Showing posts with label భగవాన్ రమణమహర్షి. Show all posts
Showing posts with label భగవాన్ రమణమహర్షి. Show all posts

Friday, 31 July 2020

శరణాగతి గురించి రమణులు



Many visitors came on one occasion and they all saluted
Sri Bhagavan with the single prayer,

“Make me a bhakta. Give me moksha.”

After they left Sri Bhagavan said, thinking aloud:

All of them want bhakti and moksha.
If I say to them,
‘Give yourself to me’
they will not.
How then can they get what they want ?

~ From Talks with Sri Ramana Maharshi : 543

Thursday, 7 May 2020

పుస్తకపఠనం గురించి భగవాన్ రమణ మహర్షి



Reading of Sastras and becoming pandits may give fame to a person but they destroy the peace of mind which is necessary for the seeker of truth and deliverance. A Mumukshu (a seeker of deliverance) should understand the essence of the Sastras but should give up the reading of Sastras as that is inimical to dhyana (meditation). It is like accepting the grain and discarding the chaff. There will be many big almirahs with many books. How many of them can be read? There are so many books and religions that one life is not enough to read all the books relating to even one religion. Where then is the time for practice? The more you read, the more you feel like reading further. The result of all that is to go on discussing with other people who have books and spend time thus, but
that will not lead to deliverance.

- Bhagavan Ramana Maharshi

Friday, 23 March 2018

Thursday, 14 December 2017

భగవాన్ రమణ మహర్షి సూక్తి



A devotee once approached Bhagavan and asked him if he could prostrate to him and touch his feet.

Bhagavan replied: ‘The real feet of Bhagavan exist only in the heart of the devotee. To hold onto these feet incessantly is true happiness. You will be disappointed if you hold onto my physical feet because one day this physical body will disappear. The greatest worship is worshipping the Guru’s feet that are within oneself.’

Friday, 14 April 2017

Wednesday, 8 March 2017

భగవాన్ రమణ మహర్షి సూక్తి



Abandon the drama of the world and seek the self within. Remaining within, I will protect you, ensuring that no harm befalls you.

- Bhagavan Ramana Maharshi

Monday, 6 February 2017

అనన్యశరణాగతి - భగవాన్ ఉపదేశం - శ్రీ రమణాశ్రమ లేఖలు

శరణాగతి
(6 వ భాగం)



10-4-1947
ఈ ఉదయం ఆంధ్ర యువకులొకరు శ్రీవారి కొక (భగవాన్ రమణ మహర్షి గారికి) జాబు వ్రాసి చేతికిచ్చారు. అందులో "స్వామి, భగవానుని యందు అనన్యశరణాగతి చెందితే, సర్వం లభిస్తుందటారు గదా. అనన్య శరణాగతి అంటే ఒక చోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీరపోషణ కావశ్యకమైన ఆహారాదుల చింత గూడా వదలి సదా భగవంతుని స్మరించుటేనా? వ్యాధిగ్రస్థుడనైతే, ఔషధసేవకై యత్నించక స్వస్థతాస్వస్థతలు భగవదధీనం చేయుటేనా? గీతలో స్థిరప్రజ్ఞుని గుఱించి "విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః, నిర్మమో నిరహంకార స్స శాంతిమధిగచ్ఛతి" - 2-21 అనటం వల్ల, సమస్త కోరికలు త్యజించుటనిగదా తేలుతుంది. అందువల్ల, మనం భగవంతుని స్మరిస్తూ ఆహారపానీయాదులు భగవదాదేశమై ఆయాచితంగా లభిస్తే, స్వీకరించటమా? లేక, స్వల్పంగా యత్నించటమా? భగవాన్, ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించా"లని ఉన్నది.

