Thursday, 6 September 2012




part-18
~ షోడశోపచార పూజ అంటే ఏమిటి?

~ షొడశోపచారాపూజ అంటే 16 ఉపచారాలతో పరమాత్మను పూజించడం.ఉప అంటే దగ్గరగా,ఆచారం అంటే చెయ్యడం.పరమాత్మును మనకు మానసికంగా దగ్గరచేసెదే ఈ పూజ.ఈ 16ఉపచారాలను మన రోజువారి జీవితానికి అన్వయం చేసుకుందాం.

~ మన ఇంటికి మన చిన్ననాటి ఫ్రెండ్,మనం ఆహ్వనించకుండానే తనకు తానే స్వయంగా వస్తున్నాడని అనుకుందాం(వినాయకుడు మనం పిలువకుండానే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున వస్తున్నాడు కదా).ఆ ఫ్రెండ్ చాలా గొప్పవాడు,పెద్ద పదవిలో ఉన్నాడు.మరి అంత గొప్ప వాడు వస్తుంటే ఒక్కడే వస్తాడా?ఆయనకు ముందు ఎంతో మంది మన ఇంటికి వస్తారు కదా(అతను పెద్ద నాయకుడైతే పోలీసులు,కార్యకర్తలు,ఆయన వల్ల పదివిలో ఉన్నవారందరూ కూడా ఆయన్ను చూడ్డానికి వస్తారు కదా(మనం కలశంలొకి త్రిమూర్తులను,మాతృగణాలను ఆవహన చేస్తాం).అదే "కలశస్తాపన".  

~ ఇంతమంది వచ్చాక మనం వాడి కోసమని ఎదురుచూస్తూ ఉంటాం కదా.వాడు అలా ఉంటాడు,ఇలా ఉంటాడు అని ఆలొచిస్తూంటాం.మొత్తం మనసంతా అతని అలొచనలే ఉంటాయి కదా.అదే "ధ్యానం".

~ వాడు రాగానే రా!లోపలికి రా! అంటూ ఆనందంగా వాడిని ఇంట్లోకి తీసుకువస్తాం.అదే "ఆవాహన".

~ మన ఇంట్లో మంచి కుర్చీలేకపొయినా ప్రక్క ఇంటినుండి అడుక్కొనైనాసరే వాడికి మంచి కుర్చీ వేయాలి అనుకుంటామా?వాడు అలా మంచి కుర్చీలొనే కుర్చుంటా అని అనకపొయినా మనం  ఊరకుంటామా?అదే వరసిద్దివినాయకునికి "నవరత్నఖచిత సీంహాసనం" లేదా "ఆసనం".

~ మన హిందువులు వచ్చిన అతిధులకు కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకునేవారు.వచ్చిన వారిలో దైవాన్ని చూసేవారు.బయటనుండి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కుంటే మెదడుకు విశ్రాంతి.కాళ్ళలొ ఉండే నాడులు మెదడుకు నిరంతరం సంకేతాలను పంపిస్తుంటాయి.అందుకే పాదాలను చల్లటి నీటితో కడుక్కుంటే మెదడు హాయిగా ఉంటుంది.అలాగే బయటకు వెళ్ళిరావడంవల్ల కాళ్ళకు అంటుకొనిఉన్న క్రిములు ఇంట్లొకి రావు.అందుకే కాళ్ళు కడగటం.అదే "పాదయొః పాద్యం సమర్పయామి".

~ ప్రయాణసమయంలో మనం బయట వస్తువులను(బస్సు హ్యండిల్ లాంటివి) ముట్టుకొవలసి వస్తుంది.అవి శుభ్రంగా ఉండవు కదా.వచ్చి రాగనే వాడికి "షేక్ హ్యాండ్" ఇస్తే ఆ క్రిములు మన చేతికి అంటుకొని మనకు రోగాలు వచ్చె అవకాశం ఉంది కనుక మనం నమస్కరిస్తాం(నమస్కారానికి అర్దం నువ్వు నేను ఒక్కటే అని).ఇంకా నమస్కారానికి అనేకానేక అర్దాలు ఉన్నా అవి ఇప్పుడు అప్రస్తుతం.మన పూర్వీకులు వచ్చిన వాడి చేతులను శుభ్రపర్చుకోడానికి నీరు ఇచ్చెవారు.అదే "హస్తయొః అర్ఘ్యం సమర్పయామి".    
 
