస్తాయి. శరీరాన్ని పూడ్చిపెట్టక, దాన్ని కాల్చివేయడం, మిగిలిన అస్థికలు, ఎముకలను నదిలో కలపడం వలన దేహం పూర్తిగా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక అక్కడ ఆత్మ తనది అంటూ కూర్చుని ఏడ్వడానికి ఏమీ మిగలదు. అలా జీవులను శవ దహనం ద్వారా ఉద్ధరించి, వెరొక జన్మకు పంపుతుంది కనుక దీనికి దహన సంస్కారం అని పేరు వచ్చింది. ఇందులో దహనం చేసేవారికి స్వార్ధం ఉండదు. వారు తమ ధర్మాన్ని నిర్వర్తించడం తప్పించి, ఏమీ ఆశించటం కూడా ఉందదు.

అంతేగాక, ఒక శరీరాన్ని అలాగే వదిలేస్తే అది కుళ్ళి రోగాలు వ్యాపిస్తాయి. కొన్ని భయంకరమైన రోగాలు, అంటువ్యాధులతో మరణించినవారిని పూడ్చిపెట్టడం కంటే కాల్చివేయడం మంచిదని కూడా ఇప్పుడు ఋజువు అవుతోంది. ధర్మం కూడా అదే చెప్పింది. అనాధ శవాలను కూడా ఎవరూ లేరని వదిలేయక, ఆ జీవుడిని ఉద్ధరించడం కోసం వాటికి కూడా కర్మకాండ నిర్వహించమంటోంది. అది చేసింనందుకు ఎంతో పుణ్యం వస్తుందని కూడా ఈశ్వరుడు నిర్దేశించాడు. ఈ చర్య నిస్వార్ధతతో కూడినదై, రోగాలు వ్యాపించకుండా ఇటు సమాజాన్ని, జీవుడి ప్రయాణాన్ని సులభతరం చేసి ఆత్మను ఉద్ధరిస్తున్న కారణాన దీన్ని యాగం అన్నారు. అంతేకాని నరమేధం అంటే వ్యక్తిని చంపి యాగంలో వేయడం కాదు.

To be continued ................