భగవాన్ చూచి, సావధానులై సమీపస్థులతో "ఇదుగో, అనన్యశరణాగతి అంటే, ఏ చింతలు లేకుండా ఉండాలనటం సత్యమేగాని, దేహపోషణ కావశ్యకాలైన అన్నపానాదుల చింత గూడా వదలవలెనా అంటే ఏం చెప్పగలం. భగవదాదేశమై ఆయాచితంగా వస్తే తినవలెనా? కొద్ది ప్రయత్నం చేయవలెనా. అంటారే; దానంతటదే వస్తుందనుకో. మింగనైనా మింగాలా? అది మాత్రం యత్నంకాదూ? 'వ్యాధిగ్రస్థుడనైతే ఔషధం సేవించాలా? స్వస్థతాస్వస్థతలు భగదధీనం చేసి, ఊరుకోవాలా?' అంటారు. 'క్షుద్వ్యాధేః ఆహారం' అన్నఆరు. దీనికి రెండర్థాలున్నవి. క్షుత్తున్నూ, వ్యాధి వంటిదే గనుక క్షుత్తనే (క్షుత్తు= ఆకలి) వాధికి ఆహారమనే ఔషధ మవసరమనీ, వ్యాధికి ఔషధం వలే, ఆకలికి ఆహారం ఇవ్వాన్లనీ చెప్పారు. శంకరులు రాసిన సాధనా పంచకంలో "క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం బిక్షౌషధం భుజ్యతాం" అని ఉన్నది. క్షుత్తనే వ్యాధ్కి భిక్షాన్నం తినమన్నారు. బిక్షకైనా పోవాలిగదా? అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని 'వస్తే తింటా'మంటే లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ననుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వ రాయిత్యంగా ఉందాలి. నేణు చేస్తున్నాననే భావనే బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలిగాని, ఆకలికి ఆహారం, వ్యాధికి మందు ఇవ్వవచ్చునా? లేదా? అని శంకలు పెట్టుకుంటే, అంతులేకుండా శంకలు వస్తూనే ఉంటవి. ఊ అని మూల్గవచ్చునా? ఊపిరి పీల్చవచ్చునా? అన్న శంకగూడా బయలుదేరుతుంది. ఈశ్వరుడనుకో, కర్మనుకో, ఏదొ ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు. భారం అతని మీద వేసి, బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం. అడుగడుక్కు కాలు ఎత్తాలి, నిలపాలి అని గమనిస్తామా, దానంతటది నడక సాగటం లేదూ? ఉచ్చ్వాస నిశ్వాసాలూ అంతే. క్షణక్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించటం లేదే. ఆ విధంగానే ఇదీను. ఏదైనా విడువాలంటే విడవగలమా? చేయాలంటే చేయగలమా. తెలిసీ తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరుగలేదా? ముందు జరుగవా? భగవానునందు అనన్యశరణాగతి చెందటమంటే, ఇంతర చింతలన్నీ వదిలి మనసు అతని యందే లగ్నం చేయాలి. ఎంతెంత మగ్నం చేస్తామో, అంతంతగా ఇంతర చింతలు దూరమౌతవి. మనోవాక్కాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే, మన కార్యభారం ఆయనమీదే ఉంటుంది. కృష్ణభగవాన్ అర్జునునితో-

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

అన్నారు. అర్జునునకు యుద్ధం చేయవలసినపని ఉన్నది. అందువల్ల భారం నా మీద వేసి, పని చేయవోయ్, నీవు నిమిత్తమాత్రమే సుమా. అంతా నేనే చూచుకుంటాను, నిన్నేదో బాధించ"దన్నారు కృష్ణ భగవాన్. అయితే, ఈ అనన్య శరణాగతి చేయటానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింతనా లేకుంటే గాని, శరణాగతి కాదు. ఏ చింతనా లేనప్పుడు ఉండేది తానే గదా? తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే, భగవానునందే భారం వేసి, తన కర్మ సాగిస్తుంటే, క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది. ఏదైనా ఫలితం ఒకటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకుని, తాను తానుగ నిలుచుటే; తన్ను విడిచి అన్యం ఏమున్నది?" అన్నారు భగవాన్.