~ ఇలా శుభ్రపరిచాకే వారికి త్రాగడానికి"నీరు" ఇచ్చేవారు.అదే ఈ కాలంలో వచ్చిరాగానే మురికి చేతులతొ ఉన్నవాడికి కూల్ డ్రింక్లు ఇస్తే,అసలే బయట నుండి వచ్చాడు కదా,కాసేపటికి దాహం వేస్తుంది,అవి అసలే ఆరొగ్యానికి మంచి కావు.మురికి చేతులు.లేని రోగాలు వచ్చి చస్తాడు.అందుకే మన పూర్వీకులు ముందు నోరు శుభ్రపరుచుకోడానికి(బయటనుండి రావడం వల్ల నొట్లో క్రిములు చేరి ఉంటాయి కదా)నీరు ఇచ్చి,తరువాత త్రాగడానికి మంచి నీరు ఇచ్చేవారు.అదే  "ఆచమనం".    


to be continued.......                        

Wednesday, 5 September 2012


part-17
~ వినాయకచవితి పూజలో పాలవెల్లి ఎందుకు కడతారు?

~ ఆరోగ్యకారణాలను దృష్టిలో పెట్టుకొని మన ఋషులు ఈ కాలంలో దొరికే రకరకాల పండ్లను దీనికి కట్టమన్నారు.ఏ ఋతువులో వచ్చె పండ్లను ఆ ఋతువులొ తింటే ఆరొగ్యం చేకూరుతుందని,మనం బద్దకస్తులం కనుక ఆయా పండ్లను తెచ్చుకోమని,కనీసం తన పూజ ద్వారా అయినా ఈ పండ్లను తింటారని,అందువల్ల పాలవెల్లికి వివిధరకాల పండ్లను కట్టమని వినాయకుడు ఋషులద్వారా చెప్పాడు.

~ తాత్వికంగా చూసినప్పుడు పాలవెల్లి అంతరిక్షానికి సంకేతం.దానికి కట్టే పండ్లు గ్రహాలు,నక్షత్రాలకు సంకేతం.స్వామి అనంతకోటి బ్రహ్మాండనాయకుడు.ఆయన మన ఇంటికి వస్తే ఒక్కడే రాడు కదా.అంత గొప్ప స్వామి వస్తుంటే ఆయన్ను సేవించడానికి దేవతలు,యక్ష,కింపురుష,గంధర్వులు         ,గ్రహాలు మన ఇంటికి వస్తాయి.గ్రహాలు,నక్షత్రాలు ఆయా పండ్లలోకి చేరి స్వామిని కొలుస్తాయి.పూజానంతరం మనం ఆ పండ్లను నైవెద్యంగా తీసుకుంటాం కదా.అలా మనకు గ్రహదోషాలు ఉంటే శాంతిస్తాయి.

~ గ్రహాలు,నక్షత్రాలు జ్యొతిష్యానికి సంబంధించినవి కదా.జ్యొతిషం మూఢనమ్మకమని నాస్తీకులు వదిస్తున్నారు కదా?

~ నిజానికి జ్యొతిషం అర్దం అవ్వాలంటే సంస్కృత భాష మనకు తెలియాలి.హేతువాదులుగా చెప్పుకునేవారు మొదట వేసే ప్రశ్న- మనకు అనంతమైన నక్షత్రాలు కనిపిస్తుంటే హిందువులు 27 ఉన్నాయి అంటారేమి అని.నిజమే మనకు ఉన్నవి 27 నక్షత్రాలే.కాని మనకు ఆకాశంలో కనిపించేవి తారలు.తారలు వేరు నక్షత్రాలు వేరు.తారలు అంటే స్టార్స్.నక్షత్రాలు అంటే తార సమూహం.ఋగ్వేదంలొ చెప్పబడింది దైవప్రఙ్ఞలె(వెలుగు లేక శక్తులు)నక్షత్రాలని.6 తారల సమూహం కృతికా నక్షత్రం.అలాగే జింక తలాకారంలో ఉండే తార సమూహం మృగశిర.ఇలా అన్నమాట.ఈ తారల సమూహం నక్షత్రం అయితే నక్షత్రాల సమూహం రాశి.

