Showing posts with label శ్రీ కృష్ణుడు. Show all posts
Showing posts with label శ్రీ కృష్ణుడు. Show all posts

Tuesday, 11 August 2020

ఏమి చేసైనా ధర్మాన్ని గెలిపించాలని మహాభారతంలో శ్రీ కృష్ణుడు బోధించలేదు

 


ధర్మాన్ని గెలిపించడానికి అధర్మంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, ఏమి చేసైనా ధర్మాన్ని గెలిపించాలని మహాభారతంలో శ్రీ కృష్ణుడు బోధించాడని ఒకాయన అన్నారు. ఆయనే కాదు చాలామందికి అదే అభిప్రాయం ఉంది. 


కాని దయ చేసి ఆ అభిప్రాయాన్ని మార్చుకోండి. ధర్మాధర్మాలకు అతీతుడైనప్పటికి, ధర్మ స్వరూపునిగా చెప్పబడుతున్న భగవంతునికి అధర్మం బాట పట్టాల్సిన అవసరంలేదు. ఆయనే సాక్షాత్తు ధర్మస్వరూపుడు. సినిమాలు చూసి, లేదంటే ఎవరో ఎక్కడో చెప్పిన మాటలు విని, అవి నిజమనుకుని దాన్నే ప్రచారం చేస్తున్నారు కొందరు హిందువులు. ఇలా చెప్పినవారిలో ఏ ఒక్కరూ ఏనాడూ శ్రీ రామాయణం, మహాభారతం యొక్క సంస్కృత గ్రంథాలను చదివి ఉండరు. చదివినా సద్గురువు నోటి ద్వారా వాటిలోని ధర్మసూక్ష్మాలను విని ఉండరు. విన్నా అర్ధమై ఉండదు. అందుకే అలాంటి అభిప్రాయానికి వస్తున్నారు.


మహాభారతం విషయానికి వస్తే అందులో కొన్ని సందర్భాల్లో ధర్మం అధర్మంగానూ, అధర్మం ధర్మంగానూ కనిపిస్తుందని పెద్దలు వందల ఏళ్ళ క్రితమే చెప్పారు. ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో ధర్మం క్షణం నుంచి క్షణానికి మారిపోతూ ఉంటుంది. సాధారణ సమయంలో ధర్మంగా చెప్పబడేది అక్కడ అధర్మం కావచ్చు, నిత్యవ్యవహారంలో అధర్మంగా కనిపించేది అక్కడ ధర్మం (కర్తవ్యం) అయిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే మహాభారతాన్ని అర్ధం చేసుకునేందుకు సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. లక్ష శ్లోకాల మహాభారతాన్ని అర్ధం చేసుకునేందుకు అంతే పెద్ద సిద్ధాంత గ్రంథాలను విజ్ఞులైన మన పూర్వులు అందించారు. 


కనుక ఏ విధమైన అవగాహన లేకుండా శ్రీ కృష్ణుడు, శ్రీ రాముని మీద మన అభిప్రాయాలు చెప్పవద్దు. సర్వశక్తిమంతుడైన పరమాత్మకు ధర్మంసంస్థాపన కొరకు ధర్మం విడిచి అధర్మాన్ని ఆశ్రయించాల్సిన అఘత్యం పట్టదని గ్రహించండి. మహాభారతం, రామాయణ రహస్యాలు సొంతంగా చదివితే అర్ధమయ్యేవి కావు, అందుకోసం సద్గురువును ఆశ్రయించాలి, ఉపాసన, చిత్తశుద్ధి, సూక్ష్మబుద్ధి, ధర్మనిరతి, దైవభక్తి తప్పనిసరిగా ఉండాలి. అన్నిటికి మించి ఈశ్వరానుగ్రహం ఉండాలి. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు మానవాళికి మార్గదర్శనం చేయడానికి వచ్చారు, అటువంటి వారు ఎందుకు అధర్మంగా నడుస్తారు ? కనీసం ఈ చిన్న విషయం మీకు అర్ధమవ్వట్లేదా?


కనుక మిత్రులు గమనిస్తారని ప్రార్థన. 

