Saturday, 31 August 2013

'ఓం'కారమే గణపతి

ఓం గం గణపతయే నమః

'ఓం'కారమే గణపతి

పరమశివుడు ఒక చేత త్రిశూలం పట్టుకుని, మరొక చేతితో ఢమరుకం పట్టుకుని నిత్యం తాండవం చేస్తుంటాడు. పరమశివుడి తాండవం నుంచే ఈ సమస్త సృష్టి ఉధ్భవించింది. సృష్ట్యాదిలో అనంతదిగంతాలకు వ్యాపించిన ఈ సువిశాల విశ్వమంతా ప్రళయకాల ప్రభంజనాలతో ప్రజ్వరిల్లుతూ ఉంది. విశ్వవ్యాప్తమైన కోటానుకోట్ల గోళాలు, గ్రహమండలాలు అపరిమితమైన వేగంతో ప్రయాణిస్తూ అగింజ్వాలలు విరజిమ్ముతున్నాయి. ఎటుచూసిన సప్తవర్ణాల కాలాగ్నిశిఖలు పెనుఉప్పెనలైన బడబాగ్ని(లావా) సముద్రాలు.......అలా ఎన్నో కోట్లసంవత్సరాల పాటు విళయప్రళయాలు సృష్టించిన ఈ విశ్వాంతరాళం క్రమక్రమంగా ప్రశాంత వాతావరణాన్ని సంతరించుకుంది.

అప్పటివరకు అరుణారుణ కాంతులతో దావానంలా దహించబడిన ఈ సువిశాల విశ్వమంతా నీలిరంగును సంతరించుకుని, అంధకార శున్యాప్రదేశంగా ఏర్పడి, మొట్టమొదటగా ప్రణవనాదమైన 'ఓం'కారం పుట్టింది. 'ఓం'కారమే గణపతి. సృష్టిలో మొదట వచ్చినవాడు గణనాయకుడు, విఘ్నవినాయకుడు. గణపతి వక్రతుండం ఓంకారానికి సంకేతం. ప్రతి మనిషి మౌనంగా ధ్యానంలో కూర్చుంటే వినిపించే శబ్దం ఓంకారం. నిశబ్దంలో ఉండే శబ్దం కూడా ఓంకారమే.అసలు గణపతి తత్వమే ఓంకారం. ఈ సృష్టిలో భూమి మొదలైన గ్రహాలు తమ చుట్టు తాము తిరగడం వల్ల పుట్టే శబ్దం ఓంకారం. సూర్యుడిలో వచ్చే సౌరతుఫానుల శబ్దాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు రికార్డు చేసారు. ఆ శబ్దం కూడా ఓంకారం. కావాలంటే నాసా వారి వీడియోలు చూడండి.
https://www.youtube.com/watch?v=w_toXu2WF50
https://www.youtube.com/watch?v=LQqShj6leq8
http://www.youtube.com/watch?v=e3fqE01YYWs
https://www.youtube.com/watch?v=NKbuGQtnnDA

ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.ఈ సృష్టిలో నిత్యం శబ్దప్రకంపనల ద్వారా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వమే గణపతి.

ఓం గం గణపతయే నమః

Wednesday, 28 August 2013

శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం. మగనెమలికి పించం ఉంటుంది. మేఘాలు పట్టి వర్షం పడే సమయంలో మగనెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది, ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం చేత ఆడనెమలి గర్భం ధరిస్తుందట. ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ      

Friday, 23 August 2013

సంకటహర చవితి వ్రత కధ

ఓం గం గణపతయే నమః

సంకటహర చవితి వ్రత కధ :

శత్రు, దారిద్ర్యాది మహాకష్టములచే బాధింపబడువారికి, ఋణబాధలు ఉన్నవారికి, సంతానం లేనివారికి, భూమి, ఇల్లూ లేకపోవడం వంటి ఈతి బాధలు పడేవారికి, ధీర్ఘవ్యాధులచే పీడింపబడేవారికి, చదువు సారిగ్గా రాకపోవడం, ముందు సాగాకపోవడం లాంటి ఆటంకాలు ఎదురయ్యేవారు అనుభవించే మానాసిక క్షోభ అంతా ఇంతా కాదు. భూలోకంలో కలియుగం మొదలై 5000 సంవత్సరములు గడిచిన తరువాత ఇట్టి క్లేశములు మనుష్యులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా క్షోభ అనుభవించే వారి కష్టములను తీర్చే వ్రత రాజమేదైనా ఉంటే చెప్పవలసిందిగా స్కందుని(కూమారస్వామిని) ఋషులందరూ అడిగారు.

"శ్రీలు సిద్ధించుటకు, తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహరచవితి అనే వ్రతం మహాశ్రేష్టమైనది. ఇది వ్రతాలలోకేల్లా ఉత్తమమైనది. ధర్మరాజు అరణ్యవాస, అజ్ఞాతవాస మహాకష్టములను ఎదుర్కోన్నప్పుడు రాజ్యలాభము, పూర్వవైభవము పొందు నిమిత్తము శ్రీ కృష్ణుని ప్రేరణచే ఈ వ్రతాన్ని ఆచారించాడు. శ్రీ క్ర్ష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహాత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీ దేవికి చెప్పినట్ట్లు, తాను ఆ వ్రతన్నే ఉపదేశిస్తున్నట్లు చెప్పాడు" అంటూ కుమారస్వామి చెప్పగానే ఋషులు ఈ విధంగా అడిగారు.

"మహాసేనాధిపతి! లోకకల్యాణ నిమిత్తం తన జనని అయిన పార్వతీ దేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ విధ్మగా చెప్పాడో, ఆ విధానం మాకు కుడా తెలియజేయండి" అని కోరారు.

" ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తే అయిన పార్వతి, సివుని పతిగా కోరి భక్తితో తీవ్ర తపస్సు చేసినా, ఫలితం లేకపోవడంతో, పూర్వలీల రూపమున తనయందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో స్మరించింది.

స్మరణమాత్రానే తన ఎదుట ప్రత్యక్షమైన గణేశుని చూసి "ఇతరులకు అసాధ్యమైన కఠోర తపస్సు చేసినా, సర్వజనవశంకరుడైన శంకరుని భర్తగా పొందటంలో జాప్యం జరగుతోంది. ఇటువంటి ఆటంకాలు తొలగడానికి, స్వర్గాది లోకాల్లో నీకు సంబంధించిన సంకటహరణం అనే వ్రతాన్ని ఆచరిస్తూంటారని నారద మహర్షి ద్వారా వినాను. ఆ వ్రత విధానం వివరించి" అని కోరింది.

దానికి వినాయకుడు "తల్లీ! గురు-శుక్ర మూఢాలేవి లేని శుభశ్రావణ బహుళ చవితినాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, దృఢ సంకల్పంతో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తాన్ని మొక్కుకుని, దంతధావనాధికాలు పూర్తి చెసుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధావందనం మొదలైన నిత్యనైమిత్తికాలు ఆచరించి కల్పోక్త ప్రకారం గణేశ పూజ నిర్వర్తించాలి.

ఉద్యాపన విధి :

బంగార, వెండి, రాగి లేదా మట్టితోనైనా నా ప్రతిమ చేసి(లోభత్వం పనికిరాదు) నీటితో నింపి, ఎర్రని వస్త్రంతో చుట్టిన కలశంపై గాని, మంటపంపై అష్టదళపద్మం ఏర్పరిచి గాని నా ప్రతిమను ఉంచిం ప్రాణ ప్రతిష్ట చేసి, విభూతి, గంధాక్షతలతో, పుష్పబిల్వాలతో, గరికపోచలతో అర్చిచి, ధూపదీప నైవేధ్యాలు అర్పించి హారతి ఇవ్వాలి. శ్రావణ బహుళ చతుర్థీ నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి. పూజానంతరం హవనం(హోమం) చేయాలి. వ్రతం విధానం బాగా తెలిసిన ఆచార్యునిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపజేయడం చాలా ఉత్తమం. ఈ పూజపై చెప్పిన తిధిలో ఏడాదికొకసారైనా సరే చంద్రోద్య సమయంలో ఆచరించదగినది.

ఏ రాత్రి పురాణోత వేదమంత్రాలతో కాలక్షేపం, దైవసంబంధిత నృత్యగీత వ్ద్యాదులచే జాగరణం వేయాలి. మరునాడు యధాశక్తి21 మంది బ్రాహమ్ణులకు దానాదులు చేసి సంతృప్తి పరచాలి. వ్రతం చేయించిన  ఆచార్యునకు వస్త్ర. భూషణ, ఛత్ర పాదుకాది సమస్త సంభారములు దక్షిణ సహితంగా ఇవ్వాలి.