~ గ్రహం అంటే ప్లానెట్ అని మాత్రమే అర్దం ఇంగ్లీషులో.గ్రహం అంటే తాత్కాలికమైనది,పరిమిత జీవిత కాలం కలిగినది,మన మీద తన ప్రభావం చూపించేది అని అర్దాలు ఉన్నాయి సంస్కృతంలో.ఇంకా అనేకం ఉన్నాయి కాని అవి అప్రస్తుతం.సూర్యుడు తార.ఎవరు కాదు అనలేదు కదా.మన మీద ప్రభావం చూపిస్తాదు కదా,అందునా ఆయనకు పరిమిత కాలం ఉంది కదా(శాస్త్రవేత్తలు కూడా చెప్పారు ఈ విషయాన్ని మన వేదంతో పాటు).అందుకే ఆయన్ను గ్రహం అన్నాము.చంద్రుడు అంతే.ఇక రాహు కేతువులను చాయగ్రహాలన్నారు.ఆ కిరణాలు గ్రహణసమయంలొ మన మీద ప్రభావం చూపిస్తాయని 1982-83లో డా.త్రాంటొన్ గారి పరిశొధనలో తేలింది కదా.అలాగే సూర్యుడు పాలపుంత మధ్యలో ఉన్నాడని,చుట్టు భూమి తిరుగుతొందని వేదాల్లొ అనెక చోట్ల మనకు కనపడుతొంది.

~ నిన్న కాకమొన్న వచ్చిన పరిమితమైన పదాల ఇంగ్లీషు భాషలో దేవ భాష సంస్కృత పదాల అర్దాలను వెతకడం మన మూర్ఖత్వం అవుతుంది.మన ధర్మంలో దేవునికి,పరమాత్మకు చాలా తేడా ఉంది.అన్నిటికి "గాడ్" అనె పదం ఏమాత్రం సరిపోదు.ఇప్పుడు మనం చెప్పుకున్న స్టార్,ప్లానెట్ కూడా అంతే.

~ అందుకే ఆంగ్లేయుడైన మెకాలె హిందువులను క్రైస్తవులుగా మార్చే కుట్ర ఫలించక ఈస్టిండియా కంపెనితో అంటాడు."ఒక జాతిని సర్వనాశనం చెయాలంటే,ముందు చేయవల్సినపని,దాని భాషను దెబ్బతీయడమే".అలాగే కలకత్తా నుండి ఇంగ్లాండులో ఉన్న అతని తండ్రికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు."ఈ ఇంగ్లీషు విద్యాప్రభావంచేత రాగల 20సంవత్సరాలలొ బెంగాల్లో హిందువెవడు మానసికంగా హిందువుగా మిగలడు,మని పని మరింత సులువవుతుంది".

~ సంస్కృతం మృతభాష కాదు.మన మాతృభాష.మన మూలం సంస్కృతంలొనే ఉంది.సంస్కృతాన్ని కాపాడుదాం.మన సంస్కృతిని కాపాడుకుందాం.


to be continued.........                      

Tuesday, 4 September 2012

వస్త్రధారణ - జాగ్రత్తలు

16
మిమ్మల్ని భయపెట్టడానికి మేము వస్త్రధారణ వెన్నుక ఉన్న సైన్స్ గురించి తెలియపరచలేదు.అందరూ నిజాలు తెలుసుకోవాలి అన్న తపనతో మీకు అందివ్వడం జరిగింది.

కేవలం వస్త్రధారణే కాదు కాలుష్యం, సెల్ ఫొన్లు, ఆహరం వంటివి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. మరి నష్టనివారణకు చేయాల్సినవి ఏమిటి? ముందు జీన్స్, బిగుతుగా(టైట్) గా ఉన్న బట్టలను ధరించడం ఆపాలి. జంక్ ఫుడ్స్ తినకూడదు. సెల్ ప్యాంట్ జేబులో పెట్టుకోకూడదు. లాప్‌టాప్ వంటివి శరీరం మీద పెట్టుకొని పనిచేయకూడదు. ధరించే బట్టలు కాటన్ వస్త్రాలైతే మంచిది. అవి కూడా లేతరంగులు అయితే ఇంకా మంచిది. అందరూ పంచెలు, చీరలు కట్టుకొవాలని చెప్పడంలేదు. కాని ధరించే వస్త్రాల విషయంలో జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్తున్నా. కనీసం పండగలు, పూజల సమయంలో ఈ సంప్రదాయ వస్త్రాలను కట్టుకొండి, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను గ్రహించండి. సంప్రదాయాన్ని భావితరాలకు అందించండి. ధూమపానం, మధ్యపానం వంటివి అలవాట్ల వల్ల జనువుల్లో లోపాలు ఏర్పడతాయి, వీర్యం, అండం క్షీణిస్తాయి. వాటి ఉత్పత్తి, వాటిలో ఉండే జీవకణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందుకే అవి అలవాటు ఉన్నవారు మానేయండి. శ్రీ విష్ణూసహస్రనామాలు, లలితా సహస్రనామాలు నియమంగా చదివితే, వాటికి మించిన పరమఔషధం లేదు. ఏది ఏమైనా ముందు దళసరి మరియు బిగుతైన బట్టలు ధరించకుండా ఉండాలి.