"అది తెల్సుకునే మార్గమో?" అన్నాడా యువకుడు. "గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. ధ్యానం చేయమన్నారు. దానికి శక్తి లేదూ, భక్తి, కాకుంటే యోగం, నిష్కామ కర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదొ ఒక మార్గాన్ననుసరించి పోవాలి. తానెప్పుడూ ఉండేవాడేకదా? సంస్కారాన్ననుసరించి పనులు వాటంతటవే జరుగుతుంటవి. చేసేది నేననే భావనే బంధం. విచారణవల్ల దాన్ని పొగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూస్కుని కూర్చున్నతనే #శరణాగతి కాదు. అంతా అదే విధంగా కూర్చుకుంటే లోకయాత్ర సాగేదెట్లా?" అని భగవాన్ అంటూ ఉండగా, భోజనశాలలో గంట మ్రోగింది. "అదుగోనయ్యా గంట, లేచిపోవద్దూ?" అని నవ్వుతూ లేచారు భగవాన్.

మూలం - శ్రీ రమణాశ్రమ లేఖలు; సూరి నాగమ్మ.

(ఇంకా ఉంది)

Thursday, 2 February 2017

Tuesday, 31 January 2017

శరణాగతి (1 వ భాగం)



శరణాగతి
(1 వ భాగం)

శరణాగతి అంటే భగవంతుని మీద పూర్తి భారం వేసి, అన్యమైన ఆలోచనలను, ఆందోళలను విడిచిపెట్టడం. శరణాగతి గురించి భగవాన్ రమణ మహర్షి గొప్పగా చెప్పారు. రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి చూపిన రెండు మార్గాల్లో ఒకటి ఆత్మవిచారణ అయితే, రెండవది శరణాగతి. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి, నడిపిస్తున్నది, లయం చేస్తున్నది భగవంతుడే. ఇది ఒట్టి మాటలలో చెప్పుకుంటే యాంత్రికంగా ఉంటుంది. దాంతో పాటు ఎన్నో సందేహాలు కూడా కలుగుతాయి. అదే అనుభూతి కలిగినప్పుడు, వివేకం కూడా జనిస్తుంది. అప్పుడు సందేహాలకు తావు ఉండదు. ఆయన ఆజ్ఞతోనే సమస్తమూ జరుగుతోంది, భవిష్యత్తులో ఏది జరగాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు. నేను చేస్తున్నాను, నా వల్ల అది జరిగింది, ఇది జరిగింది, నేనలా చేస్తాను అనుకోవడమే అహంకారం. ఎందుకంటే నా, నీ ద్వారా సమస్తమూ చేస్తున్నవాడు భగవానుడే. అన్నీ ఆయన చేస్తున్నాడనే వివేకంతో, అన్నీ ఆయనకే అర్పించి, ఇతర ఆలోచనలు చేయకుండా, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడమే శరణాగతి.

దీని గురించి #భగవాన్ రమణులు ఇలా అంటారు. భక్తులలో ఉత్తమ భక్తుడెవరు? స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను తాను అర్పించుకుంటాడో, అతడే భక్తశ్రేష్ఠుడు. ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి కొంచమైనా చోటివ్వక, ఆత్మనిష్ఠాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికి అర్పించుకోవడం. ఈశ్వరుని మీద ఎంత భారం వేసినా, ఆయన దానిని భరించగలడు. సకల కార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్నప్పుడు, మనం దానికి లోబడి ఉండడం మాని, ఇలా చేయాలి, అలా చేయాలి అని సదా చింతించడం ఎందుకు? రైలు బండి బరువులన్నిటిని మోయగలదని తెలిసియుండి, ప్రయాణీకులైన మనము మన చిన్నమూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక, దానిని నెత్తికెత్తుకుని ఎందుకు కష్టపడాలి?

