Friday, 30 June 2017

స్వామి సచ్చిదానంద సూక్తి



Assert Your Real Nature

Know that you are the true Self and you are not the mind that always changes, which gets into moods. Realize you are the Self. The Self understands equanimity. Even though the other part of the mind gets into different moods and feelings, you are not tainted by that. You know that is the nature of the mind and you can say, ‘Okay, today my mind is happy. Tomorrow it will be unhappy. Fine.’ See? You won’t identify yourself with that. You treat the mind as a separate entity, all the time asserting your real nature as the true Self.

- Swami Satchidananda

ఈ విషయంలో వారిని ఆదర్శంగా తీసుకుంటేనే ధర్మం నిలుస్తుంది.



భారతదేశంలో 100 కు పైగా పార్శీల దేవాలయాలు ఉన్నాయి. అందులో ముంబాయిలోనే 40 ఉన్నాయి- అక్కడ అగ్ని జ్వాల ఎప్పుడూ ఆరదు. వాళ్ళు కూడా అగ్ని ఆరాధకులు. అగ్ని జ్వలించడానికి కొంత గంధవు చెక్కను వాడినా, అధికంగా బబూల్ చెట్టు చెక్కను వాడతారు. ఎందుకంటే బబూల్ చెక్క ఎక్కువసేపు మండుతుంది, మెల్లిగా కాలుతుంది, అగ్ని చాలాసేపు ఉంటుంది. ఈ కారణంగా బేకరీలు మొదలైనవి కూడా వెంట చెరుకుగా బబూల్ చెక్కనే వాడుతున్నారు. దీంతో గత దశాబ్దంలో బబూల్ చెక్క ధర 5 రెట్లు పెరిగింది. ఇలా ధర పెరగడం గురించి ఆందోళన చెందిన పారశీలు తమ స్థలాల్లో బబూల్ వృక్షాలను పెంచుతున్నారు. ఇది గుజరాత్ లో మొదలైంది, ఇప్పుడు ముంబాయిలో కూడా మొదలవుతోంది. దేశవ్యాప్తంగా దీన్ని ఆచరణలోకి తెచ్చి, తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నట్లు వార్తపత్రికల్లో వచ్చింది. వారి జనాభ దేశంలో 66,000 మాత్రమే ఉంది. అయినా వారికి ఎంత నిబద్ధత.

దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. మనకు కొన్ని పవిత్ర వృక్షాలున్నాయి. కొన్ని రకాల వృక్షాల చెక్కలనే యజ్ఞంలో సమిధలుగా వినియోగిస్తారు. ఏ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏ సమిధ వాడితే ఫలితం ఉంటుందో శాస్త్రం నిర్దేశించింది. కానీ చాలామటుకు అవి లభ్యమవ్వడం లేదు. దానికి ప్రధానమైన కారణం వృక్ష సంపద తగ్గిపోవడం. అడవులు కూడా వేగంగా తరిగిపోతున్నాయి, కాదు అభివృద్ధి పేరుతో అడవితల్లిని నాశనం చేస్తున్నాం. రోజుకు సగటున 108 అరుదైన ఆయుర్వేద మూలికలు, వృక్షాలు భారతదేశంలో అంతరిస్తున్నాయని ఒక అంచనా. పార్శీల జనాభా ఈ దేశంలో 0.006 % మాత్రమే ఉంది. కానీ హిందువుల జనాభా సుమారు 60%- 70% ఉండవచ్చు (మతమార్పిడి చేసుకున్నవారిని మినహాయించి). కానీ మనకు అలాంటి ప్రణాళికలేమీ లేవు, అసలలాంటి ఆలోచనే కలగదు. ధర్మాన్ని రక్షించండి, సంస్కృతిని కొనసాగించండి అంటాము, మరియు వాటికి అవసరమైన వాటిని మాత్రం నశింపజేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు చక్కని వర్షాలు పడుతున్నాయి. ఇదే మంచి సమయం. మనం మొక్కలు నాటాలి, మేడి, మోదుగ, జువ్వి, తెల్ల మద్ది, నల్ల మద్ది, మఱ్ఱి, రావి మొదలైన దేవతా వృక్షాలను నాటి పెంచాలి. అవి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడతాయి, ముందు భూమి చల్లబడుతుంది. మొక్కలు నాటడం వలన వచ్చే పుణ్యం గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం, వాటికి తోడు మనం నాటిని మొక్కలను సమధలుగా వాడితే, ఇంకా ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది. అలా కాకుండా చాలా ఉన్నాయండి అని కబుర్లు చెబుతూ కూర్చుంటే, కొన్నాళ్ళకు చాలా కాస్త కొన్ని అవుతాయి, ఆ తర్వాత అంతరిస్తే, మనమే బాధపడాలి. అంతెందుకు మనం వృతం చేసినప్పుడు కలశం స్థాపిస్తాము. కలశంలో పంచపల్లవాలు (5 రకాల చిగుర్లు) వేయాలని శాస్త్రం చెప్పింది. మఱ్ఱి, రావి, మేడి, జువ్వి, మామిడి. అసలీ విషయం ఎంతమందికి తెలుసు? అంతెందుకు వినాయక చవితికి మనం అర్పించే పత్రిలో ఎన్ని పత్రాలు సరైనవి? అవి మన ఇంటి దగ్గర పెంచుకోలేమా? ఉగాదికి మార్కెట్ లో వేపపువ్వు దొరకడమే గగనమైపోయింది. మనమే ముందడుగు వేసి ఓ వేప చెట్టు పెంచలేమా? ఆఖరికి మామిడాకులు కూడా కొనుక్కునే దుర్భరమైన పరిస్థితి దాపురించింది. అందరికి మామిడాకులు, వేపపువ్వు కావాలి, కానీ ఎవ్వరూ వేప, మామిడి చెట్లు నాటరు. ఇలా చెప్పుకుంటే ఎన్నో.