నాకు ప్రియమైన ఈ వ్రతరాజాన్ని భక్తి స్రద్ధల్తో ఆచరించడం వల్ల నేను సంప్రీతి చెంది కోరికలను తీర్చుతాను" అన్నాడు గణపతి.

గణపతి ద్వారా విన్న పార్వతీదేవి యధావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి, ఈ వ్రత మహిమవల్ల 6 నెలలు తిరగకుండానే ఇతర ప్రయత్నాలు అవసరం లేకుండానే శివుడిని భర్తగా పొందింది.

ఈ ప్రకారమే శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించడు. భారతంలో పాండవులకు విజయప్రాప్తి కలిగినదని మేకు తెలుసు కదా! కనుక ఋషివరేణ్యులారా! లోకంలో సంకటాలు నశించడానికి, మనుష్య, యక్ష, రాక్షస, గంధరావాది సమస్త జాతులవారి సర్వాభీష్టాలు తీరడానికి ఇంతకంటే సులభోపాయం లేదు" అని స్కందుడు ఋషులకు తెలిపాడు.

"ఇంకా ఈ వ్రతం ఎవరెవరి వేత ఆచరించబదింది?" అని ఋషులు అడుగగా, " మహబలవంతుడైన వాలి, రావణునే తన చంకయందు ఇరికించుకుని బందీని చేయు సందర్భంలో రావణుడు ఈ వ్రతం ఆచరించి సుఖంగా లంక చేరుకున్నాడు. హనుమతుడీ వ్రతప్రభాముచేత లంకలో సీతమ్మవారి జాడ కనిపెట్టగలిగాడు.

అట్లే, మహారణ్యంలో భర్తను గానక, అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతిని సంకల్ప మాత్రాన ప్రసన్నం చేసుకుని భర్త అయిన నలమహారాజును కలిసి సుఖంగా జీవించింది. అహల్యానాత కూడా పతి శావపశాన భర్తకు దూరమై ఈ వ్రతాచరణ వల్ల తిర్గి భర్త అయిన గౌతమ మహర్షిని చేరింది.

ఈ సంకష్టహర వ్రతం చేసి పుత్రులు లేనివారు పుత్రలాభం, ధనం లేనివారు ధనలాభం, విద్యలేనివారు విద్యాప్రాప్తి, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పొంది సుఖంగా ఉండగలరు" అంటూ కుమారస్వామి వివరించాడు.

కధా సేకరణ : శ్రీ గణేశ పుస్తకం

ఓం గం గణపతయే నమః            

Saturday, 17 August 2013

యక్ష ప్రశ్నలు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలు ఇవే!!! ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)
 l

Tuesday, 6 August 2013

సాధనా పఞ్చకము - శంకర సందేశం

శంకర సందేశం :

మనందరికీ తర తరాలకీ ఆది శంకరులిచ్చిన సందేశం.

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్త్యజ్యతామ్ !
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! ౧

ప్రతిదినము వేదాధ్యయనం చేయుము. అందులో చెప్పబడిన కర్మలను అనుష్ఠించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజ అగు గాక, కామ్యముతో కర్మలను చేయుటను త్యజించుము. పాపములను పోగొట్టుకొనుము. సంసార సుఖములను (నిత్య అనిత్యాది విషయ సుఖములు) అనుసంధానించి పరిశీలించుము ఆత్మజ్ఞానము పొందడంలో కోరికను పెమ్చుకొనుము. గృహ నుండి అతి శీఘ్రముగా బయటికి వెళ్ళుము (శీఘ్రముగా శరీరభ్రాంతి నుండి దూరము అవ్వడానికి ప్రయత్నించుము).

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్‍విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ !! ౨

సత్సాంగత్యమును నెరపుము, సజ్జనులతోటి కలిసి మెలసి ఉండుము. భగవంతునిపై దృఢమైన భక్తిని కలిగి ఉండుము. శాంతి మొదలగు గుణములను ఆర్జించుము, కామ్య కర్మలను వర్జింపుము. సద్విద్వాంసులను, సద్గురువులను ఆశ్రయింపుము, వారి పాదుకలను ప్రతిదినమూ సేవింపుము . బ్రహ్మప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మమంత్రమగు ఓంకారమంత్రమును అర్థించుము. శ్రుతుల శిరస్సులగు (వేదాంతములు) ఉపనిషత్తుల వాక్యములను వినుము.

వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహం మతిరుజ్‍ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! ౩

తత్త్వమస్యాది మహా వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నింపుము (విచారణ చేయుము), శ్రుతిశిరస్సులైన వేదాంత పక్షాన్ని పొందుము/ఆశ్రయింపుము. కుతర్కము వీడుము. శ్రుతి సమ్మతమగు తర్కమునే గ్రహించతగినది. ’నేను బ్రహ్మమును’ అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున ’అహం’-’నేను’ అను బుద్దిని వీడుము. బుధజనులు/పండితులతో అనవసర వాదు పరిత్యజించుము.

క్షుద్‍వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్ !
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! ౪

ఆకలిదప్పులను వ్యాధికి చికిత్స చేయుము, ప్రతిదినము భిక్షాన్నమను ఔషధము సేవింపుము. రుచికరములగు భోజన పదార్థములను యాచింపక, విధివశమున లభించినదానితో తృప్తిని పొందుము. శీతోష్ణాది ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగా వాక్యములను మాట్లాడకుము. ఉదాసీనతను వహింపుము (ప్రతి దానికీ కదిలిపోకుండా ఉండే గుణాన్ని అలవర్చుకొనుము) , లోకుల యెడ నిష్ఠూరుడవు కాబోకు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! ౫

ఏకాంతం ప్రదేశంలో సుఖముగ కూర్చుండుము. పరబ్రహ్మతత్త్వమునకై చిత్తమున సమాధాన పరచుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగా జూచుచు, అది విలీనమైనట్లు భావింపుము. జ్ఞానమునాశ్రయించి రాబోవు కర్మలయందు ఆసక్తుడవు కాకుండుము, ప్రారబ్ధను (భోగమును, దుఃఖమును) అనుభవించుచు, బ్రహ్మముయందే నిలచి ఉండుము (పరబ్రహ్మస్థితియందే నిమచు ఉండుము).

ఫలశ్రుతి
యఃశ్లోక పఞ్చకమిదం పఠతే మనుష్యః
సఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముపేత్య !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !!
ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాద విరచిత సాధన పఞ్చకమ్

ఏ మానవుడు ప్రతిదినమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు స్థిరచిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగానే సంసృతి- తీవ్ర దావానల - తీవ్ర ఘోర - తాపమును, చైత్యన్య స్వరూపుడైన ఈశ్వరప్రసాదమున పోగొట్టుకొనును.

ఇది పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య కృత సాధనా పఞ్చకము

సర్వం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యస్వామి చరణారవిందార్పణమస్తు

-శంకర కింకర:

అద్వైతం సత్యం - వేదం ప్రమాణం
ధర్మస్యజయోస్తు - అధర్మస్య నాశోస్తు

Tuesday, 23 July 2013

శాకంబరీ దేవి

మన సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ పరబ్రహ్మాన్ని స్త్రీగా, అమ్మగా కొలిచే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఆ మహాశక్తిని ఆషాఢమాసంలో శాకంబరి/శాకంభరి దేవిగా అలంకరిస్తారు. ఆషాఢమాసంలో శాకంభరి దేవి నవరాత్రులు చేస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంభరిదేవిగా ఆరాధించడం వలన లోకమంతా చల్లగా ఉంటుంది. శాకంబరి దేవి గురించి శ్రీ దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. శాకంబరి దేవి అవతార వైశిష్ట్యం గురించి తెలుసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి.

--------------------------------------

జనమేజయ ఉవాచ:

వేదవ్యాస మహర్షితో జనమేజయుడు "ఓ మహర్షి! రాజర్షి హరిశ్చంద్రుడు శతాక్షిదేవి భక్తుడని సెలవిచ్చారు. శివుని భార్య అయిన శివా (శివ అంటే శివుడు, శివా అంటే పార్వతీ దేవి), శతాక్షి దేవిగా ఎందుకు పిలువబడుతోంది? అందుకుగల కారణం వివరించండి. విని నా జన్మను సార్ధకం చేసుకుంటాను. ఎవరు ఆ మహాదేవి ఒక్క మహిమలను పరిశుద్ధమైన మనసుతో, ఆదిశక్తి యందు అచంచలమైన భక్తితో వింటారో/తెలుసుకుంటారో, వారు విన్న ఒక్కో వాక్యానికి ఆశ్వమేధ యాగం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది. కనుక శతాక్షి దేవి గురించి చెప్పగలరు" అన్నాడు.