ఎంత చక్కగా చెప్పారో చూడండి. పైన చెప్పిన ఉపమానంలో ఈ ప్రపంచమే రైలుబండి అనుకుందాము. ఈ ప్రపంచం అనే రైలులో మనము కూడా ప్రయాణికులము. ఒక స్టేషనులో ఎక్కి, ఇంకొక చోట దిగిపోతాము. ఇలా ఎందరో ప్రయాణిస్తున్నారు. అది ఎందరిని ఎక్కించుకున్నా, అందరిని లాగే శక్తి దానికి ఉంది. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఈశ్వరునికి ఉంది. అందుకే కదా విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుః అంటూ ప్రారంభించబడింది. కేవలం ఈ ప్రపంచాన్నే కాదు, సమస్త బ్రహ్మాండాలను అసలే భారం లేకుండా మోస్తున్నవాడు భగవానుడు. ఈ బ్రహ్మండాలన్నిటిలో ఈ విశ్వం చిన్న కణిక. అందులో ఈ ప్రపంచమెంత? అందులో నువ్వెంత? నువ్వు వీటిలోనే ఉన్నప్పుడు నీ భారం కూడా ఆయన మీదే ఉంది. ఈ క్షణంలో కూడా నీ భారం వహిస్తున్నవాడు ఆయనే. రైలు బండి ఎక్కినవాడు, నెత్తి మీద మూటలు దింపి, క్రింద పెట్టి, హాయిగా ప్రయాణాన్ని ఆనందించి, గమ్యం వచ్చినప్పుడు దిగిపోక, ఆ మూటను నెత్తిన పెట్టుకుని, అనవసరంగా కష్టపడటం, గమ్యం ఎప్పుడు వస్తుందా, ఎక్కడ దిగాలో అంటూ కంగారు పడటం, అనవసరమూ, అవివేకము కూడా. అలాగే ఈ సమస్త ప్రపంచాన్ని నడుపుతున్న ఆ భగవంతుండే నీ భారాన్ని కూడా మోస్తున్నాడనే ఎరుక కలిగి ఉంటూ, జరిగిన వాటి గురించి బాధపడక, జరగబోయే వాటి గురించి చింతించక, వర్తమానంలో, ఈశ్వరునిపై విశ్వాసంతో, ఆనందంగా ఉండడమే #శరణాగతి.

(ఇంకా ఉంది) 

Friday, 30 December 2016

భగవాన్ రమణ మహర్షి సూక్తి


Those  who have come to my feet with love, and without delaying, are those whose birth has been graced by God. Theirs is an eminent and true life.

- Bhagavan Ramana Maharshi
(Talks 1661)

Thursday, 15 December 2016

భగవాన్ రమణుల గురించి కంచి పరమాచార్య స్వామి



మార్గశిర బహుళ ద్వితీయ రోజున అవతరించారు భగవాన్ రమణ మహర్షి. తిధుల ప్రకారం నేడు వారి జన్మదినం.

For english version
http://www.kamakoti.org/souv/5-58.html

Monday, 3 October 2016

భగవన్నామం - భగవాన్ రమణ మహర్షి సూక్తి



Q: People give some names to God and say that the name is sacred and that repetitions of the name bestow merit on the individual. Can it be true?

Sri Ramana Maharshi :
Why not?
You bear a name to which you answer.
But your body was not born with that name written on it,
nor did it say to anyone that it bore such and such a name.
And yet a name is given to you and you answer to that name, because you have identified yourself with the name.
Therefore the name signified something and it is not a mere fiction. Similarly, God's name is effective.
Repetition of the name is remembrance of what it signifies.
Hence its merit.

Friday, 1 July 2016

ఆత్మ స్వరూపుని ఆత్మ సేవ - శ్రీ రమణాశ్రమ లేఖలు ,8 వ ఉత్తరం



గత సెప్టెంబరు - అక్టోబరు సమయంలో భగవానులకు కాళ్ళనొప్పులు అధికంగా ఉండటం వలన తైలం రుద్ధి కాళ్ళోత్తేవారు సేవకులు. మిగితా చొరవ గల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళొత్తడం ప్రారంభించి సమయాన్ని అతిక్రమించడం ఆరంభించారు.

