Sunday 2 September 2012


part-13
~ వినాయక చవితి:
~ "ప్రాతః శుక్లతిలైః స్నాత్వా మధ్యాహ్నే పూజయేన్నృప" అని బ్రహ్మాండపురాణ వచనం.అంటే వినాయక చవితి రోజున ప్రాతః కాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసి,మధ్యాహ్నం గణపతిని పూజించాలి అని.

~ ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు అని.ఏదో ఒక సెలవు వస్తే హాయిగా నిద్రపొనివ్వరా అని మీకు కోపం రావచ్చు.అసలు ప్రతి రోజూ ఉదయమే ఎందుకు నిద్ర లేవాలి?సైన్సు ఎంటి?

~ ఆయుర్వేదం ఇలా చెప్తొంది.పగటి పూట శ్రమించిన మానవుడు రాత్రి నిద్రించడంవల్ల అతని అవయవాలన్ని విశ్రాంతి పొందుతాయి.దాంతొ పాటు రాత్రి సమయం చల్లగావుండటంవల్ల తాను పీల్చుకునే శ్వాసకూడా చల్లగా ప్రశాంతంగా జరుగుతుంటుంది.అలాంటి ప్రశాంత వాతావరణం సూర్యోదయంతో ఛేదించబడి భూమి వేడెక్కుతుంది.ఆ సమయానికి మనిషి నిద్రలేచి తన పనులకు ఉపక్రమిస్తే సరీరంలొ ఘర్షణ మొదలై అది కూడా వేడెక్కి శ్వాసతో లీనంకావడం వల్ల వ్యాధులు  నిరోధించే సహజశక్తి ఎల్లప్పుడు సంపూర్ణంగా ఉత్పన్నమవుతుంది.

~ అలాకాకుండా మనిషి సూర్యొదయం తర్వాత కూడా నిద్రించడంవల్ల అతని శ్వాసమాత్రం సూర్యప్రభావంతో వేడెక్కి అతని శరీరం చల్లగావుండి ఈ రెండు విరుద్దమై దాని ఫలితంగా శరీరంలో వ్యాధినిరోధకశక్తి క్షీణిస్తూ అనారోగ్యానికి కారణమవుతుంది.ఈ రహయ్సం తెలుసుకొని వేగుచుక్క పోడవగానే అంటే తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచి తన నిత్యజీవనకార్యక్రమాలను ప్రారంభించగలగాలి.ఈ నియమం ఇంతవరకూ ఏ వ్యాధి లేని నిరొగులకేగాని ఇప్పటికే నానావ్యాధులతో బాధపడుతున్నవారికి కాదని తెలుసుకోవాలి.
                                        courtesy-అందరికి ఆయుర్వేదం
~ ప్రతి ఒక్కరి శరీరంలొ సూర్యోదయానికి గంటన్నరముందు ఒక అమృతబిందువు ఉత్పన్నమవుతుంది.ఒక సూదిమొన(టిప్ ఆఫ్ నీడెల్)మీద ఒక తెనే చుక్క వెస్తే అది ఎంత పరిణామం ఉంటుందొ అందులొ సగం  పరిణామం ఉంటుందీ అమృతబిందువు.అది మనం మెల్కొని ఉంటేనే మన శరీరం దాన్ని ఉపయోగించుకొని రోజంతా ఉల్లాసంగా ఉంచగలుగుతుందని కూడా తెలుస్తోంది.అందుకే మన మహర్షులు మన సుఖమయమైన జీవనం కోసమని అనేకానేక నియమాలు పెట్టారు.తెలిసితెలియక హిందూ ధర్మాన్ని,ఋషులను,భారతీయ సంస్కృతిని విమర్శించవద్దు.
                                       
~ ఈ ప్రకృతిలోని ప్రతి జీవి సూర్యోదయానికన్నా ముందే నిద్రలేస్తొంది.మరి వాటికన్న ఎంతొ గొప్ప అని చెప్పుకునే మనం మాత్రం ప్రకృతి నియమాలను అనుసరించక హీనులుగా మిగిలిపోవాలా?ప్రతి జీవి పర్యవరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పొషిస్తున్నప్పుడు మనం మాత్రం పర్యవరణాన్ని నాశనం చెయ్యడమెందుకు?పర్యవరణ హితమైన జీవనన్ని సాగిద్దాం.అది ఈ వినాయక చవితినుండే ఆరంభిద్దాం.పర్యవరణహితకరమైన వినాయక చవితిని జరుపుకుందాం.

next coming part
~ సంప్రదాయ దుస్తులు ధరించే పూజ చేయాలా?పంచకట్టు వెనుక ఉన్న సశాస్త్రీయ కారణం ఏమిటి?వేదం ఏమి చెప్తోంది?




to be continued.............      

No comments:

Post a Comment