Sunday, 5 February 2017

హిందూ ధర్మం - 236 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)



గ్రీకు పండితుడు సెక్యులస్ అంటాడు, 'పోలిబ్రోత (పాటలిపుత్ర, ఈనాటి పాట్నా) నగరం శాండ్రకోటస్‌కు (చంద్రగుప్త మౌర్యునికి గ్రీకులు పెట్టిన పేరు) 138 తరాల ముందు హెర్కులస్ (శ్రీ కృష్ణుడు) స్థాపించాడు'. దీనిని అనుసరించి కృష్ణుడు క్రీస్తు పూర్వం 3300 కాలమానికి చెందినవాడని గ్రహించవచ్చు.

కృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటనలనే గ్రీకులు తీసుకుని, తమకు అనుగుణంగా కధలు రాసుకున్నారు. అందులో కొన్ని;
కృష్ణుడు కాళీయ మర్దనం చేసి, కాళింగుడనే సర్పం యొక్క అహంకారాన్ని అణిచివేస్తాడు. దాన్ని చంపకుండా వదిలేసి, యమునను విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అలగే హెర్కులస్ కూడా హైడ్రా అనే సర్పాన్ని చంపకుండా, దాని నెత్తి మీద పెద్ద బండరాయిని పెడతాడు.

కృష్ణుడు పక్షి రూపంలో వచ్చిన బకాసురిని చంపుతాడు. హెర్కులస్ కూడా రాకాసి పక్షులను మట్టుపెడతాడు.
కృష్ణుడు అరిష్టాసురుడనే ఎద్దును వధిస్తాడు, హెర్కులస్ క్రెటన్ అనే ఎద్దును వధిస్తాడు.
రాక్షసుడు కేశి అనే పేరుతో గుఱ్ఱం రూపంలో రాగా, దాన్ని మట్టు పెడతాడు కృష్ణ పరమాత్ముడు. హెర్కులస్ జీవితంలో కూడా ఈ ఘటన చూపిస్తారు.

కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాలకులను, వారి పరివారాలను రక్షిస్తాడు. దీన్నే గ్రీకులు హెర్కులస్ భూమిని మోసినట్లుగా చూపించారు.

దేవకీ దేవి 8 వ గర్భంలో జన్మించే పిల్లవాడు తనకు మృత్యువని, అతడి పట్ల శత్రుత్వం పెంచుకుంటాడు మేనమామ అయిన కంసుడు. కృష్ణుడిని చంపటానికి ఎంతో మంది రాక్షసులను పంపుతాడు. పిల్లలకు విషమున్న పాలిచ్చి చంపమని పూతనను పంపుతాడు. సరిగ్గా అటువంటిదే హెర్కులస్ జీవితంలో కూడా జరుగుతుంది. అతడి సవతి తల్లి హీరా, అతడిని చంపమని రెండు విష సర్పాలను పంపుతుంది.

ఇలా గ్రీకుల నోట సనాతన సంస్కృతికి చెందిన విషయాలు ఆ కాలంలోనే పశ్చిమాన వినిపించాయి. అయితే ఇవన్నీ చూపి, మనమే గ్రీకుల నుంచి అన్నీ కాపీ కొట్టామని, మనవన్నీ కల్పితాలని, మనకంటూ ఏదీ లేదని మన దేశపు కుహనా- మేధావులు, మతమార్పిడి వెధవులు చెప్తారు. కధలను కాపీ కొట్టామని వారు వాదించవచ్చు, కానీ కృష్ణుడు ఏలైన ద్వారక ఈ నాటికి భారతదేశంలో పశ్చిమాన ఉన్న గుజరాత తీరంలో, అరేబియా సాగర గర్భంలో ఉన్నది. దాని మీద పురావస్తు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దేశవిదేశాల్లో ఉన్న ఎందరో శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ ద్వారకను కూడా కాపీ కొట్టామంటారా ఈ మేధావులు? మనమే ఓ నగరం కట్టి సముద్రంలో ముంచేశామని చెప్పుకొస్తారా? మన దేశంలో పరీక్షిత్తు మహారాజు జరిపిన సర్పయాగానికి సంబంధించి దొరికిన ఆనవాళ్ళు, ఇతర రాజులు వేసిన తామ్ర శాసనాలు ఆకాశం నుంచు ఊడిపడ్డాయని చెప్తారా? (ఈ శాసనాల గురించి, ద్వారక గురించి ఇదే శీర్షికన 138 నుంచి వరుసగా 142 వరకు ప్రచురించడం జరిగింది. అది చూడగలరు.)