వ్యాస ఉవాచ -

"ఓ రాజా! నువ్వు దేవి భక్తుడవు. అందువల్ల నీకు ప్రత్యేకంగా పరమేశ్వరి గురించి చెప్పనవసరం లేదు. నేను శతాక్షి దేవి గురించి చెప్తాను విను" అంటూ వ్యాస మహర్షి ప్రారంభించారు.

పూర్వం దుర్గముడనే మహాకౄరుడైన అసురుడు/దానవుడు ఉండేవాడు. హిరణ్యాక్షవంశంలో జన్మించాడు. రురు చక్రవర్తికి యొక్క కొడుకు. చాలా శక్తివంతుడు, భయానకుడు. 'వేదం చెప్పినట్టుగా వేదమంత్రాలతో చేసిన యజ్ఞభాగాన్ని దేవతలు గ్రహించి శక్తివంతులవుతారు. శక్తివంతమైన దేవతలు జనుల యొక్క కోరికలను సిద్ధింపజేస్తారు. దేవతలకు బలం వేదం. దేవతలను నాశనం చేయాలంటే, దేవతలను ఓడించాలంటే, వేదాలను వశం చేసుకోవాలి. అప్పుడు దేవతల వలె శక్తిని పొందవచ్చు. అందులో సందేహం ఏంత మాత్రమూ లేదు' అనే ఆలోచన వాడి మనసులో కలిగింది.

ఈ ఆలోచన రాగానే హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి ఘోరతపస్సు ప్రారంభించాడు. కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ, ఏ ఇతర ఆహారపదార్ధం తీసుకోకుండా వేయి సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు. దుర్గముడి తపస్సు నుంచి పుట్టిన తేజస్సుతో కూడిన తాపం (వేడి) దేవ, దానవ లోకాలను తపింపచేసింది.

దుర్గామాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వికసించిన తామరపూవు వంటి ప్రసన్నమైన వదనం (ముఖం) తో వరం ప్రసాదించడానికి హంసవాహనం మీద ప్రత్యక్షమయ్యారు. చిన్నగా తన కన్నులు తెరిచి, తీవ్రమైన ధ్యానంలో ఉన్న దుర్గమాసురుడి వంక చూసి, నీకు ఏ వరం కావాలో కోరుకో, నీ మనసులో ఉన్నది నీకు సిద్ధించుగాక, నీవు అన్ని శుభాలే పలుకుగాక అన్నాడు. నేను నీ తీవ్రమైన తపస్సుకు మెచ్చి, నీకు వరం ఇవ్వడానికి వచ్చాను అన్నారు.

అది విన్న దుర్గముడు తన సమాధి (ధ్యానం) నుంచి మేల్కొని బ్రహ్మను స్తుతించాడు. తరువాత తాను భావించినట్టుగానే "ఓ సురేశ్వరా! వేదాలన్నీ నా దగ్గర ఉండాలి. మూడు లోకాల్లో ఋషులు, బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి. ఓ మహేశ్వరా! నాకు దేవతలను ఓడించగలిగే శక్తి కావాలి" అని పలికాడు. బ్రహ్మదేవుడు 'తదాస్తు' అని పలికి సత్యలోకానికి వెళ్ళిపోయాడు.

తతః ప్రబృతి విప్రైస్తు విస్మృతా వేదరహస్యాః
స్నాన సంధ్యా నిత్య హోమ శ్రాద్ధా యజ్ఞ జపాదయః

దుర్గముడికి బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలను మర్చిపోయారు. బ్రాహ్మణులే అన్ని వర్ణాల వారికి వేదవిహితకర్మలను, వేదోక్త ధర్మాన్ని ప్రవచించాలి, అందరిని నడిపించాల్సిన బ్రాహ్మణులే వేదాలను మర్చిపోవడంతో మిగితా అన్ని వర్ణాల వారు కూడా ధార్మిక జీవనానికి దూరమయ్యారు. ఫలితంగా స్నానము, సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రము, శ్రాద్ధ కర్మలు, యజ్ఞాలు, జపాలు అన్ని భూమి మీది నుంచి మాయమైపోయాయి. దాంతో కరువు ఏర్పడింది. భూగోళం మొత్తం రోదలనలు, హాహాకారాలు, ఆర్తనాదాలతో నిండిపోయింది. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? అని బ్రాహ్మణులు ప్రశ్నించుకోసాగారు. వేదం లేనినాడు మాకు విధింపబడిన కర్మలను మేము ఏ విధంగా ఆచరించాలి అని విచారించసాగారు.

యజ్ఞంలో వేయబడిన హవిస్సును స్వీకరించిన దేవతలు శక్తిని పొంది జనుల యొక్క కోరికలని తీరుస్తారు. యజ్ఞాలు ఆగిపోవడం చేత నిర్జరులైన (ముసలితనం అంటూ లేనివాళ్ళు) దేవతలు బలహీనులు, వృద్ధులుగా మారిపోయారు. దాంతో దేవతల యొక్క రాజధాని అయిన అమరావతి మీద దైత్యులు (రాక్షసులు) దాడి చేసారు.

హవిస్సు లేక బలహీనులైన దేవతలు వజ్రం వంటి ధృడమైన శరీరంగల రాక్షసులతో యుద్ధం చేయలేకపోయారు. ఫలితంగా దైత్యులు అమరావతిని స్వాధీనపరుచుకుని దేవతలను వెళ్ళగొట్టారు. దేవతలందరూ రాక్షసులు చేరుకోవడానికి కష్టతరమైన మేరు/సుమేరు పర్వత గుహలలోకి చేరుకుని ఆదిశక్తి మీద మనసు నిలిపి, అచంచలమైన, ఉత్కృష్టమైన భక్తితో ధాన్యంలో మునిగిపోయారు.    

చాలామంది ఇక్కడ ఒక సందేహం వస్తుంది. దుర్గాముసుడు వేదాలను పొందదం వల్ల లోకంలో క్షామం (కరువు) ఏర్పడడమేమిటి? సర్వశక్తివంతులు, కోరిన కోరికలను తీర్చే దేవతలు యజ్ఞాలు చేయకపోవడం వలన శక్తిహీనులవడమేంటి? యజ్ఞ హవిస్సు లేక శక్తిహీనులైన దేవతలను అమరావతి నుంచి తరిమేయడమేంటి? అని చాలామందికి అనిపిస్తుంది. కధలో ముందుకు వెళ్ళే ముందు వాటి ఈ సందేహాలను క్లుప్తంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం.

సనాతన ధర్మంలో దేవతలకు పరమాత్మకు (పరబ్రహ్మానికి) తేడా ఉంది. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు మొదలైనవాళ్ళు దేవతలు. శివ, విష్ణు, పార్వతీ, లక్ష్మీ, గణపతి, వేంకటేశ్వర స్వామి మొదలైనవారు పరబ్రహ్మం(పరమాత్మ) యొక్క ప్రతిబింబాలు. దేవతలు కూడా మనవంటి వారే, పుణ్యకర్మ చేయడం వలన వారికి దేవతాజన్మ వచ్చింది, పుణ్యం సుఖంగా రూపాంతరం చెంది సంతోషం అనుభవిస్తారు, సుఖం అనుభవించగానే పుణ్యం క్షీణిస్తుంది, అలా పుణ్యం క్షీణించిన ఇంద్రాది దేవతలు తిరిగి భూలోకంలో పుడతారు. కానీ పరబ్రహ్మం వీటికి అతీతుడు. ఆయన అన్నిటికి సాక్షి, ద్రష్ట, అంతర్యామి. పరమాత్మ సర్వశక్తివంతుడు, నిత్యపుష్టుడు, శాశ్వతుడు. దేవతలు ప్రకృతి శక్తులు. ప్రకృతిలో అంతర్యామిగా ఉంటూ మానవాభివృద్ధికి కారణమవుతుంటారు. ప్రకృతిలో ఉండే విద్యుత్ శక్తి ఇంద్రుడు. మిత్రావరుణులు ఆక్సిజెన్, హైడ్రోజెన్ అణువులు. ఇంద్ర, మిత్ర, అగ్ని, వరుణ అనేవి నానార్ధాలు కలిగిన పేర్లు. వీటికి అనేక కోణాల్లో అనేక అర్దాలున్నాయి.