మన ఆరోగ్యం చేడిపొతుందనే, మనం ఆరోగ్యం కాపాడుకొవాలని, మనం ఆ వస్త్రాలు కట్టుకొవాలనే  భగవంతుడు తాను చేనేత నూలు వస్త్రాల్లో ఉంటానని చెప్పాడు. కాని ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? చేనేత కార్మికులను వేదం ఎంతో పొగిడితే, మన ఆదరణ కరువైయ్యి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనకు ఎన్నో పండగలు,పూజలు వస్తాయి కదా. ఎన్నో దేవాలయాల్లో స్వామికి వస్త్రాలు సమర్పిస్తాం కదా. అవి చేనేత వస్త్రాలే ఎందుకు సమర్పించకూడదు? ప్రతి ఏడాది ప్రతి ఒక్కరు కనీసం 5 మీటర్లకు సమానమైన చేనేత వస్త్రాలను కొంటే రాష్ట్రంలో చేనేత కార్మీకుల ఆత్మహత్యలు ఉండవు.

ఇప్పటికే మీకు అర్దం అయ్యి ఉంటుంది వేదం ఎందుకు అంతా గట్టిగా ఈ వస్త్ర ధారణ గురించి చెప్పిందొ. మన హిందూ ధర్మంలో ప్రతి పండుగ, పూజ వెనుక ఎన్నో ఆరొగ్య రహస్యాలు ఉన్నాయి. మన ధర్మంలో భగవంతుడు తన కోసం ఒక్క పూజ కూడా చేయమనలేదు. అవి మన ఆరోగ్యం మరియు పర్యవరణ రక్షణ కోసమే. మీరు చేసే ప్రతి పూజ మీకోసమే.

సంప్రదాయ వస్త్రధారణ చేసిన వివేకానందుని విదేశీయుడు వెక్కిరిస్తే ఆయన అన్నారు
 "In your culture dress makes Gentleman,but in our culture CHARACTER makes gentleman".           

Monday, 3 September 2012

సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?

part-15

Should be read by youth especially.


సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
ముందు శరీర నిర్మాణం గురించి ఓ విషయం తెలియాలి. మగవారి శరీరనిర్మాణంలో వృషణాలు (టెస్టిస్) ముఖ్యమైన భాగాలు. అవే సంతానోత్పత్తికి, ఓజస్సు శక్తికి కారణమైన వీర్యాన్ని ఉత్పత్తి చేసి, తమలో దాచుకుంటాయి. వాటి ఉష్ణోగ్రత శరీరసాధారణ ఉష్ణోగ్రతకన్న 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే వీర్యకణాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే ఉత్పత్తిపై ప్రభావం చూపి, వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత మరీ పెరిగితే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపొయే ప్రమాదం ఉంది. నపుంసకత్వం వస్తుంది. ఒకవేళ ఉత్పత్తి జరిగినా ఫర్టిలిటి అతి తక్కువగా ఉంటుంది.

బిగుతగా (టైట్ గా) ఉండే బట్టలు వేసుకోవడం చేత శరీర ఉష్ణొగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా లోదుస్తులు (Inner wear) బిగుతుగా ఉంటుంది కనుక వృషణాల ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. ఫలితంగా వీర్యకణాలసంఖ్య తగ్గిపోతుంది. మనం వేసుకునే జీన్స్ ప్యాంట్స్ బాగా దళసరిగా ఉంటాయి. గాలిని వాటిలోనుండి శరీరానికి తగలడం ఆసాధ్యం. వేసవిలో ఇది అనుభవమే. అందువల్ల వృషణాల ఉష్ణొగ్రత మరింత పెరుగుతుంది. ఫలితం మరింత వీర్యోత్పత్తి తగ్గిపోవడం, సంతానసామర్ద్యం దెబ్బతింటుంది.

