Thursday 4 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (191)



కమండులువును త్రోయడం, కావేరీ నది ప్రవహించడం జరిగింది సహ్యాద్రి తీరంలో. అక్కడ ఒక ఉసిరిక చెట్టుంది. ఆ చెట్టు ఏమిటో కాదు అది మహావిష్ణువే. అది విష్ణుమాయవల్ల లోపాముద్రగా మారి అగస్త్యుని భార్య అయింది. అగస్త్యుని కమండులువులోని నీరుగా మారిందట.


ఇట్లా కావేరి, భగవానుని పాదం నుండి ప్రవహించగా గంగ నా పాదం నుండి ప్రవహిస్తోంది. కాని గంగ కంటే నామీద నాకధిక ప్రీతి యుందని, మొత్తం నా శరీర స్పర్శ నీకు కల్గుగాక అని అనుగ్రహించాడు విష్ణువు. నీవు నదిగా ప్రవహిస్తున్నప్పుడు రెండుగా చీలుతావు, ఒక ద్వీపం దగ్గర రెండు పాయలూ కలిసి నపుడు నీవు నన్ను రెండు చేతులతో ఆలింగనం చేసుకొంటావని కావేరీతో విష్ణువన్నాడట.


మరొక సందర్భంలో శైవ వైష్ణవాలు కలిసాయి. విభీషణుడు రాముడి నుండి రంగనాథుని విగ్రహం పొందినట్లు, రావణుడు పరమేశ్వరుని నుండి ఆత్మలింగాన్ని పొందాడు. దానిని నేలమీద పెట్టకూడదని షరతు పెట్టాడు. లంకకు వెళ్ళేవరకూ చేతిలోనే ఉండాలి సుమా! అన్నాడు. అదీ భారత భూమిని దాటకూడదని పన్నాగం పన్నినట్లున్న కథ మీకు తెలిసిందే. ఆ లింగం స్థాపించబడిన చోటు గోకర్ణం. అది కర్ణాటకలో పశ్చిమ తీరంలో ఉంది. ద్వారక, రామేశ్వరం మాదిరిగా ఇదీ ఒక ద్వీపంలా ఉంటుంది. అక్కడున్న స్వామికి మహాబలేశ్వరుడని పేరు. అక్కడ పెట్టి పెట్టగానే రావణుడు పెకలించబోయాడు. వీలుపడలేదు కనుక స్వామి పేరు తగ్గట్లుగానే ఉంది రావణున్ని ఎట్లా వినాయకుడడ్డుకున్నాడో, విభీషణునికీ విఘ్నం కలిగించాడు. ఇట్లా ఇతని లీలలు అనంతం. ఇతనివల్ల గోకర్ణ, శ్రీరంగ క్షేత్రాలు ప్రసిద్ధిని పొందాయి.


No comments:

Post a Comment