సేవకులను కూడా 'రండీ, పోండీ,' అనే తప్ప 'రా,పో' అని పిలవడానే ఇష్టపడని భగవానులు ఇందుకు సహించగలరా? (భగవాన్ జంతువులు సహా ఎవరిని ఏకవచనంతో పిలవలేదు. అందరిని బహువచనంతోనే సంబోధించేవారు) ఖండించి, వద్దనడం వారి పనికాదు. అందువల్ల ఛలోక్తిగా "మీరంతా కాస్త ఆగండి. నేను కూడా కాసేపీ కాళ్ళు వత్తుతాను. నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దూ?" అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు వత్తుకోవడం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా ఏ నరల్లోనైనా శ్రీవారి పాదాలు ముట్టుకుని నమస్కరిద్దామన్న కోరిక ఉంటే, దీంతో పుర్తిగా నశించిపోయింది. శ్రీవారి మాటలే చిత్రగా ఉంటాయి. ఆ పుణ్యం కొంచం వారికి కావాలట! రవంత సూక్ష్మతకలవారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి.

ఆ రోజుల్లోనే ఇక్కడ నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జీ, పండు ముసలి, ప్రతాపరాయ దేసాయీ అనేవారు భగవానుని సమీపించి "స్వామీ! నాకు కూడా గురుపాద సేవలో భాగమివ్వాలి" అన్నారు. "ఓహో! సరిసరి. 'ఆత్మావై గురుః' అన్నారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే. డెబ్బైయేళ్ళు దాటాయి. మీరా నాకు సేవ చేసేది. చాలు చాలు. ఇకనైన ఆత్మసేవ చేసుకోండి. పల్కకుండా ఊరికే ఉంటే అంతే చాలు' అన్నారు భగవాన్. సరిగా విచరిస్తే ఇంతకన్నా గొప్ప ఉపదేశం ఏముంది? పలకకుండా ఊరికే ఉంటే చాలట. అట్లా ఉండటం భగవానునికే సహజంగాని మనకు సాధ్యమా? ఎంత తపించినా ఆ స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలిగిందేమి ఉన్నది?

సూరి నాగమ్మ - 28-11-1945
(శ్రీ రమణాశ్రమ లేఖలు, సూరి నాగమ్మ - 8 వ ఉత్తరం)

పల్కకుండా ఊరికే ఉండడమంటే ఆత్మ యందు దృష్టి నిలిపి, ప్రాపంచిక విషయాలను పట్టించుకోకపోవడం. ప్రాపంచిక విషయాల్లోకి మనసును పరుగెట్టనివ్వకుండా ఆత్మయందే దృష్టి నిలపమని రమణుల ఉపదేశం. 

Saturday, 18 June 2016

వైరాగ్యం - భగవాన్ రమణ మహర్షి ఉపదేశం

వైరాగ్యం సంపాదించడం ఎలా?

ముముక్షువులందరికీ కావలసింది విరక్తి. దానిని సంపాదించాలి. కానీ, వైరాగ్యం కొరకు విషయవాంఛలతో మొండిగా యుద్ధం పనికి రాదు. వలలో చిక్కిన పక్షి తన్నుకొంటే ఆ వల ఇంకా బిగిసిపోతుంది. అలాగే విషయేచ్ఛ కూడా. కావున వాటిపై దృష్టి ఉంచకూడదు. ఇతర బాహ్య విషయాలు ఎలాగో అలాగే దుష్ట విషయాలు కూడా. 'ఇది కాదు' (నేతి) అనే స్మరణ వలనగానీ, విచార మార్గంలో ఇవి (ఆలోచనలు) ఎవరికి ఉదయిస్తున్నాయి' అనే విచారణ చేసి వాటిని నిర్మూలించు. వాటి కొమ్మలు, పిందెలు, పువ్వులు వాటంతట అవే పడిపోతాయి.

- భగవాన్ రమణ మహర్షి  
(రమణలీల 237 పేజీ)