అక్కడితో ఆగదు. ఈ కారణంగా జన్యువుల్లో (genes) లోపం ఏర్పడుతుంది. అది తరువాతి తరలవారిలో కూడా కోనసాగుతుంది. వారి వంశం మొత్తం ఆ లోపంతో బాధపడుతుంది. గత కొంతకాలంగా జరిగిన పరిశోధనలో తేలిందేంటంటే అంటే గత 20 సంవత్సరాలుగా వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందట.     

ఈ విషయం తెలిసిన మన మహర్షులు, వాటి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండటానికి పంచె మాత్రమే సరైనదని పరిశోధించి, దానినే మాత్రమే కట్టుకోమన్నారు. పంచె బిగుతుగా ఉండదు, వదులుగా ఉంటుంది. అందునా నూలు (కాటన్) పంచె వల్ల శరీర మరియు వృషణాల ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుందని, అది తెల్లది ధరించడంవల్ల వేడిని తిప్పికొట్టి శరీరాన్ని కాపాడుతుందని, చల్లగా ఉంచుటానికి దోహదపడుతుందని కేవలం పంచె మాత్రమే కట్టుకోవాలని శాసనం చేశారు.

ఇక స్త్రీల విషయంలో కూడా ఇంతే. బిగుతగా ఉండేవి, దళసరివి (జీన్స్ లాంటివి) కట్టుకోవడం చేత అండ విడుదల సమయంలో సమస్యలు వస్తాయి, సంతాన సమస్యలు విపరీతంగా వేదిస్తాయి. లెగిన్స్ లాంటివి ధరించడంచేత తొడల్లో రక్తప్రసరణ సక్రమంగా సాగదని తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అంతేకాదు స్త్రీలకు సంబంధించి నెలసరి వంటి అనేకానేక సమస్యలకు మూలకారణం ఈ ఫ్యాషన్ దుస్తులేనట.. ఇంకా చెప్పలాంటే గర్భంధరిచే అవకాశాలు పూర్తిగా కోల్పోయినా ఆశ్చర్య పోనవసరంలేదు అని వైద్యులు అంటున్నారు..

ఇది కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలిసిన మహర్షులు చీర మాత్రమే కట్టుకోవాలని నియమం పెట్టారు. అందుకే ఆ కాలంలో సంతానసాఫల్య కేంద్రాలు లేవు. ఫ్యాషన్ పేరుతోనో, స్వేచ్చ అని చెప్తూనో, నాగరికం అని మనం ఈ విదేశిదుస్తులను ధరిస్తున్నాం. మన పిల్లలకు చిన్న వయసునుండే ఈ వస్త్రాలు వేసి వారికి తీరని ద్రోహం చేస్తున్నాం.

అలాగే వేదం ఒక్కసారి ఒక బట్ట కట్టుకుంటే దాన్ని ఉతకకుండా మళ్ళి కట్టుకోరాదని చెప్పింది.ఎందుకంటే మన శరీరం ద్వారా వచ్చిన చెమటలో సూక్ష్మక్రిములు మన ధరించిన వస్త్రాలకు అంటుకుంటాయి. స్నానం తరువాత విప్పిన బట్టలే మళ్ళీ ధరిస్తే రోగాలు వస్తాయని ఆయుర్వేదంతో పాటు నేటి ఆధునిక పరిశోధనులు తెలుపుతున్నాయి.

వేదం ఏమి చెప్పిన నిజమే చెప్తుంది. కఠినంగా అనిపించినా అనేకానేక కారణాలు ఉంటాయి వేద వచనం వెనుక.

To be continued .................

Sunday, 2 September 2012

భారతీయ వస్త్రధారణ

part-14

వినాయక చవితి పూజ అనే కాకుండా ప్రతి పూజలోను భారతీయ వస్త్రధారణ తప్పనిసరి.

 వేదం అంటే భగవంతుని ఉచ్శ్వాస నిశ్వాసలు. వేదాన్ని మించిన గొప్ప గ్రంధం కానీ, వేదంలొ చెప్పబడ్డ టెక్నాలజీ కానీ ఈ ప్రపంచంలో లేదు. అలాంటి వేదం పూజ సమయంలో ఏ వస్త్రాలు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అన్నవి కూడా బలంగా చెప్పింది. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. అయితే ముందు వేదం ఏమి చెప్పిందో తెలుసుకుందాం.