సృష్టి ఆదిలో పరమాత్ముడు మనుష్యులను, దేవతలను, వీరితో పాటు యజ్ఞాన్ని సృష్టించాడు. మానవులు, దేవతలు ఒకరిమీద ఒకరు పరస్పరం ఆధారపడి ఉండేలా, మనుష్యులు చేసిన యజ్ఞం యొక్క హవిస్సును (యజ్ఞంలో వేయబడిన ఆహుతులను హవిస్సు అంటారు) దేవతలు స్వీకరించి శక్తివంతులయ్యేలా, శక్తివంతమైన దేవతలు మనుష్యుల కోరికలను తీర్చాలని, కోరికలు తీరడంతో సంతుష్టులైన మానవులు తిరిగి యజ్ఞాలు చేయాలని పరమాత్మ శాసనం చేశారు. భగవద్గీతలో ఈ విషయమే కృష్ణ పరమాత్మ చెప్తారు. ఈ దేవతలను శక్తివంతం చేస్తుంది నిత్యాగ్నిహోత్రం. ఈ నిత్యాగ్నిహోత్రం అన్ని వర్ణాల వారూ చేయాలి. ఇందులో ఎవరికి మినహయింపు లేదు.

హోమం, యజ్ఞం మొదలైనవి కాలుష్యాన్ని తగ్గిస్తాయని మన గ్రంధాలు చెప్తున్నాయి, ఆధునిక పరిశోధనలూ చెప్తున్నాయి. అగ్నిహోత్రం చేయడం చేత ఆరోగ్యం సంతరించడంతో పాటు, మన చుట్టూ ఉన్న కాలుష్యాన్ని తగ్గించినవారం అవుతాం. వీటికి తోడు యజ్ఞం పర్యావరణంలో సమతుల్యాన్ని సృష్టిస్తుంది. వేదంలో చెప్పబడినట్టుగా చేయబడిన యజ్ఞం ఏ కాలంలోనైన వర్షాన్ని కురిపిస్తుంది (ఆధునిక కాలంలో మళ్ళీ ఋజువు చేయబడింది).

ఇక వేద మంత్రం విషయానికి వద్దాం. మంత్రం శబ్దమే అయినా దానికి ఒక రూపం ఉంటుంది. మంత్రం చదివినప్పుడు కొన్ని తరంగాలు ఉద్భవిస్తాయి. యజ్ఞంలో వేసిన హవిస్సును అగ్నిదేవుడు దేవతలకు చేర్చడంలోమంత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునికులకు అర్దమయ్యేలా చెప్పాలంటే అగ్నిహోత్రంలో వేసిన ఆహుతుల మధ్య రసాయన చర్య (కెమికల్ రీయాక్షన్) జరిగి, అవి గాలిలో సూక్ష్మరూపంలో, వాయువుల రూపంలోనూ ఆకాశంలో నిర్దేశిత ప్రదేశం చేరడానికి పట్టే సమయంలో ఆ మంత్రం చదవడం పూర్తి అవుతుందన్నమాట. ఒక్కో రకమైన యజ్ఞంలో ఒక్కో రకమైన చంధస్సుతో కూడిన మంత్రాలు చదువుతారు, ఆ మంత్రం పఠనానికి పట్టే సమయంలో ఈ హవిస్సు వాయురూపంలో అతివేగంగా ఆయప్రదేశాలకు చేరుతుంది.

క్లుప్తంగా చెప్పుకోవాలంటే అంతరిక్షలోకి ప్రయోగించిన రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరడానికి క్రింది రాకెట్ కేంద్రం నుంచి కంప్యూటర్ల ద్వారా ఎలా పర్యవేక్షిస్తారో, సరిగ్గా అదే విధంగా యజ్ఞ హవిస్సు దేవతలను (ప్రకృతిలో నిర్దేశిత ప్రదేశాన్ని) చేరడానికి మంత్రం సహాయపడుతుంది.

ఇది దైవికంగా చూసినప్పుడు యజ్ఞం దేవతలకు శక్తినిస్తే, సైన్సుపరంగా చూసినప్పుడు పర్యావరణంలో సమతుల్యాన్ని ఏర్పరుస్తుంది. మనిషి యొక్క మానసిక, శారీరిక స్థితులను బట్టి చెప్పవలసి వస్తే యజ్ఞం శరీరంలో ఉన్న రాక్షసులను (రోగాలను) తరిమేస్తుంది. మద్యపానం, ధూమపానం (సిగిరెట్టు) మొదలైన వాటికి బాగా అలవాటు పడినవారు, రోజు అగ్నిహోత్రం చేయడం చేత, అతి తొందరగా ఈ దురలవాట్లను మానేసినట్లు ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి.

ఇప్పుడు గమనిస్తే దుర్గామసురుడు కోరిన వర ప్రభావం చేత యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఫలితంగా పర్యావరణం కాలుష్యమైంది, పర్యావరణసమతుల్యం దెబ్బతిన్నది, హవిస్సు లేక దేవతలు శక్తిహీనులయ్యారు, వర్షాలు కురవడం ఆగిపోయింది. పర్యావరణం దెబ్బతింటే కలుషిత పదార్ధాలు పెరిగిపోతాయి. అవి ఓజోన్ పొర నాశనానికి, భూతాపం పెరగడానికి కారణమవుతాయి. భూతాపం పెరిగితే, ఋతువులు క్రమం అస్తవ్యస్తం అవుతుంది. అతివృష్టి, అనావృష్టి ఏర్పడతాయి. సమయం కాని సమయంలో వర్షాలు పడతాయి. ఫలితంగా వ్యవసాయం దెబ్బతింటుంది, ఆకలి పెరుగుతుంది, కాలుష్యం, భూతాపం కొత్తరోగాలను పుట్టిస్తుంది. దాంతో ప్రపంచమంతా హాహాకారులు వినిపించాయి. ఇక అసురులు అమరావతిని స్వాధీనపరుచుకోవడం కూడా చూస్తే, దేవతలు మానవ మనసుపై ప్రభావం చూపిస్తారు, మంత్రపఠనం, అగ్నిహోత్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మనిషి మనసే అమరావతి (దేవతలకు రాజాధాని). వేదం మనిషి యొక్క జీవనాన్ని నిర్దేసిస్తుంది. ఇవన్ని మర్చిపోవడం వలన మనిసి మనసులోకి చెడు ఆలోచనలు (రాక్షసులు) ప్రవేశిస్తాయి. అత్యాశ, హింస, స్వార్ధం, భౌతిక వాదం పెరిగిపోతాయి. బయట ఏర్పడిన కరువు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మనిషిలో ఉన్న దైవత్వం పోయి, మనసును రాక్షసత్వం ఆక్రమిస్తుంది. అందుకే దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి సుమేరు పర్వత గుహలలో తలదాచుకున్నారని కధలో కనిపిస్తుంది.  

జనమేజయుడితో వ్యాసమహర్షి ఈ విధంగా పలుకుతున్నారు. ఓ రాజా! పవిత్రమైన అగ్ని ఆరాధన (అగ్నిహోత్రము, యజ్ఞయాగాదులు), హవిస్సులు లేని కారణం చేత వర్షాలు కురవడం ఆగిపోయింది. ఎప్పుడు జలాలతో నిండుగా ఉండే చెరువులు, తటాకాలు, నదులు అన్ని పూర్తిగా ఎండిపోయాయి. భూగోళం మీద త్రాగడానికి చుక్క నీరు కూడా లేదు. భూమి మొత్తం ఎండిపోయింది. ఈ పరిస్థితి ఒక వంద సంవత్సరాల పాటు కొనసాగింది. కరువు కారణంగా జనులు, జంతువులు, ఆవులు, గేదెలు, ఒక్కటేమిటి అన్ని జీవులు చాలావరకు మరణించాయి. వేదమూ, వైదిక క్రియలు మర్చిపోయిన కారణం చేత చనిపోయిన శవాలకు దహన సంస్కారం (కాల్చడం) నిలిచిపోయింది. ప్రపంచంలో ఎక్కడ చూసిన అందరి ఇళ్ళలో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. (వేదమే సమస్తకర్మలకు మూలం. చెప్పులు కుట్టడం నుంచి యజ్ఞం వరకు, రాకెట్ తయారి, అణుబాంబు తయారి వరకు అన్నిటికి వేదమే మూలం.) ఇలాంటి సందర్భంలో ప్రశాంత చిత్తులైన బ్రాహ్మణులు (బ్రహ్మ జ్ఞానం కలిగినవారిని బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మజ్ఞానికి జన్మతో సంబంధం లేదు) ఈ అనర్ధాన్ని చూసి 'శివా'ను వేడుకోవడం కోసం హిమాలయ పర్వతాలకు పయనమయ్యారు.

