Monday 1 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (188)



స్వామియే భక్తునికి లొంగాలని భావించినపుడు మాత్రమే లొంగుతాడు యశోద, కృష్ణుణ్ణి త్రాళ్ళతో బంధించినపుడు జరిగింది కదా!


(త్రాటితో యశోద, కృష్ణుణ్ణి కట్టాలని ప్రయత్నించగా రెండు అంగుళాల త్రాడు తక్కువ వచ్చిందని, కట్టలేకపోయిందనే కథ, ఖాగవతంలో ఉంది కదా, రెండంగుళాలు తక్కువ అవడమేమిటి? మహత్తు, అహంకారం, తన్మాత్రలని ప్రకృతి, పరాప్రకృతిగా ఉంటుంది. పంచ భూతాలతో కూడినది, అపరాప్రకృతి. ఈ రెంటి ప్రకృతులకు స్వామి అందడని సూచిస్తోంది ఆ కథ. కనుక తనంతట తాను లొంగిపోయాడు కన్నయ్య. - అనువక్త) 


విభీషణుడు, వినాయకుని తలపై ఒక దెబ్బ కొట్టాడు. అపుడు నిజరూపాన్ని చూపించాడు గణపయ్య. అట్టి దర్శనం వల్ల ఇతనిలో కోపం, బాధ మటుమాయ మయ్యాయి. "లంకకు స్వామిని తీసుకొని వెళ్ళలేకపోయానని బాధపడకు, నేనెట్లా విగ్రహాన్ని ఉంచానో గమనించావా? ఇది లంకను చూస్తున్నట్లుగానే ఉంటుంది. లంకపై నిరంతరం ఈ స్వామి అనుగ్రహాన్ని వర్షిస్తూనే ఉంటాడులే. సాధారణంగా దక్షిణవైపు చూస్తున్నట్లు విగ్రహాల్ని ప్రతిష్ఠించరు. నీకోసం అట్లా చేసాను, దిగులు చెందకు” అని గణపయ్య ఊరడించాడు.

No comments:

Post a Comment