కట్టుకునే వస్త్రాలు చేనేత కార్మికులే నేసినవై ఉండాలి. ఎందుకో తెలుసా?వారి చేతి స్పర్శ చేత ఆ వస్త్రాలకు పవిత్రత వస్తుందని, ఆ బట్టలోని దారాల మధ్య ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో ఇంద్రాది దేవతలు ఆవహింపబడతారని చెప్తోంది వేదం. అవి నూలు (కాటన్)వై ఉండాలి. వాటికి అంచు (Border) తప్పనిసరిగా ఉండాలి. వస్త్రాలు తెల్లని రంగులో ఉండాలి.

పూజా సమయంలో ధరించే దుస్తులు ఉతికినవై ఉండాలి. లేదా క్రొత్తవై ఉండాలి. గోచి పొసి మాత్రమే కట్టుకోవాలి. గోచి అంటే చిన్న బట్టను కట్టుకోవడం అని అర్దం కాదు పంచె యొక్క అంచు రెండు కాళ్ళ మధ్యలోకి వచ్చెలా, క్రింద పాదాలవరకు వచ్చేలా కట్టుకోవడం. పూజ సమయాల్లో ఆడవారికి కూడా ఇది వర్తిస్తుంది.

పెళ్ళైన మగవారు ఎడమ భూజం మీద ఉత్తరీయం వేసుకొవాలి. ఎంత గొప్ప క్రతువు చేస్తునా ఉత్తరీయం లేకపొతే ఫలితం రాదు. ఉత్తరీయం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు వేసుకోవాలి అంటే ఎడమ వైపు గుండె ఉంటుంది. భార్య భర్త ఎడమ చెయ్యి పట్టుకుంటుంది పెళ్ళి సమయంలో. భార్యే భర్త గుండెకు (ప్రాణానికి) రక్షణ అని, అందువల్ల ఆమెను ఎప్పుడు మరవద్దని శాస్త్రం చెప్తొంది.

ఆ కాలంలో మారెజ్ బ్యూరోలు లేవు. అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కాని మగవారికి ఈ ఉత్తరీయం ఉందో లేదో చూసి లేకపొతే కనుక పెళ్ళి సంబంధాలు మాట్లాడేవారట. ఇప్పుడా పరిస్థితి లేకపొయినా ఉత్తరీయం ధరించడం మాత్రం తప్పనిసరి.

చేనేత మగ్గం మీద నేయని వస్త్రమైనా, ఉతకనిదైనా, తెల్లనది కాకపొయినా, నూలుది కానిది, అంచు లేని వస్త్రాన్ని కట్టుకున్నా, అప్పుడు చేసే పూజ నగ్నపూజగా భావింపబడుతుందని, మహాపాపం వస్తుందని వేదం చెప్తోంది.  

ఇంకో విషయం తెలుసా? దేవాలయంలో దేవునికి మనం చేనేత నూలు వస్త్రాలే సమర్పించాలి.భగవంతునికి కూడా ఈ వస్త్రాలే ధరింపచేయాలి. పట్టు వస్త్రాలతో దేవలయాలకు వెళ్ళకూడదు. దేవునికి సమర్పించరాదు. పూజల్లొ కట్టుకోరాదు. అది నిషిద్దం. ఎందుకంటే పట్టు, పట్టుపురుగును చంపి తీస్తారు. లేదా పట్టు తీసే క్రమంలో అవి చనిపోతాయి. అది హింసే కదా. అందుకే శాస్త్రం నిషేధించింది. ఎంత డబ్బు ఉన్నా సరే పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించకూడదు.

వినాయక చవితి,వరలక్ష్మీ వ్రతం,సత్యనారయణస్వామి వ్రతం మొదలైన పూజల్లొ, పీట మీద పరిచే టవల్ లేదా బట్ట కూడా చేనేతది, నూలుది, తెల్లనిది, అంచు ఉన్నది, క్రొత్తది మాత్రమే అవ్వాలి. ముడుపులు కట్టేసమయలో కూడా ఇవే వాడాలి.

 మనలో చాలా మందికి ఈ విషయాలు తెలియవు. కనీసం ఇప్పటి నుంచైనా ఆచరిద్దాం.    