క్రీ.పూ. 190-188 మధ్య అగాతోక్లస్ ఆఫ్ఘనిస్థాన్ లో  అనే ప్రాంతాన్ని పాలించాడు. అతడు చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే కొన్ని బంగారు, వెండి, కంచు నాణేలను ముంద్రించాడు. వాటిపై శివ, విష్ణు, బలరామ, బుద్ధుడి ముద్రలు ఉన్నాయి. వీటి మీద బ్రాహ్మీ లిపిలో ఇవి రాజు అగాతోక్లయసకు చెందినవని ఉంది. 180 కాలానికి చెందిన డేటింగ్ లో నిర్ధారించబడిన చత్రురస్రాకార నాణేలు ఈ మధ్యే ఆఫ్ఘనిస్తాన్ తవ్వకాల్లో బయటపడ్డాయి. అందులో ఒకవైపు బలరాముడు, ఇంకో వైపు కృష్ణుడు ముద్రించబడి ఉన్నారు. దీన్ని బట్టి అంతకు పూర్వమే ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కృష్ణుడి ఆరాధన ఉండేదని తెలుస్తున్నది.

గ్రీకు రాయబారి హెలియోడొర్స్‌కు కృష్ణుడంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన గరుడ ద్వజాలు పాతించాడు. అందులో తనకు కృష్ణుడంటే ఇష్టమని, తాను భగవతుడినని, సనాతన ధర్మాన్ని అవలంభిస్తున్నానని, భాగభద్రుడు ఆస్థానికి వచ్చానని శాసనం వేయించుకున్నాడు. అది క్రీ.పూ.113 కు చెందినది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది.

చంద్రగుప్త మౌర్యుడు ఆశోకుని తాత. ఆయన ఒక యుద్ధంలో గ్రీకు పాలకుడైన సెక్యులస్‌ను ఓడించాడు. ఆ తర్వాత సెక్యులస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దీనివలన భారతదేశం యొక్క ప్రభావం అతిదూరాన ఉన్న గ్రీకుపై కూడా బలంగా పడింది.

భారత్, గ్రీకు నుంచి ఏమీ తీసుకోలేదని, గ్రీకుకే జ్ఞానదానం చేసిందని చెప్పడానికి ఇలా చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు తారపడతాయి.

To be continued ........

Source: http://experiencehinduism.com/interesting-stories/heracles-derived-from-krishna

Thursday, 25 August 2016

గీతలో భగవానుడు


One who is not envious but who is a kind friend to all living entities, who does not think himself a proprietor, who is free from false ego and equal both in happiness and distress, who is always satisfied and engaged in devotional service with determination and whose mind and intelligence are in agreement with Me-he is very dear to Me.

- Sri Krishna in Bhagavadgita 

Monday, 26 October 2015

శరత్ పూర్ణిమ - విశిష్టత

ఈ రోజు (25-10-2015, సోమవారం) శరత్ పూర్ణిమ. ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.

ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.

శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్నుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేసారట.

ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు 

Saturday, 5 September 2015

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

ఓం నమో భగవతే వాసుదేవాయ

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

కృష్ణుడిని దొంగా అంటున్నారు. శ్రీ కృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలో, బృందావనంలో గడిచింది. యశోదానందుల ప్రేమానురాగల మధ్య ఆప్యాయంగా పెరిగాడు కృష్ణుడు. నందుడి ఇంట్లో 1000 ఆవులు ఉండేవి. ఇన్ని ఆవుల నుంచి ఎన్ని పాలు వస్తాయి, ఎంత పెరుగు వస్తుంది, ఎంత వెన్న ఇంట్లో ఉండాలి. ఇంత వెన్న ఇంట్లో ఉంటే ఇక బయటకు వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం కృష్ణుడికేంటి? ఒకవేళ అలా చేశాడే అనుకుందాం, నందుడు బృందావనానికి రాజు. మరి తన కుమారుడు మిగితా ప్రజల ఇళ్ళలో దొంగతనం చేస్తుంటే నందుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? చిన్నప్పుడు మనం అల్లరి చేసినట్టుగానే కృష్ణుడూ చేశాడు. కాలక్రమంలో కృష్ణ భక్తుల ఆయన చేసిన ఒకటి రెండు చిలిపి పనులను భక్తితో బాగా వర్ణించడం మొదలుపెట్టారు. భక్తితో చూసినప్పుడు అది భగవానుడి ఆడిన దివ్యలీల. అంతకుమించి ఆయన దొంగా కాదు, ఆయనకు దొంగతనం చేయవలసిన అవరసము లేదు.

కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి ఆయన్ను చంపడానికి వచ్చి, కృష్ణుడెవరో తెలియక ఆయన వయసున్న మగపిల్లలందరిని చంపేసింది. ఇక ఆయన పెరిగి పెద్దవాడయ్యేసరికి బృందావనంలో ఆయన తప్ప ఆయన వయసు మగపిల్లలు ఎవరూ లేరు. ఉన్నది ఒక్కడే మగపిల్లవాడు, పైగా వాళ్ళ రాజైన నందుడి కొడుకు, మహా సౌందర్యవంతుడు, చిలిపివాడు, చలాకీవాడు. అందువల్ల అందరిచే ప్రేమించబడ్డాడు. అందరు ఆయన్ను ముద్దు చేశారు, గారాభంగా చూశారు. అదే చనువుతో కృష్ణుడు అందరి ఇళ్ళలోకి వెళ్ళి పాలు, పెరుగు తిన్నాడు. బృందావనంలో తన వయసు మగపిల్లలు ఎవరు లేకపోవడంతో ఆయన ఆడపిల్లలతోనే ఆడుకోవలసిన పరిస్థితి. అందుకే ఆయన గోపికలతో ఆడుకున్నాడు (రాసలీల కాదు). వాళ్ళతోనే కలిసి తిరిగాడు. స్నానం చేస్తున్న గోపికల చీరలను ఎత్తుకోపోయాడు, ఇదేనా మీ దేవుడి వ్యక్తిత్వం అంటూ విమర్శించే వారున్నారు. 7 ఏళ్ళు కూడా లేని పసిపిల్లవాడిని పట్టుకుని, అతనిలో అశ్లీలభావాలున్నాయని చెప్పడం ఎంతవరకు తార్కికంగా, సమంజసంగా  ఉంటుంది. అది ఆలోచించకుండా కృష్ణుడిని విమర్శించేవారు మూర్ఖులు మాత్రమే. రాసలీల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిన అంశం. అక్కడ శరీరాలు ఉండవు. జీవాత్మ, పరమాత్మ మాత్రమే ఉంటారు. జీవాత్మతో పరమాత్మ ఆడే దివ్యలీలనే రాసలీల. ఆ స్థాయిలో జీవుడిని స్త్రీగా, పరంధాముడిని పురుషుడిగా సంబోధిస్తారు.  ఇదంతా భౌతికస్థాయిలో బ్రతికేవారికి ఎప్పటికి అర్దం కాదు.

ఇదంతా కృష్ణుడికి 7 ఏళ్ళ వయసు వచ్చేవరకు మాత్రమే జరిగింది. ఆయన 7 ఏళ్ళ వయసు రాగానే సాందీపాని మహర్షి వద్ద చదువుకోవడానికి వెళ్ళాడు. ఆ కాలంలో విద్యాభ్యాసం కనీసం 12 సంవత్సరాలు. విద్యాభ్యాసం ముగియగానే మళ్ళీ బృందావనానికి రాకుండా నేరుగా మధురకు వెళ్ళిపోయాడు. తర్వాత రుక్మిణీ దేవితో వివాహం జరిగింది. వివాహం తర్వాత రుక్మిణి దేవితో కలిసి బధ్రీనాధ్ వెళ్ళి ఒక ఋషి దగ్గర 8 ఏళ్ళ పాటు ఆశ్రమవాసం చేశారు. కఠోరబ్రహంచర్య నియమాలతో, భూశయనం చేస్తూ గడిపారు. ఎలా చూసిన కృష్ణుడు గోపికలతో కలిసి ఆడుకున్నది ఆయనకు 8 ఏళ్ళు రాకముందు, పసిపిల్లవాడిగా. 8 ఏళ్ళ పిల్లవాడు ఆడిన ఆటను రాసలీల అని భక్తులు పవిత్రభావనతో అంటే, కొందరు ఇదే విషయాన్ని పెట్టుకుని ఆయనకు గోపికలతో శారీరిక సంబంధం ఉన్నదని దుష్ప్రచారం చేస్తున్నారు. హవ్వ!................. 8 ఏళ్ళ పిల్లవాడి మీద ఇన్ని అపనిందలా? పరమపురుషుడైన శ్రీ కృష్ణుడి శీలాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి ఇటువంటి విషయాలు. ఆఖరికి హిందువులు కూడా ఎవరైనా రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల బ్రతుకును నాశనం చేస్తే, ఈయన కలియుగ కృష్ణుడంటారు.కృష్ణుడు పరమధర్మాత్ముడు, కృష్ణుడిని విమర్శించే స్థాయి మనకు లేదు. కృష్ణుడుని విమర్శించే ముందు ఇవి కాస్త గుర్తుంచుకోండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ  

Originally Published: 27-Aug 2013
1st Edit: 5-sep 2015

Friday, 4 September 2015

శ్రీ కృష్ణాష్టమి

5-9-2015, శనివారం, శ్రావణ బహుళ అష్టమి, శ్రీ కృష్ణాష్టమి.