మొక్కలు నాటి ఆయా జాతుల వృక్షాలను పెంచి, సంరక్షించడానికి ఇది అనువైన సమయం. మనమంతా ఆ దిశగా ఒక ముందడుగు వేస్తేనే భవిష్యత్తులో #ధర్మం నిలుస్తుంది, శాస్త్రీయమైన యజ్ఞ ప్రక్రియ నిలబడుతుంది. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః అని యజుర్వేదంలో శ్రీ రుద్రం కూడా అంటున్నది. వృక్షాల రూపంలో ఉన్న రుద్రునకు నమస్సులు, పచ్చని కొమ్మలు, రెమ్మలు, ఆకులు తన కేశాలుగా కలిగిన మహాదేవునకు నమ్మస్సులు అని అర్దం.

ఇది కూడా ఒక యజ్ఞమే. దీని గురించి కూడా కాస్త ఆలోచించండి. మరి మొక్కలు నాటి పోషిస్తారా?

Thursday, 29 June 2017

అరోబిందో సూక్తి



The first principle of true teaching is that nothing can be taught.

- Aurobindo

దీన్ని ఎన్నో విధాలుగా అర్దం చేసుకోవచ్చు. అందులో ఒకటి;
ఏదైనా లోపల నుంచే కలగాలి. బయట నుంచి ఎవ్వరూ ఎమీ చేయలేరు. (Think... Think.... Think ..... )

Tuesday, 27 June 2017

ఎన్నో సందేహాలను పటాపంచలు చేసే చిన్న సంఘటన - శ్రీ రామకృష్ణుల జీవితచరిత్ర నుంచి



మొన్న మన పేజీలో ఒకరడిగారు. విదేశీయులు గుళ్ళను కూల్చుంతుంటే దేవుడెందుకు ఆపలేదని. అలాగే ఏదైనా గుళ్ళో దొంగతనం జరిగినప్పుడు అయ్యో! దేవుడేమీ కాపాడుకోలేకపోయాడే అంటారు. అలాంటి ఎన్నో సందేహాలను పటాపంచలు చేసి సంవాదం ఇది. శ్రీ రామకృష్ణుల జీవిత చరిత్ర నుంచి స్వీకరించబడినది. ఇది ఒకరమైన జ్ఞానగుళిక.