To be continued.........

part-13
~ వినాయక చవితి:
~ "ప్రాతః శుక్లతిలైః స్నాత్వా మధ్యాహ్నే పూజయేన్నృప" అని బ్రహ్మాండపురాణ వచనం.అంటే వినాయక చవితి రోజున ప్రాతః కాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసి,మధ్యాహ్నం గణపతిని పూజించాలి అని.

~ ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు అని.ఏదో ఒక సెలవు వస్తే హాయిగా నిద్రపొనివ్వరా అని మీకు కోపం రావచ్చు.అసలు ప్రతి రోజూ ఉదయమే ఎందుకు నిద్ర లేవాలి?సైన్సు ఎంటి?

~ ఆయుర్వేదం ఇలా చెప్తొంది.పగటి పూట శ్రమించిన మానవుడు రాత్రి నిద్రించడంవల్ల అతని అవయవాలన్ని విశ్రాంతి పొందుతాయి.దాంతొ పాటు రాత్రి సమయం చల్లగావుండటంవల్ల తాను పీల్చుకునే శ్వాసకూడా చల్లగా ప్రశాంతంగా జరుగుతుంటుంది.అలాంటి ప్రశాంత వాతావరణం సూర్యోదయంతో ఛేదించబడి భూమి వేడెక్కుతుంది.ఆ సమయానికి మనిషి నిద్రలేచి తన పనులకు ఉపక్రమిస్తే సరీరంలొ ఘర్షణ మొదలై అది కూడా వేడెక్కి శ్వాసతో లీనంకావడం వల్ల వ్యాధులు  నిరోధించే సహజశక్తి ఎల్లప్పుడు సంపూర్ణంగా ఉత్పన్నమవుతుంది.

~ అలాకాకుండా మనిషి సూర్యొదయం తర్వాత కూడా నిద్రించడంవల్ల అతని శ్వాసమాత్రం సూర్యప్రభావంతో వేడెక్కి అతని శరీరం చల్లగావుండి ఈ రెండు విరుద్దమై దాని ఫలితంగా శరీరంలో వ్యాధినిరోధకశక్తి క్షీణిస్తూ అనారోగ్యానికి కారణమవుతుంది.ఈ రహయ్సం తెలుసుకొని వేగుచుక్క పోడవగానే అంటే తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచి తన నిత్యజీవనకార్యక్రమాలను ప్రారంభించగలగాలి.ఈ నియమం ఇంతవరకూ ఏ వ్యాధి లేని నిరొగులకేగాని ఇప్పటికే నానావ్యాధులతో బాధపడుతున్నవారికి కాదని తెలుసుకోవాలి.
                                        courtesy-అందరికి ఆయుర్వేదం
~ ప్రతి ఒక్కరి శరీరంలొ సూర్యోదయానికి గంటన్నరముందు ఒక అమృతబిందువు ఉత్పన్నమవుతుంది.ఒక సూదిమొన(టిప్ ఆఫ్ నీడెల్)మీద ఒక తెనే చుక్క వెస్తే అది ఎంత పరిణామం ఉంటుందొ అందులొ సగం  పరిణామం ఉంటుందీ అమృతబిందువు.అది మనం మెల్కొని ఉంటేనే మన శరీరం దాన్ని ఉపయోగించుకొని రోజంతా ఉల్లాసంగా ఉంచగలుగుతుందని కూడా తెలుస్తోంది.అందుకే మన మహర్షులు మన సుఖమయమైన జీవనం కోసమని అనేకానేక నియమాలు పెట్టారు.తెలిసితెలియక హిందూ ధర్మాన్ని,ఋషులను,భారతీయ సంస్కృతిని విమర్శించవద్దు.
                                       
~ ఈ ప్రకృతిలోని ప్రతి జీవి సూర్యోదయానికన్నా ముందే నిద్రలేస్తొంది.మరి వాటికన్న ఎంతొ గొప్ప అని చెప్పుకునే మనం మాత్రం ప్రకృతి నియమాలను అనుసరించక హీనులుగా మిగిలిపోవాలా?ప్రతి జీవి పర్యవరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పొషిస్తున్నప్పుడు మనం మాత్రం పర్యవరణాన్ని నాశనం చెయ్యడమెందుకు?పర్యవరణ హితమైన జీవనన్ని సాగిద్దాం.అది ఈ వినాయక చవితినుండే ఆరంభిద్దాం.పర్యవరణహితకరమైన వినాయక చవితిని జరుపుకుందాం.

next coming part
~ సంప్రదాయ దుస్తులు ధరించే పూజ చేయాలా?పంచకట్టు వెనుక ఉన్న సశాస్త్రీయ కారణం ఏమిటి?వేదం ఏమి చెప్తోంది?




to be continued.............      

