Thursday 29 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 206 వ భాగం



జ్ఞానియైన పంచముడూ గురువే


ఒక ఉదయం శంకరులు శిష్యులతో గంగా స్నానానికై బయలుదేరారు. దారిలో ఒక చండాలుడు ఎదురయ్యాడు. ప్రక్కకు తొలగమని అడుగగా చండాలుడు ఇలా అన్నాడు.


"అన్నమయా దన్నమయం, అథవా చైతన్యమేవ చైతన్యాత్

ద్విజవర! దూరీకర్తుం వాంఛసి, కింబ్రూహి గచ్ఛ గచ్చేతి".


- మనీషా పంచకం


అనగా "ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ! దేనిని ప్రక్కకు తొలగమంటున్నావు? అన్నం తినే శరీరం దగ్గరకు మరొక శరీరం రాకూడదంటావా? లేదా రెండు శరీరాలలోనూ ఉండేది చైతన్యమే. నీ చైతన్యం దగ్గరకు పంచముని శరీరంలోని చైతన్యం రాకూడదంటావా?"


"ఉన్నది ఒక చైతన్యమే. శరీరాలు భిన్నంగా ఉండవచ్చు. ప్రాణం ఒక్కటే. నీ వేదాంతం, పెక్కు ఆత్మలున్నాయని చెబుతోందా? అందువల్ల రాకూడదంటోందా? ఎవరి శరీరమైనా మాంసం, చర్మం, ఎముకలతో నిర్మింపబడిందే కదా! లోనున్నదంతా మురికియే. శరీర భావనయే వేదాంతికి ఉండకూడదు. జ్ఞానమార్గం బోధించేవాడు మరొకణ్ణి పొమ్మనడం ఏమిటి?" 


బ్రహ్మ జ్ఞానం వల్ల పండితుడని, కేవలం చదవడం వల్ల కాదని గీత అంది:


No comments:

Post a Comment