Saturday 1 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 207 వ భాగం



"విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః


పండితుడు, అందరి పట్లా సమభావంతో ఉంటాడు. అంతా బ్రహ్మమనినప్పుడు, మరొకవిధంగా వర్తించదు. జంతువులును తీసుకుంటే ఆవు, ఏనుగు, ఎక్కువస్థాయిలో ఉన్నాయని కుక్క అధమ జంతువుని భావిస్తాం. మానవులలో బ్రాహ్మణుని ఉత్తమునిగా భావిస్తారు. చండాలుణ్ణి నీచుడని భావిస్తారు.


జంతువులకంటే మానవులుత్తములని భావిస్తారు. కాని జ్ఞానికి, ఇట్టి ఎక్కువ తక్కువలుండవు. జంతువులను, మానవులను విడివిడిగా చూడదు. అన్ని ప్రాణులను ఒకటిగానే భావిస్తాడు.


ఇట్టి సమదృష్టి కలిగియుండాలని బోధించే అద్వైత స్థాపనాచార్యుడు. నన్ను పొమ్మనడం ఏమిటని ప్రశ్న


"ఏదో బాధపడి నన్ను వాదంలోకి దింపుతున్నాడా? అందువల్ల శాస్త్ర నియమాలను చెప్పినా అతడు వినే పరిస్థితిలో లేదు. అతడు తొలగకపోతే మనమే తొలగాలి. అయితే అతడేదో బాధపడి మాట్లాడడం లేదు. వేదాంత సత్యాలను చెబుతున్నాడు. కనుక అతడు చెప్పేది వినాలని" భావించారు శంకరులు.


చండాలుడు ఇంకా ఇలా అన్నాడు:


కింగంగాబుని బింబితోఽంబరమణౌ చండాలవాటీ పయః

పూరే చాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే

ప్రత్యగస్తుని విస్తరంగసహజానం దావబోధాంబుధౌ

విప్రొ@యం శ్వపచో@య మిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః"


తా: గంగాజలంలో, చండాల వాటికలో నున్న జలాశయంలోనూ ప్రతిబింబించిన సూర్యునిలో ఏమైనా భేదం ఉంటుందా? ఎట్టి తరంగాలు లేని సహజానంద బోధ సముద్రమగు ఆత్మలో ఇతడు చండాలుడు, ఇతడు బ్రాహ్మణుదనే భేదం అనే భ్రమ నీకు ఎట్లా కలిగింది?


శంకరులు తరువాత అద్వైతంలో రెండు భేదాలు కన్పిస్తాయి. లక్ష్యంలో తేడా యుండదు. పరమాత్మ జీవాత్మగా ఎట్లా కన్పిస్తున్నాడు? రెండు సిద్ధాంతాలూ అవిద్యయే కారణమంటాయి. అయినా భిన్నంగా చెబుతాయి.

No comments:

Post a Comment