Saturday, 1 September 2012


part-12
~ విగ్రహాలతయారి మీద ముంబాయిలొ ఒకానొక హిందుధర్మ ప్రచార సంస్థ సర్వే నిర్వహించింది.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు మట్టి విగ్రహాలను తయారుచేస్తున్న వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నంలో తయారిదారులు అత్యధికగంగా ఇలా చెప్పారు.

  "మేము ఎంతొ పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను,వాటి కంటే చిన్నగా ఉన్న మట్టి విగ్రహాలను చేశాము.మట్టి విగ్రహాలకు రంగులు వేస్తున్నప్పుడు ఏదో తెలియని ఆనందానికి లోనయ్యాము.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమను ఎక్కువ ధరకు అమ్మిన మాకు అంత ఆనందం కలగలేదు".

~ ఒక విత్తనం మట్టిలొనే పెరుగుతుంది కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్లొ పెరుగుతుందా?మట్టిలో జీవశక్తి,ప్రాణ శక్తి ఉంటుంది.తాత్వికంగా చెప్పల్సి వస్తే మట్టి లేదా భూమి,శివునికి సంకేతం.దానిలో ఉన్న ప్రాణశక్తి పార్వతి దేవి.నారయాణుడు నీటి యందు ఉంటాడు.ఆయన హృదయలో లక్ష్మీ ఉంటుంది.అంటె నీటిలొని ప్రాణశక్తి.మట్టిలో నీరు కలిపే కదా విగ్రహం చేస్తారు.అంటే మనం కేవలం వినాయకునికి మాత్రమే కాదు శివపార్వతులకు,లక్ష్మీనారయణులకు కూడా పూజ చేస్తున్నాం ఆ విగ్రహం ద్వారా.

  ఇది కేవలం మట్టి విగ్రహాల ద్వార మాత్రమే సాధ్యమవుతుంది.అందుకే మట్టి విగ్రహాలను మాత్రమె పూజిద్దాం.పెద్ద విగ్రహాలు కూడా మట్టివి దొరుకుతున్నాయి.

~ 11వ భాగం చదివాక మీకొ అనుమానం రావచ్చు.నిజంగా నమ్మకానికి,భావనకు అంత శక్తి ఉందా?పరమాత్మ నమ్మి పిలిస్తే వస్తాడ?

  రామకృష్ణ పరమహంస ఒక కధ చెప్పారు.పూర్వం ఒక పిల్లకు 3సంవత్సరాలకే వివాహం చెశాడు ఆమె తండ్రి.కొంత కాలానికి ఆమె భర్త మరణించాడు.ఈ విషయం ఆ పసిపిల్లకు తెలియదు.8సంవత్సరాలు వచ్చే సరికి ఆమె స్నేహితురాళ్ళను వారివారి భర్తలు వచ్చి తీసుకెళ్ళారు.ఈ పిల్ల కూడా తన భర్త వచ్చి తనను ఎప్పుడు తీసుకెల్తాడని ఆమె తండ్రిని రోజూ అడిగేది.ఆయనకు భాధ కలిగి నీ భర్త పేరు మధుసూధనుడు(కృష్ణుడు)అని చెప్పి,గట్టిగా పిలువు,వచ్చి తీసుకెల్తాడని చెప్పాడు.ఆమె ఆర్తితో గట్టిగా పిలిచింది.నిజంగా ఆ ఊరి గుళ్ళొ ఉన్న కృష్ణుడే వచ్చి ఆమెను తీసుకెళ్ళాడట.నమ్మకంతో పిల్చిన గజేంద్రుని కోసమని పరుగుపరుగున వచ్చాడా శ్రీ మహావిష్ణువు.

  మనం పదార్ధంలో పరమాత్మను వెతుకుతున్నాం.పరమాత్మ యదార్ధం.బయట వెతకడం ఆపండి.మీలోనే వెతకండి.కనిపిస్తాడు.

  మనొ బుద్ధ్యహంకార చిత్తాని నాహం
  న చ శ్రోత్ర   జిహ్వా న చ ఘ్రాణనేత్రం|
  న చ వ్యొమ భూమిర్ న్ తేజో న వాయుః
  చిదానంద రూపః శివొహం శివొహం||
   
to be continued.........