5242 ఏళ్ళ క్రితం, కారుమబ్బులు కమ్ముకునే వర్షఋతువులో శ్రావణమాస బహుళ ఆష్టమి వేళ రాత్రి 12 గంటల సమయంలో దేవకీవసుదేవుల 8 సంతానంగా మధురలో కారాగారంలో అవతరించారు శ్రీ కృష్ణ పరమాత్మ. శ్రీ కృష్ణ పరమాత్మ జాతక చక్రంలోని గ్రహగతులని ఆధారంగా చేసుకుని ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకోవలసి వస్తే క్రీస్తు పూర్వం 3228, 21 జూలైన అవతరించారు. ద్వాపరయుగాంతంలో ఈ భూమి పైన నడయాడిన యుగ పురుషుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక సందేశం.

నారయణుడు, నారాయణి(పార్వతీ దేవి) అన్నాచెళ్లెలు. ఇద్దరు ఎప్పుడూ కలిసే జన్మిస్తారు. కృష్ణుడు ఇక్కడ మధురలో దేవకివసుదేవులకు జన్మిస్తే, పార్వతీదేవి యోగమాయగా యశోదా నందులకు అదే సమయంలో జన్మించింది. తాత్వికంగా అర్దం చేసుకుంటే మధుర అంటే మంచి ఆలోచనలున్న మనసు. అటువంటి మంచి, పవిత్ర ఆలోచనలున్న మనసులు కలవారికి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడని అర్దం. ఆయన పుట్టగానే వసుదేవుడి కాళ్ళకు, చేతులకున్న సంకెళ్ళు తెగిపొయాయి. పరమాత్మ దర్శనం కలిగితే కర్మబంధాలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్తుంది ఈ సంఘటన. కంసుడి కోటలో ఉన్న అందరిని మాయ కమ్మి స్పృహ కోల్పోయారు.

ఆయన్ను వసుదేవుడు యమున దాటించి రేపల్లెకు చేర్చాలి, కాని యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం ఆగదు.ఆగకూడదు. అందులోనా యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే. అటువంటి యమున, వసుదేవుడు పసి కందైన శ్రీ కృష్ణునితో పాటు దాటడానికి మార్గం ఇచ్చింది, తన ప్రవహాన్ని ఆపివేసింది, అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లోబడి ఉంటుందని,ఆయన కనుసన్నల్లో కాలం కూడా ఉంటుందని అర్దం చేసుకోవాలి. అంతేకాదు, నదిని సంసారానికి సంకేతంగా భావిస్తే, ఎవరు తమ నిత్య జీవితంలో పరమాత్ముడిని గుండేల్లో పెట్టుకుంటారో, వారు ఈ సంసారమనే మహాప్రవాహాన్ని సులువుగా దాటగలరని అర్దం. భగవంతుని నమ్మకుని ముందుకు నడిచేవారి జీవితం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది చెప్తుందీ ఘటన. కృష్ణుడు రేపల్లెకు చేరాడు. రేపల్లేలో జనం అమాయకులు, భగవద్భక్తి కలవారు, శాంతస్వభావులు. ఎక్కడ ప్రజలు ధర్మ మార్గంలో జీవిస్తూ పరోపకార బుద్ధితో బ్రతుకుంతుంటారో అక్కడికి పరమాత్మ తానే వెళతాడని అందులో అంతరార్ధం. ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ

Originally Published: Sri Krishnasthami
1st Edit: 16-08-2014
2nd Edit: 05-09-2015

Wednesday, 28 August 2013

శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం. మగనెమలికి పించం ఉంటుంది. మేఘాలు పట్టి వర్షం పడే సమయంలో మగనెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది, ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం చేత ఆడనెమలి గర్భం ధరిస్తుందట. ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