పూజ, సమాధి, ధ్యానం మొదలైనవాటితో ఆ పరమేశ్వరిని సంతుష్టురాలిని చేయడానికి ఏ రోజు కారోజు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిరాహారులై, 'అమ్మ' యందే మనసు నిలిపి 'అమ్మ'ను శరణాగతి చేశారు .

దయాం కురు మహేశాని పామరేషు జనేషు హి|
సర్వాపరాధయుక్తేషు నైత్ఛలాఘ్యాం తవాంబికే||

ఓ మహేశాని (మాహా మహా ఐశ్వర్యములకు అధికారిణి; మహేశ్వరుని భార్య;)! మా యందు దయ చూపు. మేము పామరులము (ఏమి తెలియనివారము). ఎన్నో తప్పులు చేసాము. నిన్ను స్తుతించే అనుగ్రహం పొందే అర్హత కూడా లేదు. అయినా నీ బిడ్డలం కదమ్మా! మా యందు దయ చూపవూ!

కోపం సంహార దేవేశి సర్వాంతర్యామిరూపిణి |
త్వయా యతా ప్రేరయేతే2ం కరోతి స తధాజనాః ||
నాన్య గతిర్జనస్యస్యా కిం పశ్యసి పునఃపునః|
యతేఛ్చసి తధాకర్తుం సమర్ధోసి మహేశ్వరీ ||

ఓ దేవేశి (దేవతలకు ఈశ్వరి)! మా మీద నీ కోపాన్ని తగ్గించమ్మా. నీవు సర్వజీవులలో అంతర్యామిగా ఉంటూ అందరిని నడిపిస్తున్నావు, అందరి కర్మలకు సాక్షిగా ఉన్నావు. అందరి యొక్క ఆలోచనలు ఎరిగినదానివి, అందరిని ఆలోచింపచేసేదానివి కూడా నీవే. నువ్వు ఏ విధంగా నడిపిస్తే జనులు ఆ విధంగా నడుస్తారు. నీవు తప్ప మాకు వేరే గతి లేదు. నువ్వే శరణు. ఓ మహేశ్వరీ! నీవు ఏమైనా చేయగల సమర్ధురాలవు. అయినా నీవు దేని కోసం మళ్ళీమళ్ళీ మౌనంగా  చూస్తున్నావు.

సముద్ధర మహేశాని సంకటాత్పరమోత్థితాత్ |
జీవనేన వినా2స్మాకం కథం స్యాత్స్థితిరంబికే ||
ప్రసీదం త్వం మహేశాని ప్రసీద జగదంబికే |
అనంతకోటి బ్రహ్మాండా నాయికెతే నమోనమః ||

ఓ మహేశాని! ఇప్పుడు సంభవించిన సంకట పరిస్థితి నుంచి మమ్ముల్ని రక్షించు తల్లీ. ఓ అంబికా (అమ్మా)! నీరు లేకపోతే మేము ఎలా జీవించగలము. దయచూపు ఓ మహేశాని! ఓ జగదంబ (జగత్తునకు అమ్మ) ! కనికరించు. ఓ మహేశాని! కరుణించు! అనంతకోటి బ్రహ్మాండాలకు నాయికవు (నడిపించే దానివి) అయిన నిన్ను మళ్ళీమళ్ళీ వేడుకుంటున్నాం అమ్మా!

నమః కుటస్థం రూపాయై చిద్రూపాయై నమోనమః |
నమో వేదాంతవేద్యాయై భువనేశ్యై నమోనమః ||
నెతినెతీతి వాక్యైర్యా బోధ్యతే సకలాగమైః |
తాం సర్వకారణాం దేవీం సరభావేన సన్నతాః ||

సకల జనుల యొక్క భ్రూమధ్యంలో (రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలో) 'కూటస్థ' అనే పేరుతో చైతన్యరూపంలో ఉన్న ఓ దేవి, నీకు మా నమస్సులు.
- భ్రూమధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇది జీవుడి స్థానం. జపం, ధ్యానం, ప్రాణాయామం మొదలైనవి సాధన చేసే సమయంలో కన్నులు మూసుకుని దృష్టినంతా ఆజ్ఞాచక్రం మీద నిలపమని గురువులు చెప్తారు. బ్రహ్మచర్యం, అహింస, శమము, దమము, అస్తేయం మొదలైన అనేక లక్షణాలను (యోగశాస్త్రాంలో, ధర్మశాస్త్రంలో చెప్పబడ్డవి) కలిగి ఉంటూ, ఈ ఆజ్ఞాచక్రం మీద దృష్టి నిలిపి రోజు ధ్యానం చేయడం చేత సిద్ధులు ప్రాప్తిస్తాయని చెప్పబడింది. దూరశ్రవణం, దూరవీక్షణం, భవిష్యద్దర్శనం మొదలైనవి ఎన్నో. అయితే సాధకుల లక్ష్యం ఈశ్వరుడే కావాలి కానీ సిద్ధులు కాదు. ఈ ఆజ్ఞాచక్రం నిద్రాణమవ్వకుండా ఉండటం కోసమే తిలక ధారణ చేస్తారు. సనాతనధర్మాన్ని అవలంబించేవారందరూ విధిగా బొట్టు పెట్టుకోవాలి. ప్రతి శుభకార్యానికి ముందు దీపారాధన చేస్తారు. దాని కంటే ముందు కుంకుమ ధరిస్తారు. బొట్టు లేకుండా చేసే ఏ కార్యం కూడా ఫలితాన్ని ఇవ్వదని ధర్మం గట్టిగా చెప్తోంది. బొట్టు అంటే స్టిక్కర్లు, రంగులు కాదు, అచ్చమైన కుంకుమ, లేదా గోమయంతో చేసిన విభూతి, లేదంటే చందనం. ఇలా బొట్టు పెట్టుకోవడం ఈ ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడం కోసమే. పిల్లలకు చిన్నవయసు నుంచే బొట్టు పెట్టుకోవడం అలవాటు చేస్తే, ఈ ఆజ్ఞాచక్రం చైతన్యంగా ఉంటూ, ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారు ఈ ఆజ్ఞాచక్రంలో కూటస్థం రూపంలో ఉంటుంది. అనగా చైతన్యం అన్నమాట. సాధకుడు ఈ స్థాయికి చేరుకున్నప్పుడు, అతడు కళ్ళతో పనిలేకుండా తన చుట్టూ 360 డిగ్రీల్లో జరిగేవి, దూరంగా జరిగేవీ కూడా వీక్షించగలడు. అందుకే ఇక్కడ అమ్మవారికి 6 ముఖాలని లలిత సహస్రనామాల్లో చెప్పబడింది. 6 ముఖాలు 4 దిక్కులను, పైన, క్రింద చూస్తుంటాయి, అనగా భగవంతుడు లక్షణమైన సర్వతోముఖం అన్నమాట.
చిత్ అంటే చైతన్యం, కదలిక, సర్వజీవుల్లోను చైతన్యం రూపంలో వ్యకతమవుతున్న తల్లే అమ్మవారు. చిద్రూపిణిగా, పరిపూర్ణమైన చైతన్యంగా నిత్యం వెలుగొందుతూ ఉండే నీకు నమస్సులు.
వేదవేదాంతల ద్వారా తెలుపబడేదానివి నీవు.
సకల భువనాలకు ఈశ్వరివైన నీకు మా నమస్కారాలు.
ఇది కాదు, ఇది కాదు అంటూ ఆగమాల ద్వారా తెలుపబడే అన్నిటికంటే ఉన్నతమైన, సర్వాతీతమైన పరతత్వం నీవు.
ఓ దేవి! అన్నిటికి కారణం నీవేనమ్మా! ఇంత వైభవం కలిగిన ఓ మహాదేవి సర్వ భావములతో నీకు నమస్కరిస్తున్నాము అంటూ వేడుకుంటున్నారు.

ఇతి సంప్రార్థితా దేవీ భువనేశీ మహేశ్వరీ |
అనంతాక్షిమయం రూపం దర్శయామాసపార్వతీ ||
నీలానజనసమప్రఖ్యాం నీలపద్మాయతేక్షణం |
సుకకర్షసమోత్తుంగవృతపీనఘనస్థనం ||

ఈ విధంగా అందరూ కలిసి సకల భువనాలకు ఈశ్వరీ అయిన మహేశ్వరిని ప్రార్ధించడంతో ఆఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి,  నిరాకార రూపిణి, త్రిగుణాత్మికా, సచ్చిదానంద స్వరూపిణి, సమస్త లోకాలను కేవలం తన సంకల్ప మాత్రంచేత సృజించగలిగిన శక్తిస్వరూపిణి, అయిన ఆ జగజ్జనని కాటుకరంగును పోలిన నల్లని వర్ణంతో, దివ్యప్రభలను విరజిమ్మే తేజస్సుతో, నీలి పద్మాలవంటి విశాలమైన కన్నులు శరీరమంతా కలిగినదై, అనంతమైన అక్షములతో (కన్నులతో), పెద్ద వక్షోజములతో మూర్తీభవించింది.