భగవంతుడిని ధ్యానించండి, ఆయన మహిమలను కాదు

కేశబ్‌తో శ్రీ రామకృష్ణులు - బ్రహ్మసమాజం సభ్యులెందుకు ఎక్కువగా దైవం యొక్క మహిమలను ధ్యానిస్తారు? 'ఓ భగవంతుడా, నువ్వు చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలను సృష్టించావ్!' అంటూ వాటిని వల్లెవేయాల్సిన అవసరం ఉందా? చాలామంది తోటను చూడటానికి ఇష్టపడుతున్నారే కానీ దాని యజమానికి తెలుసుకోవాలన్న తపన కొందరికి మాత్రం ఉంది. ఎవరు గొప్ప, తోటా? లేక దాని యజమానా?

కొంత సారాయి తాగిన తర్వాత, గ్యాలన్ల కొద్ది వైన్ ,నిలువలు ఉంటే ఎవరికి కావాలి? ఒక బాటిల్ చాలు నాకు.
నేను నరేంద్రను కలిసినప్పుడు, 'మీ నాన్నగారు ఎవరు? ఆయనకు ఎన్ని ఇళ్ళున్నాయి?' నేను అడగలేదు.
నేనొక సత్యం చెప్పనా? మనిషి తన సంపదలను ఇష్టపడతాడు, అందుకే భగవంతుడు కూడా ఇష్టపడతాడని తలుస్తాడు. దైవం యొక్క మహిమలను స్తుతిస్తే ఆయన సంతోషిస్తాడని భావిస్తాడు. ఒకసారి నాతో శంభు అన్నాడు - 'నా సంపదలను భగవంతుని పాదపద్మాల వద్ద విడిచి మరణించేలా దయతో నన్ను దీవించండి'. నేనన్నాను 'ఇవన్నీ నీకు మాత్రమే సంపదలు. నువ్వు భగవంతునికి ఏ సంపదలు అర్పించగలవు? ఆయనకు ఇవన్నీ కేవలం దుమ్ముతో సమానం మరియు తృణప్రాయము.

ఒకసారి విష్ణువు ఆలయంలో దొంగలుపడి, ఆ మూర్తి యొక్క ఆభరణాలు దొంగిలించారు. అసలు సంగతి తెలుసుకుందామని మథుర్ బాబు మరియు నేను వేళ్ళాము. విగ్రహాన్ని ఉద్దేశించి మథుర్ బాబు కటువుగా 'భగవంతుడా, ఎంత సిగ్గుచేటు! నువ్వు నిరర్థకుడివి! దొంగ నీ శరీరం నుంచి ఆభరణాలన్నీ తీసుకున్నాడు, కానీ నువ్వు మాత్రం ఏం చేయలేకపోయావు' అన్నాడు. అప్పుడు నేను మథుర్‌తో 'నువ్వు సిగ్గుపడాలి. ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నావు. భగవంతునికి, నువ్వు ఎంతగానో చెప్తున్న ఈ ఆభరణాలు మట్టి ముద్దలతో సమానం. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీ ఆయన ఇల్లాలు. ఒక దొంగ కొన్ని రూపాయలు తీసుకున్నాడని ఆయన నిద్రలేని రాత్రులు గడపాలని నువ్వంటున్నావా? నువ్విలాంటి మాటలు మాట్లాడకూడదు'.

ఎవరైన భగవంతుని తన సంపద ద్వారా నియంత్రణలోకి తెచ్చుకోగలరా? ఆయన్ను #ప్రేమ ద్వారా మాత్రమే పొందగలము. ఆయనకేమి కావాలి? ఖచ్ఛితంగా సంపద కాదు! ఆయనకు ఆయన భక్తుల నుంచి భక్తి, భావం, #వివేకము, వైరాగ్యం కావాలి.

శ్రీ రామకృష్ణ పరమహంస

Saturday, 24 June 2017

స్వామి శివానంద సూక్తి



When the mind is vacant, evil thoughts try to enter. Evil thinking is the beginning or starting point of adultery. Through a lustful look only, you have already committed adultery in the heart. Mental actions are the real actions. Remember this! God judges a man by his motives; worldly people judge a man by his external physical actions. You will have to look to the motive of the man. Then you will not be mistaken.

- Swami Sivananda