బాణముష్టించ కమలం పుష్పపల్లవ మూలకాన్ |
శాకాదీన్ ఫలసమాయుక్తాన్ అనంతరస సమ్యుతాన్ ||
క్షుత్ తృష్ణ జరాపహ హస్తైర్బిభృతిచ మహాధనుః |
సర్వసౌందర్య సారం తద్రూపం లావణ్యశోభితం ||

ఒక చేతితో బాణం, రెండవ చేతితో కమలం పట్టుకుంది, మూడవచేతితో సారవంతమైనవి, తినగానే పుష్టినిచ్చేవి, ఆకలిని తీర్చేవి, బలహీనతలను నశింపజేసేవైన పుష్పములు (పువ్వులు), మొలకలు, కందమూలాలు, కూరగాయలు, ఆకుకూరలు, రసము కలిగిన పండ్లు ధరించింది. నాల్గవ చేతితో ఒక మహాధనస్సును ధరించి కనిపించింది. ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక చోట చేర్చిన సరితూగని మహాసౌందర్యంతో, అన్ని రకాల సౌందర్యాలను కలబోసిందా అన్నట్టుగా సర్వ సౌందర్యరాశియై, ప్రేమ, కరుణ మొదలైన గుణాలను వ్యక్తపరుస్తూ సర్వజీవులను సమ్మోహ పరుస్తున్నట్టుగా ఉన్నది ఆ దేవి యొక్క దివ్య స్వరూపం. అది జగన్మోహన స్వరూపం. ఆ రూప సందర్శనమే కామవాంఛలను పటాపంచలు చేస్తుంది.

కోటిసూర్యప్రతీకాశం కరుణారససాగరం |
దర్శయిత్వా జగద్దాత్రీ సో2నంతనయనోద్భవో ||
మోచాయమాస లోకేషు వారిధారాః సహస్రశః |
నవరాత్రం మహావృష్టిరభూనేత్రోద్భవైర్జలం ||


కరుణా సముద్రురాలు అయిన ఆ తల్లి కోటి సూర్యల కాంతితో వెలిగిపోతోంది. జగత్తు మొత్తాన్ని ధరించే ఆ మహాశక్తి అక్కడున్న దయనీయ పరిస్థితిని అనంతమైన కన్నులతో వీక్షించింది. సర్వాతితురాలైనప్పటికి ఆ మహాశక్తి బ్రహ్మ మొదలు సకల జీవులకు అమ్మ. ఏ తల్లీ కూడా తన బిడ్డలు కష్టాలు పడుతుంటే చూడలేదు. బిడ్డలు పడే బాధకంటే, వారి బాధను చూసి తల్లి పడే బాధయే ఎక్కువ. ఆ పరమేశ్వరీ కూడా తన బిడ్డల కష్టాలను చూడలేక విలపిస్తూ కన్నీరు కార్చింది. అమ్మ యొక్క అక్షయమైన కన్నుల వెంట వచ్చిన నీరు ఏరులై పారింది. దాంతో తొమ్మిది రాత్రుల పాటు ఎన్నడు ఎరుగని అతిభారీ వర్షాలు కురిసి ఎండిపొయిన భూమి మీద జలం పొంగి ప్రవహించింది.

దుఃఖితాన్వీక్షస్య సకలాన్నేత్రాశృణీ విముంచతి |
తర్పితాస్తేన తే లోకా ఓషధయః సకలా అపి ||
నదీనదాప్రవాహాస్తైర్జలైః సమభవన్నృపా |
నీలీయ సంస్థితాః పూర్వం సురారస్తే నిగర్తా బహిః ||

దుఃఖితులైన జనులను, జీవులను చూసి అమ్మ ధారగా కార్చిన కన్నీరు జనులు, ఓషధుల యొక్క బాధలను తీర్చేసింది. ఆ కన్నీటి ధారతో నిండిన నదులు తిరిగి ప్రవహించసాగాయి. అప్పటివరకు మేరు పర్వత గుహలలో దాక్కున దేవతలు బయటకు వచ్చారు.

వ్యాఖ్య - అమ్మవారి కన్నుల వెంట వచ్చిన నీరే నదులుగా, సరసుల్లో ప్రవహించింది. ఇప్పుడున్న జలవనరులన్నీ అమ్మవారి ప్రసాదమే. అదంతా ఆవిడ మనకోసం ప్రేమతో కార్చిన కన్నీరే. అటువంటి జలాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రసాదంగా భావించాలి. నీటిని వృధా చేయకూడదు. జలవనరులను కలుషితం చేయకూడదు. అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా నీటిని వృధా చేస్తూ, జలాలను కలుషితం చేస్తుంటే, ఎన్ని పూజలు చేసిన అమ్మ అనుగ్రహం ఎలా కలుగ్తుంది? పైగా అమ్మవారిని అవమానించిన పాపం కూడా వస్తుంది.

మిలిత్వా ససురావిప్రా దేవీంసమభితుష్టువుః |
నమో వేదాంతవేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణీ ||
స్వమాయయా సర్వజగద్దాత్రై తే నమోనమః |
భక్తకల్పద్రుమే దేవి భక్తార్ధం దేహదారిణి ||

బ్రాహ్మణులతో కలిసి దేవతలు కూడా 'అమ్మ'ను స్థుతించసాగారు.  వేదాంతము ద్వారా తెలియబడే దానివి, సాక్షాత్తు పరబ్రహ్మానివి అయిన నీకు వందనాలు. సకల జగత్తును నీ మాయ చేత సృష్టిస్తావు. భక్తుల పాలిటి కల్పవల్లివి, కల్పవృక్షానివి, కోరిన కోరికలు తీర్చేదానివి. భక్తుల కోసమే నీవు ఒక రుపాన్ని ధరిస్తావు/పొందుతావు. అటువంటి నీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాం తల్లీ.

నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరి తే నమోనమః |
అస్మత్ఛంత్యార్ధమతులం లోచనానాం సహస్రకం ||
త్వయా యతో ధృతందేవి శతాక్షీ త్వం తతోభవ |
క్షుదయాపీడితా మాతః స్తోతుంశక్తిర్నచాస్తినః ||

నిత్యం అనంతమైన తృప్తితో ఉండేదానివి, ఎవరుతోనూ పోల్చదగినదానివి కావు, సమస్త భూవనాలకు ఈశ్వరివైన నీకు మా నమస్కారములు. సహస్ర (అనంతమైన) కన్నులు కలిగినరూపంతో వ్యక్తమై లోకాలకు శాంతిని పంచావు. అందువల్ల నీవు 'శతాక్షీ దేవి'గా పిలువబడుతావు. ఆకలితో పీడింపబడుతున్న మాకు ఇంక నిన్ను స్తుతించే శక్తి లేదు తల్లీ.

అమ్మా మా యందు కృప చూపించి వేదములను తిరిగి మాకు ప్రసాదించు అని దేవతలు, జనులు మహేశ్వరిని వేడుకున్నారు.



వ్యాసుడు జనమేజయుడుతో "ఓ రాజా! ఈ మాటలు వినగానే అమ్మ తన చేతిలో ధరించిన రుచికరమైన కూరగాయలు, పండ్లను జనులకు ఇచ్చింది. ఆ పరమేశ్వరి.......... బ్రహ్మ దేవుడు మొదలు చిన్న కిటకముల వరకు అందరికి తల్లి కదా. అందువల్ల జనులతో పాటు ఇతర జీవుల ఆకలిని కూడా తీర్చింది. జంతువులకు, పక్షులకు వాటికి సరిపడా ఆహారాలను అందించింది.

ప్రార్ధనలు చేయగానే కరుణించి మంచి రసకరమైన, పుష్టికరమైన కూరగాయాలను, పండ్లను అందరికి ప్రసాదించింది కనుక ఆ రోజు నుంచి 'శాకంబరి' / 'శాకంభరి' అనే పేరుతో ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. శాకంబరీ దేవి ఆహారానికి, ప్రకృతికి ప్రతిరూపం. శాకములంటే కూరలని అర్ధం. శాకంభరి హరితజీవనానికి ప్రతీక. స్తోత్రాలే కాక, ఆహారాన్ని, కాయగూరలు, పండ్లను వృధా చేయకపోవటం, సద్వినియోగం చేయటం, అమ్మ కన్నీటి నుంచి వచ్చినాయి కనుక నీటిని వృధా చేయకుండా ఉండటం, ప్రకృతిని రక్షించడం, ప్రకృతికి పుష్టి కలిగించే పనులు చేయటం కూడా శాకంభరి దేవికి చేసే ఆరాధనయే అవుతుంది.

అమ్మ అందరికి ఆకలిని తీర్చిందన్న విషయం, దేవతలందరూ సమావేశమవడం వలన కలిగిన శబ్దాన్ని దూత ద్వారా తెలుసుకున్న దుర్గామాసురుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అమ్మతో యుద్ధం చేయడానికి భారీ సైన్యంతో రణరంగంలోకి దూకాడు.

దుర్గమాసురుడు వేయి అక్షౌహిణుల సైన్యంతో (ఒక అక్షౌహిణిలో 21,780 ఏనుగులు, 21,780 రధాలు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు ఉంటారు), అత్యంత వేగంగా బాణాల సంధిస్తూ, దేవతల సైన్యాన్ని చేధించుకుంటూ ముందుకు కదిలి అమ్మవారి ముందు నిలబడ్డాడు. విప్రులను చుట్టుముట్టేశారు రాక్షసులు. ఈ సంఘటనను చూసిన దేవతలు, విప్రులు భయంతో 'మమ్మల్ని రక్షించమ్మా! మమ్మల్ని కాపాడు' అంటూ రోదించారు. వెంటనే అమ్మవారు దేవతలు, ద్విజుల రక్షణార్ధం, వారి చుట్టు ఒక తేజోమయమైన, చక్రం వంటి వలయాన్ని సృష్టించింది. రాక్షసులతో పోరడడానికి తాను ఆ తేజోవలయం బయట నిల్చుంది.


అప్పుడు దేవికి, దైత్యులకు (రాక్షసులకు) మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధరంగంలో విడువబడుతున్న బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. సూర్యమండలాన్ని కూడా ఈ బాణాలు కప్పివేశాయా అన్నట్టుగా జరుగుతోంది యుద్ధం. బాణాలు పరస్పరం ఢీకొనడం వలన వాటి మధ్య అగ్నిజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. భీకరమైన శబ్దాలు, కళ్ళతో చుడలేనంత కాంతి వెలువడుతోంది. ఆ యుద్ధ భూమిలో ధనుస్సును లాగి వదలడం వలన ఏర్పడిన శబ్దాలు దిక్కులన్నిటికి వ్యాపిస్తున్నాయి. దిక్కులను సైతం చెవిటివాటిగా మారుస్తున్నాయి. ఈ సమయంలోనే అమ్మవారి శరీరం నుంచి తీవ్రశక్తులు ఉద్భవించాయి.

కాళి, తారా, బాలా త్రిపుర సుందరి/ త్రిపుర బాలా, త్రిపుర భైరవి, రమా, బగళా, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజా, జంభిని, మోహిని, చిన్నమస్త మొదలైన విద్యలు/శక్తులు, పదివేల చేతులు కలిగిన అనేక మంది గుహ్యకాళీలు శాకంబరీ దేవి నుంచి ఉద్భవించారు.

పరాశక్తి శరీరం నుంచి 32 మహాశక్తులు, మరో 64 మహాశక్తులు ఉద్భవించారు. వీరితో పాటు అనేకమంది ఆయుధాలు ధరించిన దేవి స్వరూపాలు అమ్మవారి శరీరం నుంచి అవతరించారు. యుద్ధభూమి మొత్తం మృదంగం, శంఖం, వీణ, ఇతరాత్ర సంగీత వాయిద్యాల ఘోషతో మార్మోగుతోంది. అంతటా దేవి స్వరూపాలతో నిండిపోయింది. ఈ మహాశక్తులందరి చేత 100 అక్షౌహిణిల రాక్షస సైన్యం నశించింది. ఇదంతా చూస్తున్న రాక్షస అధిపతి, దేవతల శత్రువు అయిన దుర్గమాసురుడు ముందుకు వచ్చి మొదట మహశక్తులతో పోరాడాడు. యుద్ధం మరింత భీకరమైంది. అమ్మవారి దేహం నుంచి పుట్టిన శక్తులచేత 10 వ రోజు నాటికి అన్ని అక్షౌహిణిల సైన్యం సంపూర్తిగా నశించిపోయింది. (ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అమ్మవారు తల్చుకుంటేనే దుర్గమాసురుడు, వాడి సైన్యం మొత్తం నశించిపోతుంది. అమ్మ సర్వసమర్ధురాలు, సర్వశక్తులకు అధిదేవత. కానీ ఎంతైనా అమ్మ కదా. ఏ తల్లి తన బిడ్డలని తానే చంపుకోదు. వాడు ఎంత కౄరుడైన వాడు మారుతాడేమో అన్ని వేచి చూస్తుంది. అందుకే అమ్మవారైన, ఏ ఇతర దైవమైనా ఒక్కసారిగా రాక్షసులను అంతం చేయరు. వారిలోని రాక్షసత్వాన్ని మాత్రమే నాశనం చేయాలని భావిస్తారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు మారకపోతే, మొండిగా మారి లోకాలకు సంకటంగామారితే లోకకల్యాణం కోసం వారిని సంహరిస్తుంది. కానీ దయాసముద్రురాలు కనుక మళ్ళీ తనలోనే కలిపేసుకుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే కర్మపండాలి. కర్మ తీరేవరకు మరణం సంభవించదు. అమ్మవారు ఎంత ఓర్పు వహించినా, ఇంకా రెచ్చిపోయి, అంత తపస్సు చేసినా, మూర్ఖత్వంతో అమ్మవారి మీద యుద్ధం చేసి, కర్మను ఇంకా పెంచుకోని, తనకు తానుగా భయంకరమైన చావు కొని తెచ్చుకుంటున్నాడు దుర్గముడు. జీవుడికి కర్మ చేయడంలో అధికారం ఉంది, కర్మఫలం ఈశ్వరుడిస్తాడని గీతలో భగవానుడు చెప్పిందే ఇక్కడ కనిపిస్తోంది. వాడికి మంచైనా, చెడైనా చేసే అధికారం ఉంది, ఆ తర్వాత జరగబోయే పరిణామాల్లో మాత్రం వాడికి అధికారంలేదు. అప్పుడు ఈశ్వరుడు చూసుకుంటాడు. ఇలా మనం ఏది చేయాలో, ఏదో చేయకూడదో తెలియదు కనుకే ధర్మం అనేది ఈశ్వరుడిచ్చాడు. దాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడిస్తే, అప్పుడు సత్కర్మ చేసి, సత్ఫలితాలను పొందుతాము. లేదంటే పాపకర్మ చేసి, కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాము.)

యుద్ధం 11 రోజు ఉధృతమైంది. దుర్గముడు ఎర్రని పూలహారం ధరించి, శరీరానికి ఎర్రచందనం పూసుకుని, విజయం తనేదననే ఉత్సాహంతో రధం ఎక్కాడు. గట్టిగా అరుచుకుంటూ, మహాశక్తులందరిని చేధించుకుంటూ వేగంగా వెళ్ళి రధాన్ని మహాదేవి ముందు నిలిపాడు. అమ్మవారికి, దుర్గమాసురుడికి మధ్య రెండు ప్రహరల పాటు (ఒక ప్రహర అంటే దరిదాపుగా 3 గంటల సమయం) మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధం అందరి గుండెల్లో భయాన్ని నింపింది. ఆ సమయంలో అమ్మవారు 15 అత్యంత శక్తివంతమైన బాణాలను విడిచిపెట్టింది.

అమ్మవారి విడిచిపెట్టిన 15 బాణాల్లో 4 బాణాలు రధాన్ని లాగుతున్న నాలుగు గుర్రాలను హతమార్చాయి. ఒక బాణం రథసారధిని నశింపజేసింది. రెండు బాణాలు దుర్గామాసురుడి రెండు కళ్ళను, మరో 2 బాణాలు వాడి రెండు భుజాలను, ఒక బాణం రధంపైనున్న ధ్వజాన్ని(జెండాని) నాశనం చేశాయి. జగదంబ చేత విడిచిపెట్టబడిన మిగిలిన 5 దుర్గమాసురుడి హృదయంలోనికి చొచ్చుకొనిపోయాయి. వెంటనే దుర్గముడు రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. వాడి దేహం నుంచి జ్యోతిస్వరూపంలో ఆత్మ బయటకు వచ్చి అమ్మవారిలో కలిసిపోయింది. శక్తివంతమైన రాక్షసుడు మరణించడంతో మూడులోకాల్లోనూ శాంతి నెలకొంది. బ్రహ్మ, ఇతర దేవతలు సర్వలోకాలకు అధిష్టాత్రి అయిన అమ్మవారి ముందు నిలబడి భావావేశంతో, భక్తిపారవశ్యంతో గద్గద స్వరంతో అమ్మవారినిను స్థుతించారు.

దేవ ఉవాచ :
జగద్భ్రమ వివర్తైక కారణే పరమేశ్వరీ |
నమః శాకంభరీ శివే నమస్తే శతలోచనే ||
సర్వోపనిషదోద్ఘుష్టే దుర్గమాసురనాశిని |
నమో మహేశ్వరీ శివే పంచకోశాంతరస్థితే ||

దేవతలు అంటున్నారు :

ఓం పరమేశ్వరీ, ఈ జగత్తు యొక్క ఆది, అంతాలకు, కారణం నీవు. నీవే శాకంభరివి. అక్షయమైన (లెక్కలేనన్ని) కన్నులు కలదానివి. సకల ఉపనిషత్తుల చేత కీర్తించబడిన దివ్యత్వానివి. దుర్గమాసుర సంహారిణివి. సకల శుభాలకు ఈశ్వరివి, పంచకోశముల లోపల ఉండే తత్వాన్ని నీవు. అటువంటి నీకు మా నమస్కారములు.

చేతసాం నిర్వికల్పేన యా ధ్యాయంతి మునీశ్వరః |
ప్రణావార్తస్వరూపాం తాం భజామో భువనేశ్వరీం ||
అనంతకోటి బ్రహామండజననీం దివ్యవిగ్రహాం |
బ్రహ్మవిష్ణ్వాదిజననీం సర్వభావైర్నతా వయం ||


ఈ సృష్టిలో ప్రతీదీ నిత్యం మార్పునకు లోనవుతూనే ఉంటుంది. కానీ నీవు ఈ స్థితికి అతీతమైనదానివి, చైతన్య తత్వానివి. మునీశ్వరుల చేత ధ్యానింపబడే దానివి. ప్రణవ(ఓంకారం) స్వరూపానివి. సకల భువనాలకు ఈశ్వరివైన నిన్నే కీర్తిస్తున్నాము. ఎన్నో కోట్ల బ్రహ్మాండాలకు అమ్మవు. చిన్మయస్వరూపిణివి. బ్రహ్మ, విష్ణూ మొదలైన వారందరికి తల్లివి, వారందరు సర్వభావములతో నీకు పాదాభివందనం చేస్తారు.

కః కుర్యాత్ పరమాం దృష్ట్వా రోదనం సకలేశ్వరః |
సదాయం పరమేశానీం శతాక్షి మాతరం వినా ||

అత్యంత దీనులు, బలహీనులైన మా బాధలను చూసి అన్నిటికి అతీతమైన నీవు, శతాక్షిదేవిగా, దయాస్వరూపిణివై రోదించావు. మా కష్టాలను తీర్చావు. నీవు తప్ప అటువంటి పని ఇంకెవరు చేయగలరు?

వ్యాస ఉవాచ :
ఇతి స్థుతాసురైర్దేవి బ్రహ్మవిష్ణ్ణవాదిభిర్వరైః |
పూజితా వివిధైర్ ద్రవ్యైః సంతుష్టాభూచ్చ తత్క్షణే ||



ఈ విధంగా స్థితిస్తూ బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలు అమ్మను వివిధ ద్రవ్యాలతో పూజించి ఆరాధించారు. వెంటనే అమ్మ సంతుష్టురాలయ్యింది. వేదాలను తిరిగి తెచ్చి ఇచ్చింది. వెంటనే మధురమైన స్వరంతో అందరిని, ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్ద్యేశించి ఈ విధంగా పలికింది. " వేదాలు నా శరీరంలో ముఖ్యమైన భాగాలు. కాబట్టి వేదం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. వేదం లేకపోతే ఎటువంటి కష్టనష్టాలు, ఉపద్రవాలు వస్తాయో, మీరు చూశారు. నన్నే నిత్యం పూజించండి. నిత్యం నా సేవ చేయండి. మీకు శుభాలు కలగడానికి ఇంతకంటే వేరెమార్గం లేదు. అత్యుత్తమమైన నా ఈ మహత్యాన్ని నిత్యం చదవండి. నేను పరసన్నురాలనవుతాను. మీకు ఉన్న ఆపదలను, భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాలను మొత్తం ఈ విధంగా తీసేస్తాను.

దుర్గమాసుర సంహారం చేత నేను పొందిన 'దుర్గా' నామాన్ని, అక్షమయమైన కన్నులతో సాక్షాత్కరించాను కనుక నేను పొందిన 'శతాక్షి' అనే నామాన్ని నిత్యం ఎవరు స్మరిస్తారో వారు నా మాయ నుంచి విముక్తులై, పరమపదానికి నడుస్తారు, నేనే నడిపిస్తాను. ఈ సమయంలో నేను నా అసలు తత్వం మీతో ఇంకేమి చెప్పగలను. అనేక తత్వాలసారం నేను. నేనే అన్నిటి వెనుక ఉన్న అసలు తత్వాన్ని, అందరిని అన్నిటిని నడిపించేదానిని నేనే, దేవతలు, రాక్షసులు కూడా నన్నే ఆరాధిస్తారని గ్రహించండి, గుర్తించండి.

వ్యాస ఉవాచ:

ఈ విధంగా పలికి, సచ్చిదానంద స్వరూపిణి అయిన అమ్మ, జనులకు ఆనందం కలిగించి దేవతల కన్నుల ముందు నుంచి అదృశ్యమైంది. ఓ రాజా! జనమేజయ! అత్యంత రహస్యమైన, మహాగోప్యమైన ఈ కధను నీకు వివరించాను. 'గోపనీయం ప్రయత్నేన సకలకల్యాణకారకం' సకల కల్యాణాలను/శుభాలను కలిగించే ఈ కధను ప్రయత్నపూర్వకంగా అత్యంత రహస్యంగా ఉంచు (అంటే ఎవరు అడగకుండా చెప్పకు. ఒకవేళ ఈ కధ చెప్పినా అత్యంత శ్రద్ధగా ఎవరు వింటారో, ఎవరు కధను పరిహాసం చేయరో, వారికే చెప్పాలి). అత్యంత భక్తి తత్పరతో ఈ కధను ఎవరు నిత్యం వింటారో, పఠిస్తారో, వారి సకల కోరికలు తీరి, అంతిమంగా దేవీలోకానికి చేరుతారు.

ఇతి శ్రీ వ్యాసప్రోక్త శ్రీ దేవిభాగవతే మహాపురాణే సప్తమస్కంద అష్టాదశోధ్యాయః |

శ్రీ శాకంబరీ దేవీ ప్రకృతి స్వరూపం. పాడిపంటలకు అధిదేవత. శాకంబరీ దేవిని ఎక్కడ ఆరాధిస్తారో అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. శాంతి వర్ధిల్లుతుంది. ఆకలి బాధలు తీరిపోతాయి. అటువంటి శాకంబరీ దేవి ఆశీస్సులతో మన దేశం, ఈ సమస్త ప్రపంచం శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం. పర్యావరణాన్ని రక్షిద్దాం.

ఓం శాంతిః శాంతిః శాంతిః 

Sunday, 21 July 2013

Pantajali and the siddhis :

Pantajali and the siddhis :

Patanjali, a sage of ancient times wrote in his scriptures about the eight siddhis, what we call supernatural powers.

1. Anima- The siddhi by which a yogi reaches a minute state. As small as an ant or totally invisible.

2. Mahima- The siddhi by which a yogi is able to be so big that he may even tear apart the clouds and looks as if he has reached the sun.

3. Laghima- Making the body as light as a feather or cotton. The power to levitate; to make yourself light so that one could float in the air or walk on the water.

4. Garima- Heaviest body like a mountain by swallowing draughts of air.

5. Prapti- Yogi attains the power to change any object from one state to another, as he desires. Can predict future events, gains the power of clairvoyance, clairaudience, telepathy, thought-reading, etc. He can understand any unknown language, the language of any beast or bird. He can cure all diseases.

6. Prakamya- Entering the body of another (Parakaya Pravesh).

7. Vashitvam- Power of taming wild beasts and bringing them under control. It is the power of mesmerising people by the exercise of will and making them obedient to one’s own wishes and orders. It is the restraint of passions and emotions. It is the power to bring men, women and the elements under subjection.

8. Ishathvam- Attainment of divine power. The Yogi himself becomes the Lord of universe.The Yogi who has this power can restore life in dead bodies.

http://vivekananda.hubpages.com/hub/supernatural_powers_